ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ: rachayata mallaprada sridevi ramakrishna
ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..
01 వైకుంఠ ఏకాదశి విశిష్టత
🍁🍁🍁🍁🍁
ముక్కోటి ఏకాదశి.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల
ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.
ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.
ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.
ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.
పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ రెండోది.
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.
విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.
ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.
అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.
ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.
******
: వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు
🌸🌸🌸🌸🌸🌸🌸
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.
భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.
ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.
ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి.
ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.
ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.
ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు.
ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.
హరినామ స్మరణం...
సమస్త పాప హరణం ....
🌸 జై శ్రీమన్నారాయణ 🌸
*****
02. మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి
🍁🍁🍁🍁
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.
భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు.
గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది .
కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.
గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది.
"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది.
గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.
త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది.
అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది
ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||
ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.
అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు,
మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.
అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.
ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు
పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని
కొందరి భావం.
అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం
ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,
కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా
మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....
ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం
.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..
ఒక సాధువు తంబూరా మీటుకుంటూ ఓ తత్త్వాన్ని పాడుతూ వీధుల వెంట వెళుతున్నాడు. ధనం మీద ఆశ ఉంటే విభేదమనీ, మనుషుల మధ్య చిచ్చు పెడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అతడు పాడుతున్నాడు.
రాజమందిరం పై విహరిస్తున్న రాజుకి ఆ తత్త్వం వినబడింది. ఆయనకది బాగా నచ్చింది.
ఆ సాధువును రాజసభకు తీసుకు రావలసిందిగా సేవకులను ఆదేశించాడు.
రాజసభలో ఆ తత్త్వాన్ని మరోసారి పాడించి సభాసదులందరితో సహా విని ఆనందించాడు
రాజు ఆ సాధువుకి బంగారం, రత్నాలు బహూకరించాడు. వద్దని తిరస్కరించాడు సాధువు.
ఏంచేస్తూ ఉంటావని అడిగిన రాజుకి, తాను బట్టలు నేసె వాడినని జవాబిచ్చాడు ఆ సాధువు.
పోనీ, పనిలో సహాయపడేది ఇస్తానని చెప్పి రాజు, రత్నాలు పొదిగిన బంగారు కత్తెరను బహూకరించాడు. దానిని కూడా సాధువు మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు.
"సరే ఏం కావాలో నువ్వే కోరుకో" అన్నాడు రాజు. "రాజా! మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఒక సూది ఇవ్వండి చాలు" అన్నాడు సాధువు.
ఏమిటి ఈ దారిద్ర్యం? రాజు అంతటి వాడు ఏదైనా కోరుకో మంటే ఏ మాత్రం విలువ చేయని సూదినా కోరుకోవడం???
రాజు ఆశ్చర్యంతో ఆ సాధువుని అడిగాడు.
"మహారాజా! కత్తెర వస్త్రాన్ని రెండుగా చింపుతుంది.నాకు రెండు ముక్కలను కుట్టి కలిపే సూది కావాలి .అలాగే ధనం మనుషుల మధ్య విబేధాన్ని సృష్టిస్తుంది.. మనుషులను కలిసి ఉంచే మంచి మాటలు కావాలి. ఆ ఐక్యమత్యమే దేశానికి వెన్నెముక "అన్నాడు........
*ధనమెచ్చిన మదమెచ్చును*
*మదమొచ్చిన దుర్గుణంబు* *మానకహెచ్చున్*
*ధనముడిగిన మదముడుగును*
*మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!*
భావం:-
ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.
--(())--
04. జై గురుదేవ్ - సూర్యుడు ప్రపంచానికి ప్రాణదాత. సూర్యుడు నుంచి వచ్చే ప్రాణశక్తి వల్లే ప్రపంచమంతా చైతన్యంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి మానవులకు సూర్యుడే ఆరాధ్య దైవము. అటువంటి సూర్యుడును ఆరాధించే రోజు ఆదివారం. ఆదివారం నాడు గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆదివారం నాడు చేసే సాధన వల్ల సూర్యుడితో పాటు గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది. పూర్వకాలంలో అందరూ సూర్యోపాసన చేయడంవల్ల భారతదేశం రత్నగర్భ అనేవారు (అక్షయ పాత్ర , శమంతక మణి సూర్యునుండే లభించాయి ) .ఆ సూర్యోపాసన- ఆదిత్య హృదయంతో రావణాసురుని జయించి రాముడు రామ రాజ్యాన్ని స్థాపించారు. సూర్యని నుండే హనుమంతుడు వేదాలు నేర్చుకున్నాడు. సూర్యోపాసనే గాయత్రి సాధన, సంధ్యావందన సాధన. ఆదివారం నాడు చేసే సాధన వారం రోజులు కావాల్సిన శక్తి నిస్తుంది. అందుకే ఆదివారం నాడు సెలవిచ్చారు. కానీ మన భారతీయులం అందరు గతి తప్పి సూర్యోపాసన వదిలేశాం. భారతీయుడు అంటే వెలుగును ఇష్టపడేవాడు. ఆ రోజు చేయకూడని పని చేస్తూ ఉంటాము. లేటుగా లేస్తాం. తినకూడనవి తింటాం. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, లక్ష్మివారం సాయిబాబా, శుక్రవారం దుర్గాదేవి, శనివారం వెంకటేశ్వర పూజలని ఆయా దేవతల రోజున ఆ దేవతల భక్తులు మాంసాహారం తినరు. కానీ మనం జీవించడానికి ఆధారం అయినటువంటి సూర్యభగవానుడి వదిలేశాం. ఆ రోజే మాంసాహారం తింటున్నాం. పార్టీలు, అమ్మాయి పెద పాప ఫంక్షన్లు చేసుకుంటాం. ఆదివారం విశిష్టతను మర్చిపోవడం వలనే భారతదేశం పేద దేశంగాను , అభివృద్ధి చెందుతున్న దేశంగా , భారతీయులు పేద వారిగా నిలబడ్డాం. సూర్యకిరణాలలో కరోనా వైరస్ మరియు అన్ని రకాల వ్యాధులు నుండి మనలను కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది. సూర్య కిరణాలతో చనిపోయిన వారిని కూడా ఎలా బతికించవచ్చో మన ఋషులు నిరూపించారు. కావున మన తప్పును తెలుసుకొని ఆదివారం నాడు సూర్యోపాసన మొదలుపెట్టి మళ్లీ రామరాజ్యం తీసుకొద్దాం. భారతదేశం రత్నగర్భగా మార్చుదాం .
--(())--
05. గురు బోధ
ఆత్మ స్వరూపులు అందరికీ శుభోదయం.
ఈ స్థూల శరీరానికి 5 శుక్ష్మ కోశాలు ఉంటాయి. వాటిని పంచ కోశాలు అంటారు.
1 . అన్నమయ కోశం
2.ప్రాణమయ కోశం
3. మనోమయ కోశం.
4.విజ్ఞాన మయ కోశం
5. ఆనందమయ కోశం.
ముందుగా అన్నమయ కోసం గూర్చి తెలుసుకుందాము.
ఈ అన్నమయ కోశం భౌతిక ఆహారం మీద ఆధారపడి .ఆ ఆహారం యొక్క గుణము మీద శరీర ఆరోగ్యం అనేది ఆ ఆహార తత్వం మీద ఆధారపడి ఉంటుంది.ఆహారం మూడు గుణాలు కలిగి ఉంటుంది. సద్విక ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం.
సాద్విక ఆహారం తాజా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు. వీటిని పచ్చిగా అన్నా తినవచ్చు, వండుకుని అన్నా తినవచ్చు. వండిన ఆహారం సుమారు రెండు గంటల లోపు భుజించిన దానిని సద్వీక ఆహారం. అందురు.
రజోగుణ ఆహారం. మసాలా దినుసులు కలిగిన ,మరియు కారం కలిగిన ,మాంసాహారం రజో గుణం కలిగిన ఆహారం.
తమోగుణ ఆహారం మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తమోగుణ ఆహారం .
ఏవిధమైన ఆహారం తీసుకుంటే దానికి సంబంధించిన గుణాలు ఈ శరీరానికి వస్తుంది. దీని నుండి మనస్సు ప్రభావితం అవుతుంది.
సద్వికాహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
రజోగుణ ఆహారం తీసుకుంటే మనస్సు అలజడిగా ఉంటుంది.
తమోగుణ ఆహారము తీసుకుంటే మనస్సు, శరీరము కూడా అనారోగ్య స్థితికి చేరుకుంటుంది.
2. ప్రాణమయ కోశం .
ఇది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుంది. పీల్చుకునే గాలి శుభ్రంగా ఉంటే శరీరము ఆరోగ్యముగా ఉంటుంది. అందుకు యోగా ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ఆక్సిజన్ లోకూడా పూర్తి ప్రాణశక్తి అన్ని చోట్లా దొరకదు. ప్రకృతి మద్య వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. ముఖ్యముగా రావి, మర్రి, వేప ,తులసి వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. అందుకే దేవాలయములకు వెళ్లి అక్కడ ఉండే వృక్షముల చుట్టు ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది, అంటారు. పర్వతాల మధ్య ప్రాణ శక్తి దివ్యంగా ఉంటుంది. అందుకే తీర్థయాత్రల పేరిట కేదార్నాథ్, భద్రినాద్, హిమల పర్వత శ్రేణులు మద్య సంవత్సరానికి ఒక సారి ఐనా తిరిగి రమ్మంటారు.
3. మనోమయ కోశం .
ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది. తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో మనస్సు చాలా ముఖ్యం. మనసులోనే గమ్మత్తుమొత్తం ఉంది. నిరంతర బయట ప్రపంచం చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. దీనిని తీసుకుని వచ్చి అంతర్ముఖం చేస్తే అధ్బుతమైన ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. అందుకే దినకి జంపం, ధ్యానము అలవాటు చేయాలి. గుఱ్ఱములను కల్లేము ద్వారా అదుపు చేయునట్లు మనస్సుకి సాధన అనే కళ్లెం వెయ్యాలి. అప్పుడు మనస్సు కి శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యముగా ఉంటుంది. శరీరము ఆరోగ్యంగా ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు. అందుకే మనోమయ కోశం అత్యంత ముఖ్యమైనది.
4. విజ్ఞాన మయ కోశం.
ఇది మనస్సు తీసుకునే జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞముపై అంచేస్తుంది. భౌతిక పరమైన ఆలోచన చేస్తే భౌతికంగా ఎలా ఏదగాలి అను దానిపై పెంచేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచన పెడితే దానిలో పరిజ్ఞానము. సంపాదిస్తుంది. నీ ఆత్మకు ఎదుగు దలకు పనికి వచ్చేది విజ్ఞానము.ఆత్మ ఎదుగుదలకు పనికి రానిది అజ్ఞానము. విజ్ఞానము అంటే జ్ఞానము పెంచునది.అని అర్థం. ఏ జ్ఞానము ఉండాలి అంటే నేను ఎవరు అని తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో ఉండే కష్టాలు చెక్ పెట్టినట్లు.
5. ఆనందమయ కోశం.
క్రింద నాలుగు కోశాలు యొక్క శుభ్రత మీద ఆధార పడి ఉంటుంది. ఇది భగవంతునితో సమానమైనది. నిత్యం ఇది అనందమ్ కలిగి ఉంటుంది. సాధనతో మాత్రమే దీనిని గూర్చి తెలుసుకోగలం. ఎవరైతే నిత్యం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉంటారో వారీ కోశం లో ఆనందంగా ఉండగలరు.
--(())--
06. ఓం శ్రీరామ్ -- శ్రీ మాత్రేనమ:
సేకరణ కధ
ఇంద్రుడు
వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు
.అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయుచుండెను.దేవతలు,మునులును
స్వర్గము నకు రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?
అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.
ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా ప్రవర్తించ సాగాడు. అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము వుంది, నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.
వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.
అప్పుడు
నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి
శాపవిమోచనం ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ
అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.అప్పుడు నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.
అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.
స్వర్గ పరి భ్రష్టుండై దుర్గతికిం బోయెనతడు,దుష్టాత్ములకున్ దౌర్గత్యము సుజనులకు న నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్
((**))-- |
om
ReplyDelete