Sunday, 3 December 2023

సెప్టెంబర్

[12/09, 10:10 am] Malapragadasridevi: మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు  అభిమన్యుని ఎందుకు కాపాడలేదు?
ఈ విషయం అందరూ ఆలోచించాల్సిందే కదండీ.

శ్రీకృష్ణుడు భూమిమీద అవతరించిన సమయంలో బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు...దేవతలు అందరూ సహకరించి రకరకాల రూపాలతో భూమి మీదకి వచ్చారు. కానీ చంద్రుడు తన కుమారుడు వర్చ్యుడిని భూమి మీద పంపించడానికి ఇష్టపడలేదు.

అభిమన్యుడు గత జన్మలో ఎవరో మీకు తెలుసా?
భగవంతుడు ధర్మ రక్షణ కోసం ప్రతియుగంలో  భూమ్మీద అవతరిస్తూ ఉంటాడు .  అదేవిధంగా ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించవలసి వచ్చింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని? దేవతలు అందరూ కూడా శ్రీ కృష్ణ పరమాత్మ కి సహాయంగా భూమిమీద వివిధ రూపాలలో జన్మించాలి. అన్నప్పుడు దేవతలు అందరూ సరే అన్నారు. కానీ ఒక్క చంద్రుడు మాత్రం తన కుమారుడైన వర్చ్యుడుని భూమి మీదికి పంపించడానికి ఇష్టపడలేదు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ కూడా... అందరూ కచ్చితంగా భూమ్మీద అవతరించి వలసిందే. ఎవరూ కాదు అనడానికి వీలు లేదు. అన్నప్పుడు ఇంక చంద్రుడు తప్పనిసరిగా ఒప్పుకొని దానికి ఒక కండిషన్ పెట్టాడు.
తన కుమారుడు భూమ్మీద జన్మించిన తర్వాత 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు. ఆ 16 సంవత్సరాల్లో కూడా గొప్ప వీరుడు గా ఖ్యాతి పొందాలి. దానికి అంగీకరిస్తే భూమి మీదకి వస్తాడు అని చెప్పగా అందరూ అంగీకరించారు. దేవతల చాలామంది భూమిమీద అవతరించారు. తర్వాత కృష్ణుడు అవతరించాడు. ఆ తర్వాత అర్జునుడు కొడుకుగా అభిమన్యుడు జన్మించాడు. ఆ అభిమన్యుడే చంద్రుడు కొడుకు వర్చ్యుడు. అందుచేతే మహాభారత యుద్ధంలో  శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేదు. అభిమన్యుడు అంటే వర్చ్యుడు మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి అనేకమైన అనేకమంది వీరులని చంపి తన జీవితాన్ని ముగించుకొని వీరమరణం పొందాడు.

పద్మవ్యూహం ప్రవేశ ద్వారం దగ్గర సైంధవుడు.. ఐదుగురు పాండవులను అడ్డుకొనగా.. ఒక్క అభిమన్యుడు మాత్రం లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించి ఎన్నో వేలమంది కౌరవసైన్యాన్ని చంపేశాడు. అది ధర్మయుద్ధం. దుర్యోధనుడు వాళ్ళు చేసింది అధర్మ యుద్ధం. ఎదుట నిలబడి యుద్ధం చేసే ధైర్యం లేక కర్ణుడు  అభిమన్యుడి వెనకకు వచ్చి వెనక నుంచి వింటి నారిని తెంచేశాడు. కవచం వెనుక భాగాన్ని కత్తితో ఛేదించేడు. వెంటనే ద్రోణాచార్యుడు బాణాలతో గుర్రాలను పడగొట్టాడు. కృపాచార్యుడు సారధిని చంపేశాడు.  అశ్వత్థామ, బాహ్లీకుడు, శకుని, కృతవర్మ నాలుగు వైపుల నుంచి బాణాలతో అభిమన్యుని గాయపరిచారు.  ఆ విధంగా అభిమన్యుణ్ణి క్రూరంగా చంపేశారు.

సేకరణ

👉 మీ ప్రాంజలి ప్రభ 👌👈
[12/09, 10:19 am] Malapragadasridevi: *🙏నేను ఎవరు ?🙏*
  *--------- 0 ---------*
💐💐😊👍👌😊💐💐

*కా తే కాంతా కస్తే పుత్రః* *సంసారోఽయమతీవ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*

*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి:-*

*నీ భార్య ఎవరు?*
*నీ పుత్రుడు ఎవరు..?*
*ఈ సంసారము..! చాలా విచిత్రమైనది..!*
*నీవెవరి వాడవు..? ఎవడవు..? ఎక్కడినుండి వచ్చావు..?*
*ఓ సోదరుడా..! తత్త్వమునాలోచింపుము..!*

*1) కాతేకాంతః..?*

*నీ భార్య ఎవరు..? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ..!* *వివాహానికి ముందు ఒకరి కుమార్తె..! ఆమె పుట్టుకలోగాని..!* *పెరగటంలోగాని..!*
*నీకు ఏ ప్రమేయమూ లేదు..!*
*ఆమె ఎక్కడో పుట్టింది..!*
*నీవు ఎక్కడో పుట్టావు..!* *అయినా పెళ్ళితో..! మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది..!*
*పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా..! చివరిదాకా..! ఇలా కలిసే ప్రయాణిస్తారా..? అదేం లేదు..! ఈ ప్రయాణంలో..! ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు..! ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి..! అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు..! వెళ్ళిపోవటం కూడా..! ఒక్కసారిగా జరగటం లేదు..! ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను..! కొంతకాలం..! కలసి మెలసి జీవిస్తారు అంతే..!*

*ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.* *లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.*

*భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే..! అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.*

*2) కస్తే పుత్రః..?*

*అలాగే నీ కుమారుడెవరు..?*
*అని కూడా విచారించు..!* *పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో..! ప్రేమాస్పదుడైన..!*కుమారుడు..! మరి..!* *అంతకుముందు..? అతడు*
*నీ భార్య గర్భంలో పిండం..!* *అంతకు ముందో..! అతడు* *నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..?*
*నీవు తిన్న ఆహారం ద్వారా..! నీలో..!తయారైంది..! మరి*
*ఆ..! ఆహారం ఎక్కడి నుండి* *వచ్చింది..? భూమిలోనుండి వచ్చింది..!* *అంటే మట్టి అనేక మార్పులు చెంది..! ఆహారంగా మారి..!*
*ఆ..! ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి..!*
*అది వృద్ధి చెంది..! శిశువుగా వ్యక్తమైంది..!*

*అంటే మట్టి యొక్క చివరి రూపమే..! నీ కుమారుడు అన్నమాట..! మరి నీవు* *ఎవరు..? నీవూ అంతే..! కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో..!*
*నీవు ముందున్నావు..! నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే..! ఈ లెక్కన చూస్తే..!*కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద..! మరొక చిన్న మట్టి ముద్దను..! దగ్గరకు తీసుకొని ముద్దు* *పెట్టుకుంటుంది..! ప్రేమను పెంచుకుంటుంది..!* *విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు..! విల విలలాడి పోతుంటుంది..!* *దూరంగా ఉండి..! ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని..! మనం తమాషాగా..!* *చూస్తున్నాం..! అనుకోండి..!*నవ్వకుండా ఉండలేం..! కానీ..! అదే నాటకంలో..! మనం..!* *పాత్రధారులమై..! ఎంతో సీరియస్ గా..! ఆ మట్టి ముద్దల పాత్రలను..!* *పోషిస్తున్నాం..! ఇదే భ్రమ..!* *ఇదే మాయ..!*
*ఇదే అజ్ఞానం..!*

*ఉన్నది ఉన్నట్లుగ..! చూడలేక..!                    "నాది - నాది" అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం..! అందుకే ఈ సంసారం అతి విచిత్రం..! తమాషా అయినట్టిది..! ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది. వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక..! ఉపాయం..!*

*సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.*

*నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు..! గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే..! అవీ జడమే. వాటిని నేను ఉపయోగించు కుంటున్నాను.*

*మరైతే నేనెవరు..?*
*దేహంలో కూర్చొని..!* *మనోబుద్ధులను..!* *ఉపయోగించుకొని పనిచేసే జీవుడను..! అయితే* *జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కడనుంచి* *వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను..!*
*నేను వచ్చింది అక్కణ్ణించే..!* *

*మరి ఎక్కడకు వెళ్ళాలి..?*
*ఆ పరమాత్మ వద్దకే...!*   *పరమాత్మ నుండి వచ్చిన* *జీవుడు..! కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో..!* *సుఖదుఃఖాలు అనుభవించి..! చివరకు ఆ పరమాత్మలో..! చేరిపోవాలి..!*
*అప్పుడే పరమశాంతి..!*
*అదియే..! బ్రహ్మానందం..!* *అదే..! శాశ్వతానందం...!*
*అదియే..! పరమోక్షము..!*
🙏🙏🙏
ప్రాంజలి ప్రభ

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సరదాగా….

     *గురువు గారు - శార్ధూలం*
              ➖➖➖✍️

*ఒక శిష్యుడు  గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.*

*ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.*

*శిష్యుడు అతడి భార్య ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి  కాళ్ళకు నమస్కారము చేసినారు.*

*అప్పుడు గురువు ఒక శార్దూల వృత్తము(పద్యము) లో  మధ్యలో  ఒక వేదమంత్రము వచ్చేట్టుగా ఆశీర్వదించారు.*

*అప్పుడు శిష్యుడు నవ్వుతూ  “గురువుగారూ!  మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?”అన్నాడు.*

*గురువు గారు నవ్వుతూ “ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే నీకు యేమీ అపకారము చెయ్యదు. పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..”అన్నారు.*

*పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన  భయము' షష్టీ తత్పురుషము నకు ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా  శార్దూలము యొక్క కాపలా పెట్టారు.*

*ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండీలో ఎక్కించి “మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి!”అన్నాడు శిష్యుడు.*

*అందుకు గురువు గారు నవ్వుతూ నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.*

*ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ 'భార్యా భర్తలు', ‘తల్లిదండ్రులు' యిస్తారు మామూలుగా.*
*ద్వంద్వాతీతుడంటే మీ  భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.*

*పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.* ✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



53. కైక ఆదేశం- శ్రీరాముని ఆగమనం-3


మరింతగా దిగ్ర్భాంతి చెందె కైక,రాముణ్ణి విడిచి నేను జీవించలేను,చచ్చిపోతాను,ఇప్పుడు అభిషేకానికి తెచ్చిన సంభారాలతోనే నా,
రాముడు, నాకు పరలోక క్రియలు చేస్తాడు, నువ్వుగాని, భరతుడుగాని నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు, మీరిద్దరూ నా;

కు ధర్మోదకాలుకూడా విడవ వీల్లేదు అనె దశరథుడు,ఆకాశంలో వెలుగురేకలు విచ్చుకోసాగె,మెల్ల మెల్లగా సూర్యోదయం అవుతున్నది, 
 రాజుతో పాటుగా అటుగా చూసింది కైక, గాబరా చెందిందామె, వేళ మీరిపోతున్నది. పట్టు సడలించరాదనుకున్నది; 

అరచిందిలా, ‘‘రాజా! నువ్వు ఆదేశించినట్టుగానే అన్నీ జరుగుతాయిగాని, ముందు రాముణ్ణి అడవులకు వెళ్ళమని, 
ఆజ్ఞాపించు, భరతుణ్ణి యువరాజుని చెయ్యి, తప్పించుకుందామని చూడకు, తప్పదిది,’’బతిమలాడాడు, భయపెట్టాడు, ఆఖరికి ఛీ అని; 

వదలిపెట్టాడు, అయినా కైక కరగలేదంటే రాముడికి అరణ్యవాసం తప్పదనుకున్నాడు దశరథుడు, విధిని ఎదిరించడం,
 తన వల్ల కాదనుకున్నాడు, అయినా ఏదో చిన్న ఆశ! మిణుకుమిణుకుమని కనిపించిందతనికి,కైక వరాలకు తాను కట్టుబడి ఉం;

డాలి, అది ధర్మబద్ధం, రాముడు కట్టుబడి ఉండనక్కర్లేదు, తన ఆదేశాన్ని రాముడు ధిక్కరిస్తే బాగుణ్ణనిపించిం,
ది దశరథునికి, ఒళ్ళు తూలిపోయె, కళ్ళు తిరుగుతున్నాయి, అనారోగ్యం మీద పడుతున్నదని తెలుసుకున్నాడు, కైకతో,ఇక నీ ఇష్టం; 



నీకెలా చెయ్యాలనిపిస్తే అలా చేసుకో! చనిపోయే ముందు రాముణ్ణి ఒక్కసారి చూడాలనుకుంటున్నాను, చూపించు, ఆనందం,
గా కన్ను మూస్తా,’’అభిషేక సన్నాహాలురాత్రి అంతా అభిషేక సన్నాహాల్లో గడిపాడు వసిష్ఠుడు, సంభారాలన్నీ సమకూర్చె, సూర్యోదయం;

అయింది, పట్టాభిషేక మూహూర్తం సమీపించింది, స్నాన సంధ్యాదులు ముగించి,వేదపారంగతులు, శిష్యులసహా రాజ,
మందిరానికి బయల్దేరాడతను,వసిష్ఠుణ్ణి అనుసరించి  వాహనాలు నడిచె, ఆ వాహనాలలో తూర్పు, పశ్చిమ వాహినుల, సముద్రజ;


లాలుఉన్నాయి, బంగారుకలశాల్లో నింపి ఉంచారు వాటిని, మణులు, గంధ పుష్పాక్షితలు, నేయి, తేనె, పాలు, పెరుగు, పేలాలు, 
నవధాన్యాలు, దర్భలు కూడా ఉన్నాయి, రెండు చామరాలు ఉన్నాయి, శ్వేతచ్ఛత్రం ఉంది, ఖడ్గ సింహాసనాలు;
 


ఉన్నాయి, వాటి వెనుక బంగారుకొమ్ముల తెల్లటి ఆబోతు, పట్టపుటేనుగు, బంగారంలా పచ్చగా మెరిసిపోతున్న ఎనిమిదిమంది కన్యలు, 
వేగవంతాలైన అశ్వాలను పూన్చిన రథం, గోవులు, శుభసూచకాలైన పక్షులు, పెంపుడు జంతువులు; 

చాలా ఉన్నాయి,ఊరేగింపుగా రాసాగాడు వసిష్ఠుడు, అతన్ని బ్రాహ్మణులు, కానుకలు అందజేసే పౌర, జానపదులు అనుసరిం,
చారు రాజభవనం చేరుకున్నారంతా. వసిష్ఠుణ్ణి చూస్తూనే చేతులు జోడించి నమస్కరించాడు సుమంత్రుడు, ద్వారం;

 దగ్గర వేచి ఉన్నాడతను,సుమంత్రా,మహర్షి సర్వసన్నాహాలతో నేను వచ్చాననీ, పట్టాభిషేక ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయ,
నీ, ప్రజలంతా తన కోసం ఎదురు చూస్తున్నారనీ వెళ్ళి మహారాజుకి విన్నవించు,తప్పకుండా, అని అక్కణ్ణుంచి బయ;

ల్దేరాడు సుమంత్రుడు, అంతఃపురానికి చేరుకున్నాడు, మహా రాజు మందిరంలో లేడు, మరెక్కడ ఉన్నట్టు? సాలోచనగా అ,
టుగా చూశాడు, అనుకున్నట్టుగానే కోపగృహం తెరచి ఉండడాన్ని గమనించాడు, శ్మశానద్వారం తెరచి ఉన్నట్టుగా అ;


నిపించిందతనికి, అనుమానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడటు, కాలికేదో తగిలిం,
ది, తూలిపడబోయాడు, నిలదొక్కుకున్నాడు, నిలదొక్కుకుని తగిలింది ఏమిటన్నది తేరిపార చూశాడు సుమంత్రుడు, మం;


ధర చేతికర్ర, ‘‘అయ్యయ్యో! ఈ కర్ర ఇక్కడ ఉందా? ఎక్క డెక్కడో వెతుక్కుంటున్నాను’’ అని, 
గోడను ఆను కుంటూ రాసాగింది మంధర, ‘‘మహారాజూ, కైకాదేవి కోపగృహంలో ఉన్నారు’’ అని నవ్వింది, కర్ర తీసుకుని; 

వెళ్ళిపోయిందక్కణ్ణుంచి, సుమంత్రుడు కోపగృహం గుమ్మం దగ్గరకు చేరాడు, చేతులు కట్టుకుని నిల్చాడు, ‘‘రాజేంద్రా! తెల్లవారిం,
ది, సుప్రభాతం పలుకుతున్నాను’’ అన్నాడు,లోపల నుంచి సమాధానం లేదు,‘‘ప్రభూ! అభిషేక సన్నాహాలతో వశిష్ఠుడు, మం;

త్రి సామంతులు, పురప్రముఖులు నీ కోసం ఎదురు చూస్తున్నారు, స్నానాదికాలు ముగించి, త్వరగా రండి’’ ప్రార్థించాడు,సమాధానం, 
లేదు, ఇక ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు, నిష్క్రమించాలనుకున్నాడు సుమంత్రుడు, వెను తిరిగాడు, అప్పుడు కైక గొం;

తు వినవచ్చింది, సుమంత్రా! ఇప్పటి వరకూ నేనూ, మహారాజూ రామాభిషేకం గురించే మాట్లాడుకున్నా,
ం, ఇప్పుడే మహారాజు నిద్రకొరిగారు, మంచి నిద్రలో ఉన్నారాయన.’’
***

ప్రాంజలి ప్రభ.. 005...9-9-
శ్రీమద్రామాయణము.

(284 వ ఎపిసోడ్),

""యత్ర నార్యస్తు పూజ్యంతే,
   రమంతే తత్ర దేవతాః,
   యత్రైతాస్తు న పూజ్యంతే,
    సర్వసస్తత్రా ఫలాక్రియః.""

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ జరుపు కార్యాలన్ని నిష్ప్రయోజనములవుతాయి
భారతీయ సనాతన ధర్మాలన్ని స్త్రీకి అత్యంత యున్నత స్థానమిచ్చి గౌరవించింది.

రామాయణము లో సుందరకాండములో హనుమ అంగుష్టమాత్ర స్వరూపములో లంకలో ప్రవేశిస్తుంటే లంకాధిదేవత(లంకిణి) ఎదురై"'ఎవడివిరా నీవని ప్రశ్నించగ హనుమ నీవెవరో ముందు చెప్పమని అడుగుతారు.నేను ఈ లంకను పరిరక్షిస్తున్న సేవికను.నన్ను జయింపక నీవు లంకలో ప్రవేశించలేవని యుధ్దానికి దిగుతుంది.ఆ యుధ్దములో హనుమ తన లఘుముష్డి ఘాతముతో కొట్టగా ఆమె భూమిపైపడగా హనుమ,

""" కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రీయం తు తామ్,
తతో వై భృశసంవిగ్నా లంకా సా గద్గదాక్షరమ్""(03-43),

అలా క్రిందడిన ఆ రాక్షసిని చూచి "" ఆ రాక్షసి ఒక స్త్రీ""యని భావించి అమెను దయదలచి విడిచిపెడతాడు.అప్పుడు ఆ లంకిణి,

'"సమయే సౌమ్య తిష్టంతి సత్త్వంతో  మహాబలాః,
అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ||,(03-45),

ఓ మహాపురుషా!  దీరులైన మహాబలశాలురందరు "" స్త్రీలను""సంహరించరాదను నియమమునకు కట్టుబడి యుందురు. నేను లంకాధిదేవతను.నీవు నీ పరాక్రమముతో నన్ను జయించావు.పూర్వము నాకు బ్రహ్మ ఒక వరమిచ్చాడు.ఎవరైతే నిన్ను తన బలపరాక్రమముతో జయిస్తారో అప్పుడు ఈ లంకకి మా రాక్షసులకి కీడుమూడునని నీవు తెలుసుకొనమని" చెప్పాడు.ఇక నీ వల్ల ఆ సమయము ఆసన్నమైనట్లే యని స్వేఛ్చగా లంకలో ప్రవేశించమని పలుకుతుంది.

స్త్రీయని హనుమ గౌరవించి దయతో లణంకిణిని చంపకుండ వదలటముతో దేవతల ఆశీర్వాదములు హనుమకి లభించాయని మనమెల్లరము గమనించుకొని స్త్రీలని గౌరవిస్తుంటే  మనకెల్లరకు దేవతల ఆశీర్వచనములు లభ్యమవగలవని రామాయణము మనకి తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్  జై జై శ్రీరామ్.



No comments:

Post a Comment