
ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ:
సేకరణ ... రచయత . సంపాదకులు . మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..
ప్రతి రోజు కధలు చదివి మీరు మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా అందరూ దేశంలో శాంతిని కలగాలని ప్రయత్నం
ఆదిశంకరుల అవతారోద్దేశ్యమూ, వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కంచి మహాస్వామి చంద్రశేఖర సరస్వతీ స్వాములు చేసిన వివరణలోని కొన్నిభాగాలలోని విషయాలు, రోజూ భక్తి శ్రద్ధలతో మననం చేసుకుందాం. ఇది వ్యాసాలుగా ఉంటుంది. జీవిత చరిత్ర లాగా వుండదు. గ్రహించగలరు.
ప్రవృత్తి-నివృత్తి.
వేదాలు, ప్రవృత్తి, నివృత్తి అని రెండుమార్గాలు చూపించాయి. ప్రపంచ విషయాలను ధార్మికంగా నిర్వర్తించడం ప్రవృత్తి మార్గం. ప్రాపంచిక విషయాలకు దూరంగావుండి జననమరణ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా విముక్తుడగుట, పరమాత్మలో ఐక్యమగుట నివృత్తి మార్గము.
వేదాలలో చెప్పిన ధర్మాల ఆధారంగా, వర్ణాశ్రమ ధర్మాలతో, తన శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు చూసుకుంటూ ఆచరించేది ప్రవృత్తి మార్గం. ఈ వ్యవహారాలలో, పుణ్యం సంపాదించి స్వర్గలోకానికి వెళ్లిన జీవుడు, పుణ్యఫలం క్షీణించగా, సంచిత కర్మల బట్టి మరల మానవజన్మ ఎత్తడం జరుగుతుంది. అంటే స్వర్గసుఖాలు శాశ్వతం కాదని అర్ధమైంది కదా ! భూమి మీద గానీ, స్వర్గం లో గానీ శాశ్వతసుఖాలు లేవు. ఇక్కడా, అక్కడా భయం దుఃఖం క్రోధం మామూలే ! ఇక ఇంద్రియాల వలన కొన్నివిషయాలలో పొందే ఆనందం లోపలున్న ఆత్మకు సంతోషాన్ని ఇచ్చేవేనా ? ఆత్మ తృప్తి కలుగుతుందా ?
అందుకనే, అఖండ ఆనందం అనుభవించాలంటే, నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. అంటే ఏమి చెయ్యాలి ? సంఘానికి దూరంగా వుండి ఆత్మధ్యానాన్ని ఎల్లప్పుడూ చేస్తూ, అదే బ్రహ్మమనే భావనలో సమాధిస్థితిలో వుండిపోవాలి. కొందరు లౌకికసుఖాలను అనుభవిస్తూ, అమాయకంగా, ' బ్రహ్మానందం అనుభవిస్తున్నాను. ' అని చెబుతూ వుంటారు. నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే కలుగుతుంది. ఇది వేదాలు చెప్పినమాటే. ' నివృత్తిమార్గం వలననే పరమసుఖం సాధ్యం. ' అని వేదాలలోని విషయముల తాత్పర్యం.
🕉🌞🌎🌙🌟🚩
5-కంచి మహాస్వామి వారి ' శంకర విజయము '
🕉🌞🌎🌙🌟🚩
ఆదిశంకరుల అవతారోద్దేశ్యమూ, వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కంచి మహాస్వామి చంద్రశేఖర సరస్వతీ స్వాములు చేసిన వివరణ
రెండుమార్గాల ఉపదేశాలు.
సాధారణ ప్రజలు యోగ, వేదాంత, మీమాంసల మీద దృష్టిపెట్టరు. అయితే, కొద్దిపాటి భక్తితో వుంటారు. ఏదో ఒకశక్తి మనలను నడిపిస్తున్నదనీ దానిని నమ్ముకుంటే ధనము మొదలైనవి లభిస్తాయని అనుకుంటారు. భౌతిక ప్రయోజనాలే వారికి ముఖ్యం. వాటికోసమే ప్రయత్నిస్తూ, ఈశ్వర అనుగ్రహం కోసం పరితపిస్తూ వుంటారు. ఉన్నది ఒక్కదేవుడే అయినా అనేకమంది దేవతలు వివిధ ఫలాలు యిస్తారని వీరు గాఢంగా నమ్ముతారు.
వీరిని చూసి కొందరు ఇది భక్తి కాదు, వ్యాపారం అని గేలిచేస్తున్నా లెక్కచేయక, భక్తి కలిగివుంటారు ఈవర్గం వారు. ఇందులో కూడా కొందరు అక్రమ మార్గాలను తొక్కి కర్మయగాన్ని మీమాంసకులు భ్రష్టు పట్టించినట్లు, భక్తి యోగాన్ని దిగజారుస్తున్నారు.
సత్వగుణంతో వున్నవారు దేవతలను, రజోగుణంతో వున్నవారు,యక్ష రాక్షసులను, తమోగుణముతో వున్నవారు, భూత ప్రేతాలను కొలుస్తారని భగవానుడు గీతలో శలవిచ్చాడు కదా ! రానురాను కొందరి వలన భక్తిమార్గంలో క్రూర కర్మలు, నరబలులూ ప్రవేశించాయి.
సాధారణంగా ఆలోచిస్తే, ప్రవృత్తి, నివృత్తి మార్గాలు పరస్పర విరుద్ధాలు అయినప్పుడు, మూడవమార్గం వుండే అవకాశం లేదుకదా ! భక్తి వుండడం అనేది సాధారణం కనుక భక్తిమార్గమునాకు సంబంధించిన కర్మ జ్ఞాన మార్గాలని భగవానుడు పేర్కొన్నాడు. కొందరు భక్తులు కర్మమార్గాన్ని, జ్ఞానమార్గాన్ని వదిలి, కేవలం భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ ఆయన అనుగ్రహం కోసం చూస్తుంటారు. కొందరు ప్రవృత్తి మార్గంలోనే వుండి జ్ఞానాన్ని, నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని గురువులను అడుగుతుంటారు. ఎవరికైనా చిత్తశుద్ధి ఏకాగ్రత కావాలి. ఈశ్వరస్మరణే ఎవరికైనా మార్గం.
ఇక చాలామంది కర్మలను యోగంలాగా చేయకుండా, కేవలం ఫలాలని ఆశిస్తూ, కొబ్బరికాయలు కొట్టడం, అంగప్రదక్షిణలు చెయ్యడం మొదలైనవి చేస్తూ వుంటారు. భగవంతుడిని ఏదైనా కోరుకోవడం భక్తిలో భాగమని వారు భావిస్తారు. వారు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నా కొందరు, తాము భగవంతుని శ్రద్దగా పూజిస్తున్నాము కాబట్టి, తమను దేవుడు అనుగ్రహిస్తాడని భ్రమలో వుంటారు.
భక్తిని అభ్యసించడానికి కూడా వేదాలలోని ఉపాసనాకాండ అనుసరించాలని కొందరంటారు. గీతలో కర్మ భక్తి జ్ఞాన యోగాలు వరుసగా చెప్పబడినాయి కదా !
🕉🌞🌎🌙🌟🚩
6.కంచి మహాస్వామి వారి ' శంకర విజయము '
🕉🌞🌎🌙🌟🚩
భక్తిని అభ్యసించడానికి కూడా వేదాలలోని ఉపాసనాకాండ అనుసరించాలని కొందరంటారు. గీతలో కర్మ భక్తి జ్ఞాన యోగాలు వరుసగా చెప్పబడినాయి కదా !
గీతలో యోగములు
భగవద్ గీతలో 18 అధ్యాయాలలో ప్రతిదానికీ యోగం అని చెప్పబడింది కదా ! మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం. విషాదం యోగం ఎలా అయింది ? అసలు ఈ అధ్యాయాల పేర్లు ఎవరుపెట్టారు ? ఉపదేశించింది భగవానుడు అని నమ్మితేచాలు. ఎందుకంటే వ్యాసుడు కూడా విష్ణువు అవతారమే కదా !
ఆత్మ గురించి అర్జునుడు ఆలోచించకపోవడం వలననే ఇది విషాదయోగం అయింది. అంతకు ముందు ఓటమి లేకుండా విజయుడుగా పేరు తెచ్చుకున్నా, యుద్ధరంగంలో బంధువులను చంపడంకంటే, భిక్షాటనం చేసుకుని జీవించడం మేలని తలచాడు. కానీ అది పరిపక్వముగా అలోచించి చెప్పిన మాటకాదు. అజ్ఞానంతో కూడిన మమకారంతో వాళ్ళు తన వాళ్ళని భావిస్తూ బెంబేలుపడ్డాడు. అయితే, శ్రీకృష్ణుడు అతని ధోరణికి ఒప్పుకోక గీతోపదేశం చెయ్యవలసి వచ్చింది. ఆ విధంగా శ్రీకృష్ణునకు మంచిమాటలు చెప్పే అవకాశం వచ్చింది. ఇతని తాత్కాలిక విషాదం వలన మంచే జరిగింది కాబట్టి అది విషాదయోగం అయింది.
పరమాత్మతో సంపర్కం వున్న ఏసంఘటన అయినా అది యోగంగా మారుతుంది. లోకంలో వాడికి యోగం బాగుండబట్టి బాగా సంపాదించాడురా అంటాం. అంటే ఏమిటీ ? అన్నీ కలిసి వచ్చి యోగం అయిందన్నమాట. అన్నింటికంటే, పరమాత్మతో ఐక్యం కావడం గొప్పయోగం.
అద్వైతం శాశ్వతయోగం.
ఎట్టి దూరం లేకుండా పరమాత్మతో కలిసివుండడమే అద్వైతం. ఏమాత్రం ఎడం వున్నా, ఐక్యతకు భంగం కలుగుతుంది. అదే జీవబ్రహ్మ అభేదం. అది పట్టుబడడం యుద్ధభూమిలో వున్న క్షత్రియ యోధుడైన అర్జునునికి కష్టమని ముందుగా కర్మయోగాన్ని దాని గొప్పదనాన్ని భగవానుడు వివరించాడు. చివరకుమోక్ష సన్యాసయోగంతో ముగించాడు. అన్నిపనుల ఫలాలను తనకు అర్పించి నీవు చేయవలసిన కార్యములు నీవు చేయవలెనని సూటిగా చెప్పాడు, పరమాత్మ అర్జునునికి.
🕉🌞🌎🌙🌟🚩
7.. *అయ్యప్ప స్వామి చరిత్రలోని ముఖ్య ఘట్టం మహిషి మర్దన కథనం:*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
👉 మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తధాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
👉 క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమెపట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
👉 అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
👉 అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయా
రు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
👉 పందల రాజు తన కుమారుడైన అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయమే శబరిమల. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
🙏 *ఓం స్వామియే శరణం అయ్యప్ప..*🙏
ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు.ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు. పండితుడికి కోపం వచ్చింది నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా. వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు. ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.
శ్లోకం :అదత్త దానాచ్చ భవేత్ దరిద్రఃదరిద్ర దానాచ్చ కరోతి పాపం।పాప ప్రభావాత్ పునర్దరిద్రఃపునర్దరిద్రః పునరేవ పాపీ॥
అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు ?
ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.
జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక. అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు. తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. తిరగడం కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు. ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం అంటే అర్థాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు. ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడనికారణ జన్ముడనీ* అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆపేరు పెట్టారు . కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు. ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతని కీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీ ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.మన కరపాత్ర స్వామీజీకి అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ 1) కరపాత్ర స్వామిజీ ఎవరు. ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు.అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామిజీ వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది. ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.
అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు. స్వామిజీ ఇచ్చేశాడు.ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అని. అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.
సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. నాగురుదేవులు మీరు. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు.
అయ్యా ముందు వినండి. నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది. అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక
ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లోఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.
నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరిచాడు.
*కానీ, అక్కడ ఒక ఖాళీపడవ మాత్రమే ఉంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోయాడు !*_
అది గాలివాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరించింది. ఆత్మ సాక్షాత్కారం కలిగింది.
అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహించాడు.
అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే'. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహించాడు.
అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.
“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది !
--(())--
*-
Exakent
ReplyDeleteBagundi.karapatra swami katha nenu sighs group lo pettanu,neevu danni blog lo pettavu
ReplyDelete