Sunday, 9 April 2023

ప్రాంజలి ప్రభ ..1౦/౦4/2023

 



సమస్యను పరిష్కరించడం....
చుక్కలలో  నొక్క నక్క సుడివడి తిరిగెన్
.....
చక్కని సుందరి రోహిణి
చిక్కగ పన్నిన వలలను చిక్కగ వగచెన్
ఎక్కువ మూల్గుచు నీల్గుచు
చుక్కలలో :::;నొక్క నక్క సుడివడి తిరిగెన్!!
....
మక్కువ కలిగే కదిలే
చక్కని కళలే మనస్సు చేరువ యగుటే
ఎక్కవ ఆశను లేదును
చుక్కలలో నొక్క నక్క సుడి వడి తిరిగెన్

......

*రాజపత్నీ గురోః పత్నీ
మిత్రపత్నీ తథైవ చ ।
పత్నీమాతా స్వమాతా చ
పఞ్చైతే మాతరః స్మృతా ॥
(చాణక్యనీతి)

రాజుయొక్క భార్య, గురువుగారి భార్య, మరియూ స్నేహితుని భార్య, అలాగే భార్యతల్లి అనగా అత్తగారు, మరియు స్వంత తల్లి - ఈ ఐదుగురూ పంచమాతలు అని చెప్పబడినారు.


🌺ప్రాణా యతాత్మనోsభీష్టా
     భూతానామపి తే తథా ౹
     ఆత్మౌపమ్యేన భూతేషు
     దయాం కుర్వంతి సాధవః ౹౹🌺

        మనకందరికీ ఎలా జీవితం మీద ప్రీతి ఉంటుందో,అలా వేరే ప్రాణ జీవులకు ఉంటుంది.ఇలాంటి విషయాలు తెలిసిన కొంతమంది మంచివాళ్ళు వాటిపై దయ చూపుతారు.
.....
నేటి సూక్తి : జపమార్గాలు - జవం సాధారణంగా విజయవంతమయ్యే మార్గాలు రెండున్నాయి. ఒకటి, బుద్ధిని మంత్రదేవత శక్తి సౌందర్యాదుల యందు లగ్నంచేస్తూ జపించే మార్గం. రెండవది భక్తిభావ పురస్సరంగా హృదయమందు మంత్రాన్ని స్పందింప జేస్తూ జపించే మార్గం. సాధకుడు రెండింటిలో ఏదో ఒకదాన్ని అనుసరించవచ్చు.

15.  జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||

. తాత్పర్యం :
జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

*దుఃఖం బయట నుండి రాలేదు

బృహదారణ్యక ఉపనిషత్తు, ముఖ్యంగా, బంధం మరియు విముక్తి యొక్క వివిధ ప్రక్రియలను వివరించడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎలా బంధించబడ్డామో మరియు మనం ఎలా స్వేచ్ఛ పొందాలో అది చెబుతుంది. అది ఆత్మ యొక్క బంధం యొక్క అంతిమ కారణానికి సైతం వెళుతుంది. మన బంధం కేవలం భౌతికమైనది లేదా సామాజికమైనది కాదు. ఇది శతాబ్దాలుగా మన పునరావృత జననాలు మరియు మరణాల ద్వారా మనల్ని బాధించే లోతుగా పాతుకు పోయిన ఒక పరిస్థితి.

బాహ్య ప్రపంచంలో మనం చేసే ఏ పని అయినా మన ఈ దుఃఖానికి తగిన పరిహారంగా అనిపించదు, ఎందుకంటే దుఃఖం బయటి నుండి రాలేదు. వర్షం, ఎండ మరియు గాలి నుండి మనలను బాధించకుండా నిరోధించడానికి మనం బంగళాను కలిగి ఉండవచ్చు; మనం తినడానికి రోజువారీ ఆహారాన్ని కలిగి ఉండవచ్చు; మనం చాలా సంతోషకరమైన మరియు స్నేహపూర్వక సామాజిక సంబంధాలను కలిగి ఉండవచ్చు; కానీ మనం ఈ సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక రోజు చనిపోవచ్చు. ఈ భయం నుండి మనల్ని ఎవరూ విడిపించలేరు.

కొనసాగుతుంది
...
*అక్షర వ్యాపారం మణిపూసలు
ఇది పూర్తిగా కవి తప్పు, సుసాహిత్యానికి ముప్పు, దీని వలన సమాజాన, వచ్చు కుకవులకే మెప్పు
ఆలోచించాలి కవులు, మీరవ్వకండి కాకులు, మీ ప్రతిభతో వెలగాలి, కావాలి కవి కోకిలలు!
స్వార్థపరుల వెంట పోక, డబ్బులకు అమ్ముడు పోక, కవీ!నిజాయితి చాటుము, దురాశలకు లోను కాక!
స్వయంగా ఉచ్చులో పడి, భుజ కీర్తులకు ఆశ పడి, కవీ!పరువు తీసుకోకు, ఎంగిలికి అలవాటు పడి!

రా రా రమ్మని చెప్పి, రంగు బట్టలే కప్పి, నిను భ్రమలో ముంచుతారు, సిగ్గు లజ్జలే తప్పి!
చోరులకు పీఠం వేసి, నోరులకు తాళం వేసి,స్టేజిపై ఉరికిస్తారు, నీ డబ్బులను గుంజేసి!
కొందరి నికృష్ట చేష్టలు, మరి కొందరి దుష్ట పనులు, నీతిపరులకపఖ్యాతి, సంస్థలకవమానాలు!
అవార్డంటే ఉరుకకు, రివార్డంటే మురువకు, ఆత్మ గౌరవం ముఖ్యం, రికార్డంటే వెళ్ళకు
****
*ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది.

నువ్వు నీ లోపల జరుగుతున్న దాన్ని గమనిస్తే ఆశ్చర్యపోతావు. శరీరం 'చాలు చాలా తినకు, నాకు ఎక్కువయి పోయింది' అంటుంది. మనసు 'ఐస్క్రీం అద్భుతంగా వుంది. యింకొంచెం తిను' అంటుంది. హృదయం 'అదెంత అందంగా వుంది' అంటుంది. మనసు ' నీకు బుర్ర లేదు, నీకు పిచ్చి పట్టింది అంటుంది. ఎప్పుడు హృదయం ప్రేమలో పడితే మనసు 'ఇది గుడ్డితనం' అంటుంది. హృదయం ఎటు వెళ్ళినా మనసు తప్పుపడుతుంది. వాటి ప్రపంచాలు వేరు.

ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. కారణం ఘర్షణ వుండదు. ఆ శక్తి నీకు రెక్కల్ని యిచ్చి అనంతం వేపు సాగిపోయేలా చేస్తుంది.

సశేషం ...
శుద్ధవిద్యోద్యాచ్చక్రేఈశత్వ-సిద్ధిః - 2 🌻
🌴. యోగి పరిమిత శక్తులను కోరకుండా,  సార్వత్రిక జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం పెరిగి , అతను విశ్వ చైతన్య నిపుణుడు అవుతాడు. 🌴

ఒకరి స్వీయ చైతన్యం సంపూర్ణ స్వచ్ఛతతో ఉంటే తప్ప, విశ్వ చైతన్యం లేదా శివ చైతన్యం యొక్క అంతిమ దశకు చేరుకోవడానికి అనేక ఇతర ఉన్నత స్థాయి చైతన్యాలను అధిగమించడం సాధ్యం కాదు. అటువంటి వ్యక్తి తన వ్యక్తిగత చైతన్యాన్ని సర్వోన్నత చైతన్యంతో విలీనం చేసుకోగలిగినప్పుడు, అతను అది అవుతాడు. మరో మాటలో చెప్పాలంటే, అతను శివుడిగా రూపాంతరం చెందుతాడు. ఆ స్థితిలో మాత్రమే, అతను విశ్వాన్ని కొనసాగించే అన్ని శక్తి స్థాయిలను స్వాధీనం చేసుకోగలడు. తన జ్ఞానం యొక్క స్వచ్ఛత కారణంగా మాత్రమే ఉత్పన్నమయ్యే అతని చైతన్య స్థాయి యొక్క స్వచ్ఛత వల్ల మాత్రమే అతను ఆధిపత్యాన్ని పొందుతాడు.

కొనసాగుతుంది.

చం: ముడిపడి వచ్చు భార్య మది సంపద ఉన్నను లేక గొప్పగన్   
తడిపొడి మాటలన్నియు మనోహరమేయని గొప్ప గొప్పగన్
నడవ డి భర్త భారముయు భాగ్యముదొంగ తనమ్ము యట్లు వెం
బడి చెఱసాలకేగుటకు బాటను జూపు జనాళికీ ధరన్
 
వడివడి వచ్చు రాజు వలె వందల మాటలు జెప్పు గొప్పగన్
నడచును దీసుకోండనుచు నమ్మకమున్ గలిగించు,దొంగవౌ
మడతలు లేని నోటులను మార్చును లక్షకు కోటి యట్లు,వెం
బడి చెఱసాలకేగుటకు బాటను జూపు జనాళికీ ధరన్


అంతర్యామి విజ్ఞాన పెన్నిధులు

భారతీయ సనాతన సంప్రదాయానికి మూలాధారాలు- చతుర్వేదాలు. విజ్ఞాన పెన్నిధులుగా ఆర్ష ధర్మానికి ఆలంబనగా నిలిచే సమున్నత ప్రతీకలుగా వేదాలు విలసిల్లుతున్నాయి. అఖిల సృష్టిలోని జ్ఞానమంతా వేదాల్లో ప్రకటితమవుతుంది. సాధారణ పరిభాషలో ‘వేదం’ అంటే జ్ఞానం. మనసులో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలే అనంత జ్ఞాన కాంతిపుంజాలు వేదనిధులు. సృష్ట్యాదిలో సర్వశ్రేష్ఠులైన రుషులకు భగవత్‌ చైతన్యం ద్వారా వేదవిద్య అందింది. తరవాత ఆ రుషి పుంగవులు వేదాన్ని గానం చేస్తున్న సందర్భంలో బ్రహ్మరుషి విన్నాడంటారు. ఆ బ్రహ్మరుషి బృహస్పతికి,  బృహస్పతి ఇంద్రరుషికి, ఇంద్రరుషి భరద్వాజుడికి వేద విజ్ఞానాన్ని పంచారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలనే నాలుగు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సారస్వతామృతంగా తేజరిల్లుతున్నాయి.

గురుశిష్యుల పఠన, పాఠన విధితోనే వేద పరంపర కొనసాగుతోంది. యుగయుగాలుగా మహర్షుల చింతన, మనన, పరిశీలన, పరిశోధన, అధ్యయనాలతో వేద విజ్ఞానం మరింతగా వెలుగు పుంజాల్ని విరజిమ్మింది. ‘విద్‌’ అంటే తెలుసుకోవడం. మహర్షులు, రుషులు మంత్రద్రష్టలుగా వేదమంత్రాల్లోని నిగూఢ రహస్యాల్ని తెలుసుకుని, వాటి గురించి మననం చేసి, పరిశీలనాత్మక దృక్పథంతో అనుభవంలోకి ఆపాదించుకుని, ఆ జ్ఞానభాండాల్ని విశ్వానికి అమూల్యమైన కానుకలుగా అందించారు.

రుగ్వేదమంత్రాల్ని రుచ సముచ్ఛయంగా పేర్కొంటారు. నాలుగు పంక్తుల శ్లోకాలుగా ఉండే ఈ మంత్రాలన్నీ దేవతా స్తుతులుగా, యజ్ఞ నిర్వహణకు ఉపకరిస్తాయి. వైదిక దేవతల ప్రార్థనా పూర్వక మంత్రాల సమ్మిళితంగా రుగ్వేదం ప్రతిఫలిస్తుంది. యజుర్వేదం గద్యరూపాత్మకమైనది. ‘యజుష్‌’ అంటే పూజ. ప్రక్రియా పూర్వకమైన విధి విధానాలైన పూజ, ఆరాధనల మంత్రాలు యజుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి. వివిధ యజ్ఞాల ప్రాముఖ్యాన్ని ఆవిష్కరిస్తూ, వాటి ఆచరణ రీతుల్ని విహిత కర్మకాండల సంవిధానాల్ని యజుర్వేదం వివరిస్తుంది.

దేవతల్ని ఆనందపరచడానికి యజ్ఞయాగాదుల్లో, ఆరాధనా క్రతువుల్లో గానం చేసే మంత్రాల శ్రేణి- సామవేదం. స్వర, తాళయుక్తంగా ఆలపించడానికి ఆమోదయోగ్యంగా సామవేద మంత్రాలు దోహదమవుతాయి. బ్రహ్మవేదంగా పేరుపొందిన నాలుగో వేదం- అధర్వణం. తంత్రం, యంత్రం, మంత్రాల సమ్మేళనమై అధర్వణ వేదం భాసిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతనాపరమైన, భగవదనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ వేదంలో నెలకొని ఉంటాయి. ‘బ్రాహ్మణి’గా వ్యవహరించే ఈ వేదానికి బ్రహ్మవిద్య అనే పేరు ఉంది.

చతుర్వేదాలు కేవలం పారమార్థిక విషయాల్ని మాత్రమే కాక జన బాహుళ్యానికి ఉపకరించే ఎన్నో అంశాల్ని ప్రతిబింబిస్తాయి. రాజనీతి, ఆచార వ్యవహారాలు, ఔషధాల విజ్ఞానం, గణిత, భౌతిక, రసాయనిక సూత్రాలు, ప్రజాతంత్రం, రాజ్యరక్షణ, శాసన విధానం, సంస్థల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయం, భూగోళ, ఖగోళ విజ్ఞానాంశాలు- ఇలా వేదాలు విజ్ఞాన పెన్నిధులై పరిఢవిల్లుతున్నాయి.

వేదమంత్రాలన్నీ లోక కల్యాణాన్ని కాంక్షిస్తాయి. విశ్వశ్రేయస్సును కోరుకుంటాయి. అందుకే వేదాల్ని ‘విశ్వసాహిత్యం’గా వివేకానందుడు వర్ణించారు. ‘పరమపద సోపానాన్ని అధిరోహించడానికి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వేదం జీవన నాదమై రవళిస్తుంది. ఆ నాదంతో జీవన గమనాన్ని అనుసంధానం చేసుకుంటూ మానవులు నిత్య జాగృతులు కావాలి’ అనే జగద్గురువు ఆదిశంకరుల సందేశం అనుసరణీయం.

sekarana

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

 ...

*ఒక వ్యక్తి బుద్ధుడి జీవితం గురించి విన్నాడు. తను కూడా బుద్ధుడి అంత ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఎందరో గురువులను కలిశాడు. కానీ, వాళ్ల దగ్గర శిష్యరికం అతణ్ని సంతృప్తి పరచలేకపోయింది. ఒకరోజు ‘ఫలానా పర్వత శిఖరాగ్రం మీద ఒక గురువు ఉన్నాడు. ఆయన బుద్ధుడి గురించి సమస్తమూ తెలిసిన జ్ఞాని. నీ ప్రశ్నలేవో ఆయన్ని అడిగావంటే, తప్పక సమాధానాలు దొరుకుతాయి’ అని ఎవరో చెప్పారు. ఆ గురువును వెతుక్కుంటూ ఆయన ఆశ్రమానికి చేరుకున్నాడా శిష్యుడు. ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారికి పాఠాలు చెబుతున్నాడు గురువు. కొత్తగా వచ్చిన వ్యక్తిని చూసి ‘ఏం కావాలి నాయనా?’ అని అడిగాడు గురువు. ‘నేను బుద్ధుడి బోధనలు సమగ్రంగా తెలుసుకోవాలని తిరుగుతున్నాను. ఇప్పటికే చాలామంది పండితులను కలిశాను. కానీ, వాళ్లెవరూ నా సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. మీరు నా అనుమానాలు నివృత్తి చేయగలరని ఇక్కడికి వచ్చాను’ అన్నాడు శిష్యుడు.

విద్యార్థులందరూ వెళ్లిపోయాక చివరికి కొత్త శిష్యుడి దగ్గరికి వచ్చాడు గురువు. ‘నాతో రా!’ అని పిలిచాడు. గురుశిష్యులు ఇద్దరూ కొండపై నడుస్తూ వెళ్లారు. కొంతదూరంలో వాళ్లకు పచ్చని చెట్లు కనిపించాయి. వాటిని చూపిస్తూ ‘ఇవేమిటో తెలుసా?’ అని ప్రశ్నించాడు గురువు. ‘వెదురు చెట్లు’ అన్నాడు శిష్యుడు. ఆ వెదురు చెట్లకు పక్కగా పుట్టుకొస్తున్న లేత వెదురు రెమ్మలను చూపుతూ ‘ఇప్పుడు వీటిని చూస్తే, నీకెలా కనిపిస్తున్నాయి?’ అని అడిగాడు గురువు. ‘ఆ వెదురు మొక్కలు బాగా పెరిగి, పొడుగ్గా ఉన్నాయి. ఈ వెదురు రెమ్మలు ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది. ఇవింకా చిన్నవిగా, పొట్టిగా ఉన్నాయి’ అన్నాడు. ‘ఇవీ వెదుళ్లే!’ అని చెప్పి తన కుటీరం వైపు వెళ్లిపోయాడు గురువు.

జీవితాన్ని యథార్థదృష్టితో చూడాలనుకుంటే పోలికలు పెట్టడం మానుకోవాలి. పోలికల ఆధారంగా ‘ఇది ఉన్నతం, ఇది అథమం, పొడవు, పొట్టి, అందం, వికారం’ అని నిర్ణయించడం సరికాదు. ఏ వస్తువునైనా సమదృష్టితో చూసే అలవాటు ఉండాలి. అదే బుద్ధుడు చూపిన మార్గం.

***

daily *ఉదయం మీదైతే.. విజయం మీదే!*

విజేత అంటే... అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నవాడు. అందరికంటే ముందుగా చేరు కున్నాడంటే... అందరికంటే ముందుగా సాధన ప్రారంభించి ఉంటాడు. అందరికంటే ముందుగా ప్రారంభించాడంటే, అందరికంటే ముందే లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడు. అందరికంటే ముందే ఆలోచించాలంటే, అందరికంటే ముందే నిద్రలేవాలి. అంటే, "ది ఫైవ్ ఏఎమ్ క్లబ్ లో సభ్యులు కావాలి. రాబిన్‌ శర్మ తాజా పుస్తక సారాంశం ఇదే.

1.      పొద్దున్నే నిద్రలేవడం బ్రహ్మవిద్యేం కాదు. మనల్ని మనం కష్టపెట్టుకోవడం అంతకన్నా కాదు. దేనికైనా ప్రారంభం, ముగింపు అనేవి ఉంటాయి. ఏ ఏడింటికో, ఎనిమిదింటితో రోజు మొదలు కాదు. మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్తమని చెప్పిన సమయం నుంచే... అంటే తెల్లవారుజామున ఆ రోజు ఆరంభం అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడు మెల్కొన్నా ' లేట్ అటెండెన్స్' కిందే లెక్క. ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి పాఠమూ ఆలస్యంగానే అర్థం అవుతుంది. మార్కులు కూడా అంతంతమాత్రంగానే వస్తాయి. ముందుగా బడికి వచ్చిన విద్యార్థి ఎప్పుడూ ముందే ఉంటాడు. కాబట్టి, జీవిత పాఠశాలలో 'లాస్ట్ బెంచ్ ఫెలో' అని పించుకోకూడదంటే, తెల్లవారు జామున మేల్కొనాల్సిందే... 

 2.     సమాజంలో ఐదుశాతం మంది... విజేతలూ నాయకులూ. మిగిలిన తొంభై అయిదు శాతమూ అనుచరులూ పరాజితులే. ఆ ఐదుశాతం మందిని పరిశీలిస్తే... వాళ్ల దినచర్య తెల్లవారు జామునే మొదలవుతుంది. అంతా నిద్రపోతున్న వేళలో వాళ్లు మేల్కొంటారు. అంతా కలలు కంటున్న సమయంలో వాళ్లు కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచి స్తారు. అంతా పరుగు ప్రారంభించే సమయానికే వాళ్లు గమ్యాన్ని చేరుకుంటారు. ఓ గంట ముందు లేస్తే పోయేదేం లేదు.... బద్దకం తప్ప !

3.     ప్రమోషన్లు వచ్చేవరకో, సొంతిల్లు కొనేవరకో, కోటి రూపాయలు సంపాదించే వరకో.... మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి. గమ్యం వైపుగా సాగించే ప్రయాణంలో ప్రతి నిమి షాన్నీ ఆస్వాదించండి, ఆనందించండి.

4.    ఎవరో పిలిచి కిరీటం పెట్టినప్పుడు మాత్రమే ... మన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించాలనే పిచ్చి నిర్ణయానికి కట్టుబడిపోయి.. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం వాయిదా వేయకండి. ప్రపంచం గుర్తించిన తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాకే ప్రపంచం గుర్తిస్తుంది.

5.     వికాసానికి ఓ ముగింపు అంటూ లేదు. ఓ శిఖరాన్ని చేరుకోగానే పర్వతారోహణ పూర్తయి పోదు. అంతకంటే ఎత్తయిన మరో పర్వతం మీకోసం సిద్ధంగా ఉంటుంది. నన్ను అధిరో హించమంటూ సవాలు విసురుతుంది. జిజ్ఞాసి నిత్య విద్యార్థి. నిరంతర యాత్రికుడు.

    _పేదరికానికి కారణం... చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనసును చుట్టుముట్టిన భావ దారిద్ర్యం. కాబట్టి, ఎంత తొందరగా నిద్ర మేల్కొంటే, అంత తొందరగా ప్రపంచాన్ని ఏలుకుంటావు._

***

 
కనువిప్పు.

* ప్రతి వ్యక్తి జీవితంలోనూ తప్పొప్పులు ఉండనే ఉంటాయి. అయితే, తాము చేసిన తప్పులేమిటో గుర్తించి, వాటిని సరిదిద్దుకునే లక్షణం సహృదయులైన కొందరిలోనే ఉంటుంది. మరికొందరైతే తమ తప్పులను తెలుసుకోకుండా ఇతరులలోని దోషాలను ఎత్తిచూపుతూ, వారిని పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు. పైగా, ‘ఎదుటివారు తప్పులు చేస్తున్నారు కాబట్టే వారిని మందలిస్తున్నాం. తప్పును చూపకపోతే, సరిదిద్దుకునేది ఎట్లా?’ అని తమ వాదాన్ని సమర్థించుకుంటారు. ఇంకొందరు ఎదుటివారిలో లోపాల్లేకున్నా, వారి గుణాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేక దోషారోపణం చేస్తుంటారు. వీరందరికన్నా భిన్నంగా ఉండేదే సత్పురుషుల జీవనశైలి. వారు ఇతరుల దోషాలను తమ మీద వేసుకుంటారు.

పూర్వం శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఏర్పాట్లను చూసి సహించలేని మంథర తన మాటలతో కైకేయి మనసును మార్చివేసింది. దశరథ మహారాజు ఇచ్చిన రెండు వరాల సంగతిని గుర్తుచేసింది. శ్రీరాముడికి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం కోరేలా కైకేయిని ప్రేరేపించింది. పుత్ర వ్యామోహానికి లోనై దశరథుడిని నిస్సహాయ స్థితిలో పడవేసింది కైకేయి. శ్రీరాముడి ఎడబాటు వల్ల కలిగిన దుఃఖంతో సంభవించిన దశరథ మరణానికి పరోక్షంగా కారకురాలైంది. దశరథుడు భార్యకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాముడిని అడవుల పాలు చేశాడు. పితృవాక్య పరిపాలన కోసం రాముడు సీత, లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వెళ్లాడు.

దశరథుడి మరణం తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి మేనమామ ఇంటి నుంచి రాజ్యానికి వచ్చాడు భరతుడు. తాను రాజ్యంలో లేని సమయంలో జరిగిన అనర్థాలన్నిటికీ తానే కారణం అని తనపై దోషారోపణ చేసుకున్నాడు ‘మంథరది తప్పు కాదు. నా తల్లి కైకేయీ ఏ దోషం చేయలేదు. దశరథ మహారాజు నిర్ణయం తప్పు కాదు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన చేయడం కూడా కారణం కానే కాదు.

నా పాపమే శ్రీరామచంద్రుణ్ని అడవులపాలు చేసింది’ అని భరతుడు తనపై దోషారోపణ చేసుకున్నాడు. రాజ్యంలో ఏ పొరపాటు జరిగినా తానే బాధ్యత వహించే ధార్మికుడైన, ఆదర్శవంతమైన ప్రభువులా ప్రవర్తించిన భరతుడి స్వభావం అందరికీ కనువిప్పు.

*** 

ఆదర్శప్రాయమైన చర్యలే

రాజేంద్రపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని శివభక్తుడైన కులోత్తుంగ చోళుడు (క్రిమికంఠుడు) పరిపాలన చేస్తున్నాడు. తన రాజ్యంలో ఉండే ప్రజలంతా ‘శివుడే పరమదైవం’ అని అంగీకరిస్తూ సంతకం చేయాలని ఆజ్ఞాపించాడు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రధాన ఆచార్యులైన భగవత్‌ రామానుజులను కూడా బలవంతంగా రాజసభకు రప్పించి, సంతకం చేయించాలనుకున్నాడు. రామానుజుల శిష్యులలో ప్రథముడు, ప్రధానుడు అయిన కూరేశులు, రామానుజులు ధరించే కాషాయాలను తాను ధరించి, గురువును సురక్షితంగా కర్ణాటక ప్రాంతం చేరుకునేట్లుగా ఒప్పించాడు. తగిన ప్రణాళిక ఏర్పర్చి రాజసభకు చేరుకున్నాడు.

సభలో వేదశాస్త్ర, పురాణేతిహాసాల్లోని వృత్తాంతాలను, ప్రమాణ వాక్యాలను ఉదహరిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ, అద్భుతంగా వాదిస్తున్న కూరేశుల నైపుణ్యాన్ని సహించలేని రాజు దురాగ్రహంతో ‘వారి నేత్రాలను పెకలించి వేయండి’ అని భటులను ఆదేశించాడు. విశిష్టాద్వైత సిద్ధాంతం పరిరక్షణ కోసం తన నేత్రాలను కోల్పోయిన కూరేశులు మాత్రం, తన నేత్రాలు పోవడానికి వేరెవరినీ తప్పు పట్టలేదు. ‘ఇదివరలో తాను ఏ భక్తజనుల బొట్టును చూసో, వారి పడికట్టును చూసో విమర్శలు చేసి ఉండవచ్చు. ఆ కారణంగానే (చేసిన తప్పునకు శిక్షగానే) నేత్రాలను కోల్పోయాన’ని చేయని నేరానికి సంబంధించిన దోషారోపణను తనపై వేసుకున్నాడు.

నంబిైళ్లె అనే ఆచార్యులను, వారి వాక్‌ వైభవాన్ని ఒక పండితుడు సహించలేక అందరిలో ఘోరంగా నిందించాడు. తనను నిందించిన పండితుడికి క్షమాపణ చెప్పడానికి సిద్ధపడ్డాడట నంబిైళ్లె. ఈ విధంగా మన పూర్వీకులే కాకుండా, సమకాలీనులైన కొందరు మహానుభావులు సమాజంలోని అలజడుల గురించి, విభిన్న ప్రాంతాలలో ఉత్పన్నమయ్యే ఎన్నో సమస్యల గురించి తాము స్పందిస్తూ, బాధ్యత వహిస్తూ తమ మీదనే దోషారోపణం చేసుకుంటూ, ఔదార్యంతో నివారణ చర్యలకు నడుం బిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి అందరికీ ఆదర్శప్రాయమైన చర్యలే.

.....

*నమస్కారం*

ఒక రోజు, మహాభారత యుద్ధ సమయంలో దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు "నేను రేపు పాండవులను చంపుతాను"

అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది - భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు..
శ్రీ కృష్ణుడు ద్రౌపదితో ఇలా చెప్పాడు, ఇప్పుడు నాతో మీరు రండి, అంటూ, శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు - శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి

ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు, అతను - "అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించిన తర్వాత ద్రౌపదిని అడిగాడు !! "ఏంటమ్మా! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు అని, శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా" అన్నాడు

అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది - "అవును తాతయ్యా.! వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.

భీష్ముడు చెప్పాడు

" నా మాటలలోని ఒక పదాన్ని కత్తిరించే పనిని చేసిన శపథాన్ని నిర్వీర్యం చేయగల పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"

శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు "మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు" "మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు - దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు" అంటే ......

ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం,
అహంకారం,ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం,నామాట వినాలనుకోవడం, చులకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు".

"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."

పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు

"అభ్యర్థన
ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నియమంగా పెట్టుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ప్రతీ ఇల్లు స్వర్గం అవుతుంది." ఎందుకంటే

నమస్కారం ప్రేమ, క్రమశిక్షణ, చల్లదనం,  గౌరవాన్ని నేర్పుతుంది. నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి,  సంస్కరించడం నేర్పుతుంది, కోపాన్ని తొలగిస్తుంది,  కన్నీళ్లను కడిగివేస్తుంది,  అహాన్ని నాశనం చేస్తుంది.

నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి. అదే నీటి చుక్క ఆకు మీద పడితే, మెరిసి పోతుంది ఔనా !. నీటి చుక్క లాగ ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడిస్తుంది.దుష్ట సంస్కారాలు వదిలి మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది.
***
 

No comments:

Post a Comment