Monday, 21 December 2020

25-12-2020

 


ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ: rachayata mallaprada sridevi ramakrishna

ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు 

అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..

ప్రతి రోజు కధలు చదివి మీరు మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా అందరూ దేశంలో శాంతిని కలగాలని న ప్రయత్నం

01  వైకుంఠ ఏకాదశి విశిష్టత

🍁🍁🍁🍁🍁

 ముక్కోటి ఏకాదశి.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల
ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

 ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.
ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.
పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

 ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

 పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది.
 కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.
విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.
ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.
అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.


 ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.
******

: వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు

  🌸🌸🌸🌸🌸🌸🌸

శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

 భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి.
ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.
 ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు.
 ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

 హరినామ స్మరణం...
 సమస్త పాప హరణం ....

🌸 జై శ్రీమన్నారాయణ 🌸
 *****

 02. మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి

🍁🍁🍁🍁


గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.

భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు.
గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది .
కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

 గీకారం త్యాగరూపం స్యాత్
 తకారమ్ తత్వబోధకమ్
 గీతా వాక్య మిదమ్ తత్వం
 జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
 
 గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది.

"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది.

గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.

త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది.

అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది

ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.
 
 సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
 పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు,

 మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.

అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు
పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని
కొందరి భావం.

అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం
ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,

కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా
మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....

ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం

.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..


03. ..... *నేటి చిట్టికథ* Pranjali prabha daily/26/04
ఒక సాధువు తంబూరా మీటుకుంటూ ఓ తత్త్వాన్ని పాడుతూ వీధుల వెంట వెళుతున్నాడు. ధనం  మీద ఆశ ఉంటే విభేదమనీ, మనుషుల మధ్య చిచ్చు పెడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అతడు పాడుతున్నాడు.
 రాజమందిరం పై విహరిస్తున్న రాజుకి ఆ తత్త్వం వినబడింది. ఆయనకది బాగా నచ్చింది. 
ఆ సాధువును రాజసభకు తీసుకు రావలసిందిగా సేవకులను ఆదేశించాడు.
 రాజసభలో ఆ తత్త్వాన్ని మరోసారి పాడించి సభాసదులందరితో సహా విని ఆనందించాడు
రాజు ఆ సాధువుకి బంగారం, రత్నాలు బహూకరించాడు. వద్దని తిరస్కరించాడు సాధువు. 
ఏంచేస్తూ ఉంటావని అడిగిన రాజుకి, తాను బట్టలు నేసె వాడినని జవాబిచ్చాడు ఆ సాధువు. 
పోనీ, పనిలో సహాయపడేది ఇస్తానని చెప్పి రాజు, రత్నాలు పొదిగిన బంగారు కత్తెరను బహూకరించాడు. దానిని కూడా సాధువు మర్యాదపూర్వకంగానే తిరస్కరించాడు. 
"సరే ఏం కావాలో నువ్వే కోరుకో" అన్నాడు రాజు. "రాజా! మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కాబట్టి, ఒక సూది ఇవ్వండి చాలు" అన్నాడు సాధువు.
 ఏమిటి ఈ దారిద్ర్యం? రాజు అంతటి వాడు ఏదైనా కోరుకో మంటే ఏ మాత్రం  విలువ చేయని సూదినా కోరుకోవడం???
 రాజు ఆశ్చర్యంతో ఆ సాధువుని అడిగాడు.
 "మహారాజా! కత్తెర వస్త్రాన్ని రెండుగా చింపుతుంది.నాకు రెండు ముక్కలను కుట్టి కలిపే సూది కావాలి  .అలాగే ధనం  మనుషుల మధ్య విబేధాన్ని సృష్టిస్తుంది.. మనుషులను కలిసి ఉంచే మంచి మాటలు కావాలి. ఆ ఐక్యమత్యమే దేశానికి వెన్నెముక "అన్నాడు........

*ధనమెచ్చిన మదమెచ్చును* 
 *మదమొచ్చిన దుర్గుణంబు* *మానకహెచ్చున్* 
 *ధనముడిగిన మదముడుగును* 
 *మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!* 
భావం:-
ధనము అధికమైతే గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగిన వెంటనే చెడ్డగుణాలు అలవడతాయి. అదే విధంగా ధనం పొయిన వెంటనే గర్వం పోయి, చెడ్డగుణాలు తగ్గుతాయి. కాబట్టి ధనం రాగానే స్థిరమైన మనస్సుతో గర్వాన్ని తలకెక్కించుకోకూడదు.
--(())--

04. జై గురుదేవ్ - సూర్యుడు ప్రపంచానికి ప్రాణదాత. సూర్యుడు నుంచి వచ్చే  ప్రాణశక్తి వల్లే ప్రపంచమంతా చైతన్యంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి మానవులకు సూర్యుడే ఆరాధ్య దైవము. అటువంటి సూర్యుడును ఆరాధించే రోజు ఆదివారం. ఆదివారం నాడు గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆదివారం నాడు చేసే సాధన వల్ల సూర్యుడితో పాటు గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది. పూర్వకాలంలో అందరూ  సూర్యోపాసన చేయడంవల్ల  భారతదేశం రత్నగర్భ అనేవారు (అక్షయ   పాత్ర , శమంతక  మణి సూర్యునుండే  లభించాయి  ) .ఆ సూర్యోపాసన- ఆదిత్య హృదయంతో రావణాసురుని జయించి రాముడు రామ రాజ్యాన్ని స్థాపించారు. సూర్యని నుండే హనుమంతుడు  వేదాలు నేర్చుకున్నాడు. సూర్యోపాసనే  గాయత్రి సాధన, సంధ్యావందన సాధన.  ఆదివారం నాడు చేసే సాధన వారం రోజులు కావాల్సిన శక్తి నిస్తుంది. అందుకే ఆదివారం నాడు   సెలవిచ్చారు. కానీ మన భారతీయులం అందరు గతి తప్పి సూర్యోపాసన వదిలేశాం. భారతీయుడు  అంటే  వెలుగును  ఇష్టపడేవాడు. ఆ రోజు చేయకూడని పని చేస్తూ ఉంటాము. లేటుగా లేస్తాం. తినకూడనవి తింటాం.  సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, లక్ష్మివారం సాయిబాబా, శుక్రవారం దుర్గాదేవి, శనివారం వెంకటేశ్వర పూజలని  ఆయా దేవతల రోజున ఆ దేవతల భక్తులు మాంసాహారం తినరు. కానీ మనం జీవించడానికి ఆధారం అయినటువంటి సూర్యభగవానుడి వదిలేశాం. ఆ రోజే మాంసాహారం తింటున్నాం. పార్టీలు, అమ్మాయి పెద పాప ఫంక్షన్లు చేసుకుంటాం. ఆదివారం విశిష్టతను మర్చిపోవడం  వలనే భారతదేశం పేద దేశంగాను , అభివృద్ధి చెందుతున్న దేశంగా , భారతీయులు పేద వారిగా నిలబడ్డాం. సూర్యకిరణాలలో  కరోనా వైరస్ మరియు అన్ని రకాల వ్యాధులు  నుండి మనలను కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది. సూర్య కిరణాలతో చనిపోయిన వారిని కూడా ఎలా బతికించవచ్చో మన ఋషులు నిరూపించారు. కావున మన తప్పును తెలుసుకొని ఆదివారం నాడు సూర్యోపాసన మొదలుపెట్టి మళ్లీ రామరాజ్యం తీసుకొద్దాం. భారతదేశం రత్నగర్భగా  మార్చుదాం .
--(())--

05. గురు బోధ 

ఆత్మ స్వరూపులు అందరికీ శుభోదయం.

ఈ స్థూల శరీరానికి 5 శుక్ష్మ   కోశాలు ఉంటాయి. వాటిని పంచ కోశాలు అంటారు.

1 . అన్నమయ కోశం

2.ప్రాణమయ కోశం

3. మనోమయ కోశం.

4.విజ్ఞాన మయ కోశం

5. ఆనందమయ కోశం.

ముందుగా అన్నమయ కోసం గూర్చి తెలుసుకుందాము.

ఈ అన్నమయ కోశం భౌతిక ఆహారం మీద ఆధారపడి .ఆ ఆహారం యొక్క గుణము మీద శరీర ఆరోగ్యం అనేది ఆ ఆహార తత్వం మీద ఆధారపడి ఉంటుంది.ఆహారం మూడు గుణాలు కలిగి ఉంటుంది. సద్విక ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం.

సాద్విక ఆహారం తాజా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు. వీటిని పచ్చిగా అన్నా తినవచ్చు, వండుకుని అన్నా తినవచ్చు. వండిన ఆహారం సుమారు రెండు గంటల లోపు భుజించిన దానిని సద్వీక ఆహారం. అందురు.

రజోగుణ ఆహారం. మసాలా దినుసులు కలిగిన ,మరియు కారం కలిగిన ,మాంసాహారం రజో గుణం కలిగిన ఆహారం.

తమోగుణ ఆహారం మాంసాహారం, నిల్వ ఉన్న ఆహారం తమోగుణ ఆహారం .

ఏవిధమైన ఆహారం తీసుకుంటే దానికి సంబంధించిన గుణాలు ఈ శరీరానికి వస్తుంది. దీని నుండి మనస్సు ప్రభావితం అవుతుంది. 

సద్వికాహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

రజోగుణ ఆహారం తీసుకుంటే మనస్సు అలజడిగా ఉంటుంది.

తమోగుణ ఆహారము తీసుకుంటే మనస్సు, శరీరము కూడా అనారోగ్య స్థితికి చేరుకుంటుంది.

2. ప్రాణమయ కోశం .

ఇది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుంది. పీల్చుకునే గాలి శుభ్రంగా ఉంటే శరీరము ఆరోగ్యముగా ఉంటుంది. అందుకు యోగా ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ఆక్సిజన్ లోకూడా పూర్తి ప్రాణశక్తి అన్ని చోట్లా దొరకదు. ప్రకృతి మద్య వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. ముఖ్యముగా రావి, మర్రి, వేప ,తులసి వృక్షాల నుండి దివ్యమైన ప్రాణ శక్తి అందుతుంది. అందుకే దేవాలయములకు వెళ్లి అక్కడ ఉండే వృక్షముల చుట్టు ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది, అంటారు. పర్వతాల మధ్య ప్రాణ శక్తి దివ్యంగా ఉంటుంది. అందుకే తీర్థయాత్రల పేరిట కేదార్నాథ్, భద్రినాద్, హిమల పర్వత శ్రేణులు మద్య సంవత్సరానికి ఒక సారి ఐనా తిరిగి రమ్మంటారు.

3. మనోమయ కోశం .

ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది. తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. చేసే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో మనస్సు చాలా ముఖ్యం. మనసులోనే గమ్మత్తుమొత్తం ఉంది. నిరంతర బయట ప్రపంచం చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. దీనిని తీసుకుని వచ్చి అంతర్ముఖం చేస్తే అధ్బుతమైన ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది. అందుకే దినకి జంపం, ధ్యానము అలవాటు చేయాలి. గుఱ్ఱములను కల్లేము ద్వారా అదుపు చేయునట్లు మనస్సుకి సాధన అనే కళ్లెం వెయ్యాలి. అప్పుడు మనస్సు కి శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యముగా ఉంటుంది. శరీరము ఆరోగ్యంగా ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు.  అందుకే మనోమయ కోశం అత్యంత ముఖ్యమైనది.

4. విజ్ఞాన మయ కోశం.

ఇది మనస్సు తీసుకునే జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞముపై అంచేస్తుంది. భౌతిక పరమైన ఆలోచన చేస్తే భౌతికంగా ఎలా ఏదగాలి అను దానిపై పెంచేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచన పెడితే దానిలో పరిజ్ఞానము. సంపాదిస్తుంది. నీ ఆత్మకు ఎదుగు దలకు పనికి వచ్చేది విజ్ఞానము.ఆత్మ ఎదుగుదలకు పనికి రానిది అజ్ఞానము. విజ్ఞానము అంటే జ్ఞానము పెంచునది.అని అర్థం. ఏ జ్ఞానము ఉండాలి అంటే నేను ఎవరు అని తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో ఉండే కష్టాలు చెక్ పెట్టినట్లు.

5. ఆనందమయ కోశం.

క్రింద నాలుగు కోశాలు యొక్క శుభ్రత మీద ఆధార పడి ఉంటుంది. ఇది భగవంతునితో సమానమైనది. నిత్యం ఇది అనందమ్ కలిగి ఉంటుంది. సాధనతో మాత్రమే దీనిని గూర్చి తెలుసుకోగలం. ఎవరైతే నిత్యం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉంటారో వారీ కోశం లో ఆనందంగా ఉండగలరు. 

--(())--

06. ఓం  శ్రీరామ్ -- శ్రీ మాత్రేనమ:

సేకరణ కధ
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయుచుండెను.దేవతలు,మునులును స్వర్గము నకు రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని భయపడి అనేక యజ్ఞములు చేసి మహా  మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా? 

  అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు. 

ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా ప్రవర్తించ సాగాడు. అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము వుంది, నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.

వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.

అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు 
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. 

పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.అప్పుడు నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి. 

అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి. 
స్వర్గ పరి భ్రష్టుండై దుర్గతికిం బోయెనతడు,దుష్టాత్ములకున్ దౌర్గత్యము సుజనులకు న నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్

((**))--

చదవటానికి వారం పట్టినా సరే ! ఆంధ్రులు అందరు తప్పక
డా. శ్రీనివాస్ గారు వ్రాసిన ఈ వ్యాసం👇చదివి ఆలోచించుకోవాలి!! 


07. అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ అంతరాత్మ గా ఎందుకు భావించుకుని దానికోసంపోరాడాలో అర్థమవుతుంది!!!🙏
 

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన 9 సం|| ల 1.11.1956 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది . 1965 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక ప్రగతి జరగలేదు. పరిశ్రమల ద్వారామాత్రమే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్న తరుణం లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశం లో 5 భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని తలచింది . అప్పుడు 'ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కమిటీ ‘ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ను, కర్ణాటక లోని హోస్పేట ను పరిశీలించి విశాఖపట్నం లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించమని ప్రతిపాదించింది. అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు. దురదృష్ట వశాత్తు 1966 జనవరి లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అకస్మాత్తుగా మరణించారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.


అప్పటి కేంద్రం లోని అధికారపార్టీ రాజకీయ అవసరాల రీత్యా ‘ఉక్కు కర్మాగారాన్ని‘ వేరే రాష్ట్రం లో ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం “ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజలను కోపోద్రిక్తులను చేసింది“. కులమత ప్రాంతాల కతీతంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు . అప్పుడు (ప్రస్తుత రాజధాని ‘అమరావతి’ ప్రాంతానికి చెందిన) గుంటూరు జిల్లాలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ లోని దళిత నాయకుడు టి.అమృత రావు గారు ... 1966 అక్టోబర్ 14 తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. నవంబర్ 1 వ తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం గా మారి 9 ఏళ్ల బాలుడితో సహా, 9 మంది ప్రజలు పోలీస్ కాల్పులలో మరణించారు. విశాఖ పట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు పోరాడారు. ప్రాణత్యాగాలు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమకారులపై పోలీస్ వారు జరిపిన కాల్పులలో విజయవాడ లో 5 గురు, గుంటూరు లో 5 గురు, విజయనగరం లో ఇద్దరు, కాకినాడ లో ఒకరు, తగరపు వలసలో ఒకరు, సీలేరు లో ఒకరు, ఆదిలాబాద్ లో ఒకరు, వరంగల్ లో ఒకరు చనిపోయారు . రాష్ట్రం మొత్తం మీద 32 మంది పోలీస్ కాల్పులలో చనిపోయారు.
“విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు“ అనే నినాదంతో ఉద్యమం లో పోరాడిన వారు, ప్రాణత్యాగం చేసిన వారు విశాఖపట్నం మనదే, మన రాష్ట్రానిదే అన్న భావన. విశాఖపట్నం లో ఉక్కు పరిశ్రమ వస్తే విశాఖపట్నం వాసులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అని అప్పుడు పోరాడిన వివిధ ప్రాంతాల ప్రజలందరికీ తెలుసు. అయినా అప్పటి ప్రజల భావన ఏమిటంటే విశాఖపట్నం లోని ప్రజలు కూడా మన వాళ్ళే కదా, అక్కడి పిల్లలు, యువకులు మన పిల్లలే కదా అని భావించింది. ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి వలన తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధిచెందుతుంది అని ప్రజలు బలంగా నమ్మారు. అవి విశాలహృదయంతో, సమతాభావంతో నిండిన అప్పటి ప్రజల మనస్సులోని ఉదాత్తమైన ఆలోచనలు.


విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన-ఏర్పాటులో ముఖ్యమైన తేదీలు:
1 . విశాఖ ఉక్కు సాధన కోసం అమృతరావు గారి ఆమరణ దీక్ష విరమణ - నవంబర్ 3 వ తేదీ 1966. కేంద్ర ప్రభుత్వ హామీ - మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు.
2 . ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ - పార్లమెంటరీ ప్లీనరీ లో ఈ విధంగా చెప్పారు “ఆంధ్ర ప్రదేశ్ కు ఏదైనా తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావించటం లేదని, ఉక్కు కర్మాగారం ఏర్పాటు నిధుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది “ .
3 . 1970 ఏప్రిల్ 17 వ తేదీన విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పార్లమెంటులో ప్రకటన చేశారు.
4 . 1971 జనవరి 20 న స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు.
5 . 1977 అక్టోబర్ లో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అందిన తర్వాత జనతా ప్రభుత్వం 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది.
6 . 1981 లో ప్లాంటు నిర్మాణం కోసం రష్యాతో ఒప్పందం, 1982 జనవరి లో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది .


--(())--

         

 08. 60 దాటాక తూకం భోజనం అన్నీ బాధలే!

                ➖➖➖✍

60 సంవత్సరాల వయస్సు దాటిన వాడి  గోడు:

  ఏఁ రోగాలో, మాయ రోగాలు ..!

కమ్మగా కడుపు నిండా తినడానికి లేకుండా....

ఎవరినో అనుకుని ఏఁ ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చట పడి కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యాలాగా అయ్యాడు.

'అది తినొద్దు,ఇది తినొద్దు' అంటూ ఆంక్షలు.

అసలు కంది పొడి, ఆవకాయ కాంబినేషన్లో పేరినెయ్యి నాలుక్కి రాసుకుంటూ తింటూ ఉంటే... ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువా... శాకంబరీ దేవి ప్రసాదం... ఆంధ్ర శాకం... ఇంత వెన్న ముద్ద పక్కన పెట్టుకుని

ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనా? ధప్పళంలో గుమ్మడొడియాలు .... ఆయిలుంటుంది... వద్దంటాడు...

అసలు వేడి వేడి అన్నంలో మీగడ పెరుగు వేసుకుని మాగాయ ముక్క నంజుకుంటూ తింటూ ఉంటే... సాక్షాత్తు ఘటోత్కచుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరూ?

అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగిన వాడు చేస్తేనా...

ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరెవరూ వండలేరు..!

అలాంటిది... మా కుంక నా గుత్తొంకాయను కాశీలో

నా చేత వదిలించేద్దాఁవని కాశీకి టికెట్లు తీస్తాడా?

ఆ కాశీ విశ్వేశ్వరుడు నాయందు దయతలచి రెండు సార్లు టికెట్లు రద్దు చేయించేసాడు కాబట్టి సరిపోయింది ....

పైగా మా కుంక అంటాడూ ....

‘ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీ పంపించెయ్యనా?’ అని.

"ఎంథ మాత్రం వీల్లేద"ని మా బ్రహ్మ గారు చెప్పబట్టి ఆగాడు గానీ లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసే వాడు.

పొద్దున లేవగానే కోడలు పిల్ల ఒక 'పేద్ద గ్లాసు'లో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది.

ఆ గ్లాసు లోపలకు తొంగి చూడాలి ....

కాఫీ ఎక్కడుందా? అని!

'కాకి ఒకటి నీటికి కావు కావుమనుచునూ ....' అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చి చిన్న చిన్న రాళ్ళ కోసం వెతుకుతుంటానా .... 'కాఫీ ఎక్కువగా తాగితే gas వస్తుంది మాఁవయ్య గారూ' అంటుంది.

అసలు gas ఎందుకొస్తుందో తెలిసేడిస్తే కదా?

'హర్రీ, వర్రీ' అన్నారు .... 'కర్రీ’ అనేది ఈ మజ్జ చేర్చారని నా అనుమానం.

నా కాఫీ బాధ చూడలేక మా ఆఁవిడ 'ఇంకో గుక్కెడు ఇద్దూ పాపం ....' అంటుంది.

ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల ....!

'అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం' అనుకుంటూ తీర్ధంలాగా పుచ్చుకోడఁవే ...!

వాడైతే ఇంకు పిల్లరుతో పొయ్యమంటాడేఁవో?

ఇదివరకంటే స్నానం అయ్యి పూజ్జేసుకున్నాక గానీ టిఫినీ జోలికి వెళ్ళే వాడిని కాదు ...!

ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటినుండి ముందు కడుపులోకి ఏదైనా వెళ్తే గానీ కుదరదంటూ మా వాడు మొండికేయడంతో తప్పడం లేదు.

ఏదో నాలుగిడ్లీలు తింటే కొంపలంటుకు పోయినట్లు హడావిడి .... భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాలా? మరి అప్పటి లోపల ఆకలేస్తే? అని ఘఠ్ఠిగా నిలదీస్తే ఇదుగో ఈమధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి, మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు .... ఒక కేరట్టుతో సహా .... అసలా కేరట్టు మనది కాదట. విదేశాలనుండి వచ్చిందట. దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు? అంటే 'దానికి ఆచారం ఏఁవిటి నాన్న గారు' అంటాడు మా వాడు.

అసలు వీటన్నిటికి మూల కారణం అదుగో .... అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటినుండి మొదలయింది.

ఒంటి నిండా చెమటలు పట్టి, ఎడం చెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి పట్టుకుపోయారు.

వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని 'హెల్తు కార్డు' లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేసారు .... మందులతో నయమౌతుందని.

అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలో మొదలయింది ఈ ఆంక్షల గోల .... ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షల్లాగా ....

ఇంకో గంటలో బైటకొస్తాననగా కాస్త కాలు సాగినట్లుంటుందని రూమ్ బైటకొచ్చా.

ఎదురుగా ఓ బల్లేసుకుని ఓ అమ్మాయి

కూర్చునుంది .... బల్ల మీద కాదు .... బల్లకెదురుగా కుర్చీలో ...!

నన్ను చూడగానే 'బాబాయి గారు, ఒకసారి ఇలా రండి' అన్నది

'సరే కదా'ని వెళ్ళా.

"ఎవరమ్మా నువ్వు?" అని అడిగా.

"నేనిక్కడ డైటీషియన్ అండి" అన్నది.

నాకు మరోలా వినపడింది.

"బ్యూటీషియన్ కు ఆసుపత్రిలో ఏం పని?" అన్నా.

"హయ్యో, బాబాయ్ గారు, బ్యూటిషియన్ కాదు, డైటీషియన్ .... అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెబుతానన్నమాట" అన్నది.

నాకు మండదూ? "మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు .... నువ్వేం చెప్పనవసరం లేదు" అన్నా.

ఇంతలో మా ఆఁవిడొచ్చి నన్ను రూమ్ లోపలకు తీసుకెళ్ళి మళ్ళీ బైటకొచ్చి ఆ డైటీషియన్ తో కాసేపు ముచ్చట్లాడి 'వచ్చే శ్రావణ మాసం నోఁవులకు తప్పకుండా రావాలమ్మాయ్' అంటూ వచ్చేసిందాఁవిడ.

ఆ పిల్ల ఏం చెప్పిందో గానీ ఆ నాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయ్ ....

అరే .... ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందా బచ్చలి లేదు, ఓ దోసావకాయ లేదు .... నెయ్యైతే దాచేసారు ....ఏఁవి తిండది?

అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కంది పచ్చడి రుబ్బుతుంటే అక్కడక్కడే తిరిగే వాణ్ణి .... పోనీలే చిన్న వెధవ అని ఆఁవిడ రుచికన్నట్లు పొత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది .... 'ఉప్పు సరిపోయిందా?' అంటూ ....

అంతా తినేసి ఉప్పు 'సరిపోయిందత్తయ్యా, కారం సరి పోయిందో లేదో చూళ్ళేదు' అంటూ మళ్ళీ చెయ్యి చాపే వాణ్ణి.

'వెధవకు పొట్టనిండా తెలివి తేటలే' అంటూ మారు వడ్డించేది. అప్పటినుండి తెలివి తేటలు పొట్టలో ఉంటాయనుకుని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ  వస్తున్నా ....

అలా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ ఇలా ఎండ బెట్టేస్తే నా తెలివి తేటలన్నీ ఏఁవై పోవాలి?

ఇహ భోజనాల దగ్గరకొస్తే ఆఁవిడా, కోడలు చెఱో పక్క కాపలా ....

వంద గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట.

'వంద గ్రాముల బియ్యఁవేఁవోనే?' అంటే

'కాదు వండిందే వంద గ్రాములం'టుందాఁవిడ.

"ఐటమ్ కు వంద గ్రాములేఁవో? సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను?" అంటే 'అన్నిటికీ కలిపి వంద గ్రాముల'ట.

ఆ లెఖ్ఖన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు .... ఒక్కొక్క దానికి ఇరవై గ్రాములు. అంటే ఐదు వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు నాలుగు గ్రాములు తేలింది. బంగారం తూకంలాగా ....

అసలలా తింటే మందులు వేసుకోడానికైనా నేనుండాలిగా? అంటే వినిపించుకోరు.

బరువు అరవై దాటకూడదట. కొత్త రూలొహటి. అప్పటికీ నమకం, చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది. ఐనా 'బరువు తగ్గాలండి' అంటే నేనిక ఏకాదశం నడవాలి.

"బతికినంత కాలం బతకనురా. కమ్మగా తిననివ్వండర్రా" అంటే ....

"ఒక్కగానొక్క నాన్నవు ...." అలా అన్నాడో లేదో

"అదేం మాటరా అప్రాచ్యుడా .... ఎంతమంది నాన్నలుంటారేఁవిటి?" అంటూ ఆఁవిడ కోప్పడేసింది వాణ్ణి .... భుజం మీదగా కొంగు కప్పుకుంటూ ....

"వాణ్ణి అపార్ధం చేసుకోకు రాజ్జం. వాడేదో తాపత్రయంలో అనేసాడు" అని సర్ది చెప్పాల్సొచ్చింది.

దంపుడు బియ్యం తిన్న శరీరఁవాయె .... ఏదో పని వత్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వ జన్మ బాకీ చెల్లించా గానీ లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలో జైల్లో ఖైదీ లాగా తూకం భోజనం ఏఁవిటో?✍

60 దాటాక  అన్నీ   బాధలే  😩

                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

  రచయిత ఎవరో తెలియదు! కానీ అద్భుతమైన రచన!!)

 09.  : *భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)*

*జీవిత ఉపయెాగాలు*


1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి

జ. గోరు వెచ్చనివి.


2.నీరు త్రాగేవిధానము

జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.


3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి

జ.32 సార్లు.


4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి

జ. ఉదయం.


5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి

జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.


6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి

జ. ఫల రసాలు(fruit juice).


7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి

జ. లస్సీ, మజ్జిగ.


8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి

జ. పాలు.


9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు

జ. రాత్రి.


10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి

జ. ఎప్పుడూ తినకూడదు.


11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను

జ. గంట తర్వాత.


12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )

జ. త్రాగకూడదు.


13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి

జ. 40 ని.


14.రాత్రి పూట ఎంత తినాలి

జ. చాలా తక్కువగా, అసలు తిననట్టు.


15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి

జ. సూర్యాస్తమయం లోపు.


16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి

జ. 48 ని.


17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా

జ. త్రాగకూడదు.


18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి

జ. పని.


19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి

జ. విశ్రాంతి తీసుకోవాలి.


20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి

జ. 500 అడుగులు నడవాలి.


21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి

జ. వజ్రాసనం వేయాలి.


22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి

జ. 5 - 10 ని.


23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి

జ. లాలాజలం,( saliva ).


24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి

జ. 9 - 10 గం.


25. 3 విషముల పేర్లు

జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.


26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి

జ. వాము.


27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా

జ. తినరాదు.


28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి

జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .


29. విదేశీ వస్తువులను కోనవచ్చునా

జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌


30. టీ ఎప్పుడు త్రాగాలి

జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.


31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి

జ. పసుపు.


32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి

జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.


33. ఏ చికిత్సా విధానం మంచిది

జ. ఆయుర్వేదం.


34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి

జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).


35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి

జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).


36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి

జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).


37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి

జ. సుమారు 2,3 గ్లాసులు.


38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి

జ. సూర్యోదయానికి 1.30 గంట ముందుగా.

*స్వదేశీ నాచురల్ ప్రోడక్ట్స్*

(గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మరియు రసాయన రహిత నిత్యావసర సరుకులు)

*ఆవు నెయ్యి*⚪ *గానుగ నూనెలు* ⚪ *సైంధవ లవణం*⚪ *తాటిబెల్లం* ⚪ *మట్టిపాత్రలు* ⚪ *చేతితో విసిరిన పప్పు లు* ⚪ *పళ్ళ పొడి, సబ్బులు, షాంపూ లు* ⚪ *సిరి ధాన్యాలు*

ఆన్లైన్ షాప్ http://whatshop.live/swadheshi 

ఫోన్/వాట్సాప్ 📱 9030036524

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి.


10. 





1 comment: