🕉️ వైశాఖ పురాణం 5 వ అధ్యాయము 🕉️
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
🌻 వైశాఖమాస విశిష్టత 🌻
💫🌹నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా! శ్రద్దగా వినుము.
💫🌹కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి.
💫🌹దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను.
💫🌹వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.
💫🌹ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.
💫🌹సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు.
💫🌹సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు.
💫🌹వ్యగ్రులై ఏకాగ్రతలేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు.
💫🌹శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు.
💫🌹స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును.
💫🌹సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు.
💫🌹అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు.
💫🌹పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.
💫🌹అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును.
💫🌹ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును.
💫🌹భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును.
💫🌹సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును.
💫🌹అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.
💫🌹ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.
💫🌹శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును.
💫🌹అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు.
💫🌹సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును.
💫🌹పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాసవ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు.
💫🌹కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును.
💫🌹అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.
వైశాఖ పురాణం అయిదవ అధ్యాయము సంపూర్ణము
🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏
సీతాపతీ పద్య కావ్యము
సీసము
నీపదమంటిని - నీప్రేమ నాకిమ్ము
నీ పదములెచాలు- నీరజాక్ష
నీపదధూళులే - నాకును పదివేలు
నీకోవెలయె నాకు - నిత్య దీక్ష
నువు కనబడితివి - నేను ను కనలేను
నిముషము మనలేను - నిను విడిచియు
నీ దాసులకు రక్ష - నాబ్రతు కొక నావ
నడిపించె తండ్రివి - నీవె రామ
తేటగీతి
మానవత్వ మహిమ మనసున నిలిపియు
కరుణ రసము తెలిపి కాపు కాయు
జీవి తాన మంచి చైతన్య మును యిచ్చి
వజ్ర సాన వల్లె మెరుపు తెచ్చె
*****
నాతో..నా శ్రీమతి.ప్రాంజలి ప్రభలు..21
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఏవండోయ్ శ్రీ వారు మీకు తెలుసా
తెలుసా అని అనే బదులు తెలిసినది కక్కేస్తే ఒకపనైయ్ పోతుంది
పనివివరం తెలుసుకోవాలని అనుకోవు ఏదోపనిచేయబోయి మరేదో పనిచేస్తావ్ చెయ్యి కోసుకుంటావ్ ఏమన్నా అంటే అరుచు కుంటావ్.
ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా?
అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు
వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.పక్కింటిలో మేళం మ్రేగితే ఏడ్చే వారు.
*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది. శుభ్రం గా ఉన్నా నచ్చదు. తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగితే నే కాని తృప్తి పడరు
*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖ మెక్కడ. ప్రతి విషయంలో తప్పుపడతాడు సంతోషమోచ్చినా ముందే ఏడుస్తాడు ఎందుకొచ్చిందాయని
*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోష మెక్కడ.
బుల్లి అరచి నా, చీమ కుట్టినా, మంచం కిర్రన్నా, పళ్ళు కొరికినా, తుమ్మినా దగ్గినా ఒకటే అరుపు దానిలో కూడా రౌద్రం
*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం. పెళ్ళాం బయటికి పోయినా, మంచి చీర కట్టినా, పిల్లలు ఏడ్చిన అనుమానం
*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా. పెళ్ళాం సంపాదన పై, ఇతరులను మోసపు సంపాదన యే లక్ష్యంగా జీవించేవాడు. అలా చేయక పోతే నిద్రే పట్టదు.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు నా చేయి కోసుకుంది కదా నా మనసు ఎలాంటి చెప్ప గలవా
ఆ చెప్ప గలను నేను చేయగలనని ధీమా వయసు ఉడికాక ఆధీమా తగ్గించు కుంటే మంచిది
అవునే అది ఎలా తగ్గించుకోవాలి ఇలా..
ఎలా...
ముందు కాఫీ తాగితే తెలుస్తుంది కాస్త ఓపిక వస్తుంది ....
మానవత్వం అంటే ఏమిటి? మానవత్వం మరియు కరుణ ఏమిటి?
తత్వశాస్త్రంలో, మానవత్వం అనేది ఒక వ్యక్తి సాంఘిక స్థితి , లింగం, జాతీయత మరియు ఇతర వ్యత్యాసాలతో సంబంధం లేకుండా మరియు దానిలో విలువైనదిగా వర్ణించే ఒక స్థానం.
మనుషుల జీవితం మంచిది మరియు చెడు ఏమిటో గుర్తించడంలో సహాయపడే కొన్ని నైతిక నియమాలపై ఆధారపడి ఉంటుంది. సమాజపు అభివృద్ధికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మానవుడు - మనిషి యొక్క అంతర్గత ప్రపంచం, ఆత్మ యొక్క స్థితి, అదృశ్య రూపాన్ని వర్ణిస్తుంది. ఆహ్లాదకరమైన ప్రవర్తన ఎల్లప్పుడూ పరిసరాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది మరియు అనుకూల వైఖరిని కలిగి ఉంటుంది. ఇతర వ్యక్తుల చింతలకు మర్యాద మరియు ప్రతిస్పందనలు ఆధునిక ప్రపంచంలోని నాగరికత అభివృద్ధికి గురైన భావాలను ఒక విభాగానికి రూపాంతరం చేస్తాయి.
మానవత్వం - ఇది ఏమిటి? మానవత్వం మరియు మానవత్వం అంటే ఏమిటి?
ఈ భావన లాటిన్ పదం నుండి ఉద్భవించింది, ఇది "మానవత్వం" గా అనువదించబడింది. మానవ వ్యక్తి యొక్క విలువలను వేరుచేసే వ్యక్తి. స్వేచ్ఛ, అభివృద్ధి, ప్రేమ, ఆనందం మొదలైనవాటికి మానవ హక్కును గుర్తించడం అంటే. అదనంగా, ఈ జీవుల ఏ హింస యొక్క అభివ్యక్తి తిరస్కరణ ఉన్నాయి. మానవాళి భావన ప్రపంచ దృష్టికోణం యొక్క ఆధారం ఇతరులకు సానుభూతి మరియు ఇతరులకు సహాయం చేసే సామర్ధ్యం అని సూచిస్తుంది. మానవత్వం యొక్క అభివ్యక్తి వ్యక్తి యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండరాదని గమనించడం ముఖ్యం.
మానవత్వం. ఇది వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఇందులో అతను ఉన్నతమైన మానవ లక్షణాలను కలిగి ఉంటాడు, దీనిలో ప్రధానమైనది దయగల దయ. మానవజాతి యొక్క లక్షణ సంకేతాలు ప్రజల మధ్య సౌకర్యవంతమైన సంబంధాలను సృష్టించే అంతర్గత సామరస్యం, ఫలితంగా ఆత్మ యొక్క వెచ్చదనం;ప్రతిస్పందన, ఆహ్లాదకరమైన వైఖరి గౌరవం; సౌహార్ద; అంతర్గత సంస్కృతి, ఆహ్లాదకరమైన పెంపకం,సానుభూతి; సహనం; మానవత్వం; విధేయత. మొదలైనవి వ్యక్తులలో స్పష్టంగా కనిపిస్తాయి.
మానవత్వం అంటే ఏమిటి - తత్వశాస్త్రం
తత్వవేత్తల అవగాహనలో, మానవుడు మానవజాతి. లాటిన్ పదం "మానవత్వం" అనేది మానవత్వం యొక్క భావన - ప్రపంచ దృష్టికోణం గ్రహింపు, వ్యక్తిగత స్వేచ్ఛను గుర్తించడం, బహుముఖ అభివృద్ధి, సంతోషం యొక్క పరిస్థితి ఏర్పడింది. సిసెరో మానవాళి విద్య, విద్య యొక్క డిగ్రీ, మానవ సారాన్ని ప్రోత్సహిస్తుంది.
దయ మరియు మానవత్వం రెండు ఇదే భావాలు. వాటిని వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చివేస్తాడు, ఇతరులకు శ్రద్ధ మరియు అవగాహన చూపుతాడు - సామరస్యాన్ని తెస్తాడు, మనశ్శా0తిని ఇచ్చేవాడు , దృఢ నిశ్చయాన్ని కోరుకు0టాడు . మానవత్వం అనేది సహాయం అవసరమైన వ్యక్తికి ప్రేమ మరియు దయ యొక్క చర్య. ఇది విశ్వాసం ఇస్తుంది, ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది, ఒక కష్టమైన సమయంలో ఒక వ్యక్తి యొక్క "నిజమైన" ముఖాన్ని చూపుతుంది.
మానవాళి యొక్క అర్ధం ప్రతి వ్యక్తిలో అభివృద్ధికి ఒక సామర్ధ్యం ఉంది లేదా ఇప్పటికే మానవత్వం ఉంది, దాని నుండి నైతిక భావాలు మరియు ఆలోచన యొక్క నిర్మాణం మరియు అభివృద్ధి జరుగుతుంది. పర్యావరణం, ఇతర ప్రజలు మరియు వివిధ కారణాల ప్రభావాన్ని మినహాయించడం అసాధ్యం, కానీ వ్యక్తి మాత్రమే క్యారియర్ మరియు రియాలిటీ సృష్టికర్త. మానవీయ విలువలు గౌరవం, దయ మరియు మనస్సాక్షిత్వం మీద ఆధారపడి ఉంటాయి.
ఇటీవల, మానవత్వం యొక్క ఆలోచనలు మారాయి, మరియు అది కూడా దాని సంబంధాన్ని కోల్పోయింది, ఎందుకంటే ఆధునిక సమాజంలో యాజమాన్యం మరియు స్వయం సమృద్ధి, అంటే, డబ్బు యొక్క సంస్కృతులు, ముందుకు వచ్చాయి. తత్ఫలితంగా, ఇతర వ్యక్తుల భావాలకు తనను తాను సృష్టించిన వ్యక్తిని, పరిస్థితిని, సమాజాన్ని చనిపోయిన ముగింపుగా నడిపిస్తుందని మనస్తత్వవేత్తలు నమ్ముతున్నారు.
మానవత్వం అనే స్వభావంలో నుంచే మానవుడు అనే మాట రూపుదిద్దుకుంది. మనిషి అనే మాటకు అర్థవంతంగా అందరూ ఉండగలిగితే- ఈ ప్రపంచం అసలు ఇలా ఉండనే ఉండదు. అనేకానేక కారణాల వల్ల, వ్యత్యాసాల వల్ల, ఎవరికి వాళ్లు మనగలగడమే ముఖ్యం అయినందువల్ల, ఉన్న వనరులు అందరికీ సమానంగా దక్కకపోవటం వల్ల- మనిషి ప్రాథమిక లక్షణానికి అప్పుడప్పుడూ గండి పడుతూ ఉంటుంది. పదిమందికి దక్కాల్సిన దానికి ఒక్కడే బొక్కేసి, దాచేసుకునే దౌర్జన్య లక్షణం సమసిపోతే- మానవత్వం గురించి మనం ప్రత్యేకంగా వెతకాల్సి ఉండదు. ఎక్కడికక్కడే, మనిషి ఉన్న ప్రతిచోటా పరిమళిస్తూ ఉంటుంది. అయితే, సమాజంలో ప్రతి మనిషీ, ప్రతిసారీ తన కోసమే ఆలోచిస్తూ ఉండిపోడు. సమాజంలో తానొక భాగం కాబట్టి- సమాజంలోని పరిణామాలకు సహజంగానే స్పందిస్తాడు. తనకు చేతనైన రీతిలో తన భాగస్వా మ్యాన్నీ అందిస్తాడు. ఊహించని ఉత్పాతం ఎదురైనప్పుడు, విపత్తులు తలెత్తినప్పుడు తోటివారికి అవసరమైన సాయం అందించటానికి ఎన్నో చేతులు ముందుకొస్తాయి. ఎంతో సహాయ సహకారాలు వెల్లువెత్తుతాయి. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలూ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు - ఆపన్నులను ఆదుకోవటానికి ఎంతోమంది ముందుకు వస్తారు. వ్యక్తులే కాదు, అనేక సంస్థలూ మానవతా దృక్పథంతో సహాయం అందిస్తాయి.
జీవ కారుణ్యం కలిగి ఉండటమే ఒకప్పుడు మానవత్వం. ఇప్పుడు దాని విస్తృతి మరింత పెరిగింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శాంతి, స్పేచ్ఛ, సౌభాగ్యాలతో బతకాలి. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వమూ, సమాజమూ అందించాలి. అలాంటి కృషి చేసే మానవతావాదుల గురించి మాట్లాడుకోవటానికి, మానవత ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి ఈ చిన్ని ప్రయత్నం.
********
"మానవత్వం – ఆత్మీయత – మనిషి – దేవుడు మధ్య ఉన్న బంధం"
మనిషి అంటే ఎవరో తెలియదు. మతానికి, దేవుడు, అంటే, ఏమిటో తెలుసుకోవాలని లేదు. ఆత్మకు సంబంధించి¸ అనుగ్రహ భాషణలు ఇవ్వడం తప్ప, వేదాంతం, భౌతికానికి, ఆధ్యాత్మికానికి ఉన్నటువంటి ఆచరణాత్మక, వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, క్రియాపూర్వకంగా వివరించుటలేదు. అయినా, ‘జ్ఞానమే సత్యం – మోక్షం’ అని అంటూ, ప్రచారంగా, బోధిస్తున్నారు. తెలియడమే, జ్ఞానంగా భావించినపుడు, జ్ఞానాన్నే, మోక్షంగా భావించినప్పుడు, అసలు అది అంటే ఏమిటో తెలియజేయడమే, విధిగా భావించాలి. మనిషికి, తన మనసుకే, అసలు తానంటే ఏమిటో తెలియని అజ్ఞాన స్థితిలో, అలవాటుగా, ఆత్మ స్థాయిలో – తనకు తానుగా తన మనసును, ‘నేనే బ్రహ్మను’ అని భావించడం – అర్థరహితం. తనలో ఉన్న, జీవాత్మ ఏమిటి, అది శరీరంలో, ఎక్కడ, ఎలా? అని తెలిసీ తెలియని స్థితిలో ఉన్న తాను (మనిషి) అలవాటుగా, విశ్వవ్యాప్త పరమాత్మను గురించి, ముక్తి – మోక్షం గురించి ఊహించడం, ఆత్మ జ్ఞానం అనిపించుకోదు. మానవ మనసు, తన భౌతిక, ఇంద్రియ వికారాలే, గుణాలే, సాకార దేవునికి ఆపాదించడం – మనిషి అలవాట్లే, ఆచారాల పేరున, దేవుణ్ణి, పూజించడం... దేవుణ్ణి – దేవుడి లీలలను మానవాతీతంగా, కీర్తించడం, మనిషికి, స్వార్థంగా, ఉపయోగపడుతుంది. ఈ విధంగా, మాట్లాడుతూ, ఆస్తిక, వ్యతిరేకతగా భావించడంకంటే, అది, ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది, వాస్తవ రీతిగా, పరిశీలన చేసి, నిర్ధారించాలి. మనిషి, అజ్ఞానంతో, అత్యున్నత ఆధ్యాత్మికాన్ని, తన స్వార్ధం కోసం భ్రష్టు పట్టించడం కంటే, సరైన, అవగాహనతో, భౌతికాన్ని, ఆధ్యాత్మికాన్ని, అవలంభించుకోవడం, ఆచరణాత్మకం, చేయగలగాలి.
‘భౌతికాన్ని - ఆధ్యాత్మికాన్ని’, వేరు వేరుగా భావించినప్పుడు – వాటిని, మనిషి – దేవునికి పోల్చవచ్చును. భౌతిక జీవిత ఆధ్యాత్మిక భావన సమన్వయతా మంచికి, మనిషికి, మనిషి గురించి, మానవత్వం గురించి, తెలియాలి. దానితో, మొదటగా, జీవితం, దాని ప్రాముఖ్యత , అర్థం కావచ్చు. అలాగే, ‘దేవుడు అంటే ఏమిటో’, తెలిస్తే, అది ఆత్మీయతా అవగాహనకు, ఆధ్యాత్మికకి దోహదపడతాయి. తత్ఫలితంగా, భౌతిక జీవిత అవలంబనంతో - ఆధ్యాత్మిక అవగాహనతో, ‘మనిషికి - దేవునికి’, దగ్గర బంధం, ఏర్పడవచ్చు. దానితో, మానవ మనసు - దేవుడి ఆత్మ, అనే వ్యత్యాసం లేకుండా, దేవుడి, దైవత్వ పవిత్రత - మనిషిని, ఋషిగా, మారుస్తుంది. తద్వారా, మంచి, జీవితాన్ని, అనుభవించవచ్చు. సామాజిక అత్యున్నత పౌరునిగా - భాధ్యతను తెలిసిన వ్యక్తిగా, వ్యక్తి, వ్యక్తిత్వ పవిత్రతతో, జీవించవచ్చు. దానికి, మనిషి తన మనసును, దేవుడి ఆత్మగా, ‘ఆధ్యాత్మిక’ మనసుగా, పరివర్తనా, స్థాయికి పరిణామ మార్గానికి, ప్రస్థానించాలి. ప్రస్థాన ధ్యానం, దానికి మార్గం. మనసు పట్టుదలే సాధన.
******
ఒక ఎకరా భూమిలో పండిన వాటితోనే సంతృప్తి తో నిత్యాగ్నిహోత్రుడై జీవించు చుండెను. అతనికి ప్రతిగ్రహణమన్న ఇష్టముండెడిది కాదు. ప్రతిగ్రహణ మనగా
ఎవరిదగ్గరంటే వాళ్ళ దగ్గరకి వెళ్లి యాచించుట. వారిది అన్యాయార్జిత ధనమైనచో
తనకు పాపము వచ్చునని అతని అభిప్రాయము.
. మనుచరిత్రలో కూడా ప్రవరుడు కూడా ప్రతిగ్రహణ మన్న యిష్టము లేనివాడే.
యజ్ఞవర్మ భార్య చాలా గడసరి మరియు ధనాశ కలది. ఆమె రోజూ భర్తను భోజరాజు దగ్గరకు వెళ్లి ధనము తీసుకొని రమ్మని వేధించు చుండెడిది. దానికి యజ్ఞవర్మ రాజుల ధనము క్రూర క్రియార్జితము అది తీసుకొన రాదు అనెడివాడు. ఆ విషయమున
భార్యాభర్తలిద్దరూ తరుచు గొడవ పడుచుండెడి వారు.
.
భార్య: భోజరాజు అందరికీ దానము…
*******
సామాన్యముగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆయనకు ఏదీ ఇస్తానని ముందుకు రారు. అదీ కాక సమస్త జగత్తులకూ అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమదగ్గఱ ఏముంటుందనిఅనుకుంటారు కానీ శంకరులు ఈశ్వరుడికి తనమనస్సనే తురగాన్ని ఇస్తాఞి ముందుకొచ్చారు. తన మనస్తురంగాన్ని వాహనంగా స్వీకరింపుమని శివుణ్ణి కోరారు.
ఈశ్వరా! నీవు విశ్వ సామ్రాజ్యాధి నేతవు. నీవు భక్త రక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్నెక్కింౘుకుని వేగంగా తిరుగ లేదుకదా! కాబట్టి నామనస్సనే గుఱ్ఱాన్ని నీకు వాహనంగా ఇస్తాను. స్వీకరింౘు . ఎద్దు కన్నా గుఱ్ఱము వేగంగా పరుగెడుతుంది. కాబట్టి నా మనస్సనే గుఱ్ఱాన్ని ఎక్కి నీపనులు ౘక్కబెట్టుకో ప్రభూ! అన్నారు శంకరులు.
మనస్సు మంచి గుఱ్ఱము వంటిది. గుఱ్ఱములలో ఉత్తమమైనది పంచకల్యాణి. పంచకల్యాణి గుఱ్ఱము నకు ఐదు శుభలక్షణాలుంటాయి. 1) ముఖము 2) గుండె 3) వీపు 4) రెండు పార్శ్వములు మొత్తము ఐదు. మనస్సునకు కూడా మంగళకర లక్షణాలయిన 1)ఈశ్వరుని దర్శింౘడం 2) ఈశ్వరుని కథలు వినడం 3) ఈశ్వర ప్రసాదాన్ని తినడం
4) ఈశ్వర లింగాన్ని స్పృశింౘడం 5) ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణింౘడం వంటి పనులు చేసే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి.
పంచ కల్యాణి గుఱ్ఱము సరస చిత్ర గతులు కలది. అది యజమానియందనురాగము కలిగి అస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలయిన విచిత్రములయిన గమనాలతో సాగిపోతుంది. మనస్సు కూడా నానా విధములయిన పోకడలు కలది. మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే.
ఇక పంచకల్యాణి గుఱ్ఱము "సవేగం" అంటే వేగంగా పోతుంది. మనోవేగం అంటారుకదా! మనం సంకల్పించిన చోటుకి మనస్సు తక్షణం పోతుంది. గుఱ్ఱము సర్వేంగితజ్ఞము పంచకల్యాణి గుఱ్ఱము యజమాని మనోభావం గుర్తిస్తూ నడుస్తుంది. కాగా మనస్సు అందరి అభిప్రాయాలనూ గుర్తింౘ గలిగి నట్టిది.
గుఱ్ఱము "అనఘం" అనగా దోషము లేనిది. మనస్సు పాపరహితము. పుణ్యప్రదమైనది. గుఱ్ఱము ధ్రువలక్షణాఢ్యమ్". అనగా ధ్రువమనే మంచి సుడిని కలిగి యుంటుంది. మనస్సు స్థిరత్వము అనగా అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి యుంటుంది.
ఈవిధంగా తనమనస్సునకు ఉత్తమ అశ్వ లక్షణాలు అన్నీ ఉన్నాయనీ దానిని వాహనంగా స్వీకరించి విహరింపుమనీ శివుని శంకరులు కోరారు. అంటే సదా తనమనస్సులో మెదలుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని మనం గ్రహింౘాలి.
******
ఉద్యోగంలో విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలు!!
భగవద్గీత! ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా... భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం...
అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయడంతో భగవద్గీత మొదలవుతుంది. యుద్ధంలో ఎటుచూసినా తనవారే కనిపిస్తున్నారనీ, వారితో తను యుద్ధం చేయలేననీ అర్జునుడు బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి, పిరికితనానికి లోనుకావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించడమే ధర్మమని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది. తనచుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయంభయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలని నూటికి నూరుపాళ్లూ నిర్వర్తించాలి. ఎలాంటి భయమూ, మొహమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికీ, సంస్థకీ కూడా నష్టం తప్పదు.
మన బాధ్యతని పాటిస్తాం సరే! మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? అన్న బాధ ఎవరికైనా తప్పదు. ‘పనిని సక్రమంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదు’ అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట. ఫలితం ఒకోసారి వెంటనే వస్తుంది, ఒకోసారి చాలా... చాలా ఆలస్యంగా పలకరిస్తుంది. మనవైపు నుంచీ ఎలాంటి లోపమూ లేకుండా, నూటికి నూరుపాళ్లూ ప్రయత్నిస్తే... ఎప్పటికైనా విజయం తప్పదు.
ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది పని చేసే తీరు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తననీ గమనిస్తూ ఉండాల్సిందే! కానీ అది మన ఆలోచనాతీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వల్లా, ద్వేషం వల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు.
భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ‘శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం’ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు, హోదాలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం.
భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు. ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులని కలవడంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు. ఉద్యోగంలోనూ అంతే! చేసే పని గురించి అవగాహన సాధిస్తే, ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం.
Attachment with detachment అనే సూత్రం భగవద్గీతలో స్పష్టంగా కనిపిస్తుంది. నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి. కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారుపడుతూ ఉండేవారికి ఇదో పాఠం. నిన్న చేసిన పని గురించే ఆలోచిస్తూ కూర్చునేవారికిదో గుణపాఠం.
చివరగా ఒక్క మాట! ఒకరు చెడిపోవడానికైనా, బాగుప
డటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే, మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే! అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత.
🌸🌺🌷🙏🏻🌷🌺🌸
ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా,
అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..
లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు.
అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.
ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.
ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు.
త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి..
వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు.
అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి
'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు.
ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు.
ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు.
త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది..
కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప?
అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు.
నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు.
కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.
ముందు సరస్వతీ దేవి నారదునితో..
నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో
"ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.
ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు..
సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...
వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను..
వెళ్ళి చూడమంటాడు.
నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు.
ఆ బాలుడు చదువు రాదని..
తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు.
ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.
పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు..
ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు.
సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు.
ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది.
ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.
ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది. ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.
అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి..
దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది.
దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు.
ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు
''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు.
ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు.
ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు.
అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను.
ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు.
అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది.
బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు.
జగదాంబ ఆజ్ఞానుసారం..
నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం,
సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.
శ్రీ లక్ష్మిలోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ''ఓం శ్రీసతియే నమః''
అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. అదే ''ఓం శ్రీసతియే నమః' అనే మంత్రం.
*****
రామకృష్ణ పరమహంస ఒక రోజు ఉదయం పొలాల గట్ల మీద నడుస్తున్నారు. చేతిలో ఉన్న బుట్టలో బొరుగులను తింటూ, ఆకాశంలో ఎగురుతున్న కొంగల బారును చూస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు అపూర్వమైన తన్మయత్వం కలిగింది. భావ సమాధి స్థితిని పొందారు. ఈ ఘటన ఆయన జీవిత చరిత్రలో ప్రస్తావితమయింది. గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగినట్టు చెబుతారు. జెన్ గురువు హ్యూనెంగ్ జీవితంలోనూ అత్యంత ఆశ్చర్యకరమైన ఇటువంటి అనుభవమే కలిగింది.
హ్యూనెంగ్ పూర్తి పేరు డజియన్ హ్యూనెంగ్. ఆయన నిరక్షరాస్యుడు, అత్యంత సామాన్యుడు. కట్టెలు కొట్టి, అమ్మి జీవించేవాడు. ఒక రోజు సంతలో ఉన్న ఒక వ్యక్తికి కట్టెలు ఇవ్వడానికి వెళ్ళాడు. అది సూర్యాస్తమయ సమయం. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరో పండితుడు బుద్ధ భగవానుడి బోథలు ఉన్న ‘రతన సుత్త’ను పారాయణం చేస్తున్నాడు. దానిలో కేవలం నాలుగు వాక్యాలు హ్యూనెంగ్ చెవిన పడ్డాయి.
ఆ వాక్యాలలోని శక్తి ప్రభావమో... ఆయన పూర్వ సంస్కారాల బలమో కాని హ్యూనెంగ్ బాహ్య స్మృతిని కోల్పోయాడు. రాతి విగ్రహంలా నిలబడి పోయాడు. చీకటి పడింది. బజారులో అంగళ్ళన్నీ మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. సూర్యోదయమయింది. అంగళ్లు తెరుచుకున్నాయి. అందరూ బేరసారాలు చేస్తున్నారు. అయినా హ్యూనెంగ్ కదలలేదు. ఆయనకు నిద్రాహారాలు లేవు. కళావిహీనం కావలసిన ఆయన ముఖం తేజస్సుతో ప్రకాశించింది. మెల్ల మెల్లగా బాహ్య స్మృతి కలిగింది.
ఆ ‘రతన సుత్త’ను ఏళ్ళ తరబడి పారాయణ చేస్తున్న పండితుడు... పండితుడిగానే మిగిలిపోయాడు. కానీ అది విన్న హ్యూనెంగ్లో జ్ఞాన జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆయనలో ఊహకు అందని ప్రశాంతత నెలకొంది. ఆయన కళ్ళు జ్యోతుల్లా వెలిగాయి. కంఠ స్వరం తియ్యదనాన్ని సంతరించుకుంది. వాక్కులు శాంతిమయాలయ్యాయి. హృదయం కరుణాపూరితమయింది.
ఇది గమనించిన పండితుడు ‘‘ఏరా! హ్యూనెంగ్! ఏమయింది నీకు? ఎందుకలా నిలబడ్డావు?’’ అని అడిగాడు. హ్యూనెంగ్ నోరు విప్పాడు. ‘రతన సుత్త’లో తాను విన్న వాక్యాలను గొంతెత్తి పాడాడు. వాటి గురించి వ్యాఖ్యానం ఆయన నోటి నుంచి వరదలా ప్రవహించింది. అక్షరం ముక్కయినా రాని హ్యూనెంగ్ నోటి నుంచి వచ్చిన జ్ఞాన ప్రవాహం ఆ పండితుణ్ణి ఆశ్చర్యపరచింది. ‘‘నువ్వు వెళ్ళి, నా గురువు డామన్ హోంగ్రెన్ను కలువు’’ అని సూచించాడు.
అక్కడి నుంచి హ్యూనెంగ్ నేరుగా డామన్ ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు ‘రతన సుత్త’ మొత్తం బోధించాలనీ, శిష్యునిగా చేసుకోవాలనీ అడిగాడు.
‘‘దక్షిణ ప్రాంతానికి చెందిన అనాగరికుడివి. నిన్ను నా శిష్యుడిగా చేసుకోవాలా?’’ అని మొదట ఎగతాళిగా మాట్లాడిన డామన్ ఆ తరువాత హ్యూనెంగ్ మాటలనూ, వ్యాఖ్యానాన్నీ విని ముగ్ధుడైపోయాడు. తన ఉత్తరాధికారిగా హ్యూనెంగ్ను ప్రకటించాడు.
ఈర్ష్యాపరులు ఇది సహించలేక హ్యూనెంగ్కు హాని తలపెట్టారు. ఈ సంగతి డామన్ గ్రహించాడు. హ్యూనెంగ్ను ఒక రాత్రి బయటకు తీసుకువెళ్ళి, తెప్పలో కూర్చోబెట్టి, నదీ మార్గాన్ని చూపించి, సురక్షిత ప్రాంతానికి పంపాడు. అర్హులకు జ్ఞాన బోధ చేయాలని సలహా ఇచ్చాడు.
సురక్షిత ప్రదేశానికి చేరిన హ్యూనెంగ్ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్కు హాని చేయదలచిన హ్యూమింగ్ చివరకు ఆయన అనుచరుడయ్యాడు. అనుంగు శిష్యుడయ్యాడు. టాయూ పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసిన హ్యూనెంగ్ తన డెబ్భై రెండవ సంవత్సరంలో... వందలాది శిష్యుల కన్నీటి వీడ్కోలు మధ్య తనువు చాలించాడు.
హ్యూనెంగ్ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్కు హాని చేయదలచిన హ్యూమింగ్ చివరకు ఆయన అనుచరుడయ్యాడు.
*****
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేం...
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.
*ఒఖ్ఖ రెండు రూపాయలు* (కథ)
రచన: శ్రీమతి జి యస్ లక్ష్మి.
"నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
"ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే. పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒఖ్ఖ రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?"
సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.
"ఆ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేసాను. ఇంక నాదగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచిపోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.
నిజమే, అమ్మకు డబ్బులెందుకు?
టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది.
"ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒఖ్ఖ రెండు రూపాయలడిగితే..."
"అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయిపోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”
అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేసాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.
నెలలో మొదటి వారం, షాప్ రష్గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి మధ్యమధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది.
రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు.
ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.
"మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేసారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,
"నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ, ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం. అల్లాగే చూసాం. కాని మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏంచేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేసారు.
రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడూ మాకు తినడానికి టైముండేది కాదు, ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.
ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.
"ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.*
*"ఆ! ఏముందోయ్... అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు?" కుశల ప్రశ్నలు వేసారు రామ్మూర్తిగారు.*
*"ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.*
*"ఊ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.*
*"ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ, వాళ్లకి అనిపిస్తుంది కదా, మళ్లీ చిన్న పుచ్చుకుంటారనీ..." సమర్థించుకున్నాడు నూకరాజు.*
*"నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు... చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని, ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన.*
*నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?'* *ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు.* *సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.*
*"నూకరాజూ..."*
*రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.*
*"ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా..." నసుగుతూ అన్నాడాయన.*
*ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా... కొత్తరకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా... ఎలా వుంటాయో రుచి చూద్దామనీ... అంతే. ఒఖ్ఖ రెండు రూపాయలే..."*
*వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు.*
------------------------------------------------------------------------------------------------------------------------
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ..
వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?
జ.: ఉంది.
వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్మెంట్ పొందవచ్చు.
2.వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?
జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.
3.వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందా?
జ.: దీనిపై స్పష్టత లేదు. కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో... కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
4.వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?
జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది
5.వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?
జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
6.ఓవరాల్గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?
జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.
No comments:
Post a Comment