[
నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...?
_**మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*_
_*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*_
_*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_
_*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_
_*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_
_*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో 8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_
_*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_
_*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_
_*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_
_*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_
_**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.*_
_**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_
_**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*_
_**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_
_**సర్వే జనా సుఖినోభవంతు.*
[ *🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 74 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 27 🌴*
27. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ||
🌷. తాత్పర్యం :
*పుట్టిన వానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింప రాదు.*
🌷. భాష్యము :
కర్మానుసారము ప్రతి యొక్కరు జన్మింప వలసి యున్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి వేరొక జన్మ నొందవలసి యుండును. ఈ విధముగా జనన, మరణచక్రములో ప్రతియోక్కరు ముక్తి యనునది లేకుండా పరిభ్రమింతురు.
ఇట్టి జననమరణచక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటివానిని ప్రోత్సహించునది కాదు. కాని అదే సమయమున అట్టి హింస మరియు యుద్ధము లనునవి మానవసంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకు అనివార్య అంశములు కాగలవు.
శ్రీకృష్ణభగవానుని వాంఛ అయినందున కురుక్షేత్రయుద్ధము అనివార్యామై యుండెను. అంతియేగాక ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విధ్యుక్తధర్మమై యున్నది. తానూ విధ్యుక్తధర్మమునే నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందులకై తనవారి మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను.
ధర్మమును త్యజించి తద్ద్వారా పాపమును పొందుట అతనికి ఏమాత్రము తగదు. అటువంటి పాపము విషయమున అతడు మిగుల భీతుడై యున్నాడు. విధ్యుక్తధర్మమైన యుద్దమును విడునాడుట ద్వారా ఎన్నడును అతడు తన బంధువుల మరణము ఆపలేడు. పైగా అధర్మమార్గమును ఎంచుకొనుట వలన అతడు పతనము నొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 🌹🌹🌹🌹
[08/08, 4:50 am] On Sriram**: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 471 / Vishnu Sahasranama Contemplation - 471🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻471. వత్సలః, वत्सलः, Vatsalaḥ🌻*
*ఓం వత్సలాయ నమః | ॐ वत्सलाय नमः | OM Vatsalāya namaḥ*
వత్సాంశాభ్యాం కామబలే ఇతి లచ్ప్రత్యయే కృతే ।
నిష్పాదితో వత్సలోఽయం భక్త స్నేహితయా హరిః ॥
'వత్స' అను ప్రాతిపదికముపై ల(చ్) ప్రత్యయము రాగా వత్సల అగును. భక్తుల విషయమున ఆ హరికి స్నేహమూ, ప్రీతి కలవు. ఆందుచేత ఈతను 'వత్సలః'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹.
स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥
స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥
Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
[s...
🌹 🌹 🌹 🌹 🌹
[08/08, 4:50 am] On Sriram**: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 55 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. 🍀*
చైతన్యంతో వున్న మనిషిని, ధ్యానంతో వున్న మనిషిని ఏదీ దారి మళ్ళించ లేదు. కారణం అతను అన్నిట్నీ పరిశీలిస్తాడు. ఫోను శబ్దాన్ని, పసిబిడ్డ అరుపును, పక్కింటి వాళ్ళ మాటల్ని, సౌండు పెరుగుతున్న వాళ్ళ రేడియో శబ్దాన్ని వింటాడు. దాంతో అతనికేమీ అవసరం లేదు. అతను నిశ్శబ్దంగా, నిర్మలంగా వుంటాడు. అన్ని దిశలకూ తలుపులు తెరిచి వుంటాడు. ఏమి జరిగినా, ట్రైన్ శబ్దాన్ని, విమానం శబ్దాన్ని, కోకిల పాటను అన్నిట్ని వింటాడు. ఏదీ అతన్ని ఆటంకపరచదు. అట్లా వింటూ పోతూ వుంటే తనని తడుతున్న చప్పుడుని అతను గుర్తిస్తాడు.
నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. ఆ స్వచ్ఛమైన చైతన్యం నీ పుట్టుకకు ముందు వుంది. నీ మరణానంతరం వుంటుందని గ్రహిస్తావు. అదే శాశ్వతత్వం. అదే అనంత ఆవిష్కారం. మరణం లేని దాన్ని కనిపెట్టడమంటే శాశ్వతత్వాన్ని కనిపెట్టడమే.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
[08/08, 6:18 am] . Mallapragada: ఆది దేవ ఆది పురుష వందనం
ఆదు కొమ్ము ఆశ తీర్చు నందనం
వేది కయ్యె వేకు వాన చందనం
వాది లాగ పల్కు చున్న బంధనం
[08/08, 6:29 am] . Mallapragada: పేరుకు పేరుకున్ మరియు పేదల పెద్దల కొత్త వేడుకల్
మార్పులు తీర్పులన్ మరియు మంచియు చెడ్డయు ప్రశ్న వచ్చుటన్
వారికి వారికిన్ మరియు వారికి వారికి వారి వారికిన్
దారియు పొందుచున్ మరియు గాలికి వానకు వేడి శీతలమ్
[08/08, 6:55 am] Mallapragada Sridevi: India’s 🇮🇳 Olympics Medals (by editions)
1896🥈🥈
1928🥇
1932🥇
1936🥇
1948🥇
1952🥇🥉
1956🥇
1960🥈
1964🥇
1968🥉
1972🥉
1980🥇
1996🥉
2000🥉
2004🥈
2008🥇🥉🥉
2012🥈🥈🥉🥉🥉🥉
2016🥈🥉
2021🥇🥈🥈🥉🥉🥉🥉
Highest this year
[08/08, 7:20 am] Mallapragada Sridevi: చెట్టు లాగ చుట్టి సేవ చేయు
గట్టు మార గుండు నట్లు చూడు
రట్టు అనకు రమ్య మగుట చేయు
పట్టు వీడి బెట్టు చేయ కుండు
ఒట్టు నేర్పు ఓనమాలు రవళి
[08/08, 7:39 am] Mallapragada Sridevi: ముర్తీభవించే వినయాను
బంధం
ఆర్తానునాదం సహనమ్ము బంధం
కూర్మావతారం క్రమబధ్ధ బంధం
మార్తాండదేవం కమలాప్తబంధం
[08/08, 8:12 am] . Mallapragada: పతకాలు సాధించు దేశపు పర్వాలు పండుగగా
పెద్దల ప్రశంస పరముగా పిన్నులు ఉత్సాహమ్ము
ఆటల పోరులో భాగంగా భారతీయ ప్రతిభా
బహుమతులుతొ వెల్లువ విరిసే బ్రహ్మండమందు
[08/08, 8:13 am] . Mallapragada: పతకాలు సాధించు దేశపు పర్వాలు పండుగగా
పెద్దల ప్రశంస పరముగా పిన్నలు ఉత్సాహమ్ము
ఆటల పోరులో భాగంగా భారతీయ ప్రతిభ
బహుమతులుతొ వెల్లువ విరిసే బ్రహ్మండమందు
ఏం స్వాములు ఎటువైపు చూస్తున్నారు.
------------------------------
ఓపిక చేసుకుని...
ఈ చిన్న కథను చదవండి.
ఓ దేశాన్ని పాలించే రాజుకు మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉండేవి.
అవేమిటంటే.
1.దేవుడు ఏ వైపున చూస్తూంటాడు?
2.దేవుడు ఎక్కడ ఉంటాడు?
3.దేవుడు ఏం పని చేస్తూవుంటాడు?
ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.
తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను,
శాస్త్రకారులను,మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని,
వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు.
సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని కూడా చెప్పాడు.
దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.
ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.
రాజాస్థానం చేరుకొన్నాడు.
రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.
పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు.
చెప్పేవాడు గురువు
వినేవాడు శిష్యుడు కనుక
గురువు పైన ఉండాలి,
శిష్యుడు క్రింద ఉండాలి’
అని నియమం పెట్టాడు .
దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు.
పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు.
మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడా పశువుల కాపరి.
మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు?
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.
వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.
మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
అన్నివైపులకు చూస్తోందని జవాబిచ్చాడు రాజు.
ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి ఆ పరమాత్మే.
మరి ఇక రెండవ ప్రశ్న.
దేవుడు ఎక్కడ ఉంటాడన్నాడు రాజు.
సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి.
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.
పాలను బాగా మరుగబెట్టాలి.
వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి.
పెరుగు సిద్ధం అవుతుంది.
దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుందన్నాడు రాజు.
సరిగ్గా చెప్పారు మహారాజా!
అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి
మనస్సు అనే తోడు వేసి
స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును
సాధన అనే కవ్వంతో చిలికితే
జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుందన్నాడు కాపరి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
ఇక చివరి ప్రశ్న.
దేవుడు ఏం చేస్తాడు? అని.
నేను పశువుల కాపరిని మీరు మహారాజు
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు.
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశాడు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం
దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పనన్నాడు.
సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరికి పాదాక్రాంతుడయ్యాడు.
పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
శుభం భూయాత్! 🙏
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 123 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 100. శంబళ 🌻*
శంబళ, ఒక దివ్యాశ్రమము. భూమిపై జరుగు దివ్య కార్యక్రమములకు ప్రధాన కేంద్రము. అన్ని ఆశ్రమములకాధారము. దివ్య జీవనులకు శంబళ దివ్యానుభూతి. శాశ్వత సత్యము. ఇతరులకు అది పుక్కిటి పురాణము. శంబళను గూర్చి అనేకానేకములుగ వదంతులున్నవి. కొందరికది, మరుగుపడిన దివ్యసంపద. మరికొందరికి అది భూగర్భితమైన ప్రాచీన గ్రామము. ఇంకొందరికి అది ఆకసమున తేలుచుండు సూక్ష్మమగు ఆశ్రమము. తెలిసినవారు శంబళను భూమికి దివ్యరాజధానిగ తెలుపుదురు.
అందు భూమిని పాలించు ఏకైక చక్రవర్తి యగు సనత్కుమారుడు, వసించియున్నాడని భావింపుడు. అతడు శ్రీకృష్ణుడు భూమిపై సంచరించినపుడు, ప్రద్యుమ్నుడై అతనికి జన్మించినాడని తెలుపుదురు. శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసిన వెనుక మరల సనత్కుమారునిగ స్వస్థానమున నిలచి పరమ గురువుల పరంపరకు అండగ నిలచియున్నాడని కూడ తలతురు. అతడే భూమిని, భూమి జీవులను పరిపాలించుచు వారి పరిణామమునకై కృషి సలుపుచున్నాడని భావింతురు.
సనత్కుమారుడు సనక సనందనాదులతో నొక త్రిభుజముగ నేర్పడి బ్రహ్మలోకము నుండి భూలోకము వరకు నొక చైతన్య సూత్రమును సంధించియుంచినాడని, తత్కారణముగ భూమి జీవులు బ్రహ్మలోకమునకు చేరుటకు వలసిన మార్గము తెరచి యున్నదని మైత్రేయాదులు తెలుపుదురు.
అతడే ఈ భూమికి జీవమని, ప్రధాన చేతనమని, మేము తెలిసియున్నాము. అతడు మైత్రేయునికి కొండంత అండగ నిలచి అతని ఆశయ పరిపూర్తికై వలసిన సహాయ సహకారము లందించుచు అనాదిగనున్నాడు. అతడు చక్రవర్తి. మైత్రేయుడు గురువు. ఒకరు రాజు, మరియొకరు పురోహితుడు. మేమందర మతని ఋత్విక్కులము. మీరందరతని పిల్లలు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[08/08, 4:50 am] On Sriram**: *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 298 / Sri Lalitha Chaitanya Vijnanam - 298 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*
*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*
*🌻 298. 'నారాయణీ'🌻*
దివ్యజలములు నివాసముగా గలది అని అర్థము. దివ్య జలములనగా సృష్టి కాధారభూతమైన, అనంతమైన తత్త్వము. అది నీలి తరంగమువలె అనంతమై యుండును. ఇవియే సృష్టికి మూలము. వీనిని నారములని కూడ పిలుతురు. వీనియందు తేలుచు నుండునది శ్రీదేవి కనుక నారాయణి అయినది. నారాయణు డన్ననూ, నారాయణి అన్ననూ ఒక్కటియే. పురాణములందు నారాయణుని సహోదరి కనుక నారాయణి అనిరి. అట్లే శివునికి నారాయణుడను పేరు కలదు. అతని భార్య గనుక నారాయణి అని కూడ శ్రీమాత నందురు.
పద భేదము వలన తత్త్వ భేదము, అవగాహనా భేదము కలుగరాదు. సృష్టి కతీతమగు జలములను నివాసముగా గల స్థితి ఇది. శ్రీ లక్ష్మిని, పార్వతిని 'నారాయణి' అను నామముతో పిలుతురు. అట్లే విష్ణువుని, శివునిగూడ 'నారాయణుడు' అని పిలుతురు. నారముల నధిష్ఠించి యుందురు గనుక వీరు నారాయణులు. (నారాయణ అనునది ఒకటియే. నారాయణులనుట అవగాహన కలిగించుటకు.)
నరులు కూడ నారముల నుండి వచ్చినవారే కనుక వారును శాశ్వతులే. 'నర' అన్నను 'నారీ' అన్ననూ ఒక్కటియే. 'నారాయణ', 'నారాయణి' వలెనే, నర, నారీ పదము లేర్పడినవి. ఈ శబ్దములన్నిటి యందు మూలశబ్దము 'నర' శబ్దము. 'ర' అనగా నశించునది. 'నర' అనగా నశింపనిది. 'నారములు' నశింపనివి. అవి సృష్టికి ముందు, లయమునకు వెనుక కూడ నుండును. కనుక నారాయణి, నరులు ఎప్పుడూ నుందురు.
నారాయణునకు, నరునకు వ్యత్యాసము అయనము అను శబ్ద మొకటియే (నర + అయనము = నారాయణము). అయనము అనగా ఆరోహణము లేదా అవరోహణము . (దక్షిణ + అయనము, ఉత్తర + అయనము).
నరులు సృష్టి యందు అవరోహణము చెందుట, ఆరోహణము చెందుట యుండును. నారాయణుడట్లు అవరోహణ, ఆరోహణములు లేక, వాని నధిష్ఠించి నడిపించు వాడుగ నుండును. శ్రీమాత పరముగ చెప్పునపుడు నారాయణి సృష్టి స్థితి లయములను గావించు చున్నదని తెలుపుదురు. అందరునూ పూజించునది, పూజించవలసినది 'నారాయణి' లేక 'నారాయణు'లనే. ఈ పూజనము తత్త్వపరము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹
🌹 🌹 🌹 🌹 🌹
మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము.
మంచిని నేర్చుకుందాము..
మంచిని ఆచరించుదాము.
మంచిని అందరికి పంచుదాము.
మంచి పేరుతో మరణించాలి. ----------------------------
*చుక్కల అమావాస్య రేపటి రోజు ఏం చేయాలి*
ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...
హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.
ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా *‘చుక్కల అమావాస్య’* పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !
ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.
--(())--
కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు
నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి
కలతపడటమూ ఉంటుంది
దానికి నివారణోపాయం
మనోధైర్యంతో ఎదుర్కోవడమే
సంయమనంతో సమాధానపడటమే
అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది, ఎగిరిపోతుంది. కష్టం కాలంలాంటిది
కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే
దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో
సంభవించిన కష్టమూ కదిలిపోతుంది
జీవితం చాలా విలువైంది
నిజానికి విలువ కట్టలేనిది
జీవితంలోని ప్రతిక్షణం కూడా
ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు ?
మనం లోతుగా ఆలోచించాలి
కష్టాలు, కన్నీళ్లు... ఇవన్నీ అధిగమించగలిగినవి కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు
ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు. కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం
మన ప్రగతి ఆగిపోకూడదు
ఏ కష్టం కోసమైనా సరే
జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది
కొత్త క్షణం వస్తుంది
దానితోపాటే కొంత సుఖం రావచ్చు
కొత్త సుఖం రావచ్చు. పోనీ...
కనీసం కొత్త కష్టమైనా రావచ్చు
వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన
కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా ?
అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక... ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన
జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు
లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు
కాదు. మార్పు ప్రకృతి సహజం
రుతువులు మారతాయి
రాత్రింబవళ్లు మారతాయి
సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే
పిల్లలు పిల్లకాలువలో వేసిన
కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది
మనం పిల్లల్లా వినోదంగా చూడాలి
వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని తడిసిపోతుందని. అయినా ......
క్రీడావినోదం కావాలంటే
ఆ కష్టానికి వెరవకూడదు
ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి
పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి
మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు
టైటానిక్ చేసినంత ఉత్సాహంతో.
మనం పిల్లలపాటి చేయమా ?
ఆ మాత్రం అనర్థాలను
ఆటంకాలను అధిగమించలేమా ?
దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే
స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు
అది సుఖమైనా, కష్టమైనా
కష్టాన్ని కదిలిపోతున్న
క్షణంతోపాటు మరచిపోవాలి
కదిలిపోతున్న క్షణాన్ని మనం
మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం
పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం
అది సరికాదు
మనముందు ఎవరూ ఆపలేని
మరో అద్భుత క్షణం ఉంది
మరెన్నో అమృత క్షణాలున్నాయి
వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన
క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం
నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు
రాజు సానం
*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు*
*అమ్మ భాషను మరవొద్దు*
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి.
మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21 నే ఎందుకు జరుపుకోవాలి..?
మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారటా అందుకే ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో (నవంబర్ 17, 1999)న ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది. ‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్. పారిస్లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్షాప్ జరగనున్నాయి. ‘భాషల లెక్కింపు’ పై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
*తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం*
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది.
అయితే ఈ ఇంగ్లిష్ భాష నేర్చుకోవటం అన్నది అవసరం మాత్రమే, విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.
[
*నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం*.
భాష.. మనం మాట్లాడే పదాల కలయిక.. భావాలను తెలపడానికి, ఎదుటివారికి మన మదిలో మాటలు చెప్పడానికి ఉపయోగపడే సాధనం. కాగా నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అన్ని భాషల్లో తెలుగు భాష స్థానం ప్రత్యేకం. మన మాతృభాష, అచ్చమైన, స్వచ్చమైన పదాల మిళితం.. అందమైన సరస్సులో విరబూసిన తామర పువ్వుల సోయగం.. తెలుగు కవుల హృదయాల నుండి జారువాలిన మన భాషను వర్ణించడం ఎవరి తరం కాదు.. అలాంటి మన దేశంలో ప్రస్తుతం తెలుగు కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎంతో కాలంగా మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు వారి ఆంగ్ల భాషను మనమీద రుద్దిపోయారు.
అభివృద్ధి అనే పేరుతో ఆంగ్లం మోజులో అమ్మ భాషను విస్మరిస్తున్న మన సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ప్రపంచంలో మొత్తం 6000 భాషలు ఉన్నాయి. అందులో చాలా భాషలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. 1952 ఫిబ్రవరి 21 న బెంగాలీ భాష ఉద్యమ అల్లర్లలో నలుగురు యువకులు మృతి చెందడంతో ఆ రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 'అ' అక్షరం తో మొదలయ్యే తెలుగు లో అమ్మదనం, కమ్మదనం కలిపిన పదాల సమ్మేళనం మరుపులేని జ్ఞాపకం. అలాంటి తెలుగు మాట్లాడాలంటే చాలా మంది అవమానంగా భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తమ మాతృభాషా కోసం ఎంతో పరితపిస్తుంటే మనం మాత్రం వెగటుగా చూడటం భాదాకరమైన విషయం.
బ్రతకడం కోసం పరభాషను నేర్చుకోవడంలో తప్పులేదు. అలాగని మన భాషను విస్మరించడం తగదు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను చేపట్టిన సమాజంలో సామాజిక స్పృహ లేకపోతే ఎన్ని కార్యాలు చేసిన అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. అందుకే మనం మేల్కోవాలి... మన భాషను మాట్లాడుదాం.. తెలుగుని వెలుగుల చాటుదాం.. ఆచరిద్దాం..ఆలోచించండి
[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలతో శీర్షిక :తేటతెనుగు భాష నా తెలుగుభాష అచ్చమైన భాష.. స్వచ్ఛమైన భాష.. యాబదారు అక్షరాల .. తేనెలొలుకు భాష .. తేటతెనుగు భాష నా... తెలుగుభాష...అచ్చులతో గుణింతాలు..హల్లులతో ఒత్తులు అందమైన ఛందస్సు... సరసమైన సంధులు వెన్నలాంటి భాష నా... తెలుగుభాష...
భక్తిభావమైన విభక్తులు... సాటిలేని సమాసాలు అందమైన అలంకారాలు... ప్రకృతీవికృతుల పరిమళించు భాష నా... తెలుగుభాష... అసమాన ఉపమానాలు.. బాషాకీర్తి పెంచు భాషాభాగాలువ్యాకరణాలతో కూడిన నుడికారాలు గలభాష మధురమైన భాష నా మాతృభాషఅష్టావధానం”, “శతావధానం” “సహస్రావధానం” “సమస్యాపూరణం నా తెలుగు భాషకే మణిహారాలైన అరుదైన భాష నా... తెలుగుభాష...
స్పష్టత, శ్రావ్యత మాధుర్యం, గాంభీర్యం మాండలీకాలతో మధురిమలొలకించు మధురమైనటువంటి మాతృభాష అమ్మపలుకుల భాష నా తెలుగుభాష..ప్రాచ్య ఇటలీ పేర ప్రభవించు నా భాష పలుకు పలుకు లోన తేనెలొలుకు భాష అన్ని స్వరాలకు అనువైన భాషిదిమధుర మైన భాష నా తెలుగుభాష తెలుగుబాషలోని తేటతెల్లపదము వ్యాకరణముతోటి వాసికెక్కి పద్యసంపదున్న పదునైన బాషరా తేనెపలకుల భాష నా.. తెలుగుభాషమరువకండి మీరు మాతృభాషనెపుడు భావివార్కితెలుపు భాద్యతెరిగి మధురమైనభాష మన తల్లిభాష తేటతెనుగుభాష నా... తెలుగుభాష
✍🏻గోగులపాటి కృష్ణమోహన్
[*
No comments:
Post a Comment