కృష్ణ లీల.. mattakokila
సాధు సమ్మత లక్ష్యసాధన సర్వదుష్కృత మార్గమై
వేద రక్షక దుష్ట శిక్షక పాప నాశన చేయుటే
పృథ్వి పోషక ధర్మ రక్షక యాగ రక్షక నిష్టగా
చిద్విలాసక జన్మకారక దీక్షరక్షక కృషుడే
సాగరమ్మున మత్యమూర్తిగ నావలాగిన ధీరుడే
జాగ మంతయు ప్రాణ రక్షక జీవ పోషక కృష్ణుడే
యోగ శక్తిగ సృష్టి గాచియు సత్య రక్షక వీరుడే
భాగ్య కల్పక భోగ కల్పక భవ్య కల్పక కృష్ణుడే
కూర్మరూపుగ పృద్విమాతను పూర్తి రక్షగ కృష్ణుడే
క్రూరకర్మలు ఏక రవ్వున పూజ చేసిన దక్షుడే
ఘోరమాయను బంధిచేసియు గొప్ప రక్షక మిత్రుడే
పోరుసల్పియు రక్కసమ్ముల పోరు బాటయె కృష్ణుడే
--(())--
(దుష్టబుద్ధియు జ్యోతిష్కులును ప్రవేశింతురు)
దుష్ట—యెంత మూఢులైనను యిట్లు తలంతురా ? బుద్ధిబలిమికి సాటియగువది వేరొండేమి గలదు ?
(ఉప క్షేపము)
చం. నిరుపమ సౌఖ్యముల్ బడయ, నిస్తులమా విభవంబులొంద, భూ
వరపదము౯ గ్రహింపఁదన వైరుల నెల్ల నడంప, నీప్పితో
త్కములనెల్లఁ దీర్చికొనగాఁ దగుమార్గము మానవాళి క
త్యురుతరమైన బుద్దిబల మొక్కటె సుమ్మి జగంబులోపలన్.
(పరిన్యాసము)
తే గీ|| రాజునకు మారు రాజునై రాచరికము
బరపుచునుగల్గు సకలసంపదలనెల్ల
ననుభవింపుచునున్నాఁడ నస్మదీయ
బుద్ధిబల మనఁగద యిట్లు పొసఁగుటెల్ల.
(భేదము) .
కావున నెల్లవిషయంబులకును సఫల కారియగు బుద్ధి బలిమే బలిమి. బుద్ధి బలిమే కలిమి. నాష్త్రజ్ఞాతిశయంబున నమోఘంబగు బుద్ధి బలిమి వడయుటం బట్టిగదా నాకిట్టివైభవంబు చేకూరె. ఇంతకు ప్రాముఖ్యము బద్ధిబలమే కావున దానింగూర్చి మీయభిప్రాయము నింతియెకదా ?
జ్యో- మంత్రివర్యా ! తామిట్లుశలవీయఁ బ్రతివచనంబులు బల్క మేమెంతటివారము ? ఆయినను యెట్టివిషయంబులకును ముఖ్య కారణము దైవబలము కాని బుద్ధిబలము కాదని మాయభిప్రాయము.
మఱియు.
శ్లో ॥ ఆన్యధా చింతితం కార్యం దైవమన్యత్ర చింతయేత్ .”
అని పెద్దలు నుడువురీతిని కార్యంబును మనోభీష్టంబును నేకీభవించినప్పుడు తప్పఁ దక్కిన వేళలందెల్ల దైవికంబున మన మొకటి దలంప నదియొకటియగును "కావున బుద్ధిబలం బప్రయోజనంబని మనవి సేయ సాహసించుచున్నాము.
దుష్ట — అట్లేల చెప్ప నొప్పు?
(పరికరము)
తే॥ గీ॥ బుద్ధి బలమునఁగా భూములను గెల్చి
పాలనంబొనరించుచుఁ బార్థివుండు
నిహపరసుఖంబులను గాంచు టెల్లనింక
దైవికంబంట మీ ప్ర్రమాదంబ కాదె
(యుక్తి)
“ప్రమాదోధీమతామపి ” అన్నట్లు మీరు తెలిసిన పెద్దలైన నీయల్ప విషయంబునఁ బ్రమాద ముందు చున్నారు.
జ్యో- ఆట్లేల బల్కెదరు? ఎల్లవిషయంబులకు బ్రాప్తి కారణంబగు దైవబలంబుండ మానుషికంబై యస్వాతంత్య్రంబగు బుద్ధిబలం బెక్కుడని యెట్లు చెప్పగలము ! దైవికంబను శబ్దంబె మఱచి గ్రుమ్మరి యిమ్మహిని జెడినవారెందఱెందఱు గలరో చూడుడు.
సీ// పురిటింటఁ బసిబిడ్డఁ బరిమార్ప నెంచిన కంసు యోజనలు భంగములు గావె
లక్కయిల్వన్ని పాండవులఁ ద్రుంపగఁ జూచు కురుపతి యూహలు క్రుంగిపోవె
ఆంజనేయునిఁ జంప నరసిన కాలనేమి మహాపకృతులు వ్యర్ధములు గావె
పాంచాలిఁ జెఱుపఁ బాల్పడ్డ కీచకు నుపాయములన్నియును వికలములు గావె
॥ గీ॥ వారు బుద్ధిబలాఢ్యులు గారె తలఁప
దైవికంబున నవియెల్ల దప్పిపోవె
కాన మన మొనరించెడు కార్యములకు
బుద్ధిబలమె కారణమనఁ బొసఁగు టెట్లు.
(ప్రాప్తి )
దుష్ట—అకటా ! పాపము. మీ బుద్ధి ప్రమాదమంత కంత కతిశయిల్లుచున్నది. " కేవల పౌరాణిక వాక్యములనే గ్రహించితిరిగాని వానియందుగల యసందర్భముల గ్రహింప లేరైతిరి కదా ! నేను జెప్పిన పిదప నైన గ్రహింపగలరేమో చూతము,
(సమాధానము)
సీ॥ మాయచే బిడ్డను మార్చుటఁ గానమిఁగంస యోజనలు భంగంబులయ్యె
లక్కయిల్గా ల్చెడు టక్కు భీముడెఱుంగఁ గురుపతియూహలు గుంగిపోయె
ఆంజనేయులుజలం బానకుండుటఁ గాలనేమి యత్నంలన్నియును దొలఁగె
పాంచాలి చెప్పిన పట్టున కేగుటఁ గీచకు కృత్యముల్ బెడసిపోయె
తే॥ గీ॥ వారు బుద్ధిబలాఢ్యులు గారటంచు
నెఱుగ లేకుందు రేమీర లింకనైన
బుద్ధిబలము ప్రయోగింపఁ బొసఁగ రాని
కార్య మొక టైనఁగలదె జ గంబునందు.
(ఉద్బేదము)
కావున మీవచనంబులు నామదికి రుచింపకున్నవి. బుద్ధిబలిమే యెల్లవిషయంబులకి నెక్కుడని వే నోళ్ళనుడువ నొప్పును.
జ్యో- మంత్రిసత్తమా ! తాము నిక్కువముగా బుద్ధిబలాఢ్యులే కావ మావచనంబులకు యుక్తి యుక్తంబు లగు ప్రతివచనంబులు బల్కితిరి. కాని యెందు చూచినను దైవబలమే ప్ర్రాముఖ్యమని మాయభిప్రాయము, మీకు సదుత్తరంబులీయ మే మెంతటివారము
సజ్జనమైత్రిచే సాధువగును
సీసం
అగ్నిఁ గాలిన యిను మగ్నియై నట్లుగ
సత్సంగమున వ్యక్తి సాధువగును
జలము దుగ్ధమునందుఁ గలిసిపాలైనట్లు
సజ్జన మైత్రిచే సాధువగును
నీరు కతకముచే నిర్మలమైనట్లు
సజ్జనున్ గూడిన సాధువగును
విరిదండ దారమున్ శిరముఁ దాల్చినరీతి
సాధుఁగూడిన జనున్ సత్కరింత్రు
ఆ వె
నారదు వచనమునఁ జోరుఁడు వాల్మీకి
యాది సుకవి యయ్యె యతులు పొగడ
దుష్ట మానవుండు శిష్టులమైత్రిచే
సాధు పురుషుఁడగును సత్యమిదియె. 44
అచ్యుతానందబ్రహ్మచారి
అనంగ త్రయోదశి
అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి , కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి , నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని , మన్మద సాలగ్రామాన్ని గాని ,
పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి
*నమోస్తు పుష్పబాణాయ*
*జగదాహ్లాదకారిణే !!*
*మన్మధాయ జగన్నేత్రే !* *రతిప్రీతి ప్రియాయతే !!*
అనే శ్లోకాన్ని పఠించి
*కామదేవాయ విద్మహే |*
*పుష్పబాణాయ ధీమహి |*
*తన్నో అనంగ ప్రచోదయాత్ ||*
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ
మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది. అనంగుడన్నా , పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే , కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.
మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.
మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన , యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు , ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి. ఈ పువ్వులు అశోకం , తెలుపు మరియు నీలం పద్మాలు , మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి. రుషులు , మునులు , సత్పురుషులు , దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.
మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని , తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని , ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే *'అనంగ'త్రయోదశి*. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని , ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.
రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతాన్ని రాగాలున్న దంపతులు , అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత , అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది.
*_శుభమస్తు_*
****
...,......పితరౌవందే ......
ధర్మార్థకామాదిత్రైపురుషార్థమ్ము, సాధింపనుద్వాహసిధ్ధినొందు
ఏడేడుతరములునిహపరతుష్టికై
సారస్యసంతానసఫలమందు
అంకురించినదాదిఆత్మీయతనుపెంచి
ఆత్మసఖినినెంతొ నాదరించు
అర్థాంగిఅందమ్మునధికమైభాసిల్ల
అపురూపమౌప్రేమనతిశయించు
తనదుభార్యతనువునజీవనముబొంది
భావిగర్భస్థశిశువుసౌభాగ్యమునకు
ఉచితమౌరీతిసేవలునేర్పుతోడ
అందజేసెడుతండ్రి యానందమెంతొ......
......
నీలాలకన్నుల్లొనిత్యనూతనకాంతి
నిండుగామెండుగానిండిపోవ
సన్ననౌచిన్ననౌకన్నీటితెరలడ్డు
గోడగాచూపులనడ్డగింప
ఆనందబాష్పాలుఅందమౌచెక్కిళ్ళ
కలువైపాయలైజాలువార
ఆల్చిప్పలన్బోలు నాకనురెప్పలు
మాటిమాటికిచిటపటలునాడ
నోటమాటరాకనుదుటిరేకలజాడ
ఒక్కటైనరీతినొనరుచుండ
ఒడినిబూచులాడు ఉఊలరాయని
కన్ననిగనునుప్రసన్నముగను
..........
లాలిస్తుపాలిస్తుజోలపాటలుపాడి
నిద్రపుచ్చైడునీదునేర్పునకును
ఒకచేతగిన్నెనుఒకచేతచేతిని
బిగపట్టిఉగ్గుతినిపించురీతి
బుడిబుడిఅడుగులవడివడినడకల
పరుగెత్తుబాలునిపట్టుకొనగ
చిటికెనవేలునుచిరుతకందించుచు
ఆడించునేర్పుకమ్మా నమోస్తు
ఒడినిగూర్చుండబెట్టుక ఓనమాలు
ముద్దుముద్దుగనేర్పునీమురిపమునకు
శాంతిప్రేమకుదయలకుసహనమునకు
నీవెచిరునామవనుచు నిన్నేనుతింతు
....**********
దేవీ... శ్రీదేవీ అత్యాను ప్రాస భావ కవిత్వం
526.. వసుంధర.. జ భ త ర స గ..9
వినాశ కాలము విద్యా విమర్శ సేవగ నేలే
అనాది నుండియు సామర్ధ్య సేవ భావము యేలే
ప్రణీత బుద్దియు ధైర్య ప్రభోదమే జగమేలే
ననేక కష్టము లొచ్చున్న రవ్వ వెల్గులు దేవీ
527..వస్తు, వాస్తుక.. మ త ర మ గ
.7
సౌభాగ్యా సాహిత్య సంపదే సన్మార్గమ్మే
వైభోగా వైడూర్య వైనతీయా మార్గమ్మే
ప్రాబల్యమ్మే సాగి శాంతిగా విశ్వాసమ్మే
దుర్భేద్యమ్మే ప్రేమ మొక్షమౌనే శ్రీదేవీ
528.. వాంతభార:.. న త గ గ లేదు
పలుకు లన్నీ సుఖమ్మే
తలపులన్నీ తపమ్మే
మలుపులన్నీ జయమ్మే
పిలుపు లన్నీ భయమ్మే
529.. వాటికా వికాశ :.. భ మ య జ గ గ..9
బంధపు సంతోషమ్ము సౌభాగ్య మే జయమ్మే
అందము యారోగ్యమ్ము సామర్ధ్య మే జయమ్మే
పందెము ప్రోత్సాహమ్ము ప్రాబల్య మే జయమ్మే
పొందిక భావమ్మే కళాభోధ లేను దేవీ
530.. వాణినీ సురవాణి నీ..న జ భ జ జ గ గ...9
మనిషిన మోహ మాయ మ నసవ్వుట గీతమేలే
తనువున తాప తత్వతయు జీవపు మార్గమేలే
కణములు తిర్గు సాత్వికము కాలము మార్గమేలే
క్షణముయు సేవ భావిక సకామ సహాయ దేవీ
*----*
ఆచార్య తిరుమల
సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే కాదు అక్షరాలతో కూడా ఆటలాడుకున్నారు.
పద్యాలతో పరమాద్భుతమైన విన్యాసాలు చేశారు.
ఒక పద్యంలో మరో పద్యం, ఆ పద్యంలో మరో పద్యం ఇమిడ్చి రాసే 'గర్భ' కవిత్వాలూ, ఎటు చదివినా ఒకేలా వుండే అనులోమ విలోమ పద్యాలు, నాగబంధం, ఖడ్గబంధం లాంటి 'బంధ' కవిత్వాలు, సర్వ లఘు పద్యాలూ - ఒకటేమిటి? ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ చేశారు.
బమ్మెర పోతన - భాగవతం గజేంద్ర మోక్షం కథలో
అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడ నుడుగుడని వెడ నుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!
అని వృత్త్యను ప్రాసాలంకారంతో సర్వ లఘు కందం రాసి, లక్ష్మీదేవి యొక్క గుం'డె' ద'డ'కి అక్షర రూప కల్పన చేశాడు.
ఒకే హల్లు పలుమారులు ఆవృత్తి అవ్వటం వృత్త్యనుప్రాసాలంకారం. అసలు, ఒక హల్లుతోనే వాక్యాలూ, పద్యాలు వుండటం చూస్తే- ఆశ్చర్యం వేస్తుంది. ఇది చూడండి:
“కా కీ కే కా కి కి కో క కా క కే కి కా?" - కాకి ఈక - కాకికి - కోక కాక- కేకికా (నెమలికా)? అని దీని అర్థం.
అలాగే 'న' గుణితంతో చూడండి:
నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నివవై
నానీ నను నానా నను
నానూన యనంగ వొంటి యక్షరమయ్యెన్!!
అని లక్షణకారుడు చెబితే మరో మాటకారి-
నూనె(ఆయిల్) అనే మాటతో—
నా నూనె నీ నూనా? నీ నూనె నా
నూనా? నా నూనె నీ నూనని నే నన్నానా? అని గిలిగింతలు పెట్టాడు.
నేనోసారి నా మిత్రునితో మహా గాయకుడు మన్నాడే ని గూర్చి ముచ్చటిద్దామని “మన్నాడే”అనేసరికి ఆయనగారు వెంటనే-
“ఏ మన్నాడే? ఆ మన్నాడే రమ్మన్నాడే-” అని అడ్డుపడి నవ్వేశాడు
శ్రీ శ్రీ - 'న' అనే అక్షరాన్ని 'అ్న' అనీ, 'గ' అనే అక్షరాన్ని 'అ్గ' అనీ యెందుకు రాయకూడదని అడుగుతూ - మ. న. స - అనే మూడక్షరాలతో త్ర్యక్షర కందం అందించాడు చూడండి:
మనసావి నిసిని సేమా
మసి మనిసి మనసు మాసిన సీవా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!
సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనే పదాలతో చమత్కారమందించారు. ఈ పద్యంలో శ్రీ శ్రీ మహాకవిగా కంటే 'సినిమా' కవిగానే బాగా కనిపిస్తాడు.
ఒక అజ్ఞాత కవి ఎవరో-
మా పని నీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పనిగానిమ్మా!!
అంటూ సప్త స్వరాలతో కంద పద్యాన్ని పని గట్టుకుని చెప్పి రసజ్ఞుల మెప్పులందుకున్నాడు.
ఎటునుండి చదివినా ఒకేలా వుండడమే కాకుండా అర్థభేదంతో వుండే అనులోమ, విలోమ పద్యాలు మరీ అద్భుతంగా వుంటాయి.
ఈ క్రింది అనులోమ పద్యాన్ని చివరి నుండి మొదటి వరకు చదివితే వేరే అర్థం వస్తుంది. చూడండి:
దామోదర సామ తనధ
రామా సరసాకర దశరథ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!
ఈ పద్యాన్ని చివరి నుండి
సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!
అని చదివితే వేరే అర్థం వస్తుంది.
పాదభ్రమకం పద్యంలో ప్రతి పాదాన్ని ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి చదువవచ్చును చూడండి:
ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!
ఇంక పద్య భ్రమకంలో ఏ పాదాని కా పాదం కాకుండా మొత్తం పద్యాన్నే చివరి నుండి మొదటికి చదవచ్చు. ఎటునుండి యెటు చదివినా ఒకేలా వుంటుంది. (ఆంగ్లంలో వీటినే Palindromes అంటారు). ఇది చూడండి :
రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!
ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని, కవిత్వముండదని కొందరంటారు గానీ వీటిలో అర్థం ఉంటుందని, కవి యొక్క అపార శబ్ద బ్రహ్మోపాసన ఉంటుందని గ్రహించడం మంచిది.
అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయటం ఎక్కువే కదా! కాబట్టి వారిని పట్టించుకోపోవటం బుద్ధిమంతుల లక్షణం.
చిత్ర కవిత్వాల్లో ఆరితేరిన గణపవరపు వేంకట కవి ప్రతి పద్యంలోనూ ఏదో ఒక చిత్రం ఉండేలా 883 పద్యాలతో "వెంకటేశ్వర విజయ విలాసం" అనే ప్రబంధం రాశాడు. ఆ కావ్యంలోని 808 పద్యంలో 64 రకాల విచిత్రాలున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ పద్యం చూడండి:-
సారాగ్య సారస సమనేత్ర యుగళ నా
»రద రుచి కాంతి నరఘన వనిత
సారాగధీర విశదవీన తురగ భై
»రవ భవ జైత్ర భర శుభ కరణ సారతిహార విసర చారణ హరి సా »రసహిత చంద్ర శరజ జయనుత వారాశి నారద వర పూజిత పద గౌ
»రవ కటి ఖడ్గ గరళగళ సఖ
హరి నగ నిలయ గిరిధర యసుర దళన
మణిమయ మకుట సురమణి మధుర విశరణ
కరి వరద కువర రుచిరత రవ సనన
రహరి లసిత దర నిగమ విహరణ హరి!!
ఈ పద్యాన్ని గూర్చి ఈ పద్యంలో 41 గర్భ కవిత్వాలు, 20 దాకా బంధ కవిత్వాలు అనులోమ, విలోమ పద్యాలు మూడు ఉన్నాయని మా మిత్రులు డా. ద్వా.నా.శాస్త్రి గారు తమ 'సాహిత్య కబుర్లు' గ్రంథంలో తెలియజేశారు. వాటి వివరాలు తెలుసుకోవటం వేరే పరిశోధనతో కూడిన విషయం.
పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణునికి వికట కవిత్వమెలా వచ్చిందో చమత్కారంగా 'క' భాషలో చెప్పారు. చూడండి:
తే॥గీ॥ కవి కక కట కక కవి కగ కన కను క
దీ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!
ఈ పద్యంలో 'క'లు తీసివేస్తే-"వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె" అనే వాక్యం వస్తుంది.
అల్లంరాజు రంగశాయి అనే కవి 'మ' గుణింతం తో ఓ అందమైన కంద పద్యం చెప్పాడు.
మామా మీమో మామా
మామా! మి మ్మొమ్ము మామ మామా మేమా
మే మొమ్మము మిూ మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి ప్రతి పదార్థమిలా చూడాలి:-
మా=చంద్రుని, మా=శోభ, మోమౌ=ముఖముగాగల, మామా మా మాయొక్క, మా=మేధ, మిమ్ము, ఒమ్ము=అనుకూలించును, మామ మామా=మామకు మామా, ఆము=గర్వమును, ఏమి+ఒమ్మము=ఏమీ ఒప్పుకోము, మిమై=మీ శరీరము, మేము ఏమే=మేము మేమే, మమ్ము, ఓముము+ఓముము=కాపాడుము, కాపాడుము, ఇమ్ము+ఔము=అనుకూలమగుమా.
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ది మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం.
ఏకాక్షర నిఘంటువులు చూసిస్తే గానీ యిటువంటి పద్యాలు అర్థం కావు. గానీ చదువుతుంటే సరదాగా వుంటాయి. ఇలాగే సంస్కృతంలో ఉన్న ఏకాక్షర శ్లోకాన్ని పరిచయం చేస్తాను. చూడండి:
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!
శ్రీ కృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభకు ఒకనాడొక కవి వస్తే - ఆయన్ని తెనాలి రామ కృష్ణుడు
"మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక" అంటూ ఓ పెద్ద సీస పద్యం లో మేకల మందని సమస్యగా చెప్పి నిరుత్తరుణ్ని చేసి ఓడించాడు.
అయితే కృష్ణరాయల కీర్తిని వర్ణిస్తూ తెనాలి కవి చెప్పిన యీ పద్యమెంత అక్షర సౌందర్యంతో గంభీరంగా వుందో చూడండి:
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్దిరిభి
త్కరి కరిభిద్దిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
నరసింహరాయల కుమారుడైన శ్రీ కృష్ణదేవరాయల కీర్తి- కరిభిత్=గజాసుర సంహారియైన శివునిలా, గిరిభిత్కరి=ఇంద్రుని ఏనుగైన ఐరావతంలో, కరిభిద్దిరి=కైలాసంలా, గిరిభిత్=వజ్రాయుధంలా, కరిభిద్గిరిభిత్తురంగ=శివేంద్రుల వాహనానాలలైన నంది, ఉచ్ఛ అశ్వం (తెల్లగుర్రం)లా అందంగా, తెల్లగా ఉందని భావం.
చివరగా, కాళిదాసు పేరు మీద చలామణీలో వున్న చదవటానికి నోరు తిరగని, ఓ శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తాను. శ్లోకాన్ని చూసి ఖంగారు పడకండి. జాగ్రత్తగా చదవటానికి ప్రయత్నం చేయండి.
షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్ఖాఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనఃఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్ట్రి యపదాడడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటేట్ప్రట టట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః!!
ఈ శార్ధూల చంధో బద్ధమైన శ్లోకానికి అర్థమేమిటో మీలో ఎవరికైనా గనుక తెలిస్తే పంచుకోగలరు.
ఇక ఉంటానండి మరి!
హాస్య సభ....వికటకవి శ్రీనివాస్
సేకరణ 🌹
No comments:
Post a Comment