Saturday, 8 April 2023

ప్రాంజలి ప్రభ ...09-04-2023

 ప్రాంజలి ప్రభ ...09-04-2023

 

శ్లో: మూలం భుజంగై శ్శిఖరం విహంగైః
      శాఖా ప్లవంగైః కుసుమాని భృంగైః
      సంసేవ్యతే చందన పాద సోయం
      పరోపకారాయ పరాం ప్రవృత్తిః

       మంచిగంధపు చెట్లు అంతటా పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి కదా? అయితే ఆ చెట్ల మొదట్లో పాములు నివసిస్తాయి; కొమ్మలమీద కోతులుంటాయి; చెట్లపైభాగములో పక్షులు నివసిస్తాయి; పూలమీద ఎప్పుడూ తుమ్మెదలు వాలుతూ ఉంటాయి; ఇలా అన్ని విధాలా తమను ఉపయోగించుకుంటున్నా
మంచిగంధపు చెట్లు పలకవు, ఉలకవు; అన్నీ సహిస్తూ ఉంటాయి; పరోపకారము కోసము బ్రతికే వారి ప్రవృత్తి ఇలాంటిదే!

(ఓం లక్ష్మీ నారసింహాయ నమః)

****

 కర్ణుడి కృతజ్ఞత - చిన్న కధలు (6)

హస్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిశాక కర్ర, భీష్మాదులతో కలిసి మేనత్త కుంతి దగ్గరకు వెళ్లాడు శ్రీకృష్ణుడు ఆమెను పరామర్శించి, రాయబార విశేషాలు వివరించాడు. అనక పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాన్ని తీసుకుని భీషు, సంజయులతో సహా వెనుతిరిగాడు. అందర్నీ తమ తమ మందిరాలకు పంపించి, కర్ణుణ్ణి మాత్రం రథంపై కూర్చోబెట్టుకొని, బయల్దేరాడు. రధం కొంత దూరం వెళ్లాక 'రాచేయా! నువ్వు దర్మశాస్త్ర 'రహస్యాలు బాగా తెలిసినవాడివి. నీకు కొత్తగా చెప్పేవేమీ లేదు. నిజానికి మా మేనత్తకు ప్రథమ పుత్రుడివి. కనుక రాజ్యాధికారం నీవే దుర్యోధనుణ్ణి వదిలి. నాతో వచ్చి పాండుపుత్రుల వైపు చేరు. అన్నగా నీకు బ్రహ్మరధం పడతారు' రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారు. అందుకు కుంతీమాత కూడా ఆనందిస్తుంది. అన్నాడు. గోవిందుకు.

కర్ణుడు మందహాసంచేసి 'కేశవా! నీ వాత్సల్యానికి కృతజ్ఞుణ్ణి ధర్మానుసారం పాండుపుత్రుణ్ణి అనే విషయం ఎప్పుడో తెలుసు నాకు. కానీ కుంతీదేవి నన్ను నదిలో పడేసినప్పుడు అతిరథుడు, రాచ నన్ను చేరదీశారు. ప్రాణప్రదంగా పెంచిన ఆ ప్రేమమూర్తుల రుణం ఎలా తీర్చుకోగలను! మరోవైపు ఏ ఆశ్రయం దొరక్క అవమానాలు పొందుతున్న వేళ దుర్యోధనుడు నన్ను ఆదరించి రాజ్యభాగాన్నిచ్చి, రాజును చేశారు. సొంత సోదరుడిలా ఆదరించాడు. దుర్యోధనుడు నన్ను నమ్ముకునే ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. నాకు తెలుసు, ధర్మవర్తనులైన పాండవులే గెలుస్తారు. కానీ తల్లిదండ్రుల ప్రేమకు, మైత్రీబంధానికి ద్రోహం చేయలేను. సమస్త భూమండలం రాసిచ్చినా, బంగారు రాశులు కురిపించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో అనుబంధాన్ని తెంచుకోలేను' అన్నాడు. కర్ణుడి కృతజ్ఞతకు కృష్ణభగవానుడే కదిలిపోయాడు. అందుకే మహాభారతం ఉద్యోగపర్వంలో విదురుడు ఒకరి పోషణతో ఉన్నత స్థానానికి చేరి, ఎందులోనూ కొరత లేకుండా జీవిస్తూ, ఆతంచ సంపదను అర్జించి, చివరికి ఆ రాత నమ్మకాన్నే వమ్ముచేసి అపకారం చేసేవారి పార్థివ దేహాన్ని పక్కలు కూడా ఇష్టపడవు' అన్నాడు దృతరాష్ట్రుడితో. చైతన్య
___((()))___

04-08-2022
దత్తపది.. చెట్టు,మ్రాను,వృక్షము,తరువు

* ఫలము నందించు చెట్టుయే ప్రగతి జేర్చు
మ్రాను విస్తీర్ణముయె నీడ మాన్య మగుట
వృక్ష ముల కళలు విజయం వృద్ధి రేటు
తరువు జీవుల మధ్యన తీపి పంచు

* మఱ్రి చెట్టు క్రిం దన మంచి  మనసు  నొందు  l
వెల్గు జ్ఞానమూర్తిగ నిండి  వేల్పు గలుగు   
వృక్ష ములలోన  మఱ్రి వృక్షముగ మేలు
తరువు లన్ని తీర్చు కళలు  తాపములను..

* చెట్టు లున్న యెడల జీవముయుండును,
మ్రాను లిచ్చు మనకు మంచి నీడ,
వృక్షము లవలనను కురియు  వానలు మెండుగ,
తరువు లున్న చోట కరువురాదు


*కం.చెట్టేయెక్కగలగియే
పట్టుగమ్రానుగనుచేరి పాకుతు ఎక్కే
మెట్టుగ కనబడు వృక్షము
ఒట్టేసి పలుకు తరువులు ఓర్పును చూపే

 * నేను కీర్తించు కలలన్ని నీడలగుటె
నిండు మానవుడి కళలే నియమ మగుటె
పూర్ణ పురుషుడు గామారె పూజ యగుటె
స్త్రీ సమేతసృష్టి యే సీఘ్రమగుటె

 * జరుపు తున్నప్రేమకలాప జపము ఇదియె
తొలిమలి జరుపు సంధ్య యే తోడు నిధియె
మేఘలీలవల్ల నెమార్పు మధన మదియె
జనుల ఆకాంక్ష తీరుటే జయమగుటయె

*  నేలపాలు యగుటఫలం నిజము తెలుపు
పక్వముగనేను నున్నాను పలుకు మలుపు
జ్ఞానమును పంచు ఘడియలు జ్ణప్తికలుపు
పంచని తెలివి బూడిద పాలు తలపు

* అస్త మించిన సూర్యుడు ఆశ నేర్పు
తిరిగి ఉదయించె సత్యమే తెలుపు తీర్పు
గెలుపు తో పోరు ఓడిన గొప్ప ఓర్పు
తిరిగి గెలవడం సత్యమే తెలుపు నేర్పు

* ఫలము నందించు చెట్టుయే ప్రగతి జేర్చు
మ్రాను విస్తీర్ణముయె నీడ మాన్య మగుట
వృక్ష ముల కళలు విజయం వృద్ధి రేటు
తరువు జీవుల మధ్యన తీపి పంచు

* కాల జ్ణనము అనుభవం కాల మగుటె
బ్రతుకు మోడు వారె వరకు బంధ మగుటె
పంచ భూతాలు దేహాన్కి పాద మగుటె
ప్రకృతి ఫలములు పొందుటే ప్రతిభ యగుటె

* మీ అనుభవసాహిత్యాన్ని మీగడలను
హిమగిరినవిరియుసుమము హితము తెలుపు
సుందరమనసుకు స్వేచ్ఛ సుగుణ మేగ
సర్వ విధితమే మీకును సహనమేను

---((()))___

మనశ్శాంతి -- చిన్న కధలు ( 5)
 సంపదలు, రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి. ఉన్నవారు ప్రతి నిమిషం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు
 జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఎదుటివారిలో దోషాలను వెతకొద్దు మనలో దోషాలను చూసుకుందాం. మనకు నచ్చిన విధంగా మన మనసు మెచ్చే విధంగా బతకడం మొదలెడితే మనశ్శాంతి మనలను వదిలి వెళ్ళదు గాక వెళ్ళదు. ఆలోచనలు అనవసరం.
 
జీవితం అంటే  సమస్యల  ప్రయాణం మాత్రమే.ఏ సమస్యలు లేని జీవితం ఉండదుగాక ఉండదు ఎంత చెట్టుకి అంత గాలి. అనుకోవాలి ఆలోచించి. పగ ప్రతీకారాలు పెంచుకుంటూ మనశ్శాంతి పోగొట్టుకోవద్దు.

మనశ్శాంతి అనేది అన్ని కాలాల్లో అన్ని వయసులో అన్ని పరిస్థితిలో ఒకే విధంగా హాయినిస్తుంది.
ఎలా అంటే
యవ్వనములో సుఖము, వృద్ధాప్యంలో విశ్రాంతి  మనకు సుఖ దుఃఖాలు తోడు  పరమావధిగా తోస్తుంది
 
కానీ మనశ్శాంతి మాత్రం అన్ని కాలాల్లో, అన్ని వయసులలో, పరిస్థితిలో మారును
జరగబోయేదానితో జాగ్రత్తగా ఉంటూ అంతా మంచికే అనుకొని మంచిగా మలుచుకొని
మనకి ఉన్న దానిలో మనతో ఉన్న వాళ్ళతో హాయిగా చక్కగా రోజు మనకు నచ్చిన భగవన్నామస్మరణ కొంతసేపు చేసుకుంటూ హాయిగా మనశ్శాంతిగా ఉందాం ఆ తండ్రి పాదాల చెంత చేరు వరకు
___((()))__

 

నేటి సూక్తి :  అనుభూతి శక్తిగా మారాలి - సాధకుడు తాను లోపల పొందిన అనుభూతిని వెలికితెచ్చి శక్తిగా మార్చుకొని తన బాహ్యాభ్యంతర ప్రకృతులను రూపాంతరం చెందించుకోడం అవసరం. సమాధిలోనికి పోనవసరం లేకుండానే జాగృత చేతన యందు దీని నతడు సాధించవచ్చు. ముఖ్యంగా కావలసినది ఏకాగ్రతా నిష్ఠ
....
🌹. కపిల గీత - 160 / Kapila Gita - 160 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴  4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 14 🌴

14. లసత్పంకజకింజల్కపీతకౌశేయవాససమ్|
శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభాముక్తకంధరమ్॥

తాత్పర్యము : కమలకేసరములవంటి పట్టుపీతాంబరములతో శోభిల్లుచుండును. విశాల వక్షస్థలమున శ్రీవత్సచిహ్నము అలరారుచుండును. కంఠమున కౌస్తుభమణియు, ముత్యాల హారములును మెరయుచుండును.

వ్యాఖ్య : పరమేశ్వరుని వస్త్రం యొక్క ఖచ్చితమైన రంగు తామర పువ్వు యొక్క పుప్పొడి వలె కుంకుమ-పసుపుగా వర్ణించబడింది. అతని ఛాతీపై వేలాడుతున్న కౌస్తుభ రత్నం కూడా వర్ణించబడింది. అతని మెడను ఆభరణాలు మరియు ముత్యాలతో అందంగా అలంకరించారు. భగవంతుడు ఆరు ఐశ్వర్యాలతో నిండి ఉన్నాడు, వాటిలో ఒకటి సంపద. అతను ఈ భౌతిక ప్రపంచంలో కనిపించని విలువైన ఆభరణాలను చాలా గొప్పగా ధరించాడు.
....
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః  - అధ్యాయము - 06 🌴
🌻. శివస్తుతి  - 4 🌻

నీవు ఈ లోకములో సృష్టించిన వివిధ ప్రాణి సమూహములను మేము పూర్తిగా చూడజాలము. దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణులు, మరియు ఇతర చరాచర ప్రాణులు నిన్నే శరణు జోచ్చు చున్నారు (25). ఓ దేవ దేవా! శంభో! మాకు నీవు తక్క మరియొక గతి లేదు. త్రిపురాసురులు దేవతలను ఇంచుమించు నశించిన వారినిగా చేసినారు. నీవు క్షణములో ఆ రాక్షసులను సంహరించి మమ్ములను కాపాడుము (26). ఓ పరమేశ్వరా! వారీనాడు నీ మాయచే మోహమును పొంది యున్నారు. ఓ ప్రభూ! విష్ణువు చెప్పిన ఉపాయముచే వారు ధర్మ భ్రష్టులై ఉన్నారు (27).

ఓ భక్త ప్రియా! మా భాగ్యవశముచే ఆ రాక్షసులు సర్వధర్మములను విడనాడి బౌద్ధధర్మము నాశ్రయించి ఉన్నారు (28). శరణు నిచ్చువాడా! నీవు సర్వదా దేవాకార్యములను చేయుచుంటివి. మేము నిన్ను శరణు జొచ్చితిమి . నీకు నచ్చిన రీతిని చేయుము (29).

సనత్కుమారుడిట్లు పలికెను-

దేవతలు దీనులై తలలు వంచి చేతులు జోడించి ఈ విధముగా మహేశ్వరుని స్తుతించి ఆయన యెదుట నిలబడిరి (30). ఇంద్రుడు మొదలగు దేవతలు ఇట్లు స్తుతించగా, మరియు విష్ణువు చేసిన జపము చేత ఆనందించిన సర్వేశ్వరుడగు శివుడు వృషభము నధిష్ఠించి అచటకు విచ్చెసెను (31). ప్రసన్నమగు మనస్సు గల శివుడు వృషభము (నంది) నుండి దిగి విష్ణువును కౌగిలించు కొని నందిపై చేతిని ఉంచి దయతో కూడిన చూపులతో అందరినీ చూచెను (32). పార్వతీపతి యగు హరుడు దయా దృష్టితో దేవతలను, విష్ణువును చూచి, ప్రసన్నుడై గంభీరమగు వాక్కుతో ఇట్లనెను (33).

సశేషం....
.....
. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥  🍀

🌻 446. 'స్వస్తిమతిః'- 1 🌻

క్షేమము కలది శ్రీమాత అని అర్థము. స్వస్తి అను పదము ను అస్తి నుండి ఏర్పడినది. అస్తి అనగా వుండుట. సు ఆస్తి అనగా బాగుగా వుండుట. హాయిగా వుండుట. క్షేమముగా నుండుట. సుఖముగా నుండుట. ఏ జీవుడైననూ కోరునది ఈ స్థితియే. ఏ కోరికా లేని స్థితి ఇది. కోరికలన్నీ తీరిన స్థితి. పూర్ణమగు స్థితి. ఈ స్థితిని పొందుటకే స్వస్తి చిహ్నమగు (45) స్వస్తికమును ఆరాధించు సంప్రదాయ మేర్పడినది. భౌతిక దేహము నుండి అన్ని దేహ పొరల యందు లేక కోశముల యందు, లేక లోకముల యందు సుఖముగ నుండుట జీవన్ముక్తి. అనగా ఏదియూ బంధింపని స్థితి. యోగులు, సిద్దులు, తపస్విజనులు సత్సాధన ద్వారా ఈ స్థితిని పొందుటకు ప్రయత్నింతురు.

సశేషం.
.....
06. గంగా మాత మహత్యం

👉గంగా నది దేశంలోని 40% మందికి త్రాగునీరు అందిస్తున్నది. 50 కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని కలిగిస్తున్నది.

👉ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోను జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది.

👉యుగ యుగాలుగా ప్రవహిస్తున్న పునీత గంగ ని చూసే సరికి అందరి లోను ఒక పవిత్ర,దివ్యమైన భావన

👉వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణుపాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది.

👉పరమశివుడు తన జటాజూటంనుండి గంగను వదిలేటప్పుడు, ఆయన దాన్ని ఏడుపాయలుగా వదిలాడు. మూడు పాయలు (హ్లాదిని, పావని, నళిని) తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో మూడు పాయలు (సుచక్షువు, సీతా, సింధు) పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఏడవపాయ భగీరధుడిని అనుసరించి వచ్చింది. భగీరధుడు ఒక దివ్యరధంలో ముందు ప్రయాణం చేస్తుండగా, గంగ ఆ రధం వెనకే ఉరవళ్ళు, పరవళ్ళతో ప్రవహిస్తూ వెళ్ళింది, ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరధుని పేరుమీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది.

👉భారతంలో బీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై బీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు.అవి ఈ క్రింద వివరించబడినాయి.

గంగా, యమున ,సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికం.

గంగాజలం కొంచమైననూ దేహమునకు సోకిన సకల పాపములు నశించును.స్వరం లభించును.
నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.

గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు.
గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం.

శిరస్సు, మ్య్ఖం , దేహంలందు గంగా మృత్తిక(మట్టి)ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును.
ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును. దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది.

గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానందము కలిగించుచూ పాపములను దూరం చేయును.
మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును.
గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును.

గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు.
గంగ మూడు లోకములందు ప్రవహించి పునీతం లోకాలను చేస్తుంది.

భగీరధుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకు వచ్చాడు.

గంగా నది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది.

గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం.
గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు.
తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును.

గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్ననూ చదివిననూ సకల వ్యాధులు నశించి పరమ శుభములు  కలుగును.

ఆది శంకరుల గంగా స్తోత్రం

1::దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే 
శంకరమౌళివిహరిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే 

ప్రకాశించేదానా! దేవతలకు దేవతా!పూజ్యురాలా! ఓ గంగాదేవీ! మూడు లోకములను తరింపచేయుదానా! ప్రకాశించే తరంగములు కలదానా!
శుభాలు కలిగించే శంకరుని కొప్పుపై విహరించుదానా! పవిత్రమైనదానా! నీ పాద పద్మములయందు ఎప్పుడు నా బుద్ధి నిలిచి యుండుగాక!

2::భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః 
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానమ్

అందరికీ సుఖాన్ని కలిగించే భాగీరథి (భగీరథునిచే భూమికి తేబడినది) అని పిలువబడే గంగమ్మా! నీ పవిత్రమైన నీటి మహిమ వేదములలో వర్ణింపబడినది.
నీ యొక్క మహిమను నేను పూర్తిగా తెలుసుకోలేను. దయ కలిగిన దానా ! నా అజ్ఞానమును క్షమించు.

3::హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్

గంగా మాతా! నువ్వు శ్రీహరి పాదములనుంచి పుట్టావు. నీ స్వచ్చమైన తరంగాలు , తెల్లటి మంచును, చంద్రుని, ముత్యాలను పోలిఉంటాయి. పాపభారాన్ని నానుంచి తొలగించు.ఈ సంసార సాగరాన్ని తరింపచేయి

4::తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ 
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః

శుభం
07. మార్పు తప్పనిసరి

కాలం సాగుతుంది. రుతువుల దుస్తులను మార్చుకుంటూ కమనీయంగా రాసే కవికలం పలుకుతుంది సమాజంలో ఉన్న చెడు హరించుకుపోయి మంచి తప్పక పెరుగుతుందంటూ... మార్పు తప్పదంటూ, మార్పు ప్రకృతి సహజం. కొత్త నీరు వచ్చి పాత నీటిని నెట్టేసినట్లు ఏ రంగంలో అయినా మార్పు చాలా సాధారణ విషయం. మానవ మేధ అత్యంత చురుకైనది కావడం వల్ల, నిరంతరం కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. లోకం పోకడ గమనించి మనిషి తప్పనిసరిగా మారాలి. పాత తరం ఆలోచనలకే కట్టుబడితే ఛాందసులమంటూ నవతరం చేసే హేళనకు గురికావలసి వస్తుంది.

మార్పు ఆహ్వానించదగ్గ పరిణామం. కౌమారంలో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి. అప్పటి వరకూ తల్లిదండ్రులు చెప్పినట్లు బుద్ధిగా వినే పిల్లలు. పెద్దలకు సలహాలు ఇచ్చేందుకు ముందు కొస్తారు. వారి ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి. తప్ప నీరుగార్చకూడదు. మొదట్లో వారి సూచనలు ఉపయుక్తం. అనిపించకపోయినా పెద్దలు ఓపికతో మంచి చెదులు వివరించి చెప్పగలగాలి. అప్పుడే వారి బుద్ధి వికసనం జరుగుతుంది. ముందు ముందు వాళ్లే పెద్దలకన్నా గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు.

ఆలోచనల్లో నూతనత్వం మార్పునకు అంతర్యామి స్వాగతం పలుకుతుంది. గణన యంత్రం (కంప్యూటర్) మొదటి దశలో గది పరిమాణమంత ఉంటే నేడు ఒడిలో ఇమిడిపోయేంత కుదింపు రూపాన్ని పొందింది. ప్రపంచంలో అన్ని విధాలా అనుసంధానమై ఉండటానికి సాంకేతిక రంగంలో వచ్చిన ఈ మార్పు ఎంతగానో దోహదపడింది. కంప్యూటర్కు ఇంకో సూక్ష్మ రూపమని చెప్పుకోదగింది చరవాణి(సెల్ ఫోన్). తన రాక ప్రపంచ చరిత్రలో పెను మార్పు. అరచేతిలో ఒదిగిపోయే చరవాణి ద్వారా ఆధునాతన విషయాలతో పాటు ఆధ్యాత్మిక సంబంధమైన విశేషాలను సైతం పదుగురితో పంచుకోవడానికి అవకాశం దక్కింది. కొంతమంది మార్పును తొందరగా అంగీకరించరు. కాలంతో పాటు మారాలని, ఎప్పటికప్పుడు నవీకరణ చెందాలని ఎవరైనా చెబితే తేలిగ్గా తోసిపుచ్చుతారు. వారి మానసిక సరళి గతం తాలూకు ఘనతను చూసుకొని పొంగిపోయేలా ఉంటుంది.

అది తప్పు. విశ్వం నిరంతరం మార్పు చెందుతుంది. ఒకనాడు ఉన్న పెద్ద కోటలు ఉద్యానవనాలు నేడు కనిపించవు. భౌతిక పదార్థాలే గాక మనిషి అంతరంగమూ మార్పులకు లోనవుతుంది. ఇంతకుముందు నిజం అనిపించినది కొత్త సిద్ధాంతాల కారణంగా తప్పు కావచ్చు. పురాతన గ్రంథాల్లో భూకేంద్రక సిద్ధాంతం ప్రకారమే కథలు ఉండేవి. పది హేనో శతాబ్దంలో కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని (సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తుందని) ప్రతిపాదించాడు. అతడి ప్రతిపాదన దరిమిలా ప్రపంచ మేధావులు, పండితులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. సృష్టి ప్రతి అంశంలోనూ ఏదో ఒకనాడు మార్పు తప్పనిసరి. ఆ ఎరుక కలిగి ఉండి మార్పును ఆహ్వానించక తప్పదు మరి.

- గోలి రామచంద్రరావు

No comments:

Post a Comment