Sunday, 16 April 2023

ప్రాంజలి ప్రభ 18/04

 [


🙏🙏🙏🙏🙏

సీతాపతీ పద్య కావ్యము
సీసము
ఇంద్రియాలు మనల్ని - ఇబ్బంది పెట్టొచ్చు
ఇంద్రియాలు మనసు - ఇష్ట పెట్టు
మనసు బుద్ధిని మార్చి - మమతను పురికొల్పు
మానవత్వపు కళ -  మానసంబు   
జ్ఞాన సాధనతోను - జ్ఞానము అందించు
ఉత్తమోత్తమ కార్య - ముత్తమవ్వు
స్పర్శానుభూతిని -  శ్రద్ధగా వివరించు
అనువైనదియెపరి - పక్వబుద్ధి
తేటగీతి  
జ్ఞాణ తత్వంబు బోధించి శాంతి గూర్చి
భక్త గణముల రక్షించు పంకజాక్ష
రామ శ్రీరామ రఘు వీర రామ చెంద్ర
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--


సీతాపతీ పద్య కావ్యము
సీసము
నా తండ్రి, నానిధి  నా పుణ్య రూపుండు
      నా తపస్సిద్ధియు నాదు గురువు
నా ప్రాణ మాయువు,  నా ధ్యాన రూపుండు
     నా పరమాత్మయు నా సమస్త
నా శక్తి, నా యుక్తి , నా భక్తి  నీయందు
     నా నమ్మకమ్ముయు నాదు ముక్తి
నా లక్ష్య మంతయు, నిన్నుకొలుచుటయు
     నా మనసంతయు నిన్ను కోరె

నాదు నేలిక నాసౌఖ్య మాదరమున
రామచంద్రుని కొలిచెద రమ్యమవ్వు
సేవ సలిపెద నా తపస్సిద్ధి కొరకు
 ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు

--(())__
సీతాపతీ పద్య కావ్యము
సీసము
నిశ్శబ్ద హృదయం లొ నీలి మేఘము చేరు
             నగ్నదేహమునకు నాంది పలుకు
చిరు జల్లు కురిపించి చిన్మయ మోమును
               అనుబంధం కౌగిలి సేద తీర్చు
శృతి లయ బద్దంగా శ్రీ కారణంగాను
       ‌     తియ్యటి అనుభూతి తీపి గుండు
కళ్ళల్లొ పెంచిన కాంతులే కనికరం
             అలుము కొన్నట్టివి అలలు నిండు
తేటగీతి
ఐచ్ఛికపు సాన్నిహిత్యము ఆశ తీర్చు
మానవుడు నిమిత్తముబంధ మిత్రుఁడౌను    
నిత్య అభినేత చూస్తూను నిమ్మకుండు
కాల మహిమను తెల్పుచు కదులు చుండు
--(())--

సీసము
కలిమి లేమి కలసి - కష్టసుఖము లేలు
ఉలికి పడక ఉండి - ఉలుకు తెలుపు
వెన్నెల మబ్బులు - వన్నెల చుక్కలు
వరుసలు కలిపియు - వన్నె కెక్కు
నీలోన ధ్యానము - నిన్నుగా మార్చును
సాధన తో నీకు - సాధ్య మవ్వు
ఆలోచనలనేవి  - అదుపులో ఉంచుము
అభ్యంతర మనక - ఆదు కొనుము

శ్రీరామ రఘువీర చిత్ప్రకాశ
నిన్ను సతతంబు ధ్యానింతు నెమ్మసమున
నన్ను రక్షించి బ్రోవవే, సన్నుతాంగ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు

--(())--
 
  సీసము
నలుగురి కన్నీళ్లు - నీవిగా భావించి
నవ్వుల్ని పంచియు - నటన వద్దు
మనిషికి కధలేలు - మనుగడ కు మతియు
మానవత్వము గాను - మహిమ చూపు
హృదయాన్ని పలికించి - హృద్యతాపము దించి
బాధ్యత తెలిపుము - భరిత హృదయ
అణ్యాయమును ఆపి - అనురాగమును పంచు
తలచిన లక్ష్మణా - తీర్పు చెప్పు

ఆటవెలది
తనను తాను గాను తాపత్రయము ఉన్న
తనది కాని దేది తలచ వద్దు
తరుణము మన కలలు తీర్చి తృప్తిపరచు
తప్పు చేయకున్న తంతు ను జరుపుము
--(())--

సీసము
వృత్తి ప్రవృత్తి యే - వయసును ఉడికించు
నీతి నియములన్ని - నిన్ను మార్చు
తగినంత శాస్త్రము - తప్పుచేయక ఉంచు
కాలాను గుణముగా - కదులు చుండు
సంపాద నంతయు - నిన్ను మాయను చేర్చు
సామరశ్యము గాను - సుఖము పంచు
ప్రశ్నల వర్షము - ప్రాభవం మార్చును
లక్ష్మణా పంచుము లేత మనసు

ఆటవెలది
లేని దంటు ఏమి లేదులే ఇందులొ
ఉన్న దాని లోన ఉంది తృప్తి
కాల మంత ‌నీది కాలముతో నీవు
కళ్ళు తెరిచి వళ్ళు మరవ కుండు
--(())--
 

 రాతల కొలువు (1 to 8)

 పెన్ కౌంటర్.....       --  నూతన లఘు కవితా ప్రక్రియ నియమాలు :

1. మూడు పాదాలు
2. తొలి పాదంలో ఒకటే పదం లేదా పదబంధం ఉండాలి
3.మొత్తం మూడు పాదాలలో ఐదు నుంచి పది పదాలు మాత్రమే ఉండాలి
4. చివరి రెండు పాదాలకు అంత్యప్రాస తప్పనిసరి

ఉదా :
.
అబద్ధం   అద్దం కాజాలదు  నిజం తన ఇజమూ మార్చుకోదు.

సత్యం    నిత్యం జ్వలిస్తూనే ఉంటుంది  ధ్వనించే అబద్ధాన్ని దహిస్తూనే ఉంటుంది

నిజం అబద్దానికందని అంగూర్ దుర్బుద్ధితో దాన్ని గెలవాలనుకోవటం బేకార్


రాతల కొలువు (1 to 8)

నుదిటి   గీతలు మార్చ లేవు ఆయినా నిజాలు చెప్పలేవు

హంసలా పాలను నీల్లను వేరు చేయలేవు కష్ట సుఖాలను వేరు చేయలేవు

హొయలు   చూపే వయసులో మార్పు తెల్పలేవు వయసును బట్టి నడవ లేవు

హృదయ  స్పందనలు అనురాగం వైపు లేవు అభి మానం స్పందనలు అసలు లేవు

కాలంతో పురుగులు చేయలేవు కాలాన్ని బట్టి ఉండలేవు

ఊసర  వెల్లిగా రంగులు మార్చ లేవు మనిషిగా మనిషిని బతికించలేవు

మమతల నీడలు అందుబాటులో లేవు తరువుల నీడను పొందలేవు

ఊపిరి  పీల్చలేక బతుకు తున్నావు కృత్రిమ గాలితో బతికేస్తున్నావు


--(())--

రాతల కొలువు (21 to 30)


లంచం అవకాశాల దర్పణం ఆరోగ్యానికి హానికరం  ,
లంచం ఇచ్చినా తప్పే,, పుచ్చుకున్నా తప్పే
లంచం ఇస్తే పనులు ఆగుతాయని ఆశ, జీవితంలో నిరాశ
లంచం  తీసుకోక పనిచేస్తే చేతకానివాడు, తీసుకొని చేస్తే గొప్పోడు  
లంచం పుచ్చుకునే వాడికి మోదం, ఇచ్చేవాడికి ఖేదం

పుస్తకం చదివితే మస్తకం వృద్ధి, విన్నా ఆరోగ్య వృద్ధి  
పుస్త్తకం చదివితే లోకజ్ఞానం, చదవక పొతే అజ్ఞానమ్  
పుస్తకము  చదివితే ఉన్నతి, చదువుక పోతే అధోగతి
పుస్తకం చదివిన మనసుకు ఉల్లాసం, బతుకులో ప్రోత్సాహం
పుస్తకం విద్యలకు నిధి, నిన్ను నడిపించేది ఆ విధి
 

 రాతల కొలువు (31 to 45)


మాటలు మనసుకు సమ్మోహం,   పెరుగు వ్యామోహం
మాటలు వల్ల బాగుపడు జీవితం,  మనసుకు దుఃఖం
మాటలతో ప్రేను పుట్టించవచ్చు,  ద్వేషించ వచ్చు
మాటాలతో మనసుకు మకరందం, మమతకు విషకoదo     
 
ఆటలు వయుస్సుకు ధారుడ్యం, ఆరోగ్యానికి మూలం  
‍ఆటలతో మారవచ్చు చదువు,  బలంతో చదవవచ్చు   
ఆటలతో జరిపే రాజకీయం, పోటీల మయం
ఆటలతో కోలాటం, గెలుపు ఓటముల సంకటం

పాటలు పరవశానికి నిదర్శనం, ఏకాంతానికి సమ్మోహం
పాటలు కలయికకు ప్రతినిధి, ఆనందానికి పెన్నిధి  
పాటలు మనసుకు ఉల్లాసం ఇచ్చు, ఉత్సహాం కలిగించు
పాటలు కవుల హృదయ స్పన్దన, నటుల  ఆవేదన

 జీవితం  కోరింది దక్కదు,  దక్కింది తృప్తినివ్వదు..
జీవితమ్ నమ్మకాన్ని చూపదు, నమ్మిన వాణ్ని ఉంచదు
జీవితమ్ ఎడారి లాంటి బతుకు, బతుకు తెలిపి బతుకు      

ఆశ స్థాయిని చూడదు అంతం కాదు..
ఆశ మనిషిని వదలదు, దాగి ఉండలేదు  
ఆశ నిరాశల మధ్య మనిషి, సుఖదు:ఖాలమధ్య మనిషి
 
కౌగిలి బాధలో ఓదార్పు, ఎడబాటులో నిట్టూర్పు..
కౌగిలి వయసు వేడికి చల్లదనం, చల్లఁదనానికి ఉష్ణమయం
కౌగిలి చేతులు కలయిక హృదయాల మెలిక
 
అమ్మాయి ప్రేమ నమ్మితే ప్రాణమే, మోసగిస్తే మరణమే..
అమ్మాయి ప్రేమ వికసించిన పువ్వు, అనుభవిస్తే  పరిమలమవ్వు
అమ్మాయి ప్రేమ కోరికలతో ఉండు, అబ్బాయికి ఆశలతో నుండు   

వేదాంతం తెలిస్తే సిద్ధాంతం, తెలియకపోతే రాద్ధాంతం..
వేదాంతం తెలిస్తే ఆరోగ్యం , తెలియకపోతే అనారోగ్యం
వేదాంతం పఠించి తెలుసుకుంటే సంతషం, తెలియకపోతే అయ్యోమయ్యం     
     
స్వానుభవం వచ్చేదాక చెప్తారు గొప్పలు, తప్పించు కోలేక తిప్పలు
స్వానుభవం చెప్పడానికి నీతులు, ఆచరణకు గోతులు
స్వానుభవం ఆదర్శనానికి నిలయం, ఆత్మీయతకు అనుభవం   

వృద్ధుల అనుభవాలూ తెలుసు కోవటం, ఆచరణలో మాత్రం పెట్టి సుఖపడటం
వృద్ధుల మాటలు అర్దమైతే కధలు, అర్ధం కాకపొతే వెతలు
వృద్ధులు ఇంటికి వెలుగులు, ఆత్మీయతకు పునాదులు    

అరణ్యం అరణ్యం లో క్రూర జంతువులు ఉంటాయి,  క్రూర మనస్తత్వాలుంటాయి
అరణ్యం  ఓషదాలకు  నిలయం , ఆటవిక జనులకు ఆధారం
అరణ్యం మునులకు ప్రశాంత జీవనం, రాక్షసులకు సంచార అరణ్యం
 
పరీక్షలు: చదివే వాడికి  పరీక్షలు కావాలి, చదివిన వాడికి ఉద్యోగం కావాలి
పరీక్షలు: మానవ శరీరం లొ కావాలి, కొందరి వృత్తిగా మారాలి
పరీక్షలు: జీవితంలో ఉంటాయి, అవి మనసును మారుస్తాయి   

 

 

గుడిముందు గోపురం ఎందుకుఉంటాది. 

🌹🌹🌹🌹🌹

భారతదేశం అనగానే ఆధ్మాత్మికత ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబాలైన ఆలయాలు గుర్తుకువస్తాయి. భారతదేశమంతటా ఒకో ప్రాంతంలోని ఆలయాలు ఒకో శైలిలో ఉంటాయి. కానీ దక్షిణాదికి వచ్చేసరికి భారీ గోపురాలే ఇక్కడి ఆలయాల ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఇప్పటికీ దక్షిణాది ప్రజలు గోపురాలని తమ సాంస్కృతిక వారసత్వంగా భావిస్తారు. అందుకనే తమిళనాడు రాజముద్ర మీద సైతం శ్రీవిల్లిపుత్తూరు గోపురమే దర్శనమిస్తుంది. ఇంతకీ ఈ గోపురాలు కేవలం ఆడంబరానికేనా, లేకపోతే వీటి వెనుక పెద్దలు ఆలోచించిన కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటే


ఇప్పుడంటే అంతస్తులకొద్దీ ఎత్తైన భవంతులను కట్టేస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఊరంతటికీ ఎత్తైన భవనం ఆ ఊరి గోపురమే. ఒక ఊరికి వెళ్లేందుకు దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ గోపురాలు కనిపించేవి. అందుకేనేమో గోపురం అన్న మాటకి ‘పట్టణ ద్వారం’ అన్న అర్థం కూడా ధ్వనిస్తుంది. ఇప్పటికీ కంచికి వెళ్లే దారిలో దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచే ఆ ఊరి గోపురాలు కనిపిస్తూ ఉంటాయి.


ఊరిలోనే ఎత్తైన, సురక్షితమైన భవనం కాబట్టి ప్రకృతి విపత్తులలో గోపురాన్ని మించిన ఆపన్న హస్తం ఉండదు. విపత్తులలో స్వామివారి ఆధ్యాత్మిక అభయం ఎలాగూ ఉంటుంది. ఇక భౌతిక రక్షణ కూడా వారి పాదాల చెంతనుండే గోపురం దగ్గర లభిస్తుందన్నమాట!

ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే బాటసారులకి అన్నిచోటలా సత్రాల వసతి ఉండదు. కానీ గుడి లేని ఊరు మాత్రం కనిపించదు. ఆ గుడి గోపురం నీడన కాసింత సేదతీరి, చీకటివేళన బడలికను తీర్చుకుని, ఇంత ఆహారం తీసుకుని మళ్లీ బయల్దేరేవారు బాటసారులు.

గత సహస్రాబ్ది అంతా ఏదో ఒక యుద్ధంలోనే గడిచిపోయింది. ఎప్పుడు ఎటు వైపు నుంచి శత్రుసైన్యం విరుచుకుపడుతుందో ఏ వైపు నుంచి అల్లరి మూకలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి. ఇక తరుష్కుల దండయాత్రలు, బ్రిటిషర్ల దురాక్రమణలు సరేసరి! ఇలాంటి సమయంలో ఊరి వైపుగా ఎవరన్నా శత్రువులు వస్తున్నారేమో అని గమనించే ‘వాచ్‌ టవర్లు’గా గోపురాలు ఉపయోగపడేవి.


గోపురాల విషయంలో చాలామంది విశ్వసించే అంశం పిడుగుల నుంచి రక్షణ. గోపురాల పైన ఉండే కలశాలు పిడుగుపాటుని నిర్వీర్యం చేసే ‘ఎర్త్‌’లాగా పనిచేస్తాయని చాలామంది నమ్మకం. ఊరిలో ఉండే కట్టడాలన్నింటికంటే గోపురాలే పై ఎత్తున ఉంటాయి కాబట్టి, పిడుగులని దిగమింగి ఊరిని సురక్షితంగా ఉంచుతాయంటారు. గోపుర నిర్మాణానికి వాడే సామాగ్రి కూడా పిడుగులను నిర్వీర్యం చేసేందుకే అనువుగా ఉంటుందట.


భౌతికమైన విషయాలను పక్కనపెడితే... ఉన్నతమైన గోపురాలు, వాటి మీద చెక్కిన కళాఖండాలు అంతులేని ప్రశాంతతని అందిస్తాయి. భగవంతుని వైభవానికి భక్తుడు అందించే చిరుకానుకగా తోస్తాయి. గోపురం దగ్గరకి వచ్చి తల ఎత్తి చూడగానే మనసు మరో లోకంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడిపోతుంది. గోపురం లోపలికి అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక సామ్రాజ్యంలోకి కాలుమోపిన అనుభూతి కలుగుతుంది.


భౌతికంగా, ఆధ్మాత్మికంగా గోపురాలను ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే, వేయి సంవత్సరాలకు పూర్వం మొదలైన ఈ తరహా కట్టడాలను ఇప్పటికీ ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు.

🙏🙏🙏🙏🙏

🎻🌹🙏*నమస్కారం చేసే విధానం_*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


_*నమస్కారం*_ _అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం._


_తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి._


*_మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం,  విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం  భాష._*


_సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా  "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.  వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా  తాకేలా గౌరవంగా చేయాలి._


_🙏 శివకేశవులకు


 నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి  నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)_


*_🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.._*


*_🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి_*


*_🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి._*


*_🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి._*


*_🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి._*


*_నమస్కారంలోని అంతర్గతం ...._*


_హిందూ సంస్కృతిలో నమస్కారం_  

 _విశిష్ట ప్రక్ధియ._ _ఒకరికొకరు ఎదురైతే_

 _రెండు చేతులు_ _జోడించి హృదయ_ 

 _స్థానం దగ్గర ఉంచి_ _నమస్కారం  చెప్పడం_  

 _హిందువు అలవాటు   మామూలుగా_

 _చూస్తే నమస్కారం చేయడం  అంటే_  

 _ఎదుటి వ్యక్తికి గౌరవం  ఇవ్వడం  .._

 _నమస్కారం అన్న పదం  సంస్కృతం_ 

 _నుంచి వచ్చింది ._ 

 _సంస్కృతానికి_ _చెందిన నమః  అనే_

 _పదం నుంచి_  _నమస్కారం  అన్న. పదం_  

 _ఏర్పడిననది .._  _సంస్కృతంలో నమః_

 _అంటే విధేయత._ _ప్రకటించామని  అర్ధం .._

 _మనషులందరిలోనూ దైవత్వము_ 

 _ఉంటుందని  హిందువులు నమ్ముతారు ..._

 _దీనినే ఆత్మ అంటారు_  .

 _నమస్కారం పెట్టడం  అంటే  ఒక వ్యక్తిలో_ 

 _ఉన్న ఆత్మ ఎదుటి  వ్యక్తిలోని ఆత్మను_ 

 _గుర్తించి దానికి విధేయత ప్రకటించడం .._


 _ఇది అధ్యాత్మిక పరమైన వివరణ .._


 _శాస్త్రీయంగా చూస్తే నమస్కారం  చేసేటప్పుడు_

 _రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి_

 _తాకుతాయి  మనం చేతి వెళ్ల కొనలకు_

 _కళ్ళు చెవి_ _మెదడులతో సంబంధం_ 

 _ఉంటుంది._ _నమస్కారం  చేసేటప్పుడు_

 _చేసేటప్పుడు  వేలి కొనలు పరస్పరం_ 

 _ఒత్తుకోవడం  వల్ల కళ్ళు చెవి మెదడు_

 _కేంద్రాలు_ _ఉత్తేజమవుతాయి  దాంతో_ 

 _కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని  మెదడు ఎక్కువ_

 _కాలం  గుర్తు పెట్టుకోవడం_

 _వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం._

 _జరుగుతుంది .._

 _అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి_

 _నమస్కారం పెడితే  వాళ్ళు మనకి_

 _ఎక్కువ కాలం_ _గుర్తుండిపోతారని అర్థము  .._

 _నమస్కారం పెట్టేటపుడు మనం_  

 _ఎదుటి వాళ్ళను_ _ముట్టుకోనవసరంలేదు_ 

 _దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు_ 

 _సోకె ప్రమాదం ఉండదు._

 _భౌతిక సంబంధం లేకపోవడంవల్ల._

 _ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన_

 _ప్రదానం జరుగుతుంది._

 _ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల_

 _ఒకరి నుంచి చెడు భావనలు  మరొకరిలోకి_  

 _చొరబడే అవకాశము కూడ. ఉండదు._

 _నమస్కారం అన్నది సత్యగునమైనది ._

 _అవకాశం ఉన్నంతవరకు  ఎదుటి వ్యక్తికి -_ 

 _మంచి మనస్సు తో_

 _చేతులు జోడించి_ _నమస్కంరించడం_ 

 _మంచిది ...._


_*నమస్కారం  మంచి  సంస్కారం*_

 _దీన్ని మనం   అందరం  పాటిదాం_

 _ఎదుట వారికి   నమస్కరించటం  తో  మన  విలువ  పెరుగుతుంది_

 _ఈ సాంప్రదాయాన్ని  మనం  పాటిస్తూ , మన  పిల్లలకు  నేర్పిద్దాం .నేర్పిద్దా_🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గోథూళి వేళ

***********

        

           సాయంకాలంమౌతుంది . పగలంతా లోకానికి దివిటీ పట్టిన సూరీడు అలిసిపోయి  గూటికి చేరుకోబోతున్నాడు . ఇప్పుడిప్పుడే చల్లగాలి మొదలైంది . అలవాటుగా మేడ మీదకెళ్ళి పచార్లు చెయ్యడం మొదలెట్టాను . క్రింది నుండి చూస్తే ఎంతో దూరంగా కనిపించే సూరీడు మేడ మీద నుండి చాలా దగ్గరగా   వదలలేక వదిలి వెళ్ళే ఆత్మీయుడులా అనిపిస్తున్నాడు .

        .. అంతలోనే పిల్లల అల్లరి కేకలు విని రెండడుగులు ముందుకు వేసి చూశాను . బడి వదిలారేమో పుస్తకాల సంచులు మూలకిసిరేసి  సైకిళ్ళతో రేసులు మొదలెట్టేశారు .వాళ్ళలో ఇద్దరిని గమనించాను . అన్న తమ్ముడికి సైకిల్ నడపడం నేర్పిస్తున్నాడు . "ఒరేయ్ అన్నా !పడిపోతానేమోన్రా " అంటున్నాడుతమ్ముడు .అన్న భుజాన్ని వదలకుండానే ."నేనున్నాగా పర్లేదు పోనియ్" అంటూ భరోసా ఇస్తున్నాడు అన్న .చాలా అపురూపంగా ఉందా దృశ్యం .

            ఇంతలో మావూరి రెడ్డిగారి ఆవులమంద  పరుగులు చూసి ఎటువాళ్ళటు చెల్లాచెదురయ్యారు .ఆవులు బరువెక్కిన పొదుగులతో పరుగులు తీస్తున్నాయి తమ బుజ్జాయిలకోసం . ఇలా అన్ని ఆవులు పరుగులు చూస్తుంటే  చంటి పిల్లల ఏడుపులు విని కొంగులు దోపుకుని పరుగులు తీసే కన్నతల్లుల పరుగుల్లా ఉన్నాయి .ఈ ఆవులన్నింటి వెనుక ఇంకో అమ్మ తల్లి ఉంది . ఆమే చిట్టెమ్మ తల్లి . ఉదయం మేతకు పోయింది మొదలు ఇల్లు చేరేవరకు ఆవులన్నీ ఆమె సంరక్షణ లోనే ఉంటాయి .మెడ మీద పెద్దకర్ర . ఆ కర్రకు రెండు పక్కలా చేతులువేసి ఆవులవెనుకగా నడిచొస్తూ ఉంటుంది . ఈ మొత్తం దృశ్యం చూస్తుంటే   కదిలి వచ్చే ఒక గో సామ్రాజ్యానికి ఆమె తల్లి లా ఉంటుంది .అంతే కాదు కనుసైగతో వాటిని దారిలో పెట్టగల రాణి లా కూడా ఉంటుంది . ఆబగా ఇళ్లకు చేరుకుంటున్న గోవుల కాలి గిట్టల నుండి రేగే  థూళిని చూస్తుంటే ఊరు ఊరూ ఆవులమందకూ , చిట్టెమ్మతల్లికి   గోథూళిరంగు సాంబ్రాణి పొగతో ఊళ్ళోకి స్వాగతం పలుకుతున్నట్టుంటుంది . సాయంసంథ్య లో  ఊరుని కమ్మేసిన  కెంపు రంగు గోథూళి సొగసును చూస్తూ ఉంటే   అథ్భుతం అనిపిస్తుంది . . కాలం మారింది .నాగరికత మారింది . చాలా ఊళ్ళలో గోవులు ఉండవు .గోథూళీ ఉండదు .వెలవెల బోయే సాయంసంథ్య మాత్రం ఉంటుంది .

            ఇవన్నీ క్రింది నుండి కాక మేడ మీదనుండి చూడటం వలనేమో  ఇంత అందంగా కనిపిస్తున్నాయి .ఒక్కసారిగా ఆంబోతు రంకెల్లాంటి అరుపులు వినపడటంతో తల పక్కకి తిప్పి చూశాను . ఎప్పటిలానే అలవాటైన దృశ్యమే . పక్కింటి అన్నదమ్ములు ఇంటి సరిహద్దుల కోసం ఏళ్ళతరబడి గొడవ . అది రావణకాష్ఠం లా మండతూనే ఉంటుంది . ఎవరైనా వచ్చి ఆర్పుదామన్నా వాళ్ళ పట్టపు రాణులు ఆరనివ్వరు . రెండిళ్ళ మథ్య ఉన్న జానా బెత్తెడు నేల కోసం ఇద్దరూ తొడలు చరుస్తారు . మీసాలు మెలివేస్తారు . వావివరుసలు మరిచి మాట్లాడుతారు .ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టినవాళ్ళు . ఒకే తల్లి ఒడిలో సర్దుకుని పడుకున్న వాళ్ళు . జానెడు నేల కోసం గొడవలు పడుతున్న వాళ్ళు కూడా వీళ్ళే .పైగా వీళ్ళిద్దరూ ఇన్ని ఆవులను ఒకే గాట నడిపించే చిట్టెమ్మతల్లి పిల్లలు .

        వీళ్ళిద్దరి పట్టపు రాణులు  భర్తలను చాడీలతో పందెపు కోళ్లను పెంచినట్టు పెంచి నోటికి చెరొక కత్తిని కట్టి  ఎవరి కోడిని వాళ్ళు ఉసిగొలుపుతున్నారు .

             "ఈ నేల నాది ఆడుగేసి చూడు నీ ఆంతు చూస్తాను అంటాడు పెద్దోడు ". "వేస్తాను .ఎవడడ్డొస్తాడో చూస్తానంటాడు చిన్నోడు .వీళ్ళిద్దరి కాలి దువ్వులాటల్లో ధూళి పైకి లేస్తుంది .  ఆ ఇద్దరికీ ఆనేలని ఇచ్చింది చిట్టెమ్మతల్లే .ఆతల్లి వొడిని సర్దుకుని పంచుకున్నారు .ఆ తల్లి పాలను పంచుకుని తాగారు .ఇన్ని పంచుకున్న వీళ్ళు నోరూ వాయీ లేని జానెడు నేలను మాత్రం పంచుకు లేక పోతున్నారు .మహా అయితే ఈనేల ఓ పదేళ్ళనుండీ వీళ్ళదేమో . అంతకు ముందు  యాభై యేళ్ళక్రితమో ,వందేళ్ళక్రితమో ఎవరిది ,ఇంకా అంతకు ముందు వందేళ్ళక్రితం ఎవరిది . వీళ్ళ తర్వాత రాబోయే యేడాదుల్లో ఎవరిది . నేలమ్మ తల్లి భాష మనం అర్థం చేసుకోగలిగి ఉంటే ఆ తల్లి వీళ్ళద్దరినీ చూసి పక్కుమని నవ్వే నవ్వు మనం విని ఉండే వాళ్ళం  .ఇటువంటి బిడ్డలకంటే  ఆనోరులోని మూగజీవాలకే తల్లినై ఉండి పోకూడదా అని  అప్పుడే ఇల్లు చేరిన చిట్టెమ్మ తల్లి ఏడుస్తూ మంచం మీద కూలబడి పోయి రెండు చేతులూ పైకెత్తి చనిపోయిన భర్త ను తలుచుకుంటూ గొణుగుతుంది .," పంట చేను కు చీడ పడితేనే తల్లడిల్లి పోయేటోడివి గదయ్యా .ఇప్పుడు మన కడుపు పంటకు చీడ పట్టింది  ఏం చెయ్యమందువో " చెప్పమంటూ .

        .. అసలెప్పుడూ చూసే రగడే అయినా  ఈ రోజు ప్రత్యేకించి చూడటానికో కారణముంది . అదేంటంటే కొన్ని రోజుల క్రితం మిత్రులొకరు వాట్సప్ సందేశం పంపించారు .దాని సారాంశం  మనిషి సృష్టించిన డబ్బు , ఆస్తులు తిరిగి ఆ మనిషినే నకిలీగా మార్చి వేస్తాయని . కానీ  ఆ సందేశాన్ని మిత్రులతో విభేదించాను .  అదిగో అప్పటినుండీ ఆ సందేశం నా బుర్రని తొలిచి వేస్తుంది . ఎదురైన ప్రతి వ్యక్తినీ ప్రతి సంఘటననీ  నాకు తెలియకుండానే గమనిస్తున్నాను .

        ఇంతలో ఈ అన్నదమ్ముల గొడవ . ఇప్పుడనిపించింది ఆ సందేశాన్ని విభేదించి తప్పు చేశానని . ఏదో అసంతృప్తితో మేడ దిగి వచ్చేశాను .

            ఆమర్నాటి సాయంకాలం మేడ ఎక్కలేదు .కానీ ఎక్క వలసి వచ్చింది .అదే ఇంట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి . తీరా చూస్తే జనమంతా గుమిగూడి ఉన్నారు .అసలు విషయం గమనిస్తే  పొలం వెళ్ళిన తమ్ముడికి పాము కరిచింది . వైద్యం  చేయించి ఇంటికి తీసుకొచ్చారు . నాకు చాలా ఆశ్చర్యమేసింది . తమ్ముడి తల అన్న ఒడిలో ఉంది . అన్న వైపే చూస్తూ  అతని మెడ చుట్టూ చెయ్యి వేసి " ఒరేయ్ అన్నా నాకు చాలా భయంగా ఉందిరా" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు . అన్న కన్నీళ్ళు తుడుస్తూ చెంపలు నిమురుతూ " ఎందుకురా భయం నేనున్నాను కదా!నీకేమీ కానివ్వను ."అని భరోసా ఇస్తున్నాడు .ఈ దృశ్యం నన్ను కలిచివేసింది . ఇన్నాళ్ళూ ఏమైందా ప్రేమ అనిపించింది .

          నిన్నటి రోజున కత్తులు దూసుకున్న అన్నదమ్మల్లో అన్న  ఈరోజున నేనున్నాను , నీకేం కాదని తమ్ముడికి భరోసా ఇవ్వడం చూసి ప్రాణం లేని డబ్బుకు గానీ ఆస్థికి గానీ నిజమైన ప్రాణమున్న మనుషులను విడదీసే శక్తి లేదని నాకనిపించింది .సంతృప్తిగా మేడదిగి వస్తూ వస్తూ  వెనుదిరిగి చూశాను   . చిట్టెమ్మతల్లి  కళ్ళల్లో కన్నీళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి .


Ooooo

దేవసేన

కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?

పొడవు, వెడల్పు, ఎత్తుల్లాగే కాలం కూడా ఒక కొలత.

పొడవు, వెడల్పు, ఎత్తుల విషయంలో మనం ముందుకు, వెనక్కూ ఎటైనా వెళ్లొచ్చు.

కానీ, కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది. వెనక్కివెళ్లడం దానికి ఉండదు. ఎందుకలా?

ఈ ప్రశ్నకు చాలా కాలం శాస్త్రవేత్తలు సరైన బదులు చెప్పలేకపోయారు.

కాలంలో ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా భౌతికశాస్త్ర సూత్రాలు ఒకేలా పనిచేస్తాయన్న సిద్ధాంతం ఒక చిక్కుముడిగా మారింది.

చాలా కాలం సరైన సమాధానం లేకుండా ఉన్న ఆ ప్రశ్నకు జవాబు అనుకోని చోట దొరికింది. స్టీమ్ ఇంజిన్‌ దానికి బదులు చెప్పింది.

పారిశ్రామిక విప్లవం ప్రారంభ సమయంలో స్టీమ్ ఇంజిన్లను మరింత మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కృషి చేశారు.

ఇంజిన్‌కి నాలుగు దిశలా ఉష్ణం, శక్తిని ఎలా ప్రవహింపజేయాలో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా థర్మోడైనమిక్స్ అనే కొత్త శాస్త్రం పుట్టింది.

స్టీమ్ ఇంజిన్స్ పనితీరు గురించి థర్మోడైనమిక్స్ చాలా చెబుతుంది.

ముఖ్యంగా థర్మోడైనమిక్స్ రెండో నియమం.. సంఘటనలు ఒక క్రమంలోనే ఎందుకు జరుగుతాయో వివరిస్తుంది.

స్వతంత్ర వ్యవస్థలు మరింత అవ్యవస్థీకృతంగా మారతాయే తప్ప.. ఎప్పటికీ వ్యవస్థీకృతంగా మారవు అని ఈ నియమం చెబుతుంది.

ఉదాహరణకు ఓ కాఫీ కప్పు నేలపై పడితే.. అది పగిలి, అందులో ఉన్న కాఫీ బయటకు చిందుతుంది. ఈ ప్రక్రియను తిరిగి వెనక్కు మళ్లించడం కుదరదు.

వ్యవస్థలను అవ్యవస్థీకృతంగా మార్చొచ్చు. కానీ, వాటిని పూర్వ స్థితికి తీసుకువెళ్లడం సాధ్యం కాదు. అలా ఎందుకు చేయలేమనేదే థర్మో డైనమిక్స్ రెండో నియమం వివరిస్తుంది. అందుకు కారణం ఎంట్రోపీ అని చెబుతుంది.

ఎంట్రోపీ అంటే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తిగా మారలేని శక్తి పరిమాణం.

ఒక వస్తువు ఎంట్రోపీ ఎంత ఎక్కువగా ఉంటే, అది అంతగా పనికిరాకుండా పోతుంది.

Ds≥ 0

పైన కనిపించే అక్షరాల 'ఎస్' ఎంట్రోపీని సూచిస్తుంది. 'డీ' దానిలో వచ్చే మార్పును తెలిపే గణితపరమైన సంకేతం. 'డీఎస్' అంటే ఎంట్రోపీలో వచ్చే మార్పు.

ఆ సమీకరణం అర్థం ఏంటంటే, ఒక వ్యవస్థ ఎంట్రోపీ నిత్యం పెరుగుతూనే ఉంటుంది.

కప్పు పగిలినప్పుడు, కాఫీలో పాలను కలిపినప్పుడు.. ఆ సంఘటనలు థర్మో డైనమిక్స్ రెండో సూత్రం ప్రకారమే జరుగుతాయి.

పగిలిన కప్పు పూర్వ స్థితికి రావాలనుకుంటే, కాఫీ, పాలు తిరిగి వేరుపడాలనుకుంటే.. అది ఆ సూత్రానికి విరుద్ధం అవుతుంది.

విశ్వంలో సంఘటనల క్రమాన్ని రెండో సూత్రం వివరిస్తుంది. ఎస్‌లో ఉండే ఆ ప్రవాహమే మనం కాలం అనుకునేదాని గురించి స్పష్టంగా చెబుతోంది... అది ఎప్పుడూ వెనక్కివెళ్లదని.

ఎంట్రోపీ తగ్గడం థర్మో డైనమిక్స్ రెండో సూత్రానికి విరుద్ధం కాబట్టే కాలం వెనక్కి వెళ్లదు.

విశ్వం ఎంట్రోపీ, అవ్యవస్థీకృత తత్వం నిత్యం పెరుగుతూనే ఉంటుంది.

అంటే, ఎంట్రోపీ గరిష్ఠ దశకు చేరుకున్నప్పుడు మన విశ్వం పూర్తి అవ్యవస్థీకృతంగా మారిపోతుంది.

శాస్త్రవేత్తలు దీన్ని 'థర్మల్ డెత్' అంటున్నారు.

ఇక్కడ డెత్ అంటే అంతా నాశనమైపోయి, బూడిదవ్వడం కాదు. అంతకంటే ఘోరంగా ఉంటుంది.

విశ్వమంతా ఒకటే ఉష్ణోగ్రత ఉంటుంది. జీవం ఉండదు. నక్షత్రాలు, పదార్థాలు మాయమవుతాయి. కొన్ని పార్టికల్స్, వాటి రేడియేషన్ మాత్రమే ఉంటుంది.

కాలం గడిచిన కొద్దీ విశ్వం విస్తరిస్తూ పోతుంది. దాని శక్తి నశించి, ఖాళీగా మారిపోతుంది. దీన్ని 'బిగ్ ఫ్రీజ్' అని కూడా అంటుంటారు.

అయితే, ఆ పరిణామం గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఇది జరిగేందుకు బిలియన్ల బిలియన్ల బిలియన్ల ఏళ్లు పడుతుంది. ఎంట్రోపీ విశ్వాన్ని ఎలా నాశనం చేసిందో చూసేందుకు మానవమాత్రుడెవరూ మిగలరు.

హనుమంతుడికి ఒంటె ఎలా వాహనమయ్యింది?

హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు. స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ ! సూర్యుణ్ణే  పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా ! అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా ! అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ ! 

 ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా  అరుదనే చెప్పాలి . కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన  దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది . ఒంటె, ఆంజనేయ స్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ ఉంది . 

రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు.  అతడి మృతదేహాన్ని 

 ఋష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది. మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని తానూ తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.

ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న  సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు  పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు  సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం.(సేకరణ)

[

భక్తి లేని జ్ఞానం వృథా!

🔹🔸🔹🔸🔹

‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. 

తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.

 జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనినీ పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాలేవీ పట్టవు. వీరికి కావలసిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని, అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు.

 ‘ఆత్మజ్ఞానులు’ చేసే పనులు ఎంతో విజ్ఞతతో కూడుకొని ఉంటాయి.

మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో (విద్యుత్‌ బల్బ్‌, ఫ్యాన్‌, రిఫ్రిజిటర్‌ వంటి విద్యుత్‌ పరికరాలు) కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయంప్రతిపత్తి (స్వీయశక్తి)ని కలిగినవి కావు. వాటిని విద్యుచ్ఛక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి. జ్ఞానం లేనివారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతుంటారు. జ్ఞానం లేనివాని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటుంటాడు. 

ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న ‘పార్వతీ పరమేశ్వరులు’ చూసి, తమలో తాము ఇలా అనుకున్నారట. ‘జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందపడి పోవడం ఖాయం. అప్పుడు అతను ‘అమ్మా’ అని అరిస్తే నేను రక్షిస్తాను. ‘నాన్నా’ అని కేక వేస్తే మీరు రక్షించండి’ అందిట పార్వతి. 

ఇద్దరూ ‘సరే’ అని ఆ వ్యక్తివైపు చూడసాగారు. అతడు పడిపోతూ, ‘చచ్చాను..’ అని అరిచాడు. ఇద్దరిలో ఎవరినీ తలచుకోలేదు. ‘ఆపదల నుంచి గట్టెక్కించమని’ ఆపద్భాందవుని వేడుకుంటేనే కదా కాపాడేది!

ఇటువంటి ‘బుద్ధి’ (వివేచన) నిజానికి మనిషికి జ్ఞానం ‘ఉంటేనే’ పుడుతుంది. ‘కొంత ధీశక్తి, పరిశీలనా పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడ, ఎలా ఉంటాడు?’ అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని.

 అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికలు ప్రభావం చూపవు. ఒక్క పరమాత్మ సాన్నిధ్యం తప్ప, అతనికి మరేదీ అక్కరలేదు.

 ‘ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియః’ (భగవద్గీత: 7-17).

 ‘నాకు జ్ఞాని అయినవాడు అత్యంత ప్రియుడు. నేనూ అతనికే మిక్కిలి ప్రియుడను’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

 ‘జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను తాను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతని శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా, అవి వృథా అవుతాయి కదా. అందుకే, నేను అతణ్నే ప్రేమిస్తాను. అతనంటేనే నాకంత ఇష్టం.’ అన్నది పరమాత్మ భావన.

మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు. 

ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ వేర్వేరు. ఒకరకంగా ఇవి రెండు ‘విరుద్ధాలు’ కూడా. ఇక్కడ జ్ఞానియే భక్తుడు కూడా అవటం విశేషం. ‘భక్తి లేని జ్ఞానం’ నిస్సారమైంది. ‘ఆత్మజ్ఞానం’ అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి, మానవ కల్యాణానికి బాటలు వేస్తారు.

[


మహా చైతన్య పదార్థమైన ఆత్మే అన్నిటికీ మూలం. ఈ జగత్తు మొత్తం ఆత్మచైతన్యం ద్వారానే ముందుకు నడుస్తోంది. జీవికి శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు, సర్వ శారీరక సుఖాలు.. ఇవన్నీ ఆత్మ వల్లనే తెలుస్తున్నాయి. నిజానికి ఈ అనుభూతులు ప్రాణానికి సంబంధించినవే అయినా, ఈ అనుభవాలకు ఆధారం ఆత్మ మాత్రమే! మెలకువలోనూ, స్వప్నావస్థలోనూ జాగృతంగా ఉండి... జీవికి సంభవించే అనుభవాల సమాహారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి, తిరిగి జ్ఞాపకం చేయగలిగే నిరంతర చేతనా శక్తి... హృదయకుహరంలో స్థితమై ఉన్న ఆత్మ. అది చలనం లేనిది. కానీ మనసు కన్నా వేగవంతమైనది. ఆత్మ ఒకచోట స్థిరంగా ఉంటూనే అన్నిటినీ దాటుకొని ముందుకు వెళుతుంది. చలించే వస్తువులన్నిటికన్నా దాని వేగం చాలా ఎక్కువ.

ఆత్మ ఇంద్రియాలకు పూర్తిగా అతీతమైనది. ఇంద్రియాలద్వారా మనం ఆత్మను గ్రహించలేమన్నది వాస్తవం. ప్రతి ఉపకరణం నిర్దేశించిన పని మాత్రమే చేయగలుగుతుంది. సూక్ష్మదర్శిని ద్వారా దగ్గరలో ఉన్న వస్తువులను మాత్రమే మనం చూడగలం. దూరదర్శన యంత్రాన్ని ఉపయోగించి... దూరంగా ఉన్న వస్తువులను చూడగలం. అదే విధంగా, ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకోగలవు. ఆంతరిక లోకంలోని సత్యాలను సందర్శించలేవు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేవు. 

ఆత్మ భూత, భవిష్యత్తులకు అధిపతి. ఆత్మస్వరూపుణ్ణి వర్ణిస్తూ ‘‘బొటనవేలి పరిమాణం కలిగి, భూ, భవితవ్యాలకు అధిపతిగా వెలిగే పురుషుడు. ఏ కాలంలోనూ పొగబారని నిర్మలుడు. తేజోమయమైన జ్యోతివంటివాడు’’ అంటుంది కఠోపనిషత్తు. ఆత్మ జన్మించదు, మరణించదు. ఈ లోకాన ఆవిర్భవించిన లేదా జనించిన ప్రతి వస్తువూ అనిత్యం. కాబట్టి వాటిలో షడ్భావ వికారాలు ఉంటాయి. అంటే సూక్ష్మ రూపం (పుట్టుక), స్థూల రూపం (పెరుగుదల) మరింతగా పెరగడం (బలపడడం), రూపంలో మార్పు రావడం, క్షీణ దశ, నాశనం. వీటిలో ఏ భావ వికారాలకూ లోనుకానిది ఆత్మ. అది సూక్ష్మమైన అణువుకన్నా సూక్ష్మమైనది. బ్రహ్మాండం కన్నా పెద్దది. ఆత్మను శరీరంగా భావించి ‘నేను చంపుతున్నాను’ అని ఎవరైనా భావించినా, దేహాన్ని దేనితోనైనా కొట్టినప్పుడు ‘ఆత్మకు గాయమయింది’ అని అనుకున్నా... వారికి ఆత్మతత్త్వంపై అవగాహన ఏమాత్రం లేదని భావించాలి. 

ఆత్మ స్వరూపాన్ని ఎంతో ఘనంగా, విశదంగా పాండవ మధ్యముడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ, ‘‘అర్జునా! మానవుడు జీర్ణ వస్త్రాలను త్యజించి, నూతన వస్త్రాలను ధరించినట్టే, జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి, నూతన శరీరాన్ని పొందుతుంది. ఈ ఆత్మను శక్తిమంతమైన ఏ అస్త్రాలు, శస్త్రాలు ఛేదించలేవు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. వాయువు ఆరిపోయేలా చెయ్యలేదు. ఆత్మ నాశనరహితమైనదీ, నిత్యమైనదీ, సత్యమైనదీ అని, ఆత్మకు జనన మరణాలు లేవనీ, మార్పు అసలే లేదని తెలుసుకో’’ అని చెప్పాడు. ఆత్మ ఇంద్రియగోచరం కానిది. అంతేకాదు, అచింత్యమైనది. అంటే... మన మనసులోని ఆలోచనలకు అందనిది. ప్రతి ఒక్క చలనానికి... అంటే కదలికకు... అచంచలమైనదొకటి ఆధారంగా ఉండాలి. రైలు పరుగెత్తాలంటే కదలకుండా ఉండే పట్టాలు అవసరం. చలనచిత్రం చూడాలంటే... దానికి స్థిరమైన తెర ఆధారంగా ఉండి తీరాలి. లోకంలో సంభవించే చలనాలన్నిటికీ కారణభూతమైనది ప్రాణం. చలించే ప్రాణం పనిచేయడానికి ఆధారంగా నిలిచేది చలించని ఆత్మ. దృగ్గోచరంకాని ఆత్మను వర్ణిస్తూ ‘‘చేరి కానరానివాడు... చింతింపరానివాడు, భారపు వికారాల పాయనివాడీ ఆత్మ’’ అంటారు అన్నమాచార్య. ఆత్మతత్త్వం వర్ణించడం సాధ్యంకానంత అనంతత్వంతో భాసిస్తుంది. ఆత్మ సర్వవ్యాపకమైనది. మహాచైతన్య పదార్థమైన ఆత్మనే... హృదయాంతరికలోకాన వసించే అంతర్యామిగా మనం భావన చెయ్యాలి.

[

మోక్షం అంటే ఏమిటి?

ప్రతీ ప్రాణీ కూడా పాపమో, పుణ్యమో ఏదో ఒక కర్మ శేషం ఉంటేనే ఈ భూమి మీద పుడతాడు. మోక్షం అంటే పాపము మరియు పుణ్యము లేని స్థాయిని చేరడం. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఎత్తవలసినన అవసరం ఉండదు. 

మతం ఏదైనా మతంలో, మోక్షం అనేది ధ్యానం ద్వారా మానవులు సాధించగల ఆనందం మరియు శాంతి స్థితి . బౌద్ధమతం, జైన మతం మరియు హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి , ఎందుకంటే ఇది చేరుకోగల గరిష్ట స్థితిని సూచిస్తుంది. "నిర్వాణ ఫాలసీ" అని పిలువబడే ఆర్థికవేత్త హెరాల్డ్ డెంసెట్జ్ రూపొందించిన ఒక భావన ఉంది, ఇది ఒక వ్యక్తి నిజమైన మరియు  హాత్మక ఎంపికల మధ్య పోలికలు చేసే పరిస్థితిని కలిగిస్తుంది. అదేవిధంగా, బార్బరా లో చే అభివృద్ధి చేయబడిన మానసిక విశ్లేషణ యొక్క సూత్రం కూడా ఉంది, దీనిలో ఉద్రేకాన్ని అణిచివేసే అపస్మారక ప్రేరణ వివరించబడింది.

మోక్షం యొక్క భావన తూర్పు తత్వశాస్త్రం నుండి వచ్చింది. ప్రాచీన భారతీయ భాష నుండి అనువదించబడిన "మోక్షం" అనే పదం "విలుప్తము, విరమణ" అని అర్ధం. కానీ తూర్పు తత్వంలో పాశ్చాత్య అవగాహన కాకుండా, విరమణ మరియు విలుప్త భావాలు సానుకూల అర్థాన్ని కలిగి ఉన్నాయి. వారు ఇబ్బందులు, దుఃఖం, బాధ మరియు జీవితపు స్థిరమైన పోరాటాలను తొలగిస్తారు. నిర్వాణ అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సులో ఒక నూతన లక్షణాన్ని పొందుతుంది. ఈ స్థితిలో, మెదడు ఆలోచనలు, ఆందోళన, కోరికల నుండి స్వేచ్ఛ పొందుతుంది. ఈ వ్యక్తికి కృతజ్ఞతలు ఒక నూతన ప్రపంచం మరియు జీవితం యొక్క అవగాహన తెరుస్తుంది.

మతంలో, మోక్షం అనేది అత్యున్నత స్థానంగా భావించబడుతుంది, దీనిలో మీరు మీ భుజాలపై మోసిన అన్ని బాధలకు మీరు వీడ్కోలు పలుకుతారు , కానీ ఇది మీ స్వంత వ్యక్తిత్వానికి ముగింపు మరియు అది తీసుకువెళ్ళేది (శరీరం, మనస్సు ); స్వచ్ఛమైన, నైరూప్య జీవిగా మారడం ద్వారా, అది మొత్తంలో భాగం అవుతుంది. ఇంతలో, హిందూ మతానికి పైన పేర్కొన్న మాదిరిగానే ఒక నిర్వచనం ఉంది, కానీ ఇది కొవ్వొత్తి యొక్క రూపకాన్ని ఉపయోగిస్తుంది, దీనిలో నిర్వాణ అంతరించిపోయిన మంట అని చెప్పబడింది, ఇది ప్రస్తుతం ఉన్న అన్ని మానవ చెడులను సూచిస్తుంది (కామం, ద్వేషం, అసూయ …); బౌద్ధమతంలో వలె, నైరూప్య జీవి ఉన్నత వాతావరణంలో భాగం అవుతుంది. జైనమతంలో, మరోవైపు, ఈ రాష్ట్రం చివరకు విముక్తి కలిగించేది, దానిని అనుభవించిన వ్యక్తి కర్మ నుండిఅంటే అది ఆధ్యాత్మిక విమానంలోకి వెళుతుంది .

ఈ జన్మలోనే మోక్షం పొందడానికి మనకున్న కర్మ క్షయం అవ్వాలి. అంటే ఎన్నో పూర్వ జన్మలలో చేసిన పాపపు కర్మ మరియు పుణ్యపు కర్మల యొక్క ఫలం మొత్తాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి. మోక్షం పొందడానికి సత్య త్రేతా ద్వాపర యుగాలలో తపస్సు, యజ్ఞాలు, అతికష్టమైన దీక్షలతోనూ, సద్గురువు యొక్క అనుగ్రహంతోనూ మోక్షాన్ని పొందేవారు. దానికి వారి ఆయుష్షు, శరీరం, మనస్సు, ఆ కాల పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండేవి. 

ఇవి కలియుగ మానవులకు సాధ్యం కాని పని. దానికి మన ఆయుర్దాయం సరిపోదు. ఇలా జన్మ జన్మలలో చేసిన కర్మలకు ఫలాన్ని అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తాడు. మళ్ళీ ఎత్తిన ఈ జన్మలలో కూడా పాపాలు, పుణ్యాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ వీటి కోసం ఎత్త వలసిన జన్మల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా జీవి జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు. చేసిన పాపపుణ్యాల ఫలితాలను కాసేపు దుఖం రూపంలో, మరికాసేపు సుఖం రూపంలో అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ, ఒడ్డుకు చేరలేక మునిగిపోతూ ఉంటాడు.

[

మోక్షం అంటే ఏమిటి ? బందాల నుంచి విడుదల అవ్వటం మోక్షం! బందం అంటే ?. ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే! మనం చేసే కర్మ నిష్కామ పూరితమై ఉంటే, అప్పుడు కర్మ ఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ యోగం,జ్ఞాన యోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు! నిష్కామ కర్మే

అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవటానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు.ఇవి కూడా ధర్మాన్ని అనుసరించే ఉండాలి. మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం!.ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని పొందటానికి చేసే ప్రయత్నాన్ని శ్రేయస్సు అంటారు.  మోక్షాన్ని కర్మ, భక్తి , జ్ఞానయోగాల ద్వారా కూడా పొందొచ్చు!  భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం.

జ్ఞానం గురువులాంటిది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ భ్రమలను తొలగిస్తేనే మోక్షం లభిస్తుందని వేమన చెప్పాడు. ఆత్మానాత్మ వివేకమే నిజమైన జ్ఞానం. వివేకం అంటే తెలివితేటలు. తెలివితేటలు కలిగివుంటే జ్ఞానం రాదు. ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ దేని నుండి పుడుతుంది? “నేను” ఎవరు? అని తెలుసుకోవటమే జ్ఞానం. మిగిలినది అంతా అజ్ఞానమే! విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ ఈశ్వరమయమని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అటువంటివాడే భగవంతునికి ప్రియతముడు. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించటమే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ లభించదు . ఘోర తపస్సులు చేసిన ఋషులందరికీ మోక్షం లభించలేదు. మోక్షం లభించటానికి గత జన్మలో చేసిన కర్మ ఫలాలు కూడా కారణం అవుతాయి . ఈ జీవితంలో సత్కర్మలు కూడా చేయాలి. మోక్షం పొందటానికి ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని భగవద్గీత చెబుతుంది . ఈ కర్మలు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి 1. ధర్మబద్ధమైనవి అంటే చేయటానికి నిర్దేశించబడినవి. 2. ధర్మ విరుద్ధమైనవి అంటే చేయటాన్ని నిషేధించినవి. కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం, “కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు”. జనన జరా మరణాల నుండి మోక్షాన్ని పొందగోరినవారు పరమాత్మను ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మస్థితిని పొందుతారు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు అని పైన చెప్పుకున్నాం! జ్ఞాని అయితేనే కర్మ ఫలాలను త్యజించగలడు. కర్మ ఫలాలను త్యజిస్తే జ్ఞానం లభిస్తుంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.

ఇక నిష్కామ కర్మ అంటే మోక్షం కలగాలనే కోరికను కూడా త్యజించటం. మోక్షం కోసం చేసే కర్మలు సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే వాటిలో కోరికలు, ఫలాలను ఆశించటం ఉన్నాయి.అయితే జ్ఞానానికి మనిషిలో అహంభావాన్ని పెంచే(పంచే) లక్షణంవుంది. ఒక యోగ మిత్రుని ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. సాహిత్యాభిలాష (చదవటం,వ్రాయటం,ఏదైనా కావచ్చు) కూడా జ్ఞాన సముపార్జనలో భాగమే కదా! ‘తెలుసును’ అనే భావమే జ్ఞానం.ఆ ‘తెలుసును’ అనే ‘భావం’ ఏర్పడటానికి ఏది మూల కారణమో తెలిసిన రోజున ‘తెలుసును’ అనేది ‘భావం’ గానే మిగులుతుంది! తప్పితే, దానికి ‘అహం’ తోడు కాదు. అది తెలియకపోతే ‘భావా’ నికి ‘అహం’ తోడు కావటం తధ్యం. తెలియటానికి పనికివచ్చే సాధనం మాత్రమే మనలో ఉంది. తెలిసే ప్రక్రియకు మూలకారణం మాత్రం మనం కాదు. నేను తెలుసుకుంటున్నాను అనే భావం కాక, ‘తెలియవలసిన అవసరం నా తత్వానికి ఉంది, తెలుస్తుంది’ అని భావన చేసుకోవాలి.అదే వాస్తవం కూడా! ఒక ప్రఖ్యాత రచయిత గొప్ప శాస్త్రవేత్త కాకపోవచ్చు!అలాగే, ఒక శాస్త్రవేత్త ప్రఖ్యాత రచయిత కూడా కాకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, అన్నీ తెలియవు! ఈ నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటం, తెలియటం అనేది నిత్యం జరిగే ప్రక్రియలు!

అందరికీ అన్నీ తెలియడమనేది ఇప్పుడు నడుస్తున్న సృష్టి విధానంలో అసంభవం. తెలిసే విషయాలలోనూ, తెలిసే విధానంలోనూ, తెలిసే స్థాయిలోనూ కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ తెలియటమనేది వ్యక్తిపరమైనదీ, వ్యక్తి ప్రమేయంతో జరిగేది కాక, సృష్టి పరమైనదీ, సృష్టి ప్రణాళికలోనిదీ! కనుక,ఏయే తత్వమున్న వ్యక్తులకు ఎప్పుడు, ఏది, ఎలా తెలియాలో, తెలియబడాలో, అప్పుడే అవి తెలియబడుతాయి! మనం కోరుకునే జ్ఞానం మరెక్కడో లేదు. అది మనలోనే ఉంది. ప్రయత్నం చేస్తే దాన్ని సులభంగా పొందవచ్చు. మనస్సుకు జ్ఞానం ఉందని తెలుసు. జ్ఞానం విడుదల అయిన తర్వాత మోక్ష మార్గం సులభం అవుతుంది. ఇంద్రియ జ్ఞానమే మోక్షమని కొందరి భావన! కానీ అది మోక్షం కాదు “నేను-నాది” అనుకున్న స్వార్ధమే దుఃఖాన్ని కలిగిస్తుంది. త్యజించబడింది ఏదీ దుఃఖాన్ని కలిగించలేదు. “ఈ శరీరం నేను కాదు” అని అనుకున్న మరుక్షణం ఈ శరీర మరణం మన మరణం కాజాలదు. ఆ స్థితిని పొందటం అంటే మోక్షం లభించినట్లే! నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది.

మోక్షానికి బౌద్ధం ‘నిర్వాణం’ అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. ఐహిక బంధాల నుండి విముక్తి పొందడమే మోక్షం. “మనస్సును, బుద్ధిని నాయందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు. మనస్సు లగ్నం చేయడం చేతకాకపోతే కాకపోతే అభ్యాస యోగంలో ప్రయత్నించు. అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి. అది కూడా సాధ్యం కాకపోతే నన్ను శరణు పొంది నీ సర్వ కర్మ ఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కన్నా ధ్యానం, ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగం శ్రేష్ఠం. త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది.”అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అరటిపండును వలిచిపెట్టినట్లు చెప్పాడు. సహజంగా జీవించటమే మోక్షానికి మార్గం! సహజంగా జీవించటమంటే, కర్మ ఫలాలను త్యజించి ముందుకు నడవటం! మిగిలినవన్నీ అసహజాలే!

No comments:

Post a Comment