[12/09, 10:10 am] Malapragadasridevi: మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు?
ఈ విషయం అందరూ ఆలోచించాల్సిందే కదండీ.
శ్రీకృష్ణుడు భూమిమీద అవతరించిన సమయంలో బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు...దేవతలు అందరూ సహకరించి రకరకాల రూపాలతో భూమి మీదకి వచ్చారు. కానీ చంద్రుడు తన కుమారుడు వర్చ్యుడిని భూమి మీద పంపించడానికి ఇష్టపడలేదు.
అభిమన్యుడు గత జన్మలో ఎవరో మీకు తెలుసా?
భగవంతుడు ధర్మ రక్షణ కోసం ప్రతియుగంలో భూమ్మీద అవతరిస్తూ ఉంటాడు . అదేవిధంగా ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించవలసి వచ్చింది.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని? దేవతలు అందరూ కూడా శ్రీ కృష్ణ పరమాత్మ కి సహాయంగా భూమిమీద వివిధ రూపాలలో జన్మించాలి. అన్నప్పుడు దేవతలు అందరూ సరే అన్నారు. కానీ ఒక్క చంద్రుడు మాత్రం తన కుమారుడైన వర్చ్యుడుని భూమి మీదికి పంపించడానికి ఇష్టపడలేదు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ కూడా... అందరూ కచ్చితంగా భూమ్మీద అవతరించి వలసిందే. ఎవరూ కాదు అనడానికి వీలు లేదు. అన్నప్పుడు ఇంక చంద్రుడు తప్పనిసరిగా ఒప్పుకొని దానికి ఒక కండిషన్ పెట్టాడు.
తన కుమారుడు భూమ్మీద జన్మించిన తర్వాత 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు. ఆ 16 సంవత్సరాల్లో కూడా గొప్ప వీరుడు గా ఖ్యాతి పొందాలి. దానికి అంగీకరిస్తే భూమి మీదకి వస్తాడు అని చెప్పగా అందరూ అంగీకరించారు. దేవతల చాలామంది భూమిమీద అవతరించారు. తర్వాత కృష్ణుడు అవతరించాడు. ఆ తర్వాత అర్జునుడు కొడుకుగా అభిమన్యుడు జన్మించాడు. ఆ అభిమన్యుడే చంద్రుడు కొడుకు వర్చ్యుడు. అందుచేతే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేదు. అభిమన్యుడు అంటే వర్చ్యుడు మహాభారత యుద్ధంలో వీరోచితంగా పోరాడి అనేకమైన అనేకమంది వీరులని చంపి తన జీవితాన్ని ముగించుకొని వీరమరణం పొందాడు.
పద్మవ్యూహం ప్రవేశ ద్వారం దగ్గర సైంధవుడు.. ఐదుగురు పాండవులను అడ్డుకొనగా.. ఒక్క అభిమన్యుడు మాత్రం లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించి ఎన్నో వేలమంది కౌరవసైన్యాన్ని చంపేశాడు. అది ధర్మయుద్ధం. దుర్యోధనుడు వాళ్ళు చేసింది అధర్మ యుద్ధం. ఎదుట నిలబడి యుద్ధం చేసే ధైర్యం లేక కర్ణుడు అభిమన్యుడి వెనకకు వచ్చి వెనక నుంచి వింటి నారిని తెంచేశాడు. కవచం వెనుక భాగాన్ని కత్తితో ఛేదించేడు. వెంటనే ద్రోణాచార్యుడు బాణాలతో గుర్రాలను పడగొట్టాడు. కృపాచార్యుడు సారధిని చంపేశాడు. అశ్వత్థామ, బాహ్లీకుడు, శకుని, కృతవర్మ నాలుగు వైపుల నుంచి బాణాలతో అభిమన్యుని గాయపరిచారు. ఆ విధంగా అభిమన్యుణ్ణి క్రూరంగా చంపేశారు.
సేకరణ
👉 మీ ప్రాంజలి ప్రభ 👌👈
[12/09, 10:19 am] Malapragadasridevi: *🙏నేను ఎవరు ?🙏*
*--------- 0 ---------*
💐💐😊👍👌😊💐💐
*కా తే కాంతా కస్తే పుత్రః* *సంసారోఽయమతీవ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*
*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి:-*
*నీ భార్య ఎవరు?*
*నీ పుత్రుడు ఎవరు..?*
*ఈ సంసారము..! చాలా విచిత్రమైనది..!*
*నీవెవరి వాడవు..? ఎవడవు..? ఎక్కడినుండి వచ్చావు..?*
*ఓ సోదరుడా..! తత్త్వమునాలోచింపుము..!*
*1) కాతేకాంతః..?*
*నీ భార్య ఎవరు..? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ..!* *వివాహానికి ముందు ఒకరి కుమార్తె..! ఆమె పుట్టుకలోగాని..!* *పెరగటంలోగాని..!*
*నీకు ఏ ప్రమేయమూ లేదు..!*
*ఆమె ఎక్కడో పుట్టింది..!*
*నీవు ఎక్కడో పుట్టావు..!* *అయినా పెళ్ళితో..! మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది..!*
*పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా..! చివరిదాకా..! ఇలా కలిసే ప్రయాణిస్తారా..? అదేం లేదు..! ఈ ప్రయాణంలో..! ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు..! ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి..! అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు..! వెళ్ళిపోవటం కూడా..! ఒక్కసారిగా జరగటం లేదు..! ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను..! కొంతకాలం..! కలసి మెలసి జీవిస్తారు అంతే..!*
*ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.* *లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.*
*భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే..! అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.*
*2) కస్తే పుత్రః..?*
*అలాగే నీ కుమారుడెవరు..?*
*అని కూడా విచారించు..!* *పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో..! ప్రేమాస్పదుడైన..!*కుమారుడు..! మరి..!* *అంతకుముందు..? అతడు*
*నీ భార్య గర్భంలో పిండం..!* *అంతకు ముందో..! అతడు* *నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..?*
*నీవు తిన్న ఆహారం ద్వారా..! నీలో..!తయారైంది..! మరి*
*ఆ..! ఆహారం ఎక్కడి నుండి* *వచ్చింది..? భూమిలోనుండి వచ్చింది..!* *అంటే మట్టి అనేక మార్పులు చెంది..! ఆహారంగా మారి..!*
*ఆ..! ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి..!*
*అది వృద్ధి చెంది..! శిశువుగా వ్యక్తమైంది..!*
*అంటే మట్టి యొక్క చివరి రూపమే..! నీ కుమారుడు అన్నమాట..! మరి నీవు* *ఎవరు..? నీవూ అంతే..! కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో..!*
*నీవు ముందున్నావు..! నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే..! ఈ లెక్కన చూస్తే..!*కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద..! మరొక చిన్న మట్టి ముద్దను..! దగ్గరకు తీసుకొని ముద్దు* *పెట్టుకుంటుంది..! ప్రేమను పెంచుకుంటుంది..!* *విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు..! విల విలలాడి పోతుంటుంది..!* *దూరంగా ఉండి..! ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని..! మనం తమాషాగా..!* *చూస్తున్నాం..! అనుకోండి..!*నవ్వకుండా ఉండలేం..! కానీ..! అదే నాటకంలో..! మనం..!* *పాత్రధారులమై..! ఎంతో సీరియస్ గా..! ఆ మట్టి ముద్దల పాత్రలను..!* *పోషిస్తున్నాం..! ఇదే భ్రమ..!* *ఇదే మాయ..!*
*ఇదే అజ్ఞానం..!*
*ఉన్నది ఉన్నట్లుగ..! చూడలేక..! "నాది - నాది" అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం..! అందుకే ఈ సంసారం అతి విచిత్రం..! తమాషా అయినట్టిది..! ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది. వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక..! ఉపాయం..!*
*సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.*
*నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు..! గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే..! అవీ జడమే. వాటిని నేను ఉపయోగించు కుంటున్నాను.*
*మరైతే నేనెవరు..?*
*దేహంలో కూర్చొని..!* *మనోబుద్ధులను..!* *ఉపయోగించుకొని పనిచేసే జీవుడను..! అయితే* *జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కడనుంచి* *వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను..!*
*నేను వచ్చింది అక్కణ్ణించే..!* *
*మరి ఎక్కడకు వెళ్ళాలి..?*
*ఆ పరమాత్మ వద్దకే...!* *పరమాత్మ నుండి వచ్చిన* *జీవుడు..! కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో..!* *సుఖదుఃఖాలు అనుభవించి..! చివరకు ఆ పరమాత్మలో..! చేరిపోవాలి..!*
*అప్పుడే పరమశాంతి..!*
*అదియే..! బ్రహ్మానందం..!* *అదే..! శాశ్వతానందం...!*
*అదియే..! పరమోక్షము..!*
🙏🙏🙏
ప్రాంజలి ప్రభ
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సరదాగా….
*గురువు గారు - శార్ధూలం*
➖➖➖✍️
*ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.*
*ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.*
*శిష్యుడు అతడి భార్య ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.*
*అప్పుడు గురువు ఒక శార్దూల వృత్తము(పద్యము) లో మధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా ఆశీర్వదించారు.*
*అప్పుడు శిష్యుడు నవ్వుతూ “గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?”అన్నాడు.*
*గురువు గారు నవ్వుతూ “ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే నీకు యేమీ అపకారము చెయ్యదు. పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..”అన్నారు.*
*పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.*
*ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండీలో ఎక్కించి “మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి!”అన్నాడు శిష్యుడు.*
*అందుకు గురువు గారు నవ్వుతూ నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.*
*ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ 'భార్యా భర్తలు', ‘తల్లిదండ్రులు' యిస్తారు మామూలుగా.*
*ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.*
*పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.* ✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment