నీతి కోరి ఒప్పు చేయు నిష్ట కాగ వోర్పుతో
చేత నైన ఒప్పు మాట చింత మాపు నేర్పుతో
భీతి చెంద ముప్పు వచ్చె బేల జూపు మార్పుతో
ఖ్యాతి నెంచ గల్గు బుద్ది కర్మ వల్ల యీశ్వరా 82
నమ్మి నెంచగల్గు సాధనే విదీ మదీయ మౌ
బిమ్ముగా మహేశ్వరీ విచిత్రమే వినోద మౌ
ఇమ్ము శాంతి సహాయమ్ము యీశ్వరీ విధానమౌ
బి మ్మహీన రక్ష ధర్మ శీల విద్య యీశ్వరా 83
కన్ను కానకే కధళ్ళు కాలమాయ దేనికో
మిన్ను నమ్మియే సహాయ మిధ్యయో దేనికో
మన్ను తిన్న మాట బుద్ధిమంద హాస మేలనో
వెన్నెలమ్మ యున్నతేను వేద తీర్పు యీశ్వరా 84
చిన్న విత్తుఁ దీసి మన్ను చిత్తు చేయు సందడే
కన్న వారి వేడి తీరు కాయ కష్టమే సుధీ
విన్న మౌన బుద్ధి మేలు విశ్వ మాయ వెల్గుగా
కన్న సృష్టి చిత్రమే సకామ బుద్ధి యీశ్వరా 85
సీస పద్యము
ఢమఢమ శబ్దము డమరీకము కదల
నటరాజు నర్తించే నవ్య రీత
ఆనంద తాండవ నర్ధంబు హరుడాడె
మూడుకన్నుల వేల్పు మదన హారి
తన్మయాభినయమై తత్త్వము ధ్యానమై
సకలశోకనివార శ్యామకంఠ
పార్వతీ వల్లభా పాఠము తెలుపుమా
పాప వినాశుని పాద పూజ
వినయమునున్న నవీన విహారి కవిత్వ శివా
పనితనమున్న నుపాయ విధానము భక్తి హరా
అణుకువయున్న శుభంకర వెల్పగు భాగ్యధరా
మనమనసన్న సురక్ష సహాయ సమర్ధ శివా 86
మధువు కోరిసమస్య తెచ్చుట మందభాగ్యము యేలనో
వధువు చెంతసుఖమ్ము పంచక వెర్రి వేషము లేలనో
అదుపులేక వితండ వాదపు యాస లన్నియు యేలనో
పొదుపుయంటు సహాయమేయని పోరుచేమదియీశ్వరా.. 87
=--=
ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 73 (కల్పవృక్షవాహనం) 🎈
🍃🌹బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉదయం శ్రీదేవి - భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు. కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, లతలు - ఇలా: వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో, కళాకౌశలం ఉట్టిపడేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు.
🍃🌹ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం. సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం. క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె అంటే దేవతలు, రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు: అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది.
🍃🌹ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఆ వాహనాన్ని అధివేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగా ఇలా వర్ణించాడు -
గౌతము భార్యాపాలిటి కామధేను వితడు,
ధాతల కౌశికుపాలి కల్పవృక్షము,
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు,
ఈతడు దాసులపాలి ఇహపరదైవము ||
🍃🌹కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను యీడేర్చడం కోసం - శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు.
🍃🌹వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం. చెట్టు తొర్రలు, బొరియలు, వ్రేళ్ళు, శాఖలు - సమస్తం పక్షులకు, చీమలకు, పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి. చెట్లు మానవజాతికి ఫల, పుష్పాదులను ప్రసాదించడమే గాకుండా - జీవం కోల్పోయిన తర్వాత కూడా కలప నిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి. అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి.
🍃🌹అదేవిధంగా, కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే "పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు" అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు.
🌻 సర్వభూపాలవాహనం 🌻
🍃🌹బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి - భూదేవిలతో సర్వభూపాలవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మేలిమి బంగారంతో, అచ్చెరువొందే శిల్పకళా సోయగంతో, ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు. అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం - వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది.
🍃🌹"సర్వభూపాల" అంటే "రాజులందరూ" అని అర్థం. దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు. విష్ణు అంశ లేనిదే రాజభోగం లభించదు. "రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే" అనే వేదస్మృతి ననుసరించి, శ్రీహరి రాజాధిరాజు. మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు. లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై, వారి కనుసన్నల్లో వెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది.
🍃🌹సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి. వాటి సహాయంతో, దుష్టశిక్షణ - శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే, వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి. సర్వభూపాలవాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుణికిపుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది.
🍃🌹ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకొని, శాశ్వత ఫలితాన్ని పొందుతారు. ఇతిహాసాల్లో చెప్పబడినట్లు - సాటి నరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు. రాజు కోపిస్తే, దేవుడు రక్షిస్తాడు. అంటే, దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకేమాత్రం హాని తలపెట్ట లేరు. ఈ వాహనం దర్శించడం ద్వారా, దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు.
🌻 మోహిని అవతారం 🌻
🍃🌹ఐదవ నాటి ఉదయం శ్రీవేంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి, రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకి పై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు. మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే - మిగతా అన్ని వాహనాలు వాహనమండపం నుండి మొదలైతే, ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.
🍃🌹శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది - మొదటగా, క్షీరసాగరమధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు.
🍃🌹విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి - శ్రీహరి జగన్మోహన రూపంతో సమ్మోహింప జేసి ఆ దానవుడి పీచమణుస్తాడు. మూడవసారి - దారుకావనం నందు జగన్మోహిని రూపంలో నున్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది.
🍃🌹మరోసారి, భోళాశంకరుడిచ్చిన వరగర్వంతో
మోహిని అవతారంలో, మలయప్పస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింప బడతాయి. మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టు చీర, రవిక, కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య చంద్ర - సావేరిలను అలంకరిస్తారు. స్వామివారికి వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు.
🍃🌹సాధారణంగా, వరదభంగిమలో ఉండే స్వామివారి కుడి చెయ్యి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుక తోనూ, మరికొన్ని సార్లు అభయ హస్తంగానూ దర్శనమిస్తుంది.
🍃🌹జగత్తంతా మాయా మోహానికి లొంగబడి ఉంటుంది. తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. మాయా పూరితమైన ఈ ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేశుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు.
🍃🌹"బలగర్వితులు, అహంకారులు కార్య ఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించిన వారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరనే" సందేశం మోహిని అవతారం ద్వారా ప్రకటిత మవుతుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
----- శుభోదయం ----- సుభాషితాలు -------
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"
భావము:
శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.(కుంతీ స్తుతి)
కవిజనంబుల కుపద్రవము దాల్చుట ముప్పు బలవంతునితో వైరపడుట ముప్పు
దేశాధిపతిని నిందించ బూనుట ముప్పు గ్రామాధికారితో కక్ష ముప్పు
చెడి చుట్టమింటికి జేరబోవుట ముప్పు చెడుగులతో బొందుచేత ముప్పు
భార్యకు జనువిచ్చి పాతిసేయుట ముప్పు పదిమంది కాదన్న పనులు ముప్పు
తే :--మొండికొయ్యలమాట నమ్ముకొని బుధులు
పాడుతంటాల పనికడ్డపడుట ముప్పు
భూరిమయవాస కోలంకపురనివాస
మదన గోపాల కోలంక పూరి నివాస!
పదునా ల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు, చెల్లించెన
య్యుదయాస్తాచలనసంధి నాజ్ఞ నొకడాయుష్మంతుడై వీరి య
భ్యుదయంబెవ్వరు చెప్పగా వినరొ! అల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కట కటా శ్రీ కాళహస్తీశ్వరా! ౩౮
శంకరా! ఒక రాజు పద్నాలుగు మహాయుగములు పాలించెను. (మహాయుగమనగా కృత త్రేత ద్వాపర కలియుగములు నాలుగూ కలిసినది.) మరొక రాజు ఉదయగిరి నుండి అస్తగిరి వరకు ఉన్న భూమిని నిరాఘాటంగా పాలించాడు. ఇటువంటి మహారాజుల చరిత్రలను ఈ అల్పులైన రాజులు వినలేదా? తాము కూడా రాజులమే అని ఎలా గర్వపడుతున్నారో!
అలఘ గుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొకడిష్టుడై తనున్ వలచి
యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుడొక్కని యందె౦ దటుకులు తనకిచ్చినన్ మహా
ఫలదుడు కృష్ణు డత్యధిక భాగ్యము లాతనికీడే భాస్కరా!
తా:--గుణవంతునకు తన స్నేహితుడైన వాడు ప్రేమతో లేశమైన పదార్థము నిచ్చిననూ,
అతనికి గొప్ప మేలు కలుగజేయును. అని ఈ గాథ తెలియజేయుచున్నదని శతకకర్త
చెప్పుచున్నాడు..
------------------------------------------------------
ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లేదు
ఈ కడ భూలోక మందు యెందు లేదు
పైకొని ఆశ లెల్ల పారద్రోలి వెదికితే
శ్రీకాంతు పోగిడేటి చిత్తములో నున్నది
తా:-- ముక్తి ఎక్కడో ఆకాశము లోనో,పాతాళం లోనో భూమి పైననో లేదు.ఆశలవలయం లో చిక్కుకో కుండా
ఆ శ్రీకాంతుని స్మరించుకునే మనసులోనే మోక్షము వుండి.మనో నైర్మల్యమే ముక్తికి దారి.
రసవాదంబులు పెక్కు నేర్చిన, మహా రాజేంద్రులన్
వెసతో మంత్రములుచ్చరించిన, మహా విద్యల్ ప్రసంగించినన్
అసహాయంబగు శూరత౦ గనిన, దా నంభోధి లంఘించినన్
నొసటన్ వ్రాసిన వ్రాలు కనగలడా?నూరేండ్లు చింతించినన్
భావము:--రసవాదములు నేర్చిననూ, రాజులదగ్గర మంత్రములు చదివిననూ,మహావిద్యలు ప్రదర్శించిననూ,అసహాయ శూరత చూపించిననూ, సముద్రము లఘించిననూ,నూరేండ్లు చింతించిననూ బ్రహ్మ నుదుటవ్రాసినవ్రాతను చూడగలడా?
సిరిపొయిన సమయంబున
ధరలో నెవ్వారు వాని దలపరు సుమ్మీ
సరి, రాత్రిబోవ జంద్రుని
నరులేక్రియ జూతురయ్య నాథా! కృష్ణా!
నీచ మావమాన మలినంబు నిష్ఠురంబుఁ
నైన పరసంపదకు నాస నొందువాడు
కాలకూట విషాక్తమౌ గందరసము
నాలాడికొనువానితో సాటియగును గాదె
ఇల్లు భుజంగమైన, దన యిష్టుడు వైరికి మర్మమిచ్చినన్
గల్ల నిజంబు నేర్పరుప గానక భూపతి జంప వచ్చినన్
దల్లి విషంబు బెట్టినను, దండ్రి ధనాఢ్యుల కమ్మ జూపినన్
వల్లభు డొల్ల కున్న, నిక వారల కెవ్వరు దిక్కు?భైరవా!
ఇల్లే పామైన, తన సొంతవారే శత్రువుకు తన రహస్యము శత్రువులకు చెప్పిన, ఏది సత్యము, ఏదసత్యమని విచారించకుండా రాజే చంప జూచిన, తల్లియే విషము పెట్టిన, తండ్రి ధనవంతులకు తనను అమ్మజూపిన, భర్త తనను యిష్టపడకున్న నిక వారందరికీ దిక్కెవరు భైరవా?
మనసులోన నున్న మమతలన్నియు గోసి
దృఢము చేసి మనసు తేటపరచి
ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ!
సిరి తా వచ్చిన వచ్చును
నారికేళ సలిలము భంగిన్
సిరి దాపోయిన పోవును
కరిమ్రింగిన వెలగ పండు కరిణిని సుమతీ!
అర్థము:- సిరి అంటే ధనము వచ్చేటప్పుడు కొబ్బరికాయలో నీళ్ళుతెలియకుండా ఎలా వచ్చాయో అలాగే వస్తుంది.పోయేటప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండు లాగా వెళ్ళిపోతుంది.ఏనుగు వెలగ పండు మింగితే దానిలోని గుజ్జును పండు పగల కొట్ట కుండానే తినేస్తుందట.దాని లద్దేలో డొల్ల మాత్రమె బయటకు వస్తుందట సలిలము అంటే నీరు కరిణి=విధము
తరిగిపోనట్టి సిరివిగా పరిఢవిల్లు
పద్యమన్నది మాకు పాలసంద్రంబులో
పుట్టిన పీయూష పూర్ణఘటము
పద్యమన్నది మాకు పారాయణాస్పద
మహితమౌ గాయత్రి మంత్రం జపము
పద్యమన్నది మాకు పాతాళమందున్న
కడు పవిత్ర గంగా జలమ్ము
తన గుణములు గొప్పవంచు
తలపోయును ప్రతియొక్కడు
లోకము గుర్తించదంచు
లోలోన వ్యధ చెందును.
తనయందము రంభ కైన
తలవంపను కొనును తన్వి
పరుని పత్ని వైపు చూచు
పతి తత్వము నెరుగలేదు. (మిరియాల రామకృష్ణ )
స్థాన విశేష మాత్రమున తామర పాకున నీటి బొట్ట నిన్
పూనిక మౌక్తికం బనుచు పోల్చిన మాత్రాన యింత గర్వమా
మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పగ వత్తువో
కానుక లియ్యవత్తువొ వికాసము నిత్తువొ విలవ దెత్తువొ
అర్థము:-- నీవున్న స్థానాన్ని బట్టి నిన్ను ముత్యము లాగ మెరిసి పోతున్నావు అని పొగడి నంత మాత్రమున నీవు గర్వముతో
మిడిసి పడుతున్నావు. అందమైన ఆడవాళ్ళ .మెడలోని హరములోనికి పనికి వస్తావా?కానుకలాగా ఇచ్చేందుకు పనికి వస్తావా?వికాసన్నిస్తావా?నీకు విలువమైనా వుందా?అంటే పదవిలో వున్న నాయకుల గురించి ఈ చురక.నీవు వున్న స్థానాన్ని బట్టి నిన్నుఅందరూ పొగడుతున్నారు కానీ పదవి లేకుంటే నీకు విలువ లేదు.అంత మిడిసి పడకు అని కవి చెప్పుచున్నాడు.
తొలినాడు కలకండ పలుకులంబోని, ధూర్జటి సుకవి
పలుకులంబోని దాహమ్ము, చూచెడు వరకాగ రాని
యలనటై నిను వచ్చి చూచి యప్పటి కారియు మరల
నలసట యగుచు శృఈ కాళహస్తీశ్వరా! మహాదేవ!
అతో విముక్టై ప్రయతేత విద్వాన్
సంన్యస్త బాహ్యార్థ సుఖస్ప్రుహస్సన్
సంతం మహాంతం సముపేత్య దేశికం
తేనో పదిషార్థసమాహితాత్మా
తా:-- విద్వా౦సుడైనవాడు బాహిరములైన భోగములమీద యచ్ఛను వీడవలెను. సాధు
పుంగవుడైన గురుదేవు నాశ్రయింపవలయును. అతని చేత నుపదేశింపబడిన విషయమందు సమాహితమైన చిత్తముతో ప్రవర్తిస్తూ ముక్తి కొరకు ప్రయత్నము చేయుచుండవలెను.
***
విశ్వహిత కాంక్ష
మనిషి పుట్టుక ఒక వరం. ఎన్నో జన్మల పుణ్య విశేషంతో మనిషి వివేకవంతు డిగా ఈ పుడమిపై జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఉండే శైశవదశలో అతడిలో ఏ వికారాలూ ఉండవు. భగవంతుడిలా మాయకు అతీతుడిగా, ఆనందంలో మునిగి తేలతాడు. శైశవదశ తరవాత బాల్యంలోకి అడుగు పెట్టి, విద్యాబుద్ధులు నేర్చుకొం టాడు. తదనంతరం యౌవనదశకు చేరుకుంటాడు. ఆ దశలో మనిషికి ఏర్పడే శక్తియుక్తులు, లోకజ్ఞానం కారణంగా రాగద్వేషాలు, శత్రుత్వమిత్రత్వాలు, స్వార్ధ పరమార్థాలు సంక్రమిస్తాయి. అవి వృద్ధాప్యందాకా కొనసాగుతాయి. జన సత్యాలన్నీ ఉడిగిపోయిన ముసలితనంలో మనిషి క్రమంగా నిశ్చేష్టుడిగా కాలం గడుపుతాడు. చివరికి మరణ చక్రంలోకి చేరుకుంటాడు.
మనిషి తన నూరేళ్ల జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మంచి మార్గాలు.. న్నాయి. మనిషి తన స్వశక్తితో దేన్నైనా సాధించగలుగుతాడు. అసాధ్యాలను సుసా ధ్యాలు చేసుకుంటాడు. ఎవరూ ఊహించని అద్భుత చరిత్రలను సృష్టిస్తాడు. మనిషి తలచుకుంటే సంభవం కాని పనులు లేవు. మనిషికి ఆశలు మాత్రమే ఉంటే చాలదు. ఆశలను సఫలీకృతం చేసుకోగలిగే కృషి తోడు కావాలి.
***
నిరంతరం
ప్రయత్నం చేసే మనిషికి దైవం
కూడా తోడవుతుందని పెద్దల మాట. మనిషి తన జీవితావసరాలు తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తాడు. ఆపారధనాన్ని కూడబెడ తాడు. ఆస్తులను పెంచుకుంటాడు. తాను, తన కుటుంబం ఏ లోటూ లేకుండా ఉండాలని తపిస్తాడు. మనిషి తన సొంత లాభం మాత్రమే చూసుకొంటే జీవితంలో సంతృప్తిని సంపూర్ణంగా పొంద లేదు. తన చుట్టూ ఉన్న ప్రపం చాన్నీ మనిషి చూడాలి. తానూ బతకాలి, అందరూ బతకాలి అని. ఎప్పుడూ భావిస్తూ ఉండాలి.
మహాత్యులు పరోపకారంతో చరి త్రలో నిలిచిపోయారు. వారి చరి త్రలు స్ఫూర్తిదాయకాలు, వారు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. 'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంపూర్ణారోగ్యంతో ఉండాలి. అందరూ ఎల్లవేళలా మంచినే చూడాలి. ఏ ఒక్కరూ దుఃఖించరాదు' అని ప్రాచీనుల సదుపదేశం అందరి సుఖాన్ని కోరే మనిషి తాను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సహిస్తాడు. సహనం ఒక ఆభరణం, అందరి ఆరోగ్యాన్ని ఆశించే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఎవ్వరికీ హాని కలగని రీతిలో పరిసరాలను కాపాడ తాడు అందరూ మంచినే చూడాలని కోరుకుంటే మనిషి తాను మొదట మంచివాడు. కావాలి. తాను మారితేనే లోకమంతా మారుతుందని గ్రహించాలి.
విశ్వక్షేమమే మనిషికి దక్ష. విశ్వమంతా అల్లకల్లోలం అయితే, తాను ఒక్కడు మాత్రమే బతికి బట్టకట్టగలడా? లోకంలో కనిపించే సృష్టి అంతా పరోపకారం కోసమే. ప్రపంచం అందరి యోగక్షేమాల కోసమే తప్ప కొందరి లాభాల కోసం | ఏర్పడలేదు. విశ్వం అంతా ప్రకృతి ప్రసాదించిన దివ్యఫలం. దాన్ని అమృత ఫలంలా భావించి, ఆస్వాదించాలే కానీ ధ్వంసరచనలతో కలుషితం చేయరాదు. విశ్వహితంలోనే వ్యక్తిహితం అంతర్భవించి ఉంటుందనేది సత్యం.
వేల ఏళ్ల క్రితం ఎవరో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో మధు రఫలాలను, చల్లని నీడను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనిషి తాను చేసే మంచి పనులవల్ల భవిష్యత్తులో మానవాళికి శ్రేయస్సును అందించాలి. అదే జీవన పరమార్ధం. మనసును విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
కుమార చరిత్ర..18.. 👇
ఈ భాగం అడిషనల్ 👉తిరుప్పరంకుండ్రం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరంకుండ్రం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..!!
తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.
ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. వీరి యొక్క పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. (మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములు గురువుల ద్వారా తెలుసుకోవాలి).
అయితే ఒక రోజు వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లితో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను” అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి “ నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది“ అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు. అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో “యానై” అంటే ఏనుగు). అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు.
తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ గారికి, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మ గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.
ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వివాహం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది.
పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి.
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమః
సర్వే జనాః సుఖినోభవంతు
BkR:
కుమారచరిత్ర -18
యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించిన అమర సింహసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యము కట్టపెట్టాడు .
అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం ప్రదేశములో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకు వచ్చి
" కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను చేపట్టవలదినిదిగా ప్రార్ధించగా " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు. అమర వైభవంతో దేవ గణాలన్నీ వారి వివాహాన్ని జరిపాయి . రంగ రంగ వైభవం తో దేవసేన సుబ్రమణ్యుల వివాహం జరిగింది
అల్లునికి కానుకగా ఐరవాత సమేతంగా అమూల్య వస్తువులను ఇంద్రుడు బహూకరించాడు .
మహా విష్ణువు తన మేనల్లుడు / అల్లుడుకు అపూర్వ యశస్సును ప్రసాదించాడు .
సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి.
శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మేల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి.
‘మరుమగన్’ అంటే అల్లుడు.
పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటారు.
మహేశ్వరుడు కుమారస్వామి ని కుజగ్రహాని కి అధిదేవత గా చేసారు
( అప్పటినుండి జాతకం లో కుజదోషం కల్గి వెతలు అనుభవించే వారందరు కార్తికేయుని పూజించి ఆయన కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవించారు) .
లోకమాత తన అపూర్వ శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాధి దేవత ( షష్ఠి దేవత గా ) చేసింది . ముల్లోకాలు ఆ కల్యాణ వైభోగాలతో తరించారు .
#షష్టీ_దేవి_ఉపాఖ్యానం :
ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.
ఈ దేవి పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది.
శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ,కధ ఇది.
స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు
చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు.
ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది.
ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి
అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు.
అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది.
ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని.
నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది.
ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు. అని అన్నది.
వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.
ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.
పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,
పుట్టిన శిశువుకు క్షేమం.
అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.
సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.
బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి.
ఇది షష్టీ దేవి కధ.
🍁🍁🍁🍁🍁
#శ్రీ_షష్ఠీదేవీ_స్తోత్రం:
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ఠీ దేవ్యై నమో నమః 1
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్టీ దేవ్యై నమో నమః 2
సృష్ట్యై సృష్టశ్వరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయై సిద్ధయోగిన్యై, షష్ఠీ దేవ్యై నమో నమః 3
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాదిస్త్యై దేవ్యై షష్ఠీ దేవ్యై నమో నమః 4
కళ్యాణ దాయై కళ్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః 5
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్ఠీ దేవై నమో నమః 6
శుద్ధసత్వ స్వరూపయై, వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్జితాయై, షష్ఠీ దేవ్యై నమో నమః 7
ధనం దేహి ప్రియం దేహి, పుత్రాం దేహి సురేశ్వరి
మోక్షం దేహి జయం దేహి, యశోదేహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవీ నమో నమః 8
దేహి భూమిం, ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః 9
#ఫలస్తుతి
ఇది దేవీం సంసుత్మోలేకే పుత్రం ప్రియపుత్ర
యశ్మినం చ రాజేంద్రం షష్ఠీ దేవి ప్రసాదత
షష్ఠీ స్తోత్రం ఇదం బ్రహ్మ య శ్మనోతి చ వత్సరం
అపుత్రో లభతే పుత్రాన్ వరం సుచిర జీవనం
వర్షమే కంచ యోభక్త్య సంపూజం సృనోధిచ
సర్వపాప వినిర్ముఖ్తో మహావంధ్యా ప్రసూయతే
వీరపుత్రం చ గుణీనం, విద్యావంతం యశశ్మినం
సుచిర్ ఆయుష్యన్త్రచ షష్టిమాతృ ప్రసాదితత్
శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం సంపూర్ణం
ఓం శరవణ భవ
సనాతన హిందూ ధర్మం
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...
.
No comments:
Post a Comment