బ్రహ్మ తత్వ భవాలు
మొదట 'జ్ఞానాన్ని'
తర్వాత 'జ్ఞాని'ని చూడు
మొదట విశ్వాన్ని చూడు
తర్వాత విద్యని చూడు
మొదట దృశ్యాన్ని చూడు
తర్వాత అర్ధము చూడు
మొదట దేహాన్ని చూడు
తర్వాత బుద్ధిని చూ
ప్రతి ఒక్కరు దేవుని అవతారములే
సర్వ సృష్టి కి మూలము అవరములే
విశ్వ మోక్షము తెల్పును అవతారములే
జీవ కోటికి బుద్ధులు అవతారములే
నిత్యమూ కనిపించేవి దశావతారాలు
సత్యమై తలపించేవి దశావతారాలు
తత్వమై మనసించేవి దశావతారాలు
గత్యమై నివసించేవి విశాలతారాలు
➡ జీవుని తలంపు -
కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.
ప్రేమపక్వ౦ పొందడానికి కొంత కాలము అవసరం
దేహభావం అర్ధమవ్వట కొంత దాహము అవసరం
కాలదైవం పోల్చడానికి కొంత భావము అవసరం
➡ భగవంతుని తలంపు -
తలంపు, కార్యం ఏకకాలంలో జరుగుతాయి.
అనంత, మొహం సామరస్యంలో జరుగుతాయి
పదంతొ లాశ్యం హావభావంలో జరుగుతాయి
జపంతొ నిత్యం సేవ కార్యంలో జరుగుతాయి
శివ తత్వం:-
➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం/తపస్సు.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం - నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర - ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు. చిత్త Lభస్మం. (సృష్టి రహస్య విశేషాల
1 సృష్టి లా ఏర్పడ్డది
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
( సృష్ఠి ) ఆవిర్బావము
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాదం
4 నాదం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 అగ్ని యందు జలం
16 జలం యందు పృద్వీ.
17 పృద్వీ యందు ఓషధులు
18 ఓషదుల వలన అన్నం
19 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి .
1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది
అన్ని జీవులలో మూడే గుణములు ఉంటాయి
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
( పంచ భూతలు )
1 ఆకాశం
2 వాయువు
3 అగ్ని
4 జలం
5 భూమి
.
5 ఙ్ఞానింద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
ఆకాశ పంచికరణంలు
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( అహంకారం ) పుడుతున్నాయి
వాయువు పంచికరణంలు
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
అగ్ని పంచికరణములు
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.
జలం పంచికరణంలు
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.
భూమి పంచికరణంలు
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
5 ( పంచ ప్రాణంలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
6 ( అరిషడ్వర్గంలు )
,
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మచ్చార్యం
3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు )
1 జాగ్రదవస్త
2 స్వప్నవస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరిణమించుట
5 క్షిణించుట
6 నశించుట
6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం
7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞాడు
3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 అభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
14 మంది ( అవస్థ దేవతలు )
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 అగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యానా
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
( మనిషి ప్రమాణంలు )
96 అంగళంలు
8 జానల పొడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 మురల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం
( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
అధోలోకలు 7
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చేమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షిర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
( పంచాగ్నులు )
1 కాలగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభీలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబు ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుప
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో
10 ( నాధంలు )
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
[08/03, 10:37 am] +91 83094 66007: జన్మ సార్ధక సాధన.....
ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.
అప్పుడు పాలు..........
ఈశ్వరా !!
నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...
ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.
పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,
పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.
అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు.
ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి...
|| ఓం నమః శివాయ ||
🙏🏻🙏🙏🏻
[09/03, 6:02 pm] +91 94404 88271: *తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది..*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైైైైైైైై
👉 తథాస్తు దేవతులుంటారు జాగ్రత్త.. అంటూ పెద్దలు అంటూ వుంటారు. అది ముమ్మాటికీ నిజమే. ముఖ్యంగా సంధ్యావేళల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెప్తుంటారు. అలాంటి తథాస్తు దేవతల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సాధారణంగా ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
👉 మన మనస్సు మంచినే ఆశిస్తే అదే జరుగుతుంది. కీడును తలిస్తే కీడే జరిగి తీరుతుంది. ఇబ్బందులు తప్పవు. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి. తథాస్తు దేవతలూ ఆశీర్వదిస్తారు.
👉 ఇక తథాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా ఏ మాట మాట్లాడకూడదని.. అలా అనుకుంటే దేవతలు తథాస్తు అని అంటారు. దీంతో జరగాల్సిందంతా జరిగిపోతుంది. అందుకే నెగటివ్గా మనలో మనం ఆలోచించే యోచనలు సైతం ఒక్కోసారి జరిగిపోతూ వుంటాయి.
👉 ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు చెప్తూ వుంటే.. నిజంగానే లేకుండా పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ నటిస్తూ అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు. అందుకే మంచి గురించే ఆలోచించాలి. మంచే మాట్లాడాలి. ధర్మాన్నే ఆచరించాలి. అప్పుడు మనకు మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰*"వడదెబ్బ"బారిన పడకుండా ఉండటానికి మిత్రులకు సూచన :*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం.. తగినన్ని నీరు తీసుకోండి..
వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వడదెబ్బకు గురైన వారిలో వేవిళ్లు, తలతిరగడం, జ్వరం రావడం.. చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్తో పల్స్ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటంవంటి లక్షణాలు కనబడతాయి. వీటి ద్వారా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే... శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చేయాలి.
అధికంగా ఎండలో తిరగడం ద్వారా.. మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. తద్వారా అత్యధికంగా వడదెబ్బతో మరణాలు చోటుచేసుకుంటాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి. బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్ అందించాలని వారు చెప్తున్నారు.
ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
[09/03, 6:02 pm] +91 94404 88271: 🙏🕉️🛕🌞🌙🚩🌎📖🙏
*_చెట్టు ముందా? విత్తు ముందా? సృష్టి ప్రారంభం. దేవుడా? దేవతయా? ఎవరు ముందు?_*
🙏🕉️🛕🌞🌙🚩🌎📖🙏
*సృష్టి ప్రారంభం. త్రిమూర్తులెవరు? ఎవరిని కోలవాలి.*
చెట్టు ముందా? విత్తు ముందా? అంటే చెప్పడం బహు కష్టతరం. అంత మాత్రం చేత మనం చెట్టు ఉనికి గురించి ఆలోచించ కుండా ఉంటే ఏనాటికి, ఏదీ తెలియదు. ఏమీ తెలుసు కోకుండా, ఊరికే కూర్చొనడానికి మనం జడపదార్థం కాదు కదా? పరిశోధిస్తే ఎదో కొంతైనా తెలుసుకోవచ్చు కదా! అలా తెలుసుకున్నదంతా మనకు లాభమే కదా! అదే ఈ ప్రయత్నం.
ఈ సృష్టికి మూలం ఏమిటి? అసలు మూలం స్త్రీ స్వరూప దేవియా? లేక పురుష స్వరూప దేవుడా? మనం,మనవులం ఎవరిని కోలవాలి? ప్రస్తుతం మనం ఎన్నో, ఎన్నెన్నో, కుల,మత, జాతి, వర్ణ, వర్గ భేదాలు మూడు నాలుగు రకాల దైవ విభజన మత సూత్రాలు, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వాగ్వివాదాల మధ్య నలిగి పోతున్నాము.
*అనరాదు* కానీ పుట్టేది ఒకే రకంగానే పుడతారు. నిద్ర లేచి, దైనందిన కార్యక్రమాల వరకు అందరూ ఓకేరకంగా చేస్తారు. నెత్తిన పెట్టే బొట్టు దగ్గర కొచ్చే సరికి..అడ్డమా, నిలువా, ముద్రనా, మొ. వి.
అంతా ఆగమ్యగోచరం, కానీ పెద్దలు అన్నీ మనకు విశదoగానే చెప్పివున్నారు
మనమేమైనా అర్థం చేసు కోవడంలో తప్పులు చేస్తున్నామా? మధ్యలో నుండి ఎందుకు మొదలు పెట్టడం, *ప్రారంభానికే పోదాం.*
దేవీ భాగవతం అనుసారం ప్రకృతి, పురుషుడు ఒకరికొకరు ప్రతిభింభాలు. ఓకే బిళ్లకు ఇరువైపులు, ఎటుచూస్తే అది. మూల ప్రకృతి లేదా ఈ మాయ మరియు ఈ పరబ్రహ్మం అనగా పురుషుడు ఆధ్యంత రహితమైన మిశ్రమ తత్వం కలవారు. అంటే నిప్పు...మంట, రవి...కిరణాలు, బంగారు.. ఆభరణాలు, మట్టి.. మట్టి కుండలు లాగున, అంటే విడదీయలేని అవినావ సంభంధం కలది కానీ వేటికి అవే వేరు.వీటికి *శక్తి* మూలం. *శ* అంటే సమృద్ధి, సంపద, విజయం అయితే., *క్తి* అనునది సత్తువ, బలం,
భగవతి, భాగవాన్ అంటే *భగ* అభివృద్ధి, అభ్యదయం, సంతోషం. దీనికి *వాన్/వతి* కలుస్తుంది అనగా మళ్లీ పురుష, ప్రకృతి తత్వం. ఏదైతే అది. ఒకరూపానికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గాని స్వతంత్రంగా అపాదించు కొన వచ్చు లేక గుప్తముగాను ఉంచు కొనవచ్చును. ఈ నిర్ణయం గైకొనటకు త్రిగుణముల యొక్క అంతర్లీనంగా ఉన్న గుప్తార్థముల స్వభావముల నెఱింగిన స్వయంజ్ఞాన పండితులు చైతన్య/నచైతన్య శక్తి శాలురికే సుసాధ్యము.
ఈ త్రిగుణాలు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఇవి మూడు ఏకమైన అది పరాశక్తి యొక్క భౌతిక రూపం. కానీ ఈ అనంత విశ్వ అధినేత్రి అయిన అది పరాశక్తి కి రూపం లేదు. నిర్గుణబ్రహ్మ. ఈ శక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యం.
శాక్తేయం ప్రకారం ఆదిపరాశక్తి ఒక శూన్యభిoదువు.(శూన్య స్త్రీ శక్తి) ఈ శక్తి సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి లకు జన్మిoచిన అంశము.
సాత్విక, రాజసిక , తామసిక ఈ మూడు గుణాల కలయిక చే ఆదిపరాశక్తి భౌతిక రూపము ఏర్పడినది. ఈ ఆది పరశక్తే అఖండ సత్యం. త్రిగుణాత్మికశక్తి సమ్మేళనమే ఈ శక్తి భౌతిక స్వరూపం. ఇదే సంపూర్ణం. ఈ శక్తి నే మనం దుర్గా దేవి అని అంటున్నాము. (ఆదిపరాశక్తి.). ఈ పరాశక్తి భర్తలేనిది. ఒక విశిష్ట స్త్రీ. ఈమె ఈ జగత్తుకు శివుడిని ఆహ్వానించటానికి తానే స్త్రీ రూపంతో జన్మను పొందింది. అందుకే ఈ శక్తి సంపూర్ణం. వివిధ దేవతలకు కూడా తానే మూలం అయినది. కావుననే ఈ ఆధిపరాశక్తి *సంపూర్ణం*. భర్త లేనిది.
*(ఇంకావుంది)*
🙏🕉️🛕🌞🌙🚩🌎📖🙏
[09/03, 6:02 pm] +91 94404 88271: 🙏🕉️🛕🌞🌙🔱🏵️🌼🙏
*జపం విధి విధానాలు* 🙏🕉️🛕🌞🌙🔱🏵️🌼🙏
*జపం అనేది 3 రకాలు.*
1. ఉదాత్త అనుదాత్త స్వరాలతో అందరికీ వినిపించేరీతిలో చేసేది. దీన్ని *వాచక జపం* అంటారు.
2. పెదాలు కదుపుతూ స్వరం బైటకు వినిపించకుండా చేసేది. దీన్ని *ఉపాంశు జపం* అంటారు.
3. పెదవులు సైతం కదపకనే తనలో తానే జపం చేసుకోవడం. దీన్ని *మానస జపం* అంటారు.
(ఇవికాక - ఇంకా సగర్భ జపం, అగర్భ జపం అనేవీ ఉన్నాయి.)
ఒకదాని కంటె ఒకటి మిన్నగా ఫలితాలు ఇచ్చే జపమాలలు ఉన్నాయి. హస్తరేఖల మొదలు - బంగారపు జపమాల వరకూ జపసంఖ్య తెలిపేవి గాక, విశేష ఫలదాయక మాలలు వున్నాయి.
శంఖ మణిమాలల కన్న ప్రవాళమాల, దానికంటె స్ఫటికమాల, అంతకంటే ముత్యాలమాల, అంత కంటె పద్మబీజాలమాల అధిక ఫలదాయినులు.
స్వర్ణ, రుద్రాక్ష, కుశ గ్రంధ మాలల ఫలితం ఎన్ని రెట్లుంటుందన్నది కనీసం ఊహించలేము.
ఇంట్లో జపం కన్నా గోశాలలో, గోవు ఎదుట జపం సర్వ శ్రేష్టం. ఆలయాలు, కొండలు, బ్రాహ్మణ, గురుసన్నిధి, నదీతీరాల యందు జపం ఉత్తమం!
కామక్రోధ వికారాదులకు అతీతంగా జపం చేయాలి. అపవిత్రంగా జపం చేయ రాదు. జప సమయంలో తుమ్ములూ - దగ్గులూ - అపాన వాయువులూ రాకూడదు. అవి వస్తే జపం విడిచి, వేరే అనుకూల సమయాన్ని ఎంచుకోవాలి.
శునకం, నీచులు, అశుభ సూచనలు, ప్రకృతి భీభత్సాలు కనిపిస్తే జపం నిలుపుదల శ్రేష్ఠం. కొన సాగిస్తే అరిష్టం.
నడుస్తూనో, పడుకొనో, యథాలాపంగా కూర్చొనో, రాజ వీధుల్లోనో, అపవిత్ర స్థలాల్లోనో జపం సర్వదా *నిషిద్ధం!*
ఈ జపవిధి కృత యుగంనాటిది. ఈ కలియుగంలో మర్త్యులు యోగసాధనకు తగినంత కాయసిద్ధి లేక పంచాక్షరీ జపం చేసే వారు పై చెప్పిన రీతి పాటించలేరు. విశేష జపాలకు నియమాలు పాటించ గలరు అనేది, శుద్ధ అపనమ్మకం. కనుక *శివపంచాక్షరి* అనే *ఓం నమశ్శివాయః* మంత్రం ఉత్తమం. ఈ జపానికి మాత్రం నిషేధం లేదు. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ జపించుకోవచ్చు!
యోగ - సాధకులు మాత్రం యుగధర్మం ఏది ఎలావున్నా విధి విధానం పాటిస్తేనే ఫలసిద్ధి. అగ్నికి ఏవిధంగా నిత్య పరిశుద్ధత ఉంటుందో - యోగులకూ నిత్య పరిశుద్ధత ఉంటుంది గనుక సదా ధ్యాన తత్పరులైన వీరికి ఏ సూత్రాలూ వర్తించవు.
[: *సర్వ వ్యాధులు నయమగుటకు మంత్రం*
ఒక చిన్న లోహపు పాత్ర, నిండా (రాగి, ఇత్తడి, వెండి) నీటిని తీసుకొని , కుడి చేతితో మూసి, మీఇష్ట (ఇంటి) దేవుడిని ప్రార్థించి, ఈ క్రింది మంత్రమును ఏడు సార్లు పఠించి, ఆ నీటిని త్రాగవలెను. ప్రతి నిత్యం సంధ్యాసమయంలో ఇట్లు చేసిన ఏ వ్యాధి అయినా, నిస్సందేహముగా బహు శీఘ్రంగా నయమై పోవును.
..... *మంత్రం* ....
*_మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్దయ సర్వదా, శరీరారోగ్యంమే దేహి దేవ దేవ నమోస్తుతే!_*
[09/03, 6:02 pm] +91 94404 88271: *కలశంలోని కొబ్బరి కాయను, నీటిని, బియ్యంను ఏమి చేయాలి?*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
👉 చాలామంది కొబ్బరికాయను, కలశం క్రింద ఉంచిన బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. కానీ కొంతమంది వరలక్ష్మిగా పూజించిన కొబ్బరి కాయను దానం చేస్తే లక్ష్మి దేవి ఇంట్లో నుండి వెళ్లి పోతుంది అని అనుకుంటారు.
👉 అలాంటప్పుడు ఆ కొబ్బరి కాయతో ఏదైనా తీపి పదార్థం తయారు చేసి నైవేద్యంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయతో పచ్చడి లాంటివి చేయకూడదు, కేవలం తీపి పదార్థం అంటే కొబ్బరి సున్ని లేదా కొబ్బరి ఉండలు తయారుచేసి ప్రసాదంగా స్వీకరించాలి.
👉 కానీ కొబ్బరికాయ తో తయారుచేసిన ప్రసాదాన్ని ఎంత తొందరగా స్వీకరిస్తే అంత మంచిది ఎందుకంటే వెంటనే ప్రసాదం తయారు చేయకపోతే కొబ్బరికాయ కుళ్లిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయ ప్రసాదాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్వీకరించాలి.
👉 అలాగే కలశం కింద పెట్టిన బియ్యంతో కూడా పరవాన్నం లాంటి తీపి పదార్థం తయారుచేసి ఇంట్లో ఉన్న సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. కలశం లో ఉన్న నీళ్లను ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ వాళ్ళ మీద చల్లుకొని మిగిలిన నీళ్ళని మామిడి ఆకులతో సహా మొక్క మొదళ్లలో పోయాలి.
👉 కలశం పై పెట్టిన బ్లౌజ్ పీస్ ని బ్లౌజ్ గా కుట్టించుకోవచ్చు, కలశం లో వేసిన నాణాన్ని దేవుడి మందిరంలో గానీ లేదా బీరువాలో భద్రపరుచుకోవాలి. ఇలా నియమనిష్టలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం తో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలను పొందుతారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
*సేనా జలం*(ఆర్మీ వాటర్)
***************************
బిస్లరీ.,అక్వాఫినా అనేవి వాటర్ బాటిల్స్ అమ్ముతున్న విదేశీ కంపెనీలు.
వీటిని కొనడంవల్ల ఈ డబ్బు విదేశాలకు వెళ్తుంది.
కావున అందరికీ మనవి చేసేదేమంటే?
మీరు ప్రయాణం చేసేటప్పుడుగానీ లేదా మార్కెట్ కు షాపింగ్ కు వెళ్లినప్పుడుగానీ నీళ్ల బాటిల్ కొనాలంటే *సేనా జలం* ఆర్మీ వాటర్ అని అడగండి.
ఇది అంతటా లభ్యమౌతుంది.
అలాగే ఇది చాలా చవక కూడా.
*భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం* సేనా జలం ను ఏర్పాటు చేసింది.
భారత ఆర్మీ జనరల్ విపిన్ రావత్ గారి భార్య అయిన మధుళికా రావత్ గారు దీనిని ఏర్పాటు చేశారు.
ఇది అర లీటరు మరియు లీటరు బాటల్లలో లభిస్తుంది.
అర లీటరు బాటిల్ రూ.6/-.లీటరు బాటిల్ రూ.10/-.మాత్రమే.
ఇతర కంపెనీలైతే లీటరుకు కనీసం రూ.20/-కు అమ్ముతాయి.
*సేనా జలమును* అమ్మగా వచ్చిన లాభము ఆర్మీ సంక్షేమ సంఘానికి చేరుతుంది.తద్వారా ఈ డబ్బు మరణించిన సైనిక కుటుంబాలకు మరియు వారి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది.
భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం ఈ నీటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పటి నుండి ఎక్కడ కూడా టీ.వీల్లో గానీ పేపర్లలో గానీ ఎలాంటి ప్రచారం జరగలేదు.!?
పబ్లిసిటీ చేయడానికి సైన్యం వద్ద అంత డబ్బు కూడా లేదు.!?
అలాగే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటి గురించి ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు.!?
అందుచేత కొందరికే ఈ ఆర్మీ వాటర్ గురించి తెలుసు.
కావున మనందరం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమంటే?
మనం నీళ్ల బాటిల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ ఆర్మీ వాటర్ ను అడగాల్సిందే.
*ఆర్మీ వాటర్ కొందాం.*
*సైనిక కుటుంబాలను కాపాడుకుందాం.*
జైజవాన్✊జైహింద్💪జైభారత్🙏
(ఒక ఇంగ్లీషు మెసేజ్ కు తెలుగు అనువాదం)
ధన్యవాదాలు🙏🤝
అర్ధం చేసుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బుద్దితో, రెండవది హృదయంతో. ఈశ్వరార్పణం అనేది ఎప్పుడూ బుద్ధితో జరగని పని. ఎందుకంటే బుద్ధి ఎప్పుడూ అహంకారాన్ని దాటిపోదు.
కర్మ నాది, ఫలం నీది అనే సూత్రాన్ని బుద్ధి అర్ధం చేసుకోలేదు. హృదయం తో అర్ధం చేసుకోవడం అంటే, లభించిన ప్రతీది పరమాత్మ ప్రసాదమే అని గ్రహించడం.
తర్కము కానీ, బుద్ధి కానీ ఎందుకు?అని ప్రశ్నిస్తాయి. ఆ ఎందుకు అనే దానికి జవాబు దొరకకపోతే అవి వెనక్కి వచ్చేస్తాయి. ఎక్కడ ఈ ఎందుకు? అనే దానికి జవాబు దొరకదో, అక్కడ హృదయం శోధిస్తుంది.
ఏది బయట ద్వారా లోపలికి తీసుకోబడుతుందో, దానికి ఆహారం అని పేరు. అంటే భోజనం ఒక్కటే కాదు. మనం ఇంద్రియాల నుండి లోపలికి తీసుకునే ప్రతీది, ప్రాణాన్ని ప్రాణంలోకి సమర్పించడానికి అనువుగా ఉండాలి.
మనం తీసుకునే ఆహారం, ప్రాణానికి ఉత్తేజం, ఉద్వేగం కలిగించి, ప్రాణం బయట వస్తువుల వైపు పరుగులు తీసేలా చేస్తుంది. ఆ పరుగుని ఆపగలిగితే ఈ ప్రాణం, మహాప్రాణంలో విలీనం అవుతుంది.
ఈ ప్రపంచంలో అజ్ఞానానికి మించిన మృత్యువు ఏదీ లేదు. శరీరంలో శరీరం గురించి తప్ప మరే తత్త్వము తెలియని వాడు అజ్ఞాని. "నేను" అనేది తెలుసుకోగలిగేదే జ్ఞానము. మనం ఉన్నాము అనే ఎరుక కలిగివుండి, ఆ మనం ఏమిటో తెలియక పోవడమే అజ్ఞానం. తెలియడం జ్ఞానం5:13 am]
......
అంతర్గతంగా అధ్ తినిపించేటప్పుడు, వాళ్లని నిద్రచ్చేటప్పుడు చెప్పే ఏడు చేపల కథలో ఎంత
అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకెండలేదు? అంటే.. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంది. గడ్డిమేటా గడ్డి మేటా ఎందుకడ్డం వచ్చావు అంటే.. ఆవు మెయ్యలేదంది. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే.. గొల్లవాడు మేపలేదంది. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదంటే.. అమ్మ అన్నం పెట్టలేదన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదంటే.. పిల్లవాడు ఏడ్చాడు అంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడ్చావంటే.. చీమకుట్టింది అన్నాడు. చీమా చీమా ఎందుకు కుట్టావు? అంటే.. నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా అందా చీమ. ఇదీ స్థూలంగా కథ. ఇందులో ఉండే అంతరార్థం తెలియాలంటే స్థూలంగా చూస్తే కనబడని చిక్కుముడి విప్పాలి. కథానిర్మాణంలో ఎక్కడో ఏదో లోపమో, అనౌచిత్యమో ఉంటుంది. అక్కడ ఆగి సూక్ష్మ దృష్టితో చూస్తే ఆ చిక్కుముడి విడిపోతుంది. రాజుగారికి కొడుకులుండడం, వాళ్లు వేటకు వెళ్లడం మామూలు విషయమే కానీ.. రాజుగారి కుమారులు వేటకెళ్లి చేపలు తేవడమేమిటి? రాజకుమారులు వేటకు వెళితే సింహాన్నో, పులినో వేటాడి తెస్తారు. అవి దొరక్కపోతే ఒక లేడినైనా తెస్తారు. కానీ చేప నెందుకు తెస్తారు? కథలో కీలకం అంతా అక్కడే ఉంది.
నిజానికి తెచ్చినవి చేపలు కావన్నమాట. మరేమయ్యుంటాయి? అని ఆలోచిస్తే ఎవరో ఒకరికి తోచకపోదు. ఏడు చేపల్లో ఎండిన ఆరు చేపలే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు). ఎండని ఏడవ చేపే ఈ ఆరింటికీ పుట్టినిల్లయిన మనస్సు.
ఈ దృష్టితో కథ అంతటినీ మరో సారి తరచిచూస్తే అనర్ఘరత్నాలన్ని గనిలోంచి తమంతతామే బయటకు వస్తాయి. చేప ఎండకపోవడం అంటే మనస్సు నశించకపోవడం. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంటే అజ్ఞానం గడ్డిమేటులా పేరుకుపోయిందని. గడ్డిమేటుని ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేయ్యలేదు అని! గొల్లవాడు మేపలేదు అంటే.. ఏ గురువూ జ్ఞానోపదేశం చెయ్యలేదు అని(జగద్గురువు శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా). అమ్మ అన్నం పెట్టలేదు అంటే.. మనకు జ్ఞానోపదేశం చెయ్యాల్సిందిగా అమ్మవారు ఏ గురువుకూ చెప్పలేదని! పిల్లవాడు ఏడ్చాడు అంటే.. ఇంకో భక్తుడు మనకంటే ఎక్కువగా భగవత్ సాక్షాత్కారం కోసం తపిస్తున్నాడని. చీమ కుట్టింది అంటే.. సంసారతాపత్రయం అనే విషపు పురుగు కాటేసిందని. బంగారుపుట్టలో వేలు పెట్టడం అంటే సంసారం మట్టిపుట్టే అని తెలిసి కూడా బంగారు పుట్ట అని భ్రమించి అందులో ప్రవేశించామని. ఇదీ కథలో అంతరార్థం. ఇంతటి గొప్ప కథని కాలక్షేపం కథగానో, ‘పనెందుకు చెడి పోయింది?’ అంటే ఎవరిమీదో వంకపెట్టి తప్పించుకోడానికి ఉపయోగించే కథగానో భావించడం ఎంత పొరపాటు!!
[
*ఎవరు తీసిన గోతిలో*...
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
భక్త తుకారాం పాండురంగడి భక్తుడు. నిరంతరం దైవ నామ స్మరణలో గడిపేవాడు. దేవుణ్ణి కీర్తిస్తూ అభంగాలు రచించి గానం చేసేవాడు.
తుకారాం భక్తి ప్రపత్తులకు ఆకర్షితుడయ్యాడు ఆ వూళ్ళోని ఒక భక్తుడు. అతడు తరచుగా భక్త తుకారాంని ఇంటికి ఆహ్వానించి అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాడు.
అలా తుకారాం వచ్చి భర్తను కలవడం భక్తుని భార్యకు నచ్చేది కాదు. తన భర్త తుకారాంని కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ తనను పట్టించుకోటం లేదని బాధపడేది. కొన్నాళ్ళకు ఆ బాధ కాస్తా కోపంగా మారింది. భక్త తుకారాం మీద పగ తీర్చుకోవాలన్నంత కసి పెరిగింది ఆమెలో.
ఒక రోజు ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు తుకారాం. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండగా భక్తుడి భార్యకు మనసులో అప్పటికే ఉన్న కోపం తారాస్థాయికి చేరుకుంది.
ఎలాగైనా తుకారాంని తమ ఇంటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక గిన్నెలో నీరు నింపి పొయ్యి మీద బాగా మరిగించింది. ఆ వేడి నీరుని తుకారాం కాళ్ళ మీద పోసినట్టయితే తన పగ చల్లారుతుందని తరువాత నుండి తుకారాం బాధ తప్పి పోతుందని అనుకుందామె.
వేడి నీరున్న గిన్నెను గుడ్డతో పట్టుకుని వంటగది నుండి బయటకు వచ్చి నడుస్తుండగా అనుకోని విధంగా ఆమె కాలు జారి క్రింద పడింది. మరుక్షణం గిన్నె లోని వేడినీరు ఆమె ఒంటి మీదనే చిలికి ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. బొబ్బల బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ అరిచింది భక్తుని భార్య.
భార్యకు ఏమైందోనని భక్తుడు ఆందోళన చెందుతుండగా అతడితో బాటూ తుకారాం కూడ లోపలకు వెళ్ళాడు. అక్కడ భక్తుడి భార్య బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమెకు జరిగిన ప్రమాదం చూసి చలించిపోయాడు తుకారాం. భగవంతుని స్మరిస్తూ ఆమె శరీరం మీద స్పృశించాడు. తుకారాం చేయి ఆమెను తాకగానే ఆమె బాధ మటుమాయమై పోయింది. అంతే కాకుండా కాలిన బొబ్బలన్నీ మాయమై పోయాయి.
తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ భక్త తుకారాం పాదాలపై పడి క్షమించమని వేడుకుంది . విశాల హృదయం గల తుకారాం ఆమెను క్షమించాడు. తనను పాండురంగడే కాపాడాడని తుకారాం మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకున్న భక్తుని భార్య తుకారాంని గౌరవించడం నేర్చుకుంది. తరువాత నుండి భర్తను తుకారంతో వెళ్లేందుకు ప్రోత్సహించింది.
No comments:
Post a Comment