ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ: rachayata mallaprada sridevi ramakrishna
ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..
ప్రతి రోజు కధలు చదివి మీరు మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా అందరూ దేశంలో శాంతిని కలగాలని న ప్రయత్నం
01. శ్రీరామ తత్త్వం
శ్రీరాముడు... మానవరూపం ధరించిన మాధవుడు. పుంసామోహన రూపాయ అని కొనియాడబడినవాడు*
తండ్రి మాటను జవదాటక నూనూగు మీసాల ప్రాయంలోనే విశ్వామిత్రుని వెంట యాగసంరక్షణకు పోయినాడు.
గురువు నాజ్ఞ శిరసా వహించి సీతాస్వయంవరం లో పాల్గొనినాడు.
రాజధర్మం గా శివుని విల్లును ఎక్కుపెట్టి వీరత్వమును చాటినాడు.
జనకుడు సీతానిచ్చి వివాహము చేయబోగా, తల్లిదండ్రుల అనుమతి కావాలని చెప్పినాడు.
వివాహమై, సకల భోగాలు అనుభవిస్తూ, పట్టాభిషేకం జరగబోయే సమయాన, పినతల్లి కోరికపై అరణ్యవాసం చేసినాడు.
దుష్ట రాక్షస సంహారం చేసి, జనస్థానమున మునివాటికలకు ఆపదలను మాపినాడు.
శూర్పణఖ మూలంగా, రావణునిచే సీతాపహరణం జరుగగా , తనవలె రాజ్యమును, భార్యను కోల్పోయిన సుగ్రీవునితో చెలిమి చేసినాడు.
స్థిరము లేని కోతుల సహాయముతో అలవికాని సంద్రముపై సేతువు నిర్మించి శత్రు పురంపై దండెత్తినాడు.
నిజధర్మమును చాటగా శత్రువును చెండాడి, అగ్నిపునీతను తిరిగి స్వీకరించినాడు.
జన హితము కోరుచు నిజసతిని తిరిగి వనవాసమునకు పంపినాడు.
స్థూలంగా చూస్తే రామాయణం ఇదే...
ఇక్కడ సూక్ష్మ పరిశీలన జరగాలి.
ద్వారపాలకులను తన దగ్గరకు చేర్చుకోవాలి. భూమిపై ఒక ధర్మ మార్గాన్ని ఆచరించి చూపి, మార్గదర్శకునిగా నిలవాలి. చెప్పినపుడు కాకుండా చేసి చూపించితేనే ఏదైనా కాలపరీక్షకు నిలుస్తుంది.
శాపవశాత్తు విష్ణు వైరిగా జన్మించిన రావణుడు మహాపండితుడు, వేదవిజ్ఞాని, వేదప్రోత్సాహి, మహావీరుడు, పులస్థ్యబ్రహ్మ మనుమడు, పార్వతీదేవి స్వయంగా పాలిచ్చిన సుమాలికి మేనల్లుడు.
సనక సనందాదుల శాపం, నంది శాపం ఫలితంగా మానవులు, వానరులచే మాత్రమే రావణునకు ప్రాణహాని.
మానవుడైన రాముడు , వానరులతో కలిసి మాత్రమే చేయదగిన పని కనుక, అసాధ్యమైన పనిని ఎలా సాధించాడో చూద్దాం.
'మానవమాత్రుద
సర్వంతర్యామిత్వం , సమస్త వీక్షణ (మొదట సీత ఉన్న చోటుకి రావణుడొచ్చే సమయము నిర్ధారించలేడు )
అలాగే తన మరణానికి సీత అపహరణం ఒక గాలం ఔతుందని అనిపిస్తే రావణుడు వెనక్కి తగ్గవచ్చు.
అలాగాక అతడిని ఒంటరిగా దండకారణ్యంలో సంహరిస్తే, లంకలో ఉన్న మిగతా 'దుష్ట ' రాక్షసులు మిగిలిపోతారు. మరి ఎలా!
'నా వంశంవాడే నిన్ను ఓడించి సంహరిస్తాడు' అని కొన్ని తరాలముందే కాకుత్స వంశీకుడు రావణుడికి శాపమిచ్చి ఉన్నాడు. నిన్ను ఓడించి అంటే ఆయన కోటను ముట్టడించాలి గదా. అప్పుడే గదా ఆ శాపం పూర్తిగా నెరవేరుతుంది? అందుకే రఘు వంశంలో పుట్టి లంకకు వెళ్ళే మార్గం చూసుకున్నాడు.
మరి రావణునితో విరోధమెలా? అందుకే సీతాపహరణం జరగాలి. గనుక తను అడవికి వెళ్ళాలి, అది కూడా రావణునికి దగ్గరగా- దండకారణ్యం రావణుడి కట్టుబడిలో ఉంది.
అందుకే రాత్రికి రాత్రే పట్టాభిషేకాశక్తి దశరధుడికి కలిగినా, అందులో కైకేయికి సందేహం ఉధ్బవించి రాముడికి గద్దెగాక అడవికి వెళ్ళే ఆజ్ఞ వచ్చి, ఆ పనికి బయలుదేరాడు. వీటన్నిటికీ తరువాతే ఆయన సామాన్య మానవుడు అయ్యాడు. రాజకుమారుడో, రాజో కాదు. దేవుడు అంతకంటే కాదు. (రావణ వరాల నేపధ్యంలో).
ఇక ఖర,దూషణ సంహారం. లక్ష్మణుని ద్వారా జరిగితే రాక్షసులు తనని, జానకిని, వదిలి లక్ష్మణుని మీద మాత్రమే పగపట్టవచ్చు. అందుకే కాబోలు లక్షణుడు ఎంత అడిగినా "నీవు సీతతో ఆ గుహలో ఉండు" అని వారందరినీ ఒక్కచేతితో సంహరించాడు. తద్వారా, రావణ సంహారానికి అంకురార్పణ జరిగింది.
సీతాదేవి ప్రేరేపణ వల్లే మొదట శ్రీరాముడూ, పిదప లక్ష్మణుడూ పర్ణశాల వదలి వెళ్ళారు.
రాముడి శక్తి సీత, రాముడి సంకల్పం, ఆచరణ, క్రియా సీత. ఆమెకు రాముడి మనస్సు, అతని లక్ష్యం తెలుసు. (రాక్షస, రావణ సంహారం. లంకా విమోచనం).
అందుకే 'ఆమెను ' ముందుంచుకొని, 'ఆమె ' ద్వారా, 'ఆమె కోసం అంటూ ఇంత కథ నడిచింది. అదే మరి సీతారాములు ఆదర్శ దంపతులనటానికి రహస్యం. అదే ఆదర్శ దాంపత్యరహస్యమూ, సారమూనూ.
భర్త లక్ష్యం తెలుసుకొని, ఆ లక్ష్య సాధనకై ఆయన మనసులో ఉండగానే, గ్రహించి గ్రంధం నడిపింది సీత. అందుకే విజ్ఞులు, రామాయణంలో అసలు సూత్రధారి సీత అంటారు. అది సత్యం.!!
సీతాన్వేషణకో, తదుపరి లంకపై దండయాత్రకో రాముడు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి లేక సైన్యం పైనో, దేవ/ దైవీక శక్తిమీదా ఆధారపడలేదు. కావలసిన సంబారాలను, తన విద్య - తన సోదరుని సహకారంతో వెళ్లే దారిలో, సుగ్రీవునితో స్నేహం ద్వారా, హనుమంతుని ప్రేమతో వానర సైన్యాన్ని సమకూర్చుకున్నాడు.
అందుకావలసినవన్నీ చేశాడు. కబంధ వధ, వాలివధ. కబంధుడు బాధించాడు తన, లక్ష్మణ రక్షణార్ధం చంపాడు. వాలివధ ?- రావణ సంహరణమనే గొప్ప విషయసాధనకై చేశాడు.
అసలు ప్రపంచంలోని వానరజాతులన్నిటినీ ఒక్క త్రాటిలోకి తేవడంతో రావణసంహార బృహన్నాటకం లో దేవాంశ సంభూతుడైన వాలి పాత్ర ముగిసింది. ఆ ముగింపు రామునిచేతిలోనే జరిగింది.
సుగ్రీవునిమించిన బలవంతుడైన వాలి సహాయమే రాముడు తీసుకోవచ్చు. తద్వారా, ఓ మూడు నాలుగు మాసాలు మిగిలేవికదా.
అయితే రావణుడుచేసిన తప్పే- మరొకని భార్యని కాంక్షకోసం ఎత్తుకెళ్ళడం –వాలీ, చేశాడు. కనుక రాముని మనస్సులోని బాధా అవమానం/ క్రోధం, వాలి అర్ధం చేసుకోలేడు. ప్రాణానికి ప్రాణమైన సోదరుడు చెప్పేది గూడ వినిపించుకోక పగపట్టాడు. కనుక అంత ఆధారపడ తగ్గవాడు కాదు.
ఒక విధంగా పరమాత్మ తత్వంగా రాముడు చేసిన ఒకే ఒక కార్యం, ఆత్మని వెతుకుతూ పరమాత్మ రావడం.
రావణసంహారం జరిగింది, దుష్ట శిక్షణతో పాటు శిష్ట రక్షణ కూడా జరిగింది. విభీషణునికి శరణాగతి లభించింది.
కాబట్టి సంకల్పబలం, మనోధైర్యం ఉంటే చిన్న చిన్న వస్తువులతోనే పెద్దకార్యాలు సాధించవచ్చు అని రామాయణం తెలియజేస్తుంది.
రామతత్వం చేసి చూపించినది. చూపి ఒప్పించినది కాదు. నాడు, నేడు కూడా రామ బాట రాచబాట*
02. నే డు గు రు పూ ర్ణి మ!
దీనినే వ్యాసపూర్ణిమ అంటారు.భారతసంస్కృతికి మూలకందమైన వ్యాసమహర్షి సంస్మరణతో మనమీరోజు కార్యక్రమాన్ని ప్రారంబిద్దాం!
వాల్మీకి ,వ్యాసులు భారత సంస్కృతీవైభవానిికి ప్రతీకలు,రూపురేఖలు దిద్దినవారు.
వాల్మీకి రామాయణకావ్యరచనతో రసమయమైన,ధార్మికమైన రామచరితకు ప్రాణంపోసి భారతీయసాహిత్యలోకానికి,సాంఘికనియమ జీవనరీతులకు రూపురేఖలుదిద్దగా,
వ్యాసుడు భారతీయ ధార్మిక జీవనగతులకు భారతగ్రంధరచనద్వారారూపురేఖలుతీర్చిదిద్దాడు.సుమారు లక్షశ్లోకాలతో 18 పర్వముల భారతేతిహాసాన్నిరచించి,భారతీయధార్మికజీవనవిధానానికి మార్గదర్శియైనాడు.
గజిబిజిగా నున్నవేదరాసిని వింగడించి,ఋక్,యజుర్,సామ,అధర్వణ,ములనుపేర చతుర్వేదముల నేర్పరచి వైశంపాయనాది శిష్యులచే వానిని ప్రచారమునకు దెచ్చెను.
వ్యాసముని,యొనర్చిన వాఙ్మయపరమైనకృషిమిగులగొప్పది. 18పర్వములునిడివియైన మహాభారతేతిహాసమునేగాక,
భాగవతమును,18పురాణములను రచించి భారతసంస్కృతికి చక్కని పునాదులను నిర్మించెను.
అందువలన వ్యాసుడు జగద్గురువు.అపరవైష్ణవావతారము.ఆమహనీయునికుడుగరగా,నేడాతనిని మనసార స్మరించితరింతముగాక!!
నమో వ్యాస పరమాత్మనే సద్గురవే నమోన్నమః!!!
వ్యాసంవశిష్టనప్తారం
శక్తేఃపౌత్రమకల్మషం
పరైశరాత్మజంవన్దే
శుకతాతం తపోనిధిం!!
వ్యాసాయ విష్ణూపాయ!
వ్యాసరూపాయవిష్ణవే!.
నమోవై బ్రహ్మనిధయే!
వాసిష్టాయనమోనమః!
అచతుర్వదనోబ్రహ్మా!
ద్విబాహురపరోహరిః!
ఆఫాలలోచనఃశంభూ!
భగవాన్బాదరాయణః,!!
"నమోస్తుతే వ్యాస!
విశాలబుధ్ధే!
ఫుల్లారవిందాయచ
లోచనాయ!
ఏనస్వయం భారతతైవపూర్ణం
ప్రజ్వాలితో జ్ఢానమయ
ప్రదీపః!!
శ్రీ సత్యనారాయణ.చొప్పకట్ల
శ్రీ కృష్ణ ప్రేమ లీలా అమృతం (1)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రేమంటే ఏమిటి అనిఅన తెలిపేటి
మహనీయు డెవరని నేను అన్న
మనసు వికసిత వేదము మాత్రము
సర్వమంగళ మును తెల్పు చుండు
మోన రాగము హృదయము తాకగా
పులకించు మనసున ప్రేమ ఉండు
చెప్ప లేనట్టి తపనల బావము
చూపులతో పిల్వ లేని మాయా
ప్రేమ అంటే ను మనుసులో దాగి ఉండి
హావ భావాలు కలిగిన హృదయ ముండి
నిత్య సత్యాలు తెల్పేటి మహిళ తీర్పు
తెల్పు మల్లాప్రగడ నిత్య సత్య బోధ
--(())--
03. ఒక్క పల్లెటూరు లో kadha
ఒక్క పల్లెటూరు లో ఒక్క హోటల్ ఉంది...
అక్కడకి ఒక్క సినిమా వాళ్ళు ఒక్క 40మంది వచ్చారు అందరు వచ్చి రాగానే ఆ హోటల్ లో జనం అంత చుట్టూ చూస్తున్నారు సినిమా వాళ్ళని.
సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయపోతూన్నారు...
అందరు హోటల్ లో కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్ గారు వచ్చారు...
అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్ గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాత ఇటురా అని పిలిచాడు...
ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు...
తాతచేసా బాబయ్య అని చెప్పాడు...
మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు...??
అదేం లేదు బాబయ్య అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు...
మరి ఏంటి ఏమైనా డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...
అదేం లేదు బాబయ్య.. నేను ఒక్కటి అడగాలి అనుకుంటున అడగనా బాబయ్య...??
సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...
మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా ఎవరేనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే
ఏం చేస్తారు బాబ్బయ్య...??
ఏముంది అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు...??
అప్పుడు ఆ తాత మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??
అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...
అపుడు తాత అడిగాడు మీరు ఇంత మంది ఇక్కడ భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల
మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు.అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...
దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...
అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా
కట్టిస్తారు...
కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా రాబందులు మమల్ని పీక్కు తింటున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??
డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు...??
తాత చెప్పాడు కోట్లు ఉన్న కోటీస్వరుడు అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు,దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు...
కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఎదో ఒక్కసారి అయినా మమల్ని గుర్తు చేసుకోకపోయినా
వాడి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటయీ అని చెప్పాడు...
అందుకే బాబు ఇందాక మీరు సగం అన్నం లో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...
ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే రైతు ఉన్నాడు . మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం
భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...
ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...
NOTE: ఇదంతా మీకు సోది లా అనిపించోచ్చు కానీ రోజు అన్నం లేక ఎంత మంది చనిపోతున్నారో
ఇక్కడ ఎంత మంది కి తెలుసు...???
మనకి భోజనం సమయానికి వస్తుంది కాబట్టి మనకి తెలియట్లేదు..
అదే రాకపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది... తినే వాడికి ఏం తెలుసు వండే వాడి బాధ,పండించే వాడి
ఆవేదన..........!!!
ఇది మాలాంటి రైతుల ఆవేదన
--(()0--
04. Very interesting
If:
A = 1 ; B = 2 ; C = 3 ; D = 4 ;
E = 5 ; F = 6 ; G = 7 ; H = 8 ;
I = 9 ; J = 10 ; K = 11 ; L = 12 ;
M = 13 ; N = 14 ; O = 15 ; P = 16 ;
Q = 17 ; R = 18 ; S = 19 ; T = 20 ;
U = 21 ; V = 22 ; W = 23 ; X =24 ;
Y = 25 ; Z = 26.
Then,
H+A+R+D+W+O+R+K
=8+1+18+4+23+15+18+11
= 98%
K+N+O+W+L+E+D+G+E
=11+14+15+23+12+5+4+7+5
=96%
L+O+V+E
= 12+15+22+5
= 54%
L+U+C+K ;
=12+21+3+11
= 47%
None of them makes 100%.
Then what makes 100%?
Is it Money?
.
.
.
NO!
M+O+N+E+Y
= 13+15+14+5+25
=72%
Leadership?
.
.
.
NO!
L+E+A+D+E+R+S+H+I+P
=12+5+1+4+5+18+19+8+9+16
=97%
Every problem has a solution, only if we perhaps change our
"ATTITUDE"...
A+T+T+I+T+U+D+E ;
1+20+20+9+20+21+4+5
= 100%
It is therefore OUR ATTITUDE towards Life and Work that makes
OUR Life 100% Successful.
Amazing mathematics
With each alphabet getting a number, in chronological order, as above, study the following, and bring down the total to a single digit and see the result yourself
Hindu -
S h r e e K r i s h n a
19+8+18+5+5+11+18+9+19+8+14+1
=135
=1+3+5 = 9
Muslim
M o h a m m e d
13+15+8+1+13+13+5+4
= 72
= 7+2 = 9
Jain
M a h a v i r
13+1+8+1+22+9+18
=72
= 7+2= 9
Sikh
G u r u N a n a k
7+21+18+21+14+1+14+1+11
=108
=1+0+8 = 9
Parsi
Z a r a t h u s t r a
26+1+18+1+20+8+21+19+20+18+1
=153
=1+5+3 = 9
Buddhist
G a u t a m
7+1+21+20+1+13
=63
= 6+3 = 9
Christian
E s a M e s s i a h
5+19+1+13+5+19+19+9+1+8
=99
9+9=18
1+8 = 9
Each one ends with number 9
THAT IS NATURE'S CREATION TO SHOW THAT GOD IS ONE !!!
--(())--
05. నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు
బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు
రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ
నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.
చేదు నిజం ఏమంటే, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,
టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి.
రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే,
దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.
ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో
నేతల పంటలకు అగ్గి తగులుతుందో ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.
25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు.
కానీ,
ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.
ఇలా ఎందుకు ఇవ్వాలి?
నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.
కానీ,
భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?
రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.
కాని,
మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.
రైతు తినేది దొంగ సొమ్మా?
నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం.
విద్యలో రాజకీయం 100%
రాజకీయంలో విద్య 00%
ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.
ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది.
దేశంలోని ప్రతిభావంతులేమో
వలస పక్షులు అవుతున్నారు.
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.
₹399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?
ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?
అందరూ ఆలోచించాలి.
దయచేసి మన దేశంలోని ఇలాంటి దరిద్ర వ్యవస్థ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
--(())--
-6. ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి..?
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే స్వామి.
ఆంజనేయుడు, మారుతి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. స్వామివారికి సంప్రదాయానుసారంగా శ్రీసీతారామ స్తుతి అత్యంత ప్రీతికరమైనది.
రక్షణకు, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.
ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి:
1. హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన.
2. ఆంజనేయ స్తోత్రం: మనోజవం మారుత తుల్య వేగం.. వంటి శ్లోకాలతో కూడినది. ఇందులో అన్ని శ్లోకాలూ ప్రసిద్ధం.
3. శ్రీ ఆంజనేయ మంగళస్తుతి: వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, పూర్వాభాద్రాప్రభుతాయ మంగళవారం శ్రీ హనుమతే..
4. శ్రీ మారుతీ స్తోత్రం: ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయి శ్రీమతే..
5. సుందరకాండ: సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.
6. హనుమత్పంచరత్న స్తోత్రం: శంకర భగవత్పాదుల విరచితం.. వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్.
7. హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రం.
8. ఆంజనేయ మంగళాష్టకం.
9. హనుమన్నమస్కార: గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ రామాయణమహామాలారత్నం వందేనిలాత్మజమ్.
10. ఆంజనేయ దండకం: శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం.. అని సాగే ఈ దండకం తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది.
-- వరలేఖరి.నరసింహశర్మ.
దేవుడు కలలో కనిపిస్తే ఏమౌతుందో తెలుసా?
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
👉 కష్టమొచ్చినప్పుడు అందరం దేవున్ని తలుచుకుంటాం. మనకు దేవుడు వివిధ రూపాల్లో మార్గాల్లో సహాయం చేస్తాడు. మానన ప్రయత్నం ఉంటే తాను కూడా ఓ చెయ్యి వేస్తాడు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. దేవుడు కలలో కనిపించి మనకు కొన్ని సందేశాలు అందిస్తాడు. మనకు దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం.
👉 మీరు ప్రయత్నాలు చేసి ఏ విషయంలోనైనా నమ్మకాన్ని కోల్పోయుంటే అది నెరవేరబోతోందని అర్థం. మీ పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. మీరు నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతుంటే దేవుడు కలలో కనిపించి సందేశం ఇస్తాడు. మీ అంతరంగాన్ని నమ్మండి అని సూచిస్తాడు. మీ అంతరాత్మ ఏది చెబితే అది చేయాలి. దేవుడు కలలో కనిపిస్తే మీపై, మీ కుటుంబంపై దేవుని కరుణా కటాక్షాలు ఉన్నట్లు లెక్క.
👉 మీ సమ
స్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని అర్థం. దేవుడు కలలో కనిపించినప్పుడల్లా ఏదో మంచే అని భావిస్తే తప్పు. దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా కలలో కనిపిస్తాడు. ఏదైనా మ్రొక్కుబడి తీర్చకపోతే వెంటనే తీర్చమని గుర్తు చేస్తాడు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చాల్సి ఉంటుంది.
--(())--
07. దేవుడు కలలో కనిపిస్తే ఏమౌతుందో తెలుసా?
👉 కష్టమొచ్చినప్పుడు అందరం దేవున్ని తలుచుకుంటాం. మనకు దేవుడు వివిధ రూపాల్లో మార్గాల్లో సహాయం చేస్తాడు. మానన ప్రయత్నం ఉంటే తాను కూడా ఓ చెయ్యి వేస్తాడు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. దేవుడు కలలో కనిపించి మనకు కొన్ని సందేశాలు అందిస్తాడు. మనకు దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం.
👉 మీరు ప్రయత్నాలు చేసి ఏ విషయంలోనైనా నమ్మకాన్ని కోల్పోయుంటే అది నెరవేరబోతోందని అర్థం. మీ పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. మీరు నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతుంటే దేవుడు కలలో కనిపించి సందేశం ఇస్తాడు. మీ అంతరంగాన్ని నమ్మండి అని సూచిస్తాడు. మీ అంతరాత్మ ఏది చెబితే అది చేయాలి. దేవుడు కలలో కనిపిస్తే మీపై, మీ కుటుంబంపై దేవుని కరుణా కటాక్షాలు ఉన్నట్లు లెక్క.
👉 మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని అర్థం. దేవుడు కలలో కనిపించినప్పుడల్లా ఏదో మంచే అని భావిస్తే తప్పు. దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా కలలో కనిపిస్తాడు. ఏదైనా మ్రొక్కుబడి తీర్చకపోతే వెంటనే తీర్చమని గుర్తు చేస్తాడు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చాల్సి ఉంటుంది.
--(())--
08. శ్రీవల్లికి గల పేర్లు:
1 అమృత స్వరూపి, 2 అమృతానంది; 3 ఇచ్చాశక్తి, 4 లావణ్య, తులోత్తమ; 5 కళాలత; 6 రక్షకనారి! 1 కిరాతకుల గోలకము, 8 కిరాతలక్ష్మి, 9 సంతానమాత; 10 సుజ్ఞాన రంభ, 11 జ్యోతి ప్రకాశ కిరణ్మయి, 12 జ్ఞానతపోగ్ని; 13 భట్టారిక, 14 సోరీవాయః , 15 మృగ గర్భవాసిని; 16 మాయాదేవి; 17 త్ర్యక్షరి 18 మూలజ్ఞానశ్రీ 19 కిరాతపతి తనయ; 20 వేద్యస్వరూపి; 21 ఆపరేశ జ్ఞానవల్లి 22 లవలీ
శ్రీ సుబ్రహ్మణ్యుని అద్భుత నామావళి:
********
, 1) దాస రక్షక : 2) సంకష్టహరుడు, 3) వేదసారస్వరూపి 4) సహస్రక స్కంద; 5) హారాధరుడు; 6) మకరందభక్తుడు 7) బధిరదేవసోదరుడు; 8) నిత్యయవ్వనుడు; 9) దేవతా చక్రవర్తి 10) విద్యాసాగరతీరపండిత; 11) కవీశ్వతసహాయక చక్రవర్తి, 12) కవిరాజ దేవమ; 13) బాలగురు నాధ; 14) కిరాతవపుషమూర్తి; 15) సకలకళాధరుడు; 16) సత్య వాక్యపరిపాలకుడు; 17) త్యక్ష రీభాషా దురంధరుడు'; 18) జాన పండితస్వామి; 19) ఏతాగుడు; 20) నారద అవినదుడు 21) బాలనాధుడు ; 22) త్ర్యక్షరీభాషా వినోదుడు; 23) ము క్తిటబుడు 24) మురుగానందం, 25) సంపూర్ణ సేవకుడు 26) వర్గభృత్యుడు ; 27) తారకారి.
ఈ అపురూపమైన శ్రీవల్లి! శ్రీ సుబ్రహ్మణ్యుల నామాపళిని నిత్య మూ స్మరించువారికి (మిగిలిన మంత్రములు చదవ వీలు కాకపోయి ననూ) సర్వ సౌఖ్యములొనగూరునని ప్రాజ్ఞుల అభిప్రాయము.
--(())--
09. పూర్వ కాలంలో దేవాలయములు నిర్మించేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుండేది.
ఉదాహరణకు కొన్ని :
1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది చిదంబరం నటరాజ స్వామి.
2. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు (ధనుర్దారిగా చెక్కబడిన స్తంభం) కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది. (అంతరార్ధం అర్ధమైనదనుకుంటాను)
3. ధర్మపురి (తమిళనాడు)
మల్లికార్జున స్వామి కోవెలలో నవంగా మంటపం (అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట) లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.
4. కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.
5. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో.
6. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది.
అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.
7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.
8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.
9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు
10. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.
11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది
14. ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో ఉంటాయి.
ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన దేవాలయాలలో వున్నాయి.
--(())--
naaku nachhina kadha
01. నలభై ఏళ్ల వయసులో ఉన్నతవిద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలనే సమాజం గమనిస్తుంది.
ఏభై ఏళ్ల వయస్సులో...
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.
అరవై ఏళ్ల వయసులో..
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. పదవీవిరమణ తర్వాత బంట్రోతుకూడా పలకరించకపోవచ్చు.
డెబ్బై ఏళ్లవయస్సులో..
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే.. కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.
ఎనభైఏళ్ల వయస్సులో..
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా .. స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.
తొంభైఏళ్ల వయస్సులో..
నిద్ర మెలుకువ రెండూ ఒకటే. సూర్యోదయం.. సూర్యాస్తమయం.. రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.
అందంతో వచ్చే మిడిసిపాటు.. ఆస్తులతోవచ్చే అహంకారం..
కులమతాలు పదవులతో గౌరవాన్ని ఆసించటం.. కాలగమనంలో మనకళ్లముందే కనుమరుగయ్యే సత్యాలు.
సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే. అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ..
అనుబంధాలను పదిల పరుచుకుంటూ..
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం....
--(())--
నాకు చాలా బాగా నచ్చింది మీతో పంచుకోవాలనిపించింది
No comments:
Post a Comment