*పూర్వం గురుశిష్యులు చెప్పుకునే మంత్రం.!*
*ఈ మధ్య ఎక్కడ మనం వినడం -చూడటంలేదు..*
ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక.
మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక.
ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక.
మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు
తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.
*భావము.*
ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. అతడు మనల నిరువురను పోషించుగాక.
మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి పని చేయుదుముగాక. అధ్యయనము చే మనమిరువురమును మేథా సంపదను పొందుదుము గాక! మనమితరులను ద్వేషింపకుందుము గాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.
(ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను
ఉదారములైన ఆశయములను ప్రకటించును. )
....
*వివరణ:.💐*
పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ
అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ
వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.పాఠం, అధ్యయనం మాత్రమే కాదు,పాఠం, అధ్యయన౦ మాత్రమే
కాదు.ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే
కాక,ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - నేను చెబితే నువ్వు వినాలి,నేను గెలిస్తే నువ్వు ఓడాలి, నాది పైచెయ్యి నీది కింది చెయ్యి,నేను అంటాను నువ్వు పడు. ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు.తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. కొత్త ఆలోచనలు బయల్దేరినై. వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను,మానవ సంబంధాల్లోను -ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి.
పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత.
కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా?
ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు
తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో,
బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?
అప్పుడే అనిపిస్తుంది, ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మంత్రార్ధాన్ని మననం చేసుకోండి.
ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి.
మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి. మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. .
ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి.
అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో,
నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను.
అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే స్వ-పర భేదం మాయమవుతుంది
స్వ-పర భేదం మాయమవుతుంది.
త్వమేవాహం. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
సర్వే జనా సుఖినోభవంతు..!
....
*రాముడు ఏమి తపస్సు చేశాడు?*
*రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?*
*కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.*
*నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".*
*ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.*
*ఇందులోని విచిత్రమేమిటంటే ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.*
*తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.*
*అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.*
*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః | |*
*అని ఉపనిషద్వాక్యం.*
*ఋజు వర్తనము, సత్య వాక్పరిపాలనము , వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.*
*దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు. మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.*
*కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.^
*అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు. కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".*
*ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.*
......
శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.
శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.
అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.
కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.
........
*కృష్ణపరమాత్మ-* *ఐదుగురు..మాతృమూర్తులు..!*
*1. దేవకి..!*
*వసుదేవుడు సతీమణి అయిన దేవకి.. శ్రీ కృష్ణుడి నిజమైన తల్లి.*
*మధురలో ఆమె సోదరుడు కంసుడు చెఱసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన ఆ కారగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి మాత.*
*దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలికిన మాటలలో.. సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధిస్తాడు.*
*దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా చెబుతారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది.*
*ఈ కారణంగా శ్రీ కృష్ణుడిని దేవకినందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.*
*2. యశోద..!*
*కన్నయ్యను కనకపోయినా కంటికి రెప్పలా చూసుకుంది యశోద. నందుడు-యశోద దంపతులు. వీరితో కలిసి శ్రీ కృష్ణుడు గోకులంలో పెరిగాడు.*
*మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేస్తాడు చిన్ని కృష్ణుడు. భాగవత ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు.*
*చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే.. ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది.*
*3. రోహిణి..!*
*వసుదేవుడు దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకుంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానం.*
*దేవకి-వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు.*
*రోహిణి తన కుమార్తె, కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు.*
*శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడు, ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగ జాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బాహిలిక కుమార్తే అని కూడా అంటారు.*
*4. సుముఖి దేవి..!*
*సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీ కృష్ణుడు.*
*కృష్ణుడు, బలరాముడు, సుదాముడు, సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖి దేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది.*
*ఎందుకంటే ఆమె శంఖాసురుడి అధీనంలో ఉంటుంది.*
*మాధవుడు ఆమెను అతడి చెఱ నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది.*
*అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవదని చెప్పింది. అందుకే కృష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది.*
*5. పూతన..!*
*శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు.*
*పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది.*
*తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని చిన్ని కృష్ణుడిని చంపాలని చూస్తుంది.*
*అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించే పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు.*
*పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది.*
*ఆ సువాసన వాతవరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు.*
[......
*🌻భక్తుని హృదయ నివాసి భగవంతుడు🌻*
🍃🌺అనేక తలలు అనేక ముఖాలు, అనేక కళ్ళు అనేక కాళ్ళతో భగవంతుడు అంతటా వ్యాపించి ఉం టాడు. అన్నింటా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ”సహస్ర శీర్షా: పురుష: సహస్రాక్ష సహస్ర పాద్..” అంటూ పురుష సూక్తం వివరిస్తోంది
🍃🌺భగ వంతుడు ఉండే ప్రదేశాన్ని, మరోవి ధంగా, మరో కోణంలో ఇలా చెబుతారు. భక్తుడి హృదయంలో భగవంతుడు ఉం టాడని, భగవంతుడు భక్తుని హృదయ నివాసి అని అం టారు. భగవంతుడు ఉండే స్థానం విషయంలో పైన చెప్పిన రెండూ భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి. భగవంతుడు సర్వత్రా ఉంటాడని ఓ వైపు చెబుతూనే, మరో పక్క భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటాడు అనే విషయం విన్నప్పుడు/ చెప్పినప్పుడు, ఏమిటీ గందరగోళం అనిపి స్తుంది. పరస్పర విరుద్ధంగా అనిపించే ఈ రెండు విషయా లకు సమన్వయం కుదరక అయోమయంలో పడిపోతాం. విషయం ఏమిటో అర్ధంకాక ఆధ్యాత్మికం అంటే అర్థంకాని బ్రహ్మ పదార్ధంగా భావిస్తాం.
🍃🌺ఓసారి ఓ కుర్రాడికి ఈ సందేహమే వచ్చింది. తల, నుదురు, కాళ్ళు, భుజాలు, చేతులు, పొట్ట, ఇలా ఎన్నో భాగాలు భక్తుడి శరీరంలో ఉండగా, భక్తుడి హృదయాన్నే తానుండే స్థానంగా, ఆ భగవంతుడు ఎందుకు ఎంచు కున్నాడో ఎంతగా ఆలోచించినా అంతు చిక్కలేదు ఆ కుర్రా డికి. ఎందరినో ఈ విషయం గురించి అడిగాడు. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపో యారు. చివరకు ఆ కుర్రా డు తిన్నగా పెద్ద గురువుగారి దగ్గరికి వెళ్లాడు. విషయం అంతా చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయమని గురువుని ప్రార్ధించాడు.
🍃🌺అప్పుడు గురువుగారు. ”వెయ్యి ఎకరాల భూమి ఉన్న ఓ జమిందార్ తనకు ఇష్టమైన చోట తాను నివాసం ఉంటే, అది తప్పని ఆయన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందా?” అని ఆ ప్రశ్నించారు.
”ఆయన స్థలం ఆయన ఇష్టం. ప్రశ్నించే హక్కు ఎవ రికీ ఉండదు.” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పు డు గురువుగారు ”ఆ వెయ్యి ఎకరాల్లో మనం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని, అందులో ఒక ప్రదేశాన్ని చూపించి, అందులో మీరు ఉండండి అని మనం జమిందారుని ఆజ్ఞాపించగల మా? అని మరో ప్రశ్న వేసారు గురువుగారు.
🍃🌺”ఆజ్ఞాపించ లేం” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పుడు గురువు గారు ”అయితే ఆ జమిందారు గాలి, వెలుతురు బాగా వచ్చే అనువైన స్థలాన్ని తానే ఎంచుకుని, తనకు అను కూలమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు . అవునా?” అని ఆ కుర్రాణ్ణి ప్రశ్నించారు. ”అవును. ఆ జమిందారు అలానే చేస్తాడు. అది అతనిష్టం” సమాధానమిచ్చాడు కుర్రాడు.
”అవును కదా! భగవంతుడు కూడా అంతే! సర్వం సమస్తం ఆ భగవంతునిదే కాబట్టి తనకు అనువైన అను కూలమైన చోటు, శుభ్రమైన చోటు, పరిశుద్ధమైన చోటు హృదయం కాబట్టి, భక్తుడి హృదయాన్ని తన నివాస స్థానంగా భగవంతుడు ఎంచుకున్నాడు.
🍃🌺దేవుడు నివాసం ఉండే చోటును నిర్మలంగా పవిత్రంగా స్వచ్ఛంగా భక్తు డు ఉంచుకోవాలి. శరీరం మొత్తంలో స్వచ్ఛంగా ఉంచుకోవ డానికి అవకాశం ఉండేది ఒక్క హృదయం మాత్రమే అను వైనది. కాబట్టి భక్తుడికి ఆ సౌలభ్యం ఇవ్వడం కోసమే భక్తుడి హృదయాన్నే తన నివాసంగా భగవంతుడు ఎంపిక చేసుకు న్నాడు.” అని చెప్పటం ముగించారు గురువుగారు.
🍃🌺గురువుగారు చెప్పింది సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు శిష్యుడు. విషయం పూర్తిగా అర్థం చేసుకున్న ముఖం ఆనం దంతో వెలిగిపోయింది.
🍃🌺భగవంతుడు తన నివాసంగా భక్తుని హృదయాన్ని ఎందుకు ఎంచుకున్నాడో చెప్పేందుకు చమత్కారంతో కూడిన సహితుకమైన గమ్మత్తయిన కథ యిది. అందుకే ”ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది ఆధ్యాత్మిక రహస్యమంతా” అన్నారు పెద్దలు. సాధన చేసి
ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకో వాలి. అందరు ఆచరించాలి.
*అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది?* 🌺
💫🌹హిందువులు పండుగల భావించే వాటిలో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ రోజు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి, కుబేరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. సంపదలను కలిగించేది మహాలక్ష్మి అయితే ఆ సంపదలకు అధిపతిగా కుబేరుడిని పూజిస్తారు.
💫🌹అక్షయ తృతీయ రోజు మనం చేసే ఎటువంటి శుభకార్యాలు అయినా ఎంతో మంచి ఫలితాలనిస్తాయి. అక్షయ తృతీయ రోజు త్రేతా యుగం ప్రారంభమైందని, పరుశురాముడు జన్మించాడని, వంటి వి అక్షయ తృతీయ రోజు జరగడం వల్ల అక్షయ తృతీయను పెద్ద పండుగ నిర్వహించుకుంటారు.
💫🌹ఈ ఏడాది అక్షయ తృతీయ 2021 మే 14 న వస్తుంది. తిథి శుభ సమయం.. ఇది మే 14, ఉదయం 05.38 నుండి ప్రారంభమవుతుంది. 2021 మే 15న ఉదయం 07.59 వరకు కొనసాగుతుంది. ఇంతలో, పవిత్ర ఆరాధన సమయం ఉదయం 05.38 నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది.
💫🌹ఈ మొత్తం శుభ ముహూర్త సమయంలో ఈ 06 గంటలు 40 నిమిషాలు. సంవత్సరంలో మూడున్నర అక్షయ ముహూర్తాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో మొదటి ప్రత్యేక అక్షయ తృతీయ ముహూర్తం. ఈ ముహూర్తంలో ఏం చేసినా కూడా అక్షయమవుతుందని భావిస్తారు.
💫🌹ఈ అక్షయ ముహుర్తం రోజున ఎంతో మంది ఎన్నో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొందరు వివాహం జరుపుకోగా మరికొందరు గృహప్రవేశం చేస్తారు. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి ఇష్టపడుతుంటారు.
💫🌹అదేవిధంగా మన స్థాయికి తగ్గట్టుగా దానధర్మాలను కూడా చేయాలి. ఈ క్రమంలోనే ఉప్పు, బియ్యం, నెయ్యి,చింతపండు వంటి వస్తువులను దానం చేయడం ఎంతో మంచిది.అదేవిధంగా అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు.
💫🌹ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ విష్ణు సహస్ర పఠనం, శ్రీ సూక్త పారాయణం లేదా శ్రీరామ చరిత్ర పఠనం చేయడం ద్వారా కీర్తి గౌరవం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
.......
No comments:
Post a Comment