Friday, 21 April 2023

ప్రాంజలి ప్రభ..

  


అక్షయ తృతీయ పండుగ ఇది ముఖ్యంగా హిందువులు, జైనులు జరుపుకునే పండగ. హిందూ క్యాలెండర్‌లో వైశాఖ చాంద్రమాన శుక్ల పక్ష తృతీయ ఈరోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు. వైశాఖమాసంలో అమావాస్య తర్వాత మూడవ రోజును అక్షయ తృతీయగా గుర్తిస్తారు.ఈరోజున లక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పవిత్రమైన రోజున విలువైనది ఏది ఇంటికి తెచ్చుకుంటే అది అక్షయం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అంటే ఇంట్లో ఎల్లప్పుడూ తరిగిపోని సంపద ఉంటుందని అర్థం. అందుకే చాలా మంది ఈరోజున అత్యంత విలువైన బంగారంను కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
జైనమతంలో మొదటి తీర్థంకరుడు అయిన రిషభనాథుని స్మరిస్తూ ఈ పండగ జరుపుకుంటారు. రిషభనాథుడు దోసిట పోసిన చెరుకు రసాన్ని సేవించి, తన సన్యాసాన్ని ముగించిన సందర్భం అక్షయ తృతీయరోజు జరిగింది. అందుకే జైనులు ఈరోజును పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, అక్షయ అంటే 'ఎప్పటికీ తరగదు'. ఈ రోజున చేసే యజ్ఞం, జపం, దానము, పుణ్యం వంటి కార్యాలు ఎప్పటికీ తరిగిపోని ఫలాలను అందించగలవు అనే భావనను సూచిస్తుంది. వివాహాలు, కొత్త పెట్టుబడులు లేదా వెంచర్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి ఈ పండుగ శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున రోజున ప్రారంభించేవి ఏవైనా సంవత్సరం పొడవునా గొప్ప విజయాలు, లాభాలు పొందేటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంతుందని నమ్ముతారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22 ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 23న 7:47 కి ముగుస్తుంది.
ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీ క్రిష్ణుడు యుధిష్టరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు. ఈ పర్వదినానే ఛార్‌ధామ్‌లోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈరోజు నుంచే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడే మీకు ఓ సందేహం రావొచ్చు. బంగారానికి ఈ పండుగకు సంబంధం ఏంటని.. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు.. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవ లోహంగా పరిగణిస్తారు. బంగారానికి ‘హిరణ్మయి’ అనే మరో పేరు కూడా ఉంది. ఈరోజున బంగారం కొనడంతో పాటు దానం చేయడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు.
అక్షయ తృతీయ రోజున ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు అంటే హిరణ్యగర్భుడు. తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున పండుగను జరుపుకుంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని.. తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
అక్షయ కుమారుడి జననం..
* హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నర నారాయణుడు జన్మించారు.
* అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మ దేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం.
* అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది.
అక్షయ తృతీయ వంటి పవిత్రమైనే రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగిందని నమ్ముతారు.
* అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్య యుగం, త్రేతా యుగం ప్రారంభమైందని నమ్ముతారు.
* అక్షయ తృతీయ రోజు నుంచే వేద వ్యాసుడు, గణేశుడు మహా భారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు.
* అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు.
* అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహా భారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే!
నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు…రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు
అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
11. ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
12. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.
13. ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.

ప్రాంజలి ప్రభ (౩౩)
కొత్త ఛందస్సు
 శలభలోలా - య/య/జ/స/గ IUU IUU - IUII IUU
13 అతిజగతి 1866

మరేమో సకాలం - సమానము తరమ్మే
విశేషం వివాదం - వినోదము తరమ్మే
చరిత్రే శివోహం - ప్రభోదము తరమ్మే
ప్రభుత్వం ప్రభావం - ప్రమాదము తరమ్మే
 
మదోన్మత్త భావం - ప్రమాదము తరమ్మే
సమానత్వ భావం - సుఖాలయ తరమ్మే
విశాలత్వ భావం - తరించుట తరమ్మే
చరిత్ర తత్వమ్మే - భరించుట తరమ్మే

ప్రభావమ్ము నందు - సకాలము తరమ్మే  
విశేషమ్ము నందు - కళా మయ తరమ్మే
దరిద్రమ్ము నందు - ధనా దయ తరమ్మే  
యతీ భావ మందు - యధా విధి తరమ్మే
 
--(())--
స్త్రీకి రెండు చేతులు
చేతులతో నె పనులు
పనులు శ్రమలేకుండా చేయు ఈశ్వరా

ఇంట్లొ ఒక ఉద్యోగి
ఉద్యోగి మనసుయొగి
యోగి సర్వసుఖములిచ్చు స్త్రీ ఈశ్వరా
 
ఆది శక్తి ఆడది
ఆడది జగమంతది
జగములేలు స్త్రీ హృదయ వాణి ఈశ్వరా
 
ఇల్లాలే దేవత
దేవతే చేయూత
చేయూత జీవితపరమార్ధం ఈశ్వరా

సకలం స్త్రీల మయం
స్త్రీలు శక్తి మయం
శక్తితో సర్వ౦ గ్రహించేను ఈశ్వరా

అతివ అబల కాదులె
కాదు కాదును సబలె   
సబలగా ఆకర్షించి బతుకును ఈశ్వరా

వితండ వాదములు
వాదము తో ప్రేమలు
ప్రేమల తోనే ఆలింగనం  ఈశ్వరా
 
చీర కట్టు అందం
అందంతో భావం
భావ మువల్ల జీవితలక్ష్యం ఈశ్వరా

తల్లిగా చెల్లిగా
చెల్లిగా భార్యగా
భార్యగా ఇన్నో సుఖాల స్త్రీ ఈశ్వరా

అలుపెరగనిది మహిళ
మహిలే పెంచును కళ
కళలు ఉప్పొంగును స్త్రీలలోన ఈశ్వరా

--(())--


ప్రాంజలి  ప్రభ (32 )
నేటి ఛందస్సు
IIU U IIU IUIII UU UI UUIU

రవి కాంచెన్ మదిలోన భావమును,  
వెల్గున్ పంచు నాప్రేమకై
కవి తెల్పైన్ హృదయమ్ము తాపము ను,
నిత్యానంద నాప్రేమకై
నవవాదమ్ములు కమ్మెనే మనసు
ఆరోగ్యము నా ప్రేమకై
జవనాశ్వంబున సమ్మోహమ్మునను
రానాప్రియ నాప్రేమకై
 
చరితార్ధంబున విశ్వమోహముకు
పంచుప్రియ నీప్రేమకై   
సమరాగమ్ములు వచ్చెనే ఇపుడు
సౌలభ్యము నీ ప్రేమకే
యద మాధుర్యము పొందుసాహసము
ప్రేమమ్ముయు నీ ప్రేమకే
పాఱువమ్మే ఇది సంతర్పణముకు
కాలమ్ముయు నీ ప్రేమకే  

--(())--
 
నేటి కవిత .. నేనెవడను?
నేనెవడను?
ఈ విశ్వానికి ఏమిచెయ్యాలి 
నేనెవడను?
ఈ జన్మకు పరమార్థ మేమిటి 
నేనెవడను?
ఇప్పుడు నన్ను చూచేదెవరు 
నేనెవడును? 
ఈ జన్మ ఋణం ఎలా తీసుకోవాలి   

ఈ విశ్వం ఏమిటి?
భూగోళము అంతా అనుకున్నా 
ఈ ప్రపంచం ఏమిటి?
భూమి ఉన్న బ్రతుకు ప్రాంతం 
వీటి తత్త్వాలు ఏమిటి?
మోక్షానికిమార్గ శివతత్వం 
దీనిని పనిగట్టుకొని ఎవరైనా సృష్టించారా?
శాస్త్రజ్ఞుల ప్రక్రియ ఇంకా ఉన్నది  
లేక ఇది స్వయంభువు నా?
ధర్మోరక్షతి రక్ష:

అసలు ఈ ఇంద్రియ గోచర ప్రపంచం నిజంగా ఉందా? 
ఇంద్రియ గోచరమే సమస్తలోకాలు 

లేక ఇంద్రియాలు,మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా?
బ్రహ్మసృష్టి అనుకుంటే అంటామాయా 

మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? 
దేవుడున్నాడని నమ్మకంతో  బతికి, బతికించు  
ఈ జీవితానికి అర్థం/పరమార్థం అంటూ ఉందా?
అల్పసంతోషం,  ఆశా పాశం జంజాటం 
  
మనస్సు అంటే ఏమిటి? 
మనో వ్యాపారాలు అనుభవించగలుగుతున్నా, 
మనస్సు యొక్క నిర్వచనం ఏమిటి?

నేనెవడను? ఎక్కడ నుండి ఈ పంచ భూతాత్మక ప్రపంచానికి వచ్చాను?

పునర్జన్మ ఉందా? మరణం తర్వాత నేనెవడను? మరణం ముందు నేనెవడను?

 ఇంతకీ ఈ "నేను" ఎవరు?
మానవుడు స్వతంత్రుడా? 
అస్వతంత్రుడా? అతనికి నిర్ణయ స్వేచ్ఛ (free will) ఉందా? 
ఈ రోజు మనం అనుభవిస్తున్నదేనా మానవ జీవితం? 
ఇంత కంటే పరమార్థం ఏదైనా ఉందా?

ఈ ప్రపంచంలో ఈ రోజు ఉన్న స్థితిలో నేనెందుకు ఉన్నాను? 
ఇంకోలా ఎందుకు లేను? 
నేనెవడను? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడికి వెళతాను?

ప్రాణం అంటే ఏమిటి?

పాపం అంటే ఏమిటి? 
పుణ్యం అంటే ఏమిటి?

ఏది తప్పు? 
ఏది ఒప్పు?
లోకంలో ఎందుకింత క్రౌర్యం? 
లోకం లో కారుణ్యం మాత్రం ఎందుకు?

మానవులలో ఒక వైపు క్రౌర్యం,
హింస...మరొక వైపు, 
చీమను కూడా చంపడానికి చేతులు రానంత దయాళుత్వం...అన్ని భూతాలను తనలోనూ, 
తనను అన్ని భూతాలలోనూ చూసుకోగలిగినంత అధ్యాత్మిక ఔన్నత్యం...ఆశ్చర్య కరమైన ఈ ద్వంద్వ ప్రవృత్తులు ఎలా వచ్చాయి? అసలు మానవ జీవిత పరమార్థం/
పరమావధి ఏమిటి?

కర్మ ఫలాన్ని కర్మలే ఇస్తాయా? బ్రహ్మమా?

కర్మ ఫలాన్ని ఈ జన్మ లోనే అనుభవించాలా?

జీవులు వ్యాపకులా? అణు స్వరూపులా?

జీవులకు సూక్ష్మ శరీరాలు, ముక్తిలో కూడా ఉంటాయా?

అసలు ముక్తి అంటే ఏమిటి?

ముక్తులు మరల జన్మ తీసుకుంటారా? లేదా?

ఈ విశ్వానికి స్థితి ఉన్నదా? అది మిథ్యనా?

జగత్తుకు ఉపాదాన కారణం ఎవరు? బ్రహ్మమా?ప్రకృతియా?

బ్రహ్మము వ్యాపకమా?పరిచ్ఛిన్నమా?దాని కన్నా పరమమైనది ఉన్నదా?

ఏ వెల్గులకీ ప్రస్థానం?

  • ➡️ తత్త్వ విచారం...ఈ విధంగానే సాగాలి.

 

🙏🙏*రక్త సంబంధం*🙏🙏

*తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.....*

*ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం...*

*పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము....*

*అప్పట్లో.....*

*ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.   అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.  పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు....     రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...*

*బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...*

*వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది...     తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...*

*తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.*

*ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు...*

*అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు.* *అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే....     జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే...    అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.*

      *ఇక వెళ్ళొస్తామంటూ...    బయల్దేరారు ముగ్గురూను.*

    *తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.*  👍

    *"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా...     నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు* *భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ...*

*ఆలోచించుకుంటూ....!*

*సోదరులంటే ఇలా ఉండాలి కదా....!*  

*బంధం అనే కాదు...    కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.*

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

*దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా...      మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.*

              *"ఏమంటారు"*..?

*ఇలాంటి ఆత్మీయతలను;* *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం, కానీ ఈ మెసేజ్ ని సాధ్యమైనంత ఎక్కువ గ్రూవులలో షేర్ చేసి మళ్ళి ఈ తరం నుండి ముందు తరాల వారు పాటించడం కొరకు దోహదపడుతుంది ఇది నా చిన్న ప్రయత్నం 

నా ప్రయత్నం కు మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..🙏🙏🙏

 

🙏 ఓం నమో వేంకటేశాయ! 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
 భాగము 1(పంచ బేరాలు)

మొట్టమొదటగా - తొలి ప్రకరణంలో పరమ పావనమైన ఆనందనిలయం, అనగా తిరుమల క్షేత్రం నందలి ప్రధానాలయపు గర్భాలయం, లోని పంచబేరాలుగా పిలువబడే శ్రీవేంటేశ్వరుని ఐదు రూపాల గురించి తెలుసుకుందాం....

సకల లోక కళ్యాణ కారకుడైన శ్రీవేంకటేశ్వరుని రూపాంతరాల స్మరణతో "తిరుమల సర్వస్వం" ప్రారంభమవ్వటం మంగళదాయకంగా భావించి, తొట్టతొలి ప్రకరణాన్ని శ్రీనివాసుని "పంచబేరాల" కు అంకితమివ్వడం జరిగింది.

ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి.

1. ధ్రువబేరం - మూలవిరాట్టు

2. అనిరుద్ధబేరం - కొలువు శ్రీనివాసుడు, దర్బారు శ్రీనివాసుడు, అళగిప్పిరాన్.

3. కౌతుకబేరం - పురుషబేరం, భోగ శ్రీనివాసుడు, మనవాళ పెరుమాళ్.

4. స్వపనబేరం - అచ్యుతబేరం, ఉత్సవ శ్రీనివాసుడు, స్వపనమూర్తి, ఉగ్ర శ్రీనివాసుడు.

5. ఉత్సవబేరం - మలయప్ప స్వామి

మూలవిరాట్టు సుమారు వెయ్యేళ్ళ క్రితం - చరిత్రకు అందనట్టి ప్రాచీనకాలం నుండి తిరుమల శిఖరంపై విరాజిల్లుతున్న ఈ ప్రతిమ శివుడిదా లేదా అమ్మవారిదా లేదా విష్ణువుదా అనే వివాదం నెలకొన్నది.

ఆ సమయంలో - శ్రీమద్రామానుజుల వారు బంగారు శంఖు చక్రాలు తయారు చేయించి, వాటిని తన భక్తితత్పరతతో స్వామివారి ఉభయహస్తాలలో శ్రీవారి చేతనే స్వయంగా ధరియింప జేసి - ఆ ప్రతిమ శ్రీమహావిష్ణువు కలియుగావతారమైన శ్రీవేంకటేశ్వరునిదేనని నిర్ద్వంద్వంగా, తర్కపూరితంగా నిరూపించారు.

కుడి వక్షస్థలంలో అమ్మవారితో, చతుర్భుజాలతో, శంఖు చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వుండే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు. మూలవిరాట్నే ధ్రువబేరం (స్థిరంగా వుండే విగ్రహం) అని కూడా వ్యవహరిస్తారు. తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉండే స్వామివారి యజ్ఞోపవీతంలో ఒక ప్రోగు తెగి వుంటుంది.

ప్రలంభాసురునితో ప్రచండయద్ధం జరిగినప్పుడు ఆ ప్రోగు తెగి పోయిందని ప్రసిద్ధి. శ్రీవారికి నాగాభరణంతో బాటుగా అనేక స్వర్ణాభరణాలు అలంకరించబడి వుంటాయి. మొదట్లో సన్నగా ఉండే తిరునామం రామానుజాచార్యుల వారి హయాం నుండి ప్రస్తుతం మనకు కనపడే వెడల్పాటి ఊర్థ్వపుండ్రంగా రూపాంతరం చెందింది.

ఈ తిరునామానికి మామూలు రోజుల్లో 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వినియోగిస్తారు. అదే - బ్రహ్మోత్సవాల్లో దీనికి రెండింతల పదార్థాన్ని ఉపయోగిస్తారు.

స్వామివారు కుడి వరదహస్తంతో (అంటే వరాలనిచ్చే హస్తం), ఎడమ కటిహస్తంతో (అంటే నడుము భాగంలో చేర్చబడిన చేయి) దర్శనమిస్తారు. స్వామివారి పాదపద్మాలు పద్మపీఠంపై విరాజిల్లు తుంటాయి. సూర్యకఠారి, లేదా నందకం, అనే ఖడ్గాన్ని నడుము క్రింది భాగం నుంచి ధరించి వుంటారు.

దాదాపు 120 సంవత్సారాలు జీవించి స్వామివారి సేవలో పునీతుడైన రామానుజాచార్యుల వారి గురించి మున్ముందు సవివరంగా తెలుసుకుందాం.... అలాగే, స్వామివారి మూలవిరాట్టు ఆవిర్భావం - స్వరూప స్వభావాల గురించి కూడా ఆనందనిలయాన్ని వివరిస్తున్నప్పుడు సవిస్తారంగా వర్ణించుకుందాం.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 1 🙏

ఈ పద్యంలో భగవంతుని అనుగ్రహ విశేషం వర్ణింప బడింది.

ఉ. శ్రీరమణీమనోహర ప్రసిద్ధసురార్చిత దివ్యనామ సం
సార సముద్రసంతరణ సాధులనీదరి జేర్పకుందువే
క్రూరు డజామిళుండు తనకూరిమి పుత్రుని బేరుకొన్న
జేరి శుభంబులం బడయ జేసితివే మును వేంకటేశ్వరా!

పద్మావతీ వల్లభా సుప్రసిద్ధులయిన ముప్పది మూడుకోట్ల దేవతలచే నిరంతరం స్మరించే అర్చించే దివ్యనామ విభాసితుడా శ్రీవేంకటేశ్వరా సంసార సంద్రంలో కూరుకుపోయిన జీవుల నుద్ధరించే దయగల స్వామీ. మంచివరాలను నీదరి జేర్చకుండా వుండవు గదా

ఎందుకనగా - క్రూరుడయిన అజామిళుడు తనకు ప్రియమయిన చిన్నపుత్రుని నారాయణ నామముతో పిలుచుకున్నంతనే ఎంతో సంతోషాన్ని పొంది అతడు చేసిన పాపాలన్నింటినీ క్షమించి శుభాలెన్నో అతనికి కలిగించావు.

నీ సన్నిధిలో అతనిని వుంచావు. అటువంటప్పుడు మంచివారలను నీదరికి జేర్చక వుండవు గదా. తప్పక వారికి అజామిళుని కంటే గొప్ప స్థితిని అనుగ్రహించగలవు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 

ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట

🕉

 "కమలాక్షా! ప్రియతమా! కొన్నిదినములు ఇచటనే ఉండుము. నీ కలయికను విడువజాలను" అని కుబ్జ ఆ స్వామిని వేడుకొనెను.

 48.10 (పదియవ శ్లోకము)

తస్యై కామవరం దత్త్వా మానయిత్వా చ మానదః|

సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదర్చితమ్॥10176॥

అంతట భక్తులకోర్కెలను ఈడేర్చునట్టి ఆ మహానుభావుడు  ''నీ అభీష్టమును దీర్చుటకై మఱలవచ్చెదను' అని మృదుమధురముగా పలికి, ఆమె పూజలను స్వీకరించెను. పిమ్మట ఆ కృష్ణభగవానుడు ఉద్ధవునితోగూడి, సకల సంపదలతో తులతూగుచున్న  తన సదనమునకు చేఱెను.

 10177॥

శ్రీమహావిష్ణువు (శ్రీకృష్ణుడు) బ్రహ్మాది సకల దేవతలకును ప్రభువు. భక్తిప్రత్తులతోగాక ఇతర ఉపాయములచే ఆ స్వామిని ప్రసన్నుని చేసికొనుట కష్టము. అట్టి పరమపురుషుని ఆరాధించి, ఆయన అనుగ్రహమును పొందియు, క్షణికములైన శబ్దాది విషయసుఖములను కోరుకొనినవాడు బుద్ధిహీనుడు.

 

పిమ్మట శ్రీకృష్ణుడు అక్రూరునకు ప్రియమును గూర్చుటకును, పాండవులకు మేలు చేయుటకై  ఆయనను హస్తినాపురమునకు పంపుటకును నిశ్చయించుకొనెను. అందువలన ఒకనాడు ఆ ప్రభువు బలరామునితో, ఉద్ధవునితో గూడి ఆయన (అక్రూరుని) భవనమునకు వెళ్ళెను.

 

అప్పుడు అక్రూరుడు తనకు ఆత్మీయులు, సత్పురుషశ్రేష్ఠులు ఐన శ్రీకృష్ణ, బలరామ, ఉద్ధవులను దూరమునుండియే చూచి, మిగుల సంతోషించెను. వెంటనే అతడు ఆసనమునుండి లేచి, ఎదురేగి, క్రమముగా వారిని అందఱిని అక్కునకుజేర్చుకొని అభినందించెను.

 

పిదప అక్రూరుడు బలరామకృష్ణులకును, ఉద్ధవునకును నమస్కరించెను. అంతట వారును అక్రూరునకు ప్రత్యభివాదములను ఆచరించిరి. అనంతరము అతడు శ్రీకృష్ణాదులను సుఖాసీనులను గావించి, విధ్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించెను.

 

మహారాజా! తదుపరి అక్రూరుడు బలరామకృష్ణులకు పాదప్రక్షాళనమొనర్చి, ఆ శ్రీపాదజలములను తన శిరమున దాల్చెను. పిమ్మట అతడు వివిధములగు పూజా సామాగ్రులతోను, అమూల్యములగు వస్త్రాభరణములతోను, దివ్యములైన పరిమళ ద్రవ్యములతోను, పుష్పమాలలతోడను వారిని అర్చించెను. పిదప భక్తితో ప్రణమిల్లి వారి చరణములను తన యొడిలో చేర్చుకొని సేవలొనర్చెను. అంతట అతడు వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు వచించెను-

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

పీయూషార్ణవమధ్యగాం మణిమయద్వీపాన్తరభ్రాజినీం,
షట్చక్రాన్తరవర్తినీం విజయదాం షట్ఛతృసంహారిణీమ్।
శ్రీచక్రాన్తరరాజితాం శశియుతాం పద్మాసనే సంస్థితాం,
వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసందాత్రిణీమ్।।(శార్దూలవిక్రీడితమ్)()

భావం-

అమృతసముద్రమధ్యమందుండేటటువంటి,మణిద్వీపమునందుప్రకాశించేటటువంటి,శ్రీచక్రాన్తరవర్తి ఐనటు వంటి, విజయమును చేకూర్చేటటు వంటి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములగు ఆరుగురు శత్రువులను సంహరించేటటు వంటి, చంద్రుడు ఆభరణముగా కలిగినటువంటి,పద్మమే ఆసనముగా కలిగినటు వంటి, వేదములచే  స్తుతింప బడేటటువంటి, అన్ని కోరికలను తీర్చేటటువంటి శారదమాతను నమస్కరించుచున్నాను

 🕉️ *వైశాఖ పురాణం 2వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

🌻 *వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు* 🌻

💫🌹నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.

💫🌹నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.

💫🌹శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. 

💫🌹అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.

💫🌹అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.

💫🌹బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా....

💫🌹దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.

💫🌹దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుదురు.

💫🌹ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.

💫🌹గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. 

💫🌹చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు. 

💫🌹మధ్యాహ్న కాలమున అతిధిగా వచ్చిన వానిని /బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమము. కావున అన్న దానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. 

💫🌹ఆకలి గల వానికి,భార్య ,సంతానము ,గృహము ,వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము.కానీ ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా - అన్నము - భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది . అట్టి అన్నదానము అన్ని దానముల కంటె ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానముల తో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు . ముందు కాలమున కూడా ఉండబోదు . 

💫🌹వైశాఖ మాసమున అలిసిన బాటసారికి /బ్రాహ్మణునికి - జల దానము, ఛత్రదానము, వ్యజన దానము, పాదుకా దానము, అన్నదానము , మున్నగువానిని చేయనివారు పిశాచమై,ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు . కావున త్రిలోకవాసులందరును, అన్నదానము మున్నగువానిని యధాశక్తిగా చేయవలయును . 

💫🌹రాజా ! అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు . కానీ అన్న దానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ మైన ఉత్తమ బంధువు. 

💫🌹నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు సర్వ ధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు (వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు (వారిని పూజించిన ఫలము) సర్వ ధర్మములు (అన్ని ధర్మములు నాచరించిన ఫలము) కలుగును భావము.



*!!వైశాఖ పురాణం రెండవ అధ్యాయము సంపూర్ణము!!*



      🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏


కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.
పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుండి , పాప రహితులైన ఋషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.

కోపమునను ఘనత కొంచెమై పోవును 
కోపమునను గుణము కొరత పడును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును 
విశ్వదాభిరామ వినుర వేమ

కర్మ మధికమైన గడచి పోవఁగరాదు 
ధర్మరాజు దెచ్చి తగని చోట 
గంకుభట్టు జేసె గటకటా దైవంబు 
విశ్వదాభిరామ వినుర వేమ

అద్భిర్గాత్రాణి శుద్ధ్యన్తి ; 
మనస్సత్యేన శుద్ధ్యతి 
విద్యా తపోభ్యాం భూతాత్మా ; 
బుధ్ధి: జ్ఞానేన శుద్ధ్యతి :

అర్థము:-- జలము చేత శరీరము పరిశుద్ధ మగును: సత్యముచేత మనస్సు పరిశుద్ద మగును, జ్ఞానము చే బుద్ది శుచి యగును, విద్య చేత, తపస్సు చేత ఆత్మ పరిశుద్ధ మగును.

చత్వారో ధన దాయాదా:
ధర్మాగ్నినృప తస్కరాః 
తేషామ్ జేష్ఠావమానేన 
త్రయ: కుప్యంతి సోదారాః

అర్థము:-ధర్మము,అగ్ని,రాజు,దొంగ ; ఈనలుగురు ధనమునకు దాయాదులు.వీరిలో జేష్ఠు డయిన ధర్మము నవమానించిన అంటే ధర్మము మీరి ప్రవర్తించిన మిగతా ముగ్గురూ కోపిస్తారు. అనగా ధర్మముగా ప్రవర్తించని వాని ధనము అగ్గిపాలో, పన్నుల రూపంలో రాజులపాలో, దొంగలపాలో అవుతుందని భావము.

   *శివరాత్రి ఎలా జరుపుకోవాలి?*


*సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో,    ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.*


*శివరాత్రే యోగరాత్రి.     శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.*


*1.ఉపవాసం:-*


*శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.*


*ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.*


*ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.  మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.*


*2. జీవారాధాన:-*


*అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది.*


*అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.*


*శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.*


*3. మౌనవ్రతం:-*


*శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమక చమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.*


*ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.*   


*4.అభిషేకం:-*


*శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.*


*5.జాగరణ:-*


*శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.*


*6.మంత్ర జపం:-*


*శివరాత్రి మొత్తం శివనామంతో….                      ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.*


*శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.* 


*అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.*

...........


వితస్తా నదీ తీరంలో కర్దముడనే మహర్షి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఎన్నెన్నో విద్యలను నేర్చుకునేవారు. ఆ విద్యలతో భుక్తిని పొందినవారు కొందరు. ముక్తిమార్గాన్ని పట్టినవారు కొందరు. అక్కడ లోకాన్వేషి, దేవాన్వేషి, బ్రహ్మాన్వేషి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు వారి పేర్లకు తగిన విధంగా వరుసగా లోకాన్ని, దైవాన్ని, బ్రహ్మతత్త్వాన్ని అన్వేషించేవారు. లోకాన్వేషి మిగిలిన ఇద్దరినీ చూసి నవ్వుతుండేవాడు. చార్వాకం అంటే అతనికి చాలా ఇష్టం. చార్వాకం చారు వాక్యముల సముదాయం అనేవాడు. మనకు కనబడే ప్రపంచం కన్నా వేరేమీ సత్యం లేదనే వాడు.

రెండో వాడు.. ‘మనకు కనబడని ఆ దేవదేవుడు మహేశ్వరుడు ఈ జగత్తుకు ఆధారం’ అనే వాడు. ఆ కనబడే త్రిమూర్తులకు కూడా మూలం నిర్గుణ పరబ్రహ్మమే అని మూడో శిష్యుడు నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తూ ఉండేవాడు. గురువు వారి అభిరుచులకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. కాలం గడిచిన కొద్దీ లోకాన్వేషి ఎగతాళి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ‘దేవుడు ఉంటే ఈ చెట్లూ, కొండలు, గుట్టలు, నదులు ఇవన్నీ కనబడినట్లు కనబడాలి కదా?’ అని అడిగేవాడు. ‘నిర్గుణ బ్రహ్మోపాసన అంటే శూన్యాన్ని ఉపాసించటమే కదా?’ అనేవాడు. ఈ మాటలు గురువు చెవిని పడ్డాయి.

ఒకరోజు ఆయన.. లోకాన్వేషిని తన ధ్యానకుటీరానికి పిలిచాడు. అతనిని ఆ విషయాలు, ఈ విషయాలు అడుగుతూ.. ‘‘మన తాళపత్ర గ్రంథాలయంలోని ‘శాస్త్రతత్త్వ రహస్య చంద్రిక’లో పదహారో పత్రంలో ఉన్న విషయం ఏమిటో వివరించు’’ అని ప్రశ్నించాడు. దానికి లోకాన్వేషి.. ‘‘గురువర్యా! నేను ఆ గ్రంథాన్ని ఎప్పుడూ చూడలేదు. కనుక మీరు చెప్పిన పత్రంలో విషయాన్ని ఎలా చెప్పగలను?’’ అని అన్నాడు. ‘‘ఆ గ్రంథశాలలోకి వెళ్లకుండా, ఆ విషయాన్ని చూడకుండా అది ఉందో లేదో చెప్పలేవు కదా?’’ అని కర్దముడు అడిగాడు. లోకాన్వేషి ఔనని తలూపాడు.

అప్పుడు గురువు.. ‘‘సరే. దగ్గరకు రా.’’ అని అతని తల పై తన కుడిచేతి బొటన వేలు అదిమిపెట్టి ఉంచాడు. కళ్లుమూసుకోగానే శిష్యుడు గ్రంథాలయంలో ఆ గ్రంథం దగ్గరకు చేరుకున్నాడు. అందులో తనకు కావాల్సిన పత్రాన్ని చదివాడు. తిరిగి చూసేసరికి గురువు దగ్గర ధ్యాన కుటీరంలో ఉన్నాడు. తాను భౌతికంగా కదలకుండానే గ్రంథాలయంలో ఆ గ్రంథాన్ని చూడగలగడం ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు గురువు అతడితో.. ‘‘ఎవరు ఏ పరిధిలో ఉంటే వారికి ఆ పరిధికి చెందిన జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆధిభౌతిక క్షేత్రంలో ఉండి ఆధిదైవిక అనుభవాన్ని, ఆధ్యాత్మికానుభవాన్ని పొందాలంటే కుదురుతుందా? అది సాధ్యం కావాలంటే మన దేహానికి సాధన అవసరం. ఈర్ష్యాసూయలకు అతీతంగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడు నీ హృదయం దేవతానిలయం అవుతుంది. దేవతానుగ్రహంతో నిర్గుణ పరబ్రహ్మ అనుభవమూ సాధ్యమవుతుంది. యోగం ద్వారా ఆధిదైవిక క్షేత్రంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి కూడా వెళ్లవచ్చు. 


నిన్ను నువ్వు పొగుడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సరళత, ఇంద్రియ ఆకర్షణకు లోనుకాకపోవడం, దైవం పట్ల సడలని నమ్మకం, ఏకాంత స్థలంలో ఉపాసన వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు నీలో దైవీ శక్తి పెరుగుతుంది. మన అనుభవంలోకి రానంత మాత్రాన అది లేదు అనరాదు’’ అని చెప్పాడు. దీంతో, లోకాన్వేషికి కర్తవ్యం తెలిసి వచ్చింది. శిష్యులు ముగ్గురూ మంచి సాధకులుగా పేరు తెచ్చుకున్నారు.

..........


పరీక్ష


🌷🕉🌷


జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం        


పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి, పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

బంగారానికి అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి.


బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు.


చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం. పక్షికి తుపాను పరీక్ష, పాముకు గద్ద పరీక్ష!


‘నన్ను పరీక్షించకు దేవా. నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. పరీక్షలు నలిపేస్తాయి. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధ ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.


పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి- పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు.


మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.


ధర్మరాజు జూదం ఆడాడు. అందరినీ రాజ్యాన్నీ ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు


పాండవులు. ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది, గెలిపిస్తుంది.


జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.


కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది. మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.


ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి.   ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది.

,............


చాలా బాగుంది ఇంటి పేర్ల పురాణం 


*తెలుగు మాస్టారా? మజాకా?*


తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.....

ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ

రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,

అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.

శుభమ్.

,..............


*మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట.!*

            

       …బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు



కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్యం.


లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే.


మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి.


ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే….       ప్రింటింగ్ ప్రెస్సు వచ్చిన తరువాత!   లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు!! 


పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించు కొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు.         తిండికి ఎంత  అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్నా రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి.!


ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో  ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది..!


ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు..!


వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది..!

1 comment:

  1. చదవండి కథలు చదివించండి తెలుగు

    ReplyDelete