Friday, 21 April 2023

 May be an image of 2 people, including Vvenkata Krishnaprasad Eleswarapu

 🕉️ వైశాఖ పురాణం 5 వ అధ్యాయము 🕉️

  
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


🌻 వైశాఖమాస విశిష్టత 🌻


💫🌹నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా! శ్రద్దగా వినుము.

💫🌹కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి.

💫🌹దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను.

💫🌹వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.

💫🌹ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.

💫🌹సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు.

💫🌹సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు.

💫🌹వ్యగ్రులై ఏకాగ్రతలేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు.

💫🌹శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు.

💫🌹స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును.

💫🌹సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు.

💫🌹అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు.

💫🌹పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.

💫🌹అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును.

💫🌹ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును.

💫🌹భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును.

💫🌹సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును.

💫🌹అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.

💫🌹ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.

💫🌹శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును.

💫🌹అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు.

💫🌹సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును.

💫🌹పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాసవ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు.

💫🌹కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును.

💫🌹అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.


వైశాఖ పురాణం అయిదవ అధ్యాయము సంపూర్ణము


       🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

 

 సీతాపతీ పద్య కావ్యము


సీసము

నీపదమంటిని - నీప్రేమ నాకిమ్ము

నీ పదములెచాలు- నీరజాక్ష

నీపదధూళులే - నాకును పదివేలు

నీకోవెలయె నాకు - నిత్య దీక్ష

నువు కనబడితివి  - నేను ను కనలేను

నిముషము మనలేను - నిను విడిచియు

నీ దాసులకు రక్ష - నాబ్రతు కొక నావ

నడిపించె తండ్రివి - నీవె రామ

తేటగీతి

మానవత్వ మహిమ మనసున నిలిపియు

కరుణ రసము తెలిపి కాపు కాయు

జీవి తాన మంచి చైతన్య మును యిచ్చి

వజ్ర సాన వల్లె మెరుపు తెచ్చె



*****

నాతో..నా శ్రీమతి.ప్రాంజలి ప్రభలు..21
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఏవండోయ్ శ్రీ వారు మీకు తెలుసా
తెలుసా అని అనే బదులు తెలిసినది కక్కేస్తే ఒకపనైయ్ పోతుంది
పనివివరం తెలుసుకోవాలని అనుకోవు ఏదోపనిచేయబోయి మరేదో పనిచేస్తావ్ చెయ్యి కోసుకుంటావ్ ఏమన్నా అంటే అరుచు కుంటావ్.

ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా?
అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు
వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.పక్కింటిలో మేళం మ్రేగితే ఏడ్చే వారు.

*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది. శుభ్రం గా ఉన్నా నచ్చదు. తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగితే నే కాని తృప్తి పడరు

*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖ మెక్కడ. ప్రతి విషయంలో తప్పుపడతాడు సంతోషమోచ్చినా ముందే ఏడుస్తాడు ఎందుకొచ్చిందాయని

*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోష మెక్కడ.
బుల్లి అరచి నా, చీమ కుట్టినా, మంచం కిర్రన్నా, పళ్ళు కొరికినా, తుమ్మినా దగ్గినా ఒకటే అరుపు దానిలో కూడా రౌద్రం

*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం. పెళ్ళాం బయటికి పోయినా, మంచి చీర కట్టినా, పిల్లలు ఏడ్చిన అనుమానం

*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా. పెళ్ళాం సంపాదన పై, ఇతరులను మోసపు సంపాదన యే లక్ష్యంగా జీవించేవాడు. అలా చేయక పోతే నిద్రే పట్టదు.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు నా చేయి కోసుకుంది కదా నా మనసు ఎలాంటి చెప్ప గలవా
ఆ చెప్ప గలను నేను చేయగలనని ధీమా వయసు ఉడికాక ఆధీమా తగ్గించు కుంటే మంచిది
అవునే అది ఎలా తగ్గించుకోవాలి ఇలా..
ఎలా...
ముందు కాఫీ తాగితే తెలుస్తుంది కాస్త ఓపిక వస్తుంది ....


మానవత్వం అంటే ఏమిటి? మానవత్వం మరియు కరుణ ఏమిటి?
తత్వశాస్త్రంలో, మానవత్వం అనేది ఒక వ్యక్తి సాంఘిక స్థితి , లింగం, జాతీయత మరియు ఇతర వ్యత్యాసాలతో సంబంధం లేకుండా మరియు దానిలో విలువైనదిగా వర్ణించే ఒక స్థానం.
మనుషుల జీవితం మంచిది మరియు చెడు ఏమిటో గుర్తించడంలో సహాయపడే కొన్ని నైతిక నియమాలపై ఆధారపడి ఉంటుంది. సమాజపు అభివృద్ధికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మానవుడు - మనిషి యొక్క అంతర్గత ప్రపంచం, ఆత్మ యొక్క స్థితి, అదృశ్య రూపాన్ని వర్ణిస్తుంది. ఆహ్లాదకరమైన ప్రవర్తన ఎల్లప్పుడూ పరిసరాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది మరియు అనుకూల వైఖరిని కలిగి ఉంటుంది. ఇతర వ్యక్తుల చింతలకు మర్యాద మరియు ప్రతిస్పందనలు ఆధునిక ప్రపంచంలోని నాగరికత అభివృద్ధికి గురైన భావాలను ఒక విభాగానికి రూపాంతరం చేస్తాయి.
మానవత్వం - ఇది ఏమిటి? మానవత్వం మరియు మానవత్వం అంటే ఏమిటి?
ఈ భావన లాటిన్ పదం నుండి ఉద్భవించింది, ఇది "మానవత్వం" గా అనువదించబడింది. మానవ వ్యక్తి యొక్క విలువలను వేరుచేసే వ్యక్తి. స్వేచ్ఛ, అభివృద్ధి, ప్రేమ, ఆనందం మొదలైనవాటికి మానవ హక్కును గుర్తించడం అంటే. అదనంగా, ఈ జీవుల ఏ హింస యొక్క అభివ్యక్తి తిరస్కరణ ఉన్నాయి. మానవాళి భావన ప్రపంచ దృష్టికోణం యొక్క ఆధారం ఇతరులకు సానుభూతి మరియు ఇతరులకు సహాయం చేసే సామర్ధ్యం అని సూచిస్తుంది. మానవత్వం యొక్క అభివ్యక్తి వ్యక్తి యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండరాదని గమనించడం ముఖ్యం.
మానవత్వం. ఇది వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఇందులో అతను ఉన్నతమైన మానవ లక్షణాలను కలిగి ఉంటాడు, దీనిలో ప్రధానమైనది దయగల దయ. మానవజాతి యొక్క లక్షణ సంకేతాలు ప్రజల మధ్య సౌకర్యవంతమైన సంబంధాలను సృష్టించే అంతర్గత సామరస్యం, ఫలితంగా ఆత్మ యొక్క వెచ్చదనం;ప్రతిస్పందన, ఆహ్లాదకరమైన వైఖరి గౌరవం; సౌహార్ద;  అంతర్గత సంస్కృతి, ఆహ్లాదకరమైన పెంపకం,సానుభూతి; సహనం; మానవత్వం; విధేయత. మొదలైనవి వ్యక్తులలో స్పష్టంగా కనిపిస్తాయి.
మానవత్వం అంటే ఏమిటి - తత్వశాస్త్రం
తత్వవేత్తల అవగాహనలో, మానవుడు మానవజాతి. లాటిన్ పదం "మానవత్వం" అనేది మానవత్వం యొక్క భావన - ప్రపంచ దృష్టికోణం గ్రహింపు, వ్యక్తిగత స్వేచ్ఛను గుర్తించడం, బహుముఖ అభివృద్ధి, సంతోషం యొక్క పరిస్థితి ఏర్పడింది. సిసెరో మానవాళి విద్య, విద్య యొక్క డిగ్రీ, మానవ సారాన్ని ప్రోత్సహిస్తుంది.
దయ మరియు మానవత్వం రెండు ఇదే భావాలు. వాటిని వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చివేస్తాడు, ఇతరులకు శ్రద్ధ మరియు అవగాహన చూపుతాడు - సామరస్యాన్ని తెస్తాడు, మనశ్శా0తిని ఇచ్చేవాడు , దృఢ నిశ్చయాన్ని కోరుకు0టాడు . మానవత్వం అనేది సహాయం అవసరమైన వ్యక్తికి ప్రేమ మరియు దయ యొక్క చర్య. ఇది విశ్వాసం ఇస్తుంది, ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది, ఒక కష్టమైన సమయంలో ఒక వ్యక్తి యొక్క "నిజమైన" ముఖాన్ని చూపుతుంది.
మానవాళి యొక్క అర్ధం ప్రతి వ్యక్తిలో అభివృద్ధికి ఒక సామర్ధ్యం ఉంది లేదా ఇప్పటికే మానవత్వం ఉంది, దాని నుండి నైతిక భావాలు మరియు ఆలోచన యొక్క నిర్మాణం మరియు అభివృద్ధి జరుగుతుంది. పర్యావరణం, ఇతర ప్రజలు మరియు వివిధ కారణాల ప్రభావాన్ని మినహాయించడం అసాధ్యం, కానీ వ్యక్తి మాత్రమే క్యారియర్ మరియు రియాలిటీ సృష్టికర్త. మానవీయ విలువలు గౌరవం, దయ మరియు మనస్సాక్షిత్వం మీద ఆధారపడి ఉంటాయి.
ఇటీవల, మానవత్వం యొక్క ఆలోచనలు మారాయి, మరియు అది కూడా దాని సంబంధాన్ని కోల్పోయింది, ఎందుకంటే ఆధునిక సమాజంలో యాజమాన్యం మరియు స్వయం సమృద్ధి, అంటే, డబ్బు యొక్క సంస్కృతులు, ముందుకు వచ్చాయి. తత్ఫలితంగా, ఇతర వ్యక్తుల భావాలకు  తనను తాను సృష్టించిన వ్యక్తిని, పరిస్థితిని, సమాజాన్ని చనిపోయిన ముగింపుగా నడిపిస్తుందని మనస్తత్వవేత్తలు నమ్ముతున్నారు.
మానవత్వం అనే స్వభావంలో నుంచే మానవుడు అనే మాట రూపుదిద్దుకుంది. మనిషి అనే మాటకు అర్థవంతంగా అందరూ ఉండగలిగితే- ఈ ప్రపంచం అసలు ఇలా ఉండనే ఉండదు. అనేకానేక కారణాల వల్ల, వ్యత్యాసాల వల్ల, ఎవరికి వాళ్లు మనగలగడమే ముఖ్యం అయినందువల్ల, ఉన్న వనరులు అందరికీ సమానంగా దక్కకపోవటం వల్ల- మనిషి ప్రాథమిక లక్షణానికి అప్పుడప్పుడూ గండి పడుతూ ఉంటుంది. పదిమందికి దక్కాల్సిన దానికి ఒక్కడే బొక్కేసి, దాచేసుకునే దౌర్జన్య లక్షణం సమసిపోతే- మానవత్వం గురించి మనం ప్రత్యేకంగా వెతకాల్సి ఉండదు. ఎక్కడికక్కడే, మనిషి ఉన్న ప్రతిచోటా పరిమళిస్తూ ఉంటుంది. అయితే, సమాజంలో ప్రతి మనిషీ, ప్రతిసారీ తన కోసమే ఆలోచిస్తూ ఉండిపోడు. సమాజంలో తానొక భాగం కాబట్టి- సమాజంలోని పరిణామాలకు సహజంగానే స్పందిస్తాడు. తనకు చేతనైన రీతిలో తన భాగస్వా మ్యాన్నీ అందిస్తాడు. ఊహించని ఉత్పాతం ఎదురైనప్పుడు, విపత్తులు తలెత్తినప్పుడు తోటివారికి అవసరమైన సాయం అందించటానికి ఎన్నో చేతులు ముందుకొస్తాయి. ఎంతో సహాయ సహకారాలు వెల్లువెత్తుతాయి. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలూ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు - ఆపన్నులను ఆదుకోవటానికి ఎంతోమంది ముందుకు వస్తారు. వ్యక్తులే కాదు, అనేక సంస్థలూ మానవతా దృక్పథంతో సహాయం అందిస్తాయి.
జీవ కారుణ్యం కలిగి ఉండటమే ఒకప్పుడు మానవత్వం. ఇప్పుడు దాని విస్తృతి మరింత పెరిగింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శాంతి, స్పేచ్ఛ, సౌభాగ్యాలతో బతకాలి. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వమూ, సమాజమూ అందించాలి. అలాంటి కృషి చేసే మానవతావాదుల గురించి మాట్లాడుకోవటానికి, మానవత ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి ఈ చిన్ని ప్రయత్నం.

********

"మానవత్వం – ఆత్మీయత – మనిషి – దేవుడు మధ్య ఉన్న బంధం"
మనిషి అంటే ఎవరో తెలియదు. మతానికి, దేవుడు, అంటే, ఏమిటో తెలుసుకోవాలని లేదు. ఆత్మకు సంబంధించి¸ అనుగ్రహ భాషణలు ఇవ్వడం తప్ప, వేదాంతం, భౌతికానికి, ఆధ్యాత్మికానికి ఉన్నటువంటి ఆచరణాత్మక, వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, క్రియాపూర్వకంగా వివరించుటలేదు. అయినా, ‘జ్ఞానమే సత్యం – మోక్షం’ అని అంటూ, ప్రచారంగా, బోధిస్తున్నారు. తెలియడమే, జ్ఞానంగా భావించినపుడు, జ్ఞానాన్నే, మోక్షంగా భావించినప్పుడు, అసలు అది అంటే ఏమిటో తెలియజేయడమే, విధిగా భావించాలి. మనిషికి, తన మనసుకే, అసలు తానంటే ఏమిటో తెలియని అజ్ఞాన స్థితిలో, అలవాటుగా, ఆత్మ స్థాయిలో – తనకు తానుగా తన మనసును, ‘నేనే బ్రహ్మను’ అని భావించడం – అర్థరహితం. తనలో ఉన్న, జీవాత్మ ఏమిటి, అది శరీరంలో, ఎక్కడ, ఎలా? అని తెలిసీ తెలియని స్థితిలో ఉన్న తాను (మనిషి) అలవాటుగా, విశ్వవ్యాప్త పరమాత్మను గురించి, ముక్తి – మోక్షం గురించి ఊహించడం, ఆత్మ జ్ఞానం అనిపించుకోదు. మానవ మనసు, తన భౌతిక, ఇంద్రియ వికారాలే, గుణాలే, సాకార దేవునికి ఆపాదించడం – మనిషి అలవాట్లే, ఆచారాల పేరున, దేవుణ్ణి, పూజించడం... దేవుణ్ణి – దేవుడి లీలలను మానవాతీతంగా, కీర్తించడం, మనిషికి, స్వార్థంగా, ఉపయోగపడుతుంది. ఈ విధంగా, మాట్లాడుతూ, ఆస్తిక, వ్యతిరేకతగా భావించడంకంటే, అది, ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది, వాస్తవ రీతిగా, పరిశీలన చేసి, నిర్ధారించాలి. మనిషి, అజ్ఞానంతో, అత్యున్నత ఆధ్యాత్మికాన్ని, తన స్వార్ధం కోసం భ్రష్టు పట్టించడం కంటే, సరైన, అవగాహనతో, భౌతికాన్ని, ఆధ్యాత్మికాన్ని, అవలంభించుకోవడం, ఆచరణాత్మకం, చేయగలగాలి.
‘భౌతికాన్ని - ఆధ్యాత్మికాన్ని’, వేరు వేరుగా భావించినప్పుడు – వాటిని, మనిషి – దేవునికి పోల్చవచ్చును. భౌతిక జీవిత ఆధ్యాత్మిక భావన సమన్వయతా మంచికి, మనిషికి, మనిషి గురించి, మానవత్వం గురించి, తెలియాలి. దానితో, మొదటగా, జీవితం, దాని ప్రాముఖ్యత , అర్థం కావచ్చు. అలాగే, ‘దేవుడు అంటే ఏమిటో’, తెలిస్తే, అది ఆత్మీయతా అవగాహనకు, ఆధ్యాత్మికకి దోహదపడతాయి. తత్ఫలితంగా, భౌతిక జీవిత అవలంబనంతో - ఆధ్యాత్మిక అవగాహనతో, ‘మనిషికి - దేవునికి’, దగ్గర బంధం, ఏర్పడవచ్చు. దానితో, మానవ మనసు - దేవుడి ఆత్మ, అనే వ్యత్యాసం లేకుండా, దేవుడి, దైవత్వ పవిత్రత - మనిషిని, ఋషిగా, మారుస్తుంది. తద్వారా, మంచి, జీవితాన్ని, అనుభవించవచ్చు. సామాజిక అత్యున్నత పౌరునిగా - భాధ్యతను తెలిసిన వ్యక్తిగా, వ్యక్తి, వ్యక్తిత్వ పవిత్రతతో, జీవించవచ్చు. దానికి, మనిషి తన మనసును, దేవుడి ఆత్మగా, ‘ఆధ్యాత్మిక’ మనసుగా, పరివర్తనా, స్థాయికి పరిణామ మార్గానికి, ప్రస్థానించాలి. ప్రస్థాన ధ్యానం, దానికి మార్గం. మనసు పట్టుదలే సాధన.

******
ఒక ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తి తో నిత్యాగ్నిహోత్రుడై జీవించు చుండెను. అతనికి ప్రతిగ్రహణమన్న ఇష్టముండెడిది కాదు. ప్రతిగ్రహణ మనగా
ఎవరిదగ్గరంటే వాళ్ళ దగ్గరకి వెళ్లి యాచించుట. వారిది అన్యాయార్జిత ధనమైనచో
తనకు పాపము వచ్చునని అతని అభిప్రాయము.
. మనుచరిత్రలో కూడా ప్రవరుడు కూడా ప్రతిగ్రహణ మన్న యిష్టము లేనివాడే.
యజ్ఞవర్మ భార్య చాలా గడసరి మరియు ధనాశ కలది. ఆమె రోజూ భర్తను భోజరాజు దగ్గరకు వెళ్లి ధనము తీసుకొని రమ్మని వేధించు చుండెడిది. దానికి యజ్ఞవర్మ రాజుల ధనము క్రూర క్రియార్జితము అది తీసుకొన రాదు అనెడివాడు. ఆ విషయమున
భార్యాభర్తలిద్దరూ తరుచు గొడవ పడుచుండెడి వారు.
.
భార్య: భోజరాజు అందరికీ దానము…

*******
సామాన్యముగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆయనకు ఏదీ ఇస్తానని ముందుకు రారు. అదీ కాక సమస్త జగత్తులకూ అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమదగ్గఱ ఏముంటుందనిఅనుకుంటారు కానీ శంకరులు ఈశ్వరుడికి తనమనస్సనే తురగాన్ని ఇస్తాఞి ముందుకొచ్చారు. తన మనస్తురంగాన్ని వాహనంగా స్వీకరింపుమని శివుణ్ణి కోరారు.

ఈశ్వరా! నీవు విశ్వ సామ్రాజ్యాధి నేతవు. నీవు భక్త రక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్నెక్కింౘుకుని వేగంగా తిరుగ లేదుకదా!  కాబట్టి నామనస్సనే గుఱ్ఱాన్ని నీకు వాహనంగా ఇస్తాను. స్వీకరింౘు . ఎద్దు కన్నా గుఱ్ఱము వేగంగా పరుగెడుతుంది. కాబట్టి నా మనస్సనే గుఱ్ఱాన్ని ఎక్కి నీపనులు ౘక్కబెట్టుకో ప్రభూ! అన్నారు శంకరులు.
మనస్సు మంచి గుఱ్ఱము వంటిది. గుఱ్ఱములలో ఉత్తమమైనది పంచకల్యాణి. పంచకల్యాణి గుఱ్ఱము నకు ఐదు శుభలక్షణాలుంటాయి. 1) ముఖము 2) గుండె  3) వీపు  4) రెండు పార్శ్వములు మొత్తము ఐదు.  మనస్సునకు కూడా మంగళకర  లక్షణాలయిన 1)ఈశ్వరుని దర్శింౘడం 2) ఈశ్వరుని కథలు వినడం  3) ఈశ్వర ప్రసాదాన్ని తినడం
4) ఈశ్వర లింగాన్ని స్పృశింౘడం  5) ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణింౘడం వంటి పనులు చేసే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి.

పంచ కల్యాణి గుఱ్ఱము సరస చిత్ర గతులు కలది. అది యజమానియందనురాగము కలిగి అస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలయిన  విచిత్రములయిన గమనాలతో సాగిపోతుంది. మనస్సు కూడా నానా విధములయిన పోకడలు కలది. మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే.
ఇక పంచకల్యాణి గుఱ్ఱము "సవేగం" అంటే వేగంగా పోతుంది.  మనోవేగం అంటారుకదా! మనం సంకల్పించిన చోటుకి మనస్సు తక్షణం పోతుంది. గుఱ్ఱము సర్వేంగితజ్ఞము పంచకల్యాణి గుఱ్ఱము యజమాని మనోభావం గుర్తిస్తూ నడుస్తుంది. కాగా మనస్సు అందరి అభిప్రాయాలనూ గుర్తింౘ గలిగి నట్టిది.
గుఱ్ఱము "అనఘం" అనగా దోషము లేనిది. మనస్సు పాపరహితము. పుణ్యప్రదమైనది.  గుఱ్ఱము ధ్రువలక్షణాఢ్యమ్". అనగా ధ్రువమనే మంచి సుడిని కలిగి యుంటుంది.  మనస్సు స్థిరత్వము  అనగా అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి యుంటుంది.

ఈవిధంగా తనమనస్సునకు ఉత్తమ  అశ్వ లక్షణాలు అన్నీ ఉన్నాయనీ దానిని వాహనంగా స్వీకరించి విహరింపుమనీ శివుని శంకరులు కోరారు.   అంటే సదా తనమనస్సులో మెదలుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని మనం గ్రహింౘాలి.

 ******

ఉద్యోగంలో విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు!!

భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం...

అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవుతుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.

మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.

ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.

భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.

భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.

Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.

చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుప
డటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్‌ ఫ్రెండ్‌ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.

🌸🌺🌷🙏🏻🌷🌺🌸
ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా,
అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..
లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు.

అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.

ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.

ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు.
త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి..
వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు.

అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి
'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు.
ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు.
ఇక సమయం దొరికింది కదా అని నారదుడు  కలహాన్ని మొదలెట్టాడు.

త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది..
కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప?
అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు.

నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు.
కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.

ముందు సరస్వతీ దేవి నారదునితో..
నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో
"ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.

ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు..
సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...
వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను..
వెళ్ళి చూడమంటాడు.

నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు.
ఆ బాలుడు చదువు రాదని..
తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు.

ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.

పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు..
ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు.

సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు.
ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది.
ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.

ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది. ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.

అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి..
దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది.

దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు.
ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు
''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు.

ఆ తర్వాత ఆ పేద పండితుడు  శ్రీమంతుడిగా మారిపోతాడు.
ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు.

అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను.
ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు.

అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది.
బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు.
జగదాంబ ఆజ్ఞానుసారం..
నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం,
సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.

శ్రీ లక్ష్మిలోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ''ఓం శ్రీసతియే నమః''
అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది.  అదే ''ఓం శ్రీసతియే నమః' అనే మంత్రం.

*****


రామకృష్ణ పరమహంస ఒక రోజు ఉదయం పొలాల గట్ల మీద నడుస్తున్నారు. చేతిలో ఉన్న బుట్టలో బొరుగులను తింటూ, ఆకాశంలో ఎగురుతున్న కొంగల బారును చూస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు అపూర్వమైన తన్మయత్వం కలిగింది. భావ సమాధి స్థితిని పొందారు. ఈ ఘటన ఆయన జీవిత చరిత్రలో ప్రస్తావితమయింది. గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్‌ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగినట్టు చెబుతారు. జెన్‌ గురువు హ్యూనెంగ్‌ జీవితంలోనూ అత్యంత ఆశ్చర్యకరమైన ఇటువంటి అనుభవమే కలిగింది.
హ్యూనెంగ్‌ పూర్తి పేరు డజియన్‌ హ్యూనెంగ్‌. ఆయన నిరక్షరాస్యుడు, అత్యంత సామాన్యుడు. కట్టెలు కొట్టి, అమ్మి జీవించేవాడు. ఒక రోజు సంతలో ఉన్న ఒక వ్యక్తికి కట్టెలు ఇవ్వడానికి వెళ్ళాడు. అది సూర్యాస్తమయ సమయం. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరో పండితుడు బుద్ధ భగవానుడి బోథలు ఉన్న ‘రతన సుత్త’ను పారాయణం చేస్తున్నాడు. దానిలో కేవలం నాలుగు వాక్యాలు హ్యూనెంగ్‌ చెవిన పడ్డాయి.
ఆ వాక్యాలలోని శక్తి ప్రభావమో... ఆయన పూర్వ సంస్కారాల బలమో కాని హ్యూనెంగ్‌ బాహ్య స్మృతిని కోల్పోయాడు. రాతి విగ్రహంలా నిలబడి పోయాడు. చీకటి పడింది. బజారులో అంగళ్ళన్నీ మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. సూర్యోదయమయింది. అంగళ్లు తెరుచుకున్నాయి. అందరూ బేరసారాలు చేస్తున్నారు. అయినా హ్యూనెంగ్‌ కదలలేదు. ఆయనకు నిద్రాహారాలు లేవు. కళావిహీనం కావలసిన ఆయన ముఖం తేజస్సుతో ప్రకాశించింది. మెల్ల మెల్లగా బాహ్య స్మృతి కలిగింది.
ఆ ‘రతన సుత్త’ను ఏళ్ళ తరబడి పారాయణ చేస్తున్న పండితుడు... పండితుడిగానే మిగిలిపోయాడు. కానీ అది విన్న హ్యూనెంగ్‌లో జ్ఞాన జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆయనలో ఊహకు అందని ప్రశాంతత నెలకొంది. ఆయన కళ్ళు జ్యోతుల్లా వెలిగాయి. కంఠ స్వరం తియ్యదనాన్ని సంతరించుకుంది. వాక్కులు శాంతిమయాలయ్యాయి. హృదయం కరుణాపూరితమయింది.
 

ఇది గమనించిన పండితుడు ‘‘ఏరా! హ్యూనెంగ్‌! ఏమయింది నీకు? ఎందుకలా నిలబడ్డావు?’’ అని అడిగాడు. హ్యూనెంగ్‌ నోరు విప్పాడు. ‘రతన సుత్త’లో తాను విన్న వాక్యాలను గొంతెత్తి పాడాడు. వాటి గురించి వ్యాఖ్యానం ఆయన నోటి నుంచి వరదలా ప్రవహించింది. అక్షరం ముక్కయినా రాని హ్యూనెంగ్‌ నోటి నుంచి వచ్చిన జ్ఞాన ప్రవాహం ఆ పండితుణ్ణి ఆశ్చర్యపరచింది. ‘‘నువ్వు వెళ్ళి, నా గురువు డామన్‌ హోంగ్రెన్‌ను కలువు’’ అని సూచించాడు.
 

అక్కడి నుంచి హ్యూనెంగ్‌ నేరుగా డామన్‌ ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు ‘రతన సుత్త’ మొత్తం బోధించాలనీ, శిష్యునిగా చేసుకోవాలనీ అడిగాడు.
‘‘దక్షిణ ప్రాంతానికి చెందిన అనాగరికుడివి. నిన్ను నా శిష్యుడిగా చేసుకోవాలా?’’ అని మొదట ఎగతాళిగా మాట్లాడిన డామన్‌ ఆ తరువాత హ్యూనెంగ్‌ మాటలనూ, వ్యాఖ్యానాన్నీ విని ముగ్ధుడైపోయాడు. తన ఉత్తరాధికారిగా హ్యూనెంగ్‌ను ప్రకటించాడు.
ఈర్ష్యాపరులు ఇది సహించలేక హ్యూనెంగ్‌కు హాని తలపెట్టారు. ఈ సంగతి డామన్‌ గ్రహించాడు. హ్యూనెంగ్‌ను ఒక రాత్రి బయటకు తీసుకువెళ్ళి, తెప్పలో కూర్చోబెట్టి, నదీ మార్గాన్ని చూపించి, సురక్షిత ప్రాంతానికి పంపాడు. అర్హులకు జ్ఞాన బోధ చేయాలని సలహా ఇచ్చాడు.


సురక్షిత ప్రదేశానికి చేరిన హ్యూనెంగ్‌ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్‌కు హాని చేయదలచిన హ్యూమింగ్‌ చివరకు ఆయన అనుచరుడయ్యాడు. అనుంగు శిష్యుడయ్యాడు. టాయూ పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసిన హ్యూనెంగ్‌ తన డెబ్భై రెండవ సంవత్సరంలో... వందలాది శిష్యుల కన్నీటి వీడ్కోలు మధ్య తనువు చాలించాడు.
హ్యూనెంగ్‌ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్‌కు హాని చేయదలచిన హ్యూమింగ్‌ చివరకు ఆయన అనుచరుడయ్యాడు.

 

*****

2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా  మనం ఆలోచించకుండా వుండలేం... 

  ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.


    *ఒఖ్ఖ రెండు రూపాయలు* (కథ)

రచన: శ్రీమతి జి యస్ లక్ష్మి.

           "నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"

       గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.

       "ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే. పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ  పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒఖ్ఖ రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?" 

    సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు  మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.

        "ఆ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేసాను. ఇంక నాదగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచిపోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.

నిజమే, అమ్మకు డబ్బులెందుకు?

       టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది. 

       "ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒఖ్ఖ రెండు రూపాయలడిగితే..." 

          "అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయిపోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”

అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేసాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.

      నెలలో మొదటి వారం, షాప్ రష్‌గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు  కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి మధ్యమధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది. 

      రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. 

      ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్‌గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.

        "మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేసారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,

         "నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ, ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం. అల్లాగే చూసాం. కాని మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏంచేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేసారు.

       రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడూ మాకు తినడానికి టైముండేది కాదు, ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.

       ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.

   "ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.*

       *"ఆ! ఏముందోయ్... అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు?" కుశల ప్రశ్నలు వేసారు రామ్మూర్తిగారు.*

        *"ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్‌మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.*

   *"ఊ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.*

       *"ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ, వాళ్లకి అనిపిస్తుంది కదా, మళ్లీ చిన్న పుచ్చుకుంటారనీ..." సమర్థించుకున్నాడు నూకరాజు.*

       *"నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు... చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని, ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన.*

        *నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?'* *ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు.* *సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.*

    *"నూకరాజూ..."*

  *రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.*

    *"ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా..." నసుగుతూ అన్నాడాయన.*

         *ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా... కొత్తరకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా... ఎలా వుంటాయో రుచి చూద్దామనీ... అంతే. ఒఖ్ఖ రెండు రూపాయలే..."*

         *వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు.* 

------------------------------------------------------------------------------------------------------------------------

  2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ..


వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?
జ.: ఉంది.
వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

2.వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?
జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్‌లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.

3.వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందా?
జ.: దీనిపై స్పష్టత లేదు. కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో... కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.

4.వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?
జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది

5.వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?
జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

6.ఓవరాల్‌గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?
జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.

Subhashitaani

ప్రాంజలి ప్రభ (జనవరి రెండవ వారం ) సుభాషితాలు 


 - 1039

---------------

షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹

నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹


యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర, మగతతో తూగేది, భయం, కోపం, సోమారితనం, ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి.

           8-1-2024.


1040

---------------

మూలచ్చేదం రిపో:, కుర్యాదథవాన ప్రకోపయేత్ ౹

అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹

     

      శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు.

           9-1-2024.

- 1041

---------------

అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹  

 నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹ 

     

      మన దేహాలు నాశనము అవుతాయి.సంపత్తు శాశ్వతం కాదు మరియు చావు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటుంది.అందువల్ల మనం తక్షణం పుణ్య కార్యలలో పాల్గొనాలి.

          10-1-2024.


- 1042

-----------------

మూర్ఖం వ్యాసానినం లుబ్ధమప్రగల్బం భయాకూలం క్రూరమాన్యాయకర్తారం నాధిపత్యే నియోజయేత్ ౹౹

     

       మూర్ఖుడ్ని,చెడ్డ పనులలో ములిగినవాడ్ని,అతి ఆశలున్నవాడ్ని,ప్రతిభలు లేనివాడ్ని,భయడుతున్నవాడ్ని,కౄరుడిని,అవినీతి పరుడుని,ఎప్పుడూ ఉన్నతి స్థానములో కూర్చో పెట్టరాదు.

          11-1-2023.

-1043

---------------

గుణగ్రామాభిసంవాది నామాపి హి  మహాత్మానాం ౹  యథా సువర్ణశ్రీఖండ రత్నాకర  సుధాకరాః ౹౹

     

      మహాత్ముల పేరుతో వాళ్ళ ఉన్నత గుణాలను కూడా తెలుసుకోవచ్చు.ఎలా అంటే ,బంగారం పేరు సువర్ణము,ఆకర్షించే గంధానికి శ్రీఖండం అంటే సుగంధాలతో కూడిన వృక్షము,సముద్రానికి రత్నాకరము అమూల్యమైన వస్తువులు పొందడం,చంద్రుడికి సుధాకరుడు,అంటే అమృతంలాంటి సంతోషం ఇచ్చేవాడు.

          12-1-2024.


దయచేసి షేర్ చేసి ఆదరించండి.. మీ ఆదరణ బట్టే మా రచనలు... అందరికీ ప్రాంజలి ప్రభ ధన్యవాదములు తెలుపుతుంది

ఆనందం.. ఆరోగ్యం.. అధ్యాత్మికం మా ధ్యేయం

ప్రాంజలి ప్రభ..

  


అక్షయ తృతీయ పండుగ ఇది ముఖ్యంగా హిందువులు, జైనులు జరుపుకునే పండగ. హిందూ క్యాలెండర్‌లో వైశాఖ చాంద్రమాన శుక్ల పక్ష తృతీయ ఈరోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు. వైశాఖమాసంలో అమావాస్య తర్వాత మూడవ రోజును అక్షయ తృతీయగా గుర్తిస్తారు.ఈరోజున లక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పవిత్రమైన రోజున విలువైనది ఏది ఇంటికి తెచ్చుకుంటే అది అక్షయం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అంటే ఇంట్లో ఎల్లప్పుడూ తరిగిపోని సంపద ఉంటుందని అర్థం. అందుకే చాలా మంది ఈరోజున అత్యంత విలువైన బంగారంను కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
జైనమతంలో మొదటి తీర్థంకరుడు అయిన రిషభనాథుని స్మరిస్తూ ఈ పండగ జరుపుకుంటారు. రిషభనాథుడు దోసిట పోసిన చెరుకు రసాన్ని సేవించి, తన సన్యాసాన్ని ముగించిన సందర్భం అక్షయ తృతీయరోజు జరిగింది. అందుకే జైనులు ఈరోజును పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, అక్షయ అంటే 'ఎప్పటికీ తరగదు'. ఈ రోజున చేసే యజ్ఞం, జపం, దానము, పుణ్యం వంటి కార్యాలు ఎప్పటికీ తరిగిపోని ఫలాలను అందించగలవు అనే భావనను సూచిస్తుంది. వివాహాలు, కొత్త పెట్టుబడులు లేదా వెంచర్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి ఈ పండుగ శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున రోజున ప్రారంభించేవి ఏవైనా సంవత్సరం పొడవునా గొప్ప విజయాలు, లాభాలు పొందేటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంతుందని నమ్ముతారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22 ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 23న 7:47 కి ముగుస్తుంది.
ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీ క్రిష్ణుడు యుధిష్టరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు. ఈ పర్వదినానే ఛార్‌ధామ్‌లోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈరోజు నుంచే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడే మీకు ఓ సందేహం రావొచ్చు. బంగారానికి ఈ పండుగకు సంబంధం ఏంటని.. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు.. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవ లోహంగా పరిగణిస్తారు. బంగారానికి ‘హిరణ్మయి’ అనే మరో పేరు కూడా ఉంది. ఈరోజున బంగారం కొనడంతో పాటు దానం చేయడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు.
అక్షయ తృతీయ రోజున ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు అంటే హిరణ్యగర్భుడు. తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున పండుగను జరుపుకుంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని.. తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
అక్షయ కుమారుడి జననం..
* హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నర నారాయణుడు జన్మించారు.
* అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మ దేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం.
* అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది.
అక్షయ తృతీయ వంటి పవిత్రమైనే రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగిందని నమ్ముతారు.
* అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్య యుగం, త్రేతా యుగం ప్రారంభమైందని నమ్ముతారు.
* అక్షయ తృతీయ రోజు నుంచే వేద వ్యాసుడు, గణేశుడు మహా భారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు.
* అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు.
* అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహా భారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే!
నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు…రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు
అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
11. ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
12. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.
13. ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.

ప్రాంజలి ప్రభ (౩౩)
కొత్త ఛందస్సు
 శలభలోలా - య/య/జ/స/గ IUU IUU - IUII IUU
13 అతిజగతి 1866

మరేమో సకాలం - సమానము తరమ్మే
విశేషం వివాదం - వినోదము తరమ్మే
చరిత్రే శివోహం - ప్రభోదము తరమ్మే
ప్రభుత్వం ప్రభావం - ప్రమాదము తరమ్మే
 
మదోన్మత్త భావం - ప్రమాదము తరమ్మే
సమానత్వ భావం - సుఖాలయ తరమ్మే
విశాలత్వ భావం - తరించుట తరమ్మే
చరిత్ర తత్వమ్మే - భరించుట తరమ్మే

ప్రభావమ్ము నందు - సకాలము తరమ్మే  
విశేషమ్ము నందు - కళా మయ తరమ్మే
దరిద్రమ్ము నందు - ధనా దయ తరమ్మే  
యతీ భావ మందు - యధా విధి తరమ్మే
 
--(())--
స్త్రీకి రెండు చేతులు
చేతులతో నె పనులు
పనులు శ్రమలేకుండా చేయు ఈశ్వరా

ఇంట్లొ ఒక ఉద్యోగి
ఉద్యోగి మనసుయొగి
యోగి సర్వసుఖములిచ్చు స్త్రీ ఈశ్వరా
 
ఆది శక్తి ఆడది
ఆడది జగమంతది
జగములేలు స్త్రీ హృదయ వాణి ఈశ్వరా
 
ఇల్లాలే దేవత
దేవతే చేయూత
చేయూత జీవితపరమార్ధం ఈశ్వరా

సకలం స్త్రీల మయం
స్త్రీలు శక్తి మయం
శక్తితో సర్వ౦ గ్రహించేను ఈశ్వరా

అతివ అబల కాదులె
కాదు కాదును సబలె   
సబలగా ఆకర్షించి బతుకును ఈశ్వరా

వితండ వాదములు
వాదము తో ప్రేమలు
ప్రేమల తోనే ఆలింగనం  ఈశ్వరా
 
చీర కట్టు అందం
అందంతో భావం
భావ మువల్ల జీవితలక్ష్యం ఈశ్వరా

తల్లిగా చెల్లిగా
చెల్లిగా భార్యగా
భార్యగా ఇన్నో సుఖాల స్త్రీ ఈశ్వరా

అలుపెరగనిది మహిళ
మహిలే పెంచును కళ
కళలు ఉప్పొంగును స్త్రీలలోన ఈశ్వరా

--(())--


ప్రాంజలి  ప్రభ (32 )
నేటి ఛందస్సు
IIU U IIU IUIII UU UI UUIU

రవి కాంచెన్ మదిలోన భావమును,  
వెల్గున్ పంచు నాప్రేమకై
కవి తెల్పైన్ హృదయమ్ము తాపము ను,
నిత్యానంద నాప్రేమకై
నవవాదమ్ములు కమ్మెనే మనసు
ఆరోగ్యము నా ప్రేమకై
జవనాశ్వంబున సమ్మోహమ్మునను
రానాప్రియ నాప్రేమకై
 
చరితార్ధంబున విశ్వమోహముకు
పంచుప్రియ నీప్రేమకై   
సమరాగమ్ములు వచ్చెనే ఇపుడు
సౌలభ్యము నీ ప్రేమకే
యద మాధుర్యము పొందుసాహసము
ప్రేమమ్ముయు నీ ప్రేమకే
పాఱువమ్మే ఇది సంతర్పణముకు
కాలమ్ముయు నీ ప్రేమకే  

--(())--
 
నేటి కవిత .. నేనెవడను?
నేనెవడను?
ఈ విశ్వానికి ఏమిచెయ్యాలి 
నేనెవడను?
ఈ జన్మకు పరమార్థ మేమిటి 
నేనెవడను?
ఇప్పుడు నన్ను చూచేదెవరు 
నేనెవడును? 
ఈ జన్మ ఋణం ఎలా తీసుకోవాలి   

ఈ విశ్వం ఏమిటి?
భూగోళము అంతా అనుకున్నా 
ఈ ప్రపంచం ఏమిటి?
భూమి ఉన్న బ్రతుకు ప్రాంతం 
వీటి తత్త్వాలు ఏమిటి?
మోక్షానికిమార్గ శివతత్వం 
దీనిని పనిగట్టుకొని ఎవరైనా సృష్టించారా?
శాస్త్రజ్ఞుల ప్రక్రియ ఇంకా ఉన్నది  
లేక ఇది స్వయంభువు నా?
ధర్మోరక్షతి రక్ష:

అసలు ఈ ఇంద్రియ గోచర ప్రపంచం నిజంగా ఉందా? 
ఇంద్రియ గోచరమే సమస్తలోకాలు 

లేక ఇంద్రియాలు,మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా?
బ్రహ్మసృష్టి అనుకుంటే అంటామాయా 

మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? 
దేవుడున్నాడని నమ్మకంతో  బతికి, బతికించు  
ఈ జీవితానికి అర్థం/పరమార్థం అంటూ ఉందా?
అల్పసంతోషం,  ఆశా పాశం జంజాటం 
  
మనస్సు అంటే ఏమిటి? 
మనో వ్యాపారాలు అనుభవించగలుగుతున్నా, 
మనస్సు యొక్క నిర్వచనం ఏమిటి?

నేనెవడను? ఎక్కడ నుండి ఈ పంచ భూతాత్మక ప్రపంచానికి వచ్చాను?

పునర్జన్మ ఉందా? మరణం తర్వాత నేనెవడను? మరణం ముందు నేనెవడను?

 ఇంతకీ ఈ "నేను" ఎవరు?
మానవుడు స్వతంత్రుడా? 
అస్వతంత్రుడా? అతనికి నిర్ణయ స్వేచ్ఛ (free will) ఉందా? 
ఈ రోజు మనం అనుభవిస్తున్నదేనా మానవ జీవితం? 
ఇంత కంటే పరమార్థం ఏదైనా ఉందా?

ఈ ప్రపంచంలో ఈ రోజు ఉన్న స్థితిలో నేనెందుకు ఉన్నాను? 
ఇంకోలా ఎందుకు లేను? 
నేనెవడను? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడికి వెళతాను?

ప్రాణం అంటే ఏమిటి?

పాపం అంటే ఏమిటి? 
పుణ్యం అంటే ఏమిటి?

ఏది తప్పు? 
ఏది ఒప్పు?
లోకంలో ఎందుకింత క్రౌర్యం? 
లోకం లో కారుణ్యం మాత్రం ఎందుకు?

మానవులలో ఒక వైపు క్రౌర్యం,
హింస...మరొక వైపు, 
చీమను కూడా చంపడానికి చేతులు రానంత దయాళుత్వం...అన్ని భూతాలను తనలోనూ, 
తనను అన్ని భూతాలలోనూ చూసుకోగలిగినంత అధ్యాత్మిక ఔన్నత్యం...ఆశ్చర్య కరమైన ఈ ద్వంద్వ ప్రవృత్తులు ఎలా వచ్చాయి? అసలు మానవ జీవిత పరమార్థం/
పరమావధి ఏమిటి?

కర్మ ఫలాన్ని కర్మలే ఇస్తాయా? బ్రహ్మమా?

కర్మ ఫలాన్ని ఈ జన్మ లోనే అనుభవించాలా?

జీవులు వ్యాపకులా? అణు స్వరూపులా?

జీవులకు సూక్ష్మ శరీరాలు, ముక్తిలో కూడా ఉంటాయా?

అసలు ముక్తి అంటే ఏమిటి?

ముక్తులు మరల జన్మ తీసుకుంటారా? లేదా?

ఈ విశ్వానికి స్థితి ఉన్నదా? అది మిథ్యనా?

జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మమా?ప్రకృతియా?

బ్రహ్మము వ్యాపకమా?పరిచ్ఛిన్నమా?దాని కన్నా పరమమైనది ఉన్నదా?

ఏ వెల్గులకీ ప్రస్థానం?

  • ➡️ తత్త్వ విచారం...ఈ విధంగానే సాగాలి.

 

🙏🙏*రక్త సంబంధం*🙏🙏

*తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.....*

*ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం...*

*పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము....*

*అప్పట్లో.....*

*ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.   అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.  పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు....     రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...*

*బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...*

*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది...     తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...*

*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*

*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు...*

*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే....     జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే...    అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*

      *ఇక వెళ్ళొస్తామంటూ...    బయల్దేరారు ముగ్గురూను.*

    *తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*  👍

    *"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా...     నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ...*

*ఆలోచించుకుంటూ....!*

*సోదరులంటే ఇలా ఉండాలి కదా....!*  

*బంధం అనే కాదు...    కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా...      మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*

              *"ఏమంటారు"*..?

*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఇది నా చిన్న ప్రయత్నం 

నా ప్రయత్నం కు మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..🙏🙏🙏

 

🙏 ఓం నమో వేంకటేశాయ! 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
 భాగము 1(పంచ బేరాలు)

మొట్టమొదటగా - తొలి ప్రకరణంలో పరమ పావనమైన ఆనందనిలయం, అనగా తిరుమల క్షేత్రం నందలి ప్రధానాలయపు గర్భాలయం, లోని పంచబేరాలుగా పిలువబడే శ్రీవేంటేశ్వరుని ఐదు రూపాల గురించి తెలుసుకుందాం....

సకల లోక కళ్యాణ కారకుడైన శ్రీవేంకటేశ్వరుని రూపాంతరాల స్మరణతో "తిరుమల సర్వస్వం" ప్రారంభమవ్వటం మంగళదాయకంగా భావించి, తొట్టతొలి ప్రకరణాన్ని శ్రీనివాసుని "పంచబేరాల" కు అంకితమివ్వడం జరిగింది.

ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి.

1. ధ్రువబేరం - మూలవిరాట్టు

2. అనిరుద్ధబేరం - కొలువు శ్రీనివాసుడు, దర్బారు శ్రీనివాసుడు, అళగిప్పిరాన్.

3. కౌతుకబేరం - పురుషబేరం, భోగ శ్రీనివాసుడు, మనవాళ పెరుమాళ్.

4. స్వపనబేరం - అచ్యుతబేరం, ఉత్సవ శ్రీనివాసుడు, స్వపనమూర్తి, ఉగ్ర శ్రీనివాసుడు.

5. ఉత్సవబేరం - మలయప్ప స్వామి

మూలవిరాట్టు సుమారు వెయ్యేళ్ళ క్రితం - చరిత్రకు అందనట్టి ప్రాచీనకాలం నుండి తిరుమల శిఖరంపై విరాజిల్లుతున్న ఈ ప్రతిమ శివుడిదా లేదా అమ్మవారిదా లేదా విష్ణువుదా అనే వివాదం నెలకొన్నది.

ఆ సమయంలో - శ్రీమద్రామానుజుల వారు బంగారు శంఖు చక్రాలు తయారు చేయించి, వాటిని తన భక్తితత్పరతతో స్వామివారి ఉభయహస్తాలలో శ్రీవారి చేతనే స్వయంగా ధరియింప జేసి - ఆ ప్రతిమ శ్రీమహావిష్ణువు కలియుగావతారమైన శ్రీవేంకటేశ్వరునిదేనని నిర్ద్వంద్వంగా, తర్కపూరితంగా నిరూపించారు.

కుడి వక్షస్థలంలో అమ్మవారితో, చతుర్భుజాలతో, శంఖు చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వుండే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు. మూలవిరాట్నే ధ్రువబేరం (స్థిరంగా వుండే విగ్రహం) అని కూడా వ్యవహరిస్తారు. తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉండే స్వామివారి యజ్ఞోపవీతంలో ఒక ప్రోగు తెగి వుంటుంది.

ప్రలంభాసురునితో ప్రచండయద్ధం జరిగినప్పుడు ఆ ప్రోగు తెగి పోయిందని ప్రసిద్ధి. శ్రీవారికి నాగాభరణంతో బాటుగా అనేక స్వర్ణాభరణాలు అలంకరించబడి వుంటాయి. మొదట్లో సన్నగా ఉండే తిరునామం రామానుజాచార్యుల వారి హయాం నుండి ప్రస్తుతం మనకు కనపడే వెడల్పాటి ఊర్థ్వపుండ్రంగా రూపాంతరం చెందింది.

ఈ తిరునామానికి మామూలు రోజుల్లో 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వినియోగిస్తారు. అదే - బ్రహ్మోత్సవాల్లో దీనికి రెండింతల పదార్థాన్ని ఉపయోగిస్తారు.

స్వామివారు కుడి వరదహస్తంతో (అంటే వరాలనిచ్చే హస్తం), ఎడమ కటిహస్తంతో (అంటే నడుము భాగంలో చేర్చబడిన చేయి) దర్శనమిస్తారు. స్వామివారి పాదపద్మాలు పద్మపీఠంపై విరాజిల్లు తుంటాయి. సూర్యకఠారి, లేదా నందకం, అనే ఖడ్గాన్ని నడుము క్రింది భాగం నుంచి ధరించి వుంటారు.

దాదాపు 120 సంవత్సారాలు జీవించి స్వామివారి సేవలో పునీతుడైన రామానుజాచార్యుల వారి గురించి మున్ముందు సవివరంగా తెలుసుకుందాం.... అలాగే, స్వామివారి మూలవిరాట్టు ఆవిర్భావం - స్వరూప స్వభావాల గురించి కూడా ఆనందనిలయాన్ని వివరిస్తున్నప్పుడు సవిస్తారంగా వర్ణించుకుందాం.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 1 🙏

ఈ పద్యంలో భగవంతుని అనుగ్రహ విశేషం వర్ణింప బడింది.

ఉ. శ్రీరమణీమనోహర ప్రసిద్ధసురార్చిత దివ్యనామ సం
సార సముద్రసంతరణ సాధులనీదరి జేర్పకుందువే
క్రూరు డజామిళుండు తనకూరిమి పుత్రుని బేరుకొన్న
జేరి శుభంబులం బడయ జేసితివే మును వేంకటేశ్వరా!

పద్మావతీ వల్లభా సుప్రసిద్ధులయిన ముప్పది మూడుకోట్ల దేవతలచే నిరంతరం స్మరించే అర్చించే దివ్యనామ విభాసితుడా శ్రీవేంకటేశ్వరా సంసార సంద్రంలో కూరుకుపోయిన జీవుల నుద్ధరించే దయగల స్వామీ. మంచివరాలను నీదరి జేర్చకుండా వుండవు గదా

ఎందుకనగా - క్రూరుడయిన అజామిళుడు తనకు ప్రియమయిన చిన్నపుత్రుని నారాయణ నామముతో పిలుచుకున్నంతనే ఎంతో సంతోషాన్ని పొంది అతడు చేసిన పాపాలన్నింటినీ క్షమించి శుభాలెన్నో అతనికి కలిగించావు.

నీ సన్నిధిలో అతనిని వుంచావు. అటువంటప్పుడు మంచివారలను నీదరికి జేర్చక వుండవు గదా. తప్పక వారికి అజామిళుని కంటే గొప్ప స్థితిని అనుగ్రహించగలవు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 

ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట

🕉

 "కమలాక్షా! ప్రియతమా! కొన్నిదినములు ఇచటనే ఉండుము. నీ కలయికను విడువజాలను" అని కుబ్జ ఆ స్వామిని వేడుకొనెను.

 48.10 (పదియవ శ్లోకము)

తస్యై కామవరం దత్త్వా మానయిత్వా చ మానదః|

సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదర్చితమ్॥10176॥

అంతట భక్తులకోర్కెలను ఈడేర్చునట్టి ఆ మహానుభావుడు  ''నీ అభీష్టమును దీర్చుటకై మఱలవచ్చెదను' అని మృదుమధురముగా పలికి, ఆమె పూజలను స్వీకరించెను. పిమ్మట ఆ కృష్ణభగవానుడు ఉద్ధవునితోగూడి, సకల సంపదలతో తులతూగుచున్న  తన సదనమునకు చేఱెను.

 10177॥

శ్రీమహావిష్ణువు (శ్రీకృష్ణుడు) బ్రహ్మాది సకల దేవతలకును ప్రభువు. భక్తిప్రత్తులతోగాక ఇతర ఉపాయములచే ఆ స్వామిని ప్రసన్నుని చేసికొనుట కష్టము. అట్టి పరమపురుషుని ఆరాధించి, ఆయన అనుగ్రహమును పొందియు, క్షణికములైన శబ్దాది విషయసుఖములను కోరుకొనినవాడు బుద్ధిహీనుడు.

 

పిమ్మట శ్రీకృష్ణుడు అక్రూరునకు ప్రియమును గూర్చుటకును, పాండవులకు మేలు చేయుటకై  ఆయనను హస్తినాపురమునకు పంపుటకును నిశ్చయించుకొనెను. అందువలన ఒకనాడు ఆ ప్రభువు బలరామునితో, ఉద్ధవునితో గూడి ఆయన (అక్రూరుని) భవనమునకు వెళ్ళెను.

 

అప్పుడు అక్రూరుడు తనకు ఆత్మీయులు, సత్పురుషశ్రేష్ఠులు ఐన శ్రీకృష్ణ, బలరామ, ఉద్ధవులను దూరమునుండియే చూచి, మిగుల సంతోషించెను. వెంటనే అతడు ఆసనమునుండి లేచి, ఎదురేగి, క్రమముగా వారిని అందఱిని అక్కునకుజేర్చుకొని అభినందించెను.

 

పిదప అక్రూరుడు బలరామకృష్ణులకును, ఉద్ధవునకును నమస్కరించెను. అంతట వారును అక్రూరునకు ప్రత్యభివాదములను ఆచరించిరి. అనంతరము అతడు శ్రీకృష్ణాదులను సుఖాసీనులను గావించి, విధ్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించెను.

 

మహారాజా! తదుపరి అక్రూరుడు బలరామకృష్ణులకు పాదప్రక్షాళనమొనర్చి, ఆ శ్రీపాదజలములను తన శిరమున దాల్చెను. పిమ్మట అతడు వివిధములగు పూజా సామాగ్రులతోను, అమూల్యములగు వస్త్రాభరణములతోను, దివ్యములైన పరిమళ ద్రవ్యములతోను, పుష్పమాలలతోడను వారిని అర్చించెను. పిదప భక్తితో ప్రణమిల్లి వారి చరణములను తన యొడిలో చేర్చుకొని సేవలొనర్చెను. అంతట అతడు వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు వచించెను-

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

పీయూషార్ణవమధ్యగాం మణిమయద్వీపాన్తరభ్రాజినీం,
షట్చక్రాన్తరవర్తినీం విజయదాం షట్ఛతృసంహారిణీమ్।
శ్రీచక్రాన్తరరాజితాం శశియుతాం పద్మాసనే సంస్థితాం,
వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసందాత్రిణీమ్।।(శార్దూలవిక్రీడితమ్)()

భావం-

అమృతసముద్రమధ్యమందుండేటటువంటి,మణిద్వీపమునందుప్రకాశించేటటువంటి,శ్రీచక్రాన్తరవర్తి ఐనటు వంటి, విజయమును చేకూర్చేటటు వంటి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములగు ఆరుగురు శత్రువులను సంహరించేటటు వంటి, చంద్రుడు ఆభరణముగా కలిగినటువంటి,పద్మమే ఆసనముగా కలిగినటు వంటి, వేదములచే  స్తుతింప బడేటటువంటి, అన్ని కోరికలను తీర్చేటటువంటి శారదమాతను నమస్కరించుచున్నాను

 🕉️ *వైశాఖ పురాణం 2వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

🌻 *వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు* 🌻

💫🌹నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.

💫🌹నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

💫🌹శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. 

💫🌹అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.

💫🌹అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.

💫🌹బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా....

💫🌹దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.

💫🌹దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుదురు.

💫🌹ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.

💫🌹గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. 

💫🌹చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు. 

💫🌹మధ్యాహ్న కాలమున అతిధిగా వచ్చిన వానిని /బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమము. కావున అన్న దానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. 

💫🌹ఆకలి గల వానికి,భార్య ,సంతానము ,గృహము ,వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము.కానీ ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా - అన్నము - భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది . అట్టి అన్నదానము అన్ని దానముల కంటె ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానముల తో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు . ముందు కాలమున కూడా ఉండబోదు . 

💫🌹వైశాఖ మాసమున అలిసిన బాటసారికి /బ్రాహ్మణునికి - జల దానము, ఛత్రదానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము , మున్నగువానిని చేయనివారు పిశాచమై,ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు . కావున త్రిలోకవాసులందరును, అన్నదానము మున్నగువానిని యధాశక్తిగా చేయవలయును . 

💫🌹రాజా ! అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు . కానీ అన్న దానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ మైన ఉత్తమ బంధువు. 

💫🌹నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు సర్వ ధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు (వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు (వారిని పూజించిన ఫలము) సర్వ ధర్మములు (అన్ని ధర్మములు నాచరించిన ఫలము) కలుగును భావము.



*!!వైశాఖ పురాణం రెండవ అధ్యాయము సంపూర్ణము!!*



      🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏


కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.
పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుండి , పాప రహితులైన ఋషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.

కోపమునను ఘనత కొంచెమై పోవును 
కోపమునను గుణము కొరత పడును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును 
విశ్వదాభిరామ వినుర వేమ

కర్మ మధికమైన గడచి పోవఁగరాదు 
ధర్మరాజు దెచ్చి తగని చోట 
గంకుభట్టు జేసె గటకటా దైవంబు 
విశ్వదాభిరామ వినుర వేమ

అద్భిర్గాత్రాణి శుద్ధ్యన్తి ; 
మనస్సత్యేన శుద్ధ్యతి 
విద్యా తపోభ్యాం భూతాత్మా ; 
బుధ్ధి: జ్ఞానేన శుద్ధ్యతి :

అర్థము:-- జలము చేత శరీరము పరిశుద్ధ మగును: సత్యముచేత మనస్సు పరిశుద్ద మగును, జ్ఞానము చే బుద్ది శుచి యగును, విద్య చేత, తపస్సు చేత ఆత్మ పరిశుద్ధ మగును.

చత్వారో ధన దాయాదా:
ధర్మాగ్నినృప తస్కరాః 
తేషామ్ జేష్ఠావమానేన 
త్రయ: కుప్యంతి సోదారాః

అర్థము:-ధర్మము,అగ్ని,రాజు,దొంగ ; ఈనలుగురు ధనమునకు దాయాదులు.వీరిలో జేష్ఠు డయిన ధర్మము నవమానించిన అంటే ధర్మము మీరి ప్రవర్తించిన మిగతా ముగ్గురూ కోపిస్తారు. అనగా ధర్మముగా ప్రవర్తించని వాని ధనము అగ్గిపాలో, పన్నుల రూపంలో రాజులపాలో, దొంగలపాలో అవుతుందని భావము.

   *శివరాత్రి ఎలా జరుపుకోవాలి?*


*సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో,    ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.*


*శివరాత్రే యోగరాత్రి.     శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.*


*1.ఉపవాసం:-*


*శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.*


*ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.*


*ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.*


*2. జీవారాధాన:-*


*అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది.*


*అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.*


*శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.*


*3. మౌనవ్రతం:-*


*శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమక చమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.*


*ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.*   


*4.అభిషేకం:-*


*శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.*


*5.జాగరణ:-*


*శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.*


*6.మంత్ర జపం:-*


*శివరాత్రి మొత్తం శివనామంతో….                      ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.*


*శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.* 


*అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.*

...........


వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ విద్యలతో భుక్తిని పొందినవారు కొందరు. ముక్తిమార్గాన్ని పట్టినవారు కొందరు. అక్కడ లోకాన్వేషి, దేవాన్వేషి, బ్రహ్మాన్వేషి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు వారి పేర్లకు తగిన విధంగా వరుసగా లోకాన్ని, దైవాన్ని, బ్రహ్మతత్త్వాన్ని అన్వేషించేవారు. లోకాన్వేషి మిగిలిన ఇద్దరినీ చూసి నవ్వుతుండేవాడు. చార్వాకం అంటే అతనికి చాలా ఇష్టం. చార్వాకం చారు వాక్యముల సముదాయం అనేవాడు. మనకు కనబడే ప్రపంచం కన్నా వేరేమీ సత్యం లేదనే వాడు.

రెండో వాడు.. ‘మనకు కనబడని ఆ దేవదేవుడు మహేశ్వరుడు ఈ జగత్తుకు ఆధారం’ అనే వాడు. ఆ కనబడే త్రిమూర్తులకు కూడా మూలం నిర్గుణ పరబ్రహ్మమే అని మూడో శిష్యుడు నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉండేవాడు. గురువు వారి అభిరుచులకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. కాలం గడిచిన కొద్దీ లోకాన్వేషి ఎగతాళి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ‘దేవుడు ఉంటే ఈ చెట్లూ, కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ కనబడినట్లు కనబడాలి కదా?’ అని అడిగేవాడు. ‘నిర్గుణ బ్రహ్మోపాసన అంటే శూన్యాన్ని ఉపాసించటమే కదా?’ అనేవాడు. ఈ మాటలు గురువు చెవిని పడ్డాయి.

ఒకరోజు ఆయన.. లోకాన్వేషిని తన ధ్యానకుటీరానికి పిలిచాడు. అతనిని ఆ విషయాలు, ఈ విషయాలు అడుగుతూ.. ‘‘మన తాళపత్ర గ్రంథాలయంలోని ‘శాస్త్రతత్త్వ రహస్య చంద్రిక’లో పదహారో పత్రంలో ఉన్న విషయం ఏమిటో వివరించు’’ అని ప్రశ్నించాడు. దానికి లోకాన్వేషి.. ‘‘గురువర్యా! నేను ఆ గ్రంథాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు చెప్పిన పత్రంలో విషయాన్ని ఎలా చెప్పగలను?’’ అని అన్నాడు. ‘‘ఆ గ్రంథశాలలోకి వెళ్లకుండా, ఆ విషయాన్ని చూడకుండా అది ఉందో లేదో చెప్పలేవు కదా?’’ అని కర్దముడు అడిగాడు. లోకాన్వేషి ఔనని తలూపాడు.

అప్పుడు గురువు.. ‘‘సరే. దగ్గరకు రా.’’ అని అతని తల పై తన కుడిచేతి బొటన వేలు అదిమిపెట్టి ఉంచాడు. కళ్లుమూసుకోగానే శిష్యుడు గ్రంథాలయంలో ఆ గ్రంథం దగ్గరకు చేరుకున్నాడు. అందులో తనకు కావాల్సిన పత్రాన్ని చదివాడు. తిరిగి చూసేసరికి గురువు దగ్గర ధ్యాన కుటీరంలో ఉన్నాడు. తాను భౌతికంగా కదలకుండానే గ్రంథాలయంలో ఆ గ్రంథాన్ని చూడగలగడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు గురువు అతడితో.. ‘‘ఎవరు ఏ పరిధిలో ఉంటే వారికి ఆ పరిధికి చెందిన జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆధిభౌతిక క్షేత్రంలో ఉండి ఆధిదైవిక అనుభవాన్ని, ఆధ్యాత్మికానుభవాన్ని పొందాలంటే కుదురుతుందా? అది సాధ్యం కావాలంటే మన దేహానికి సాధన అవసరం. ఈర్ష్యాసూయలకు అతీతంగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయం దేవతానిలయం అవుతుంది. దేవతానుగ్రహంతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవమూ సాధ్యమవుతుంది. యోగం ద్వారా ఆధిదైవిక క్షేత్రంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి కూడా వెళ్లవచ్చు. 


నిన్ను నువ్వు పొగుడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సరళత, ఇంద్రియ ఆకర్షణకు లోనుకాకపోవడం, దైవం పట్ల సడలని నమ్మకం, ఏకాంత స్థలంలో ఉపాసన వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీలో దైవీ శక్తి పెరుగుతుంది. మన అనుభవంలోకి రానంత మాత్రాన అది లేదు అనరాదు’’ అని చెప్పాడు. దీంతో, లోకాన్వేషికి కర్తవ్యం తెలిసి వచ్చింది. శిష్యులు ముగ్గురూ మంచి సాధకులుగా పేరు తెచ్చుకున్నారు.

..........


పరీక్ష


🌷🕉🌷


జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం        


పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి, పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.


బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.


చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష!


‘నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.


పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి- పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.


మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.


ధర్మరాజు జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు


పాండవులు. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.


జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.


కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది. మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.


ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి.   ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది.

,............


చాలా బాగుంది ఇంటి పేర్ల పురాణం 


*తెలుగు మాస్టారా? మజాకా?*


తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.....

ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ

రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,

అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.

శుభమ్.

,..............


*మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట.!*

            

       …బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు



కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్యం.


లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే.


మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి.


ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే….       ప్రింటింగ్ ప్రెస్సు వచ్చిన తరువాత!   లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు!! 


పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించు కొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు.         తిండికి ఎంత  అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్నా రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి.!


ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో  ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది..!


ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు..!


వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది..!