Thursday, 17 December 2020

19-12-2020

 
*రేపటి తిరుప్పావై నాల్గవరోజు పాశురం: 19 / 12 / 2020 శనివారము:*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

*4 వ పాశురము :*
ంంంంంంంంంంంం
*ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*
*ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*
*ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*
*పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*
*ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*
*తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*
*వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*
*మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*

*భావము:*
ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!

*అవతారిక:*

సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.

*ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము:*

ప. వెనుదీయబోకుమా! వర్జన్యమా!
కనికరముంచుమ! వర్షాధిదైవతమ!

అ. ప. పానము చేయుమ! సాగర జలముల
ఘనమౌ గర్జన చేయగరమ్మా!

1 చ. ఆకాశమున కెగసి లోకకారణుని
పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ

2 చ. విశాల సుందర భుజ పద్మనాభుని 
అసదృశమగు చక్రమువలె మెరసి
ఆశనిపాత శంఖముగ గర్జించి
ఆ శార్జపు శరములుగ వర్షింపుమా

3 చ. ఆశల, లోకము సుఖముల నొందగ
మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!

*-- *

కోడింగ్ మోసం.

ఇటీవల కాలం లో కొన్ని ఆన్లైన్ టీచింగ్ కార్పోరేట్స్ , పిల్లలకి 6 వ తరగతి నుండి కోడింగ్ నేర్పిస్తాం అని తెగ మార్కెటింగ్ చేస్తున్నారు. వారి మార్కెట్ ని పెంచుకోటానికి, ఉల్ఫ్ గుప్తా అనే అబ్బాయిని సృష్టించారు. ఈ పిల్లాడు చిన్నప్పటి నుండి కోడింగ్ నేర్చుకొని ఇప్పుడు 150 కోట్ల వరకు సంపాదించాడు అని, అతని వయసు ఇప్పుడు 14 సంవత్సరాలే అని నమ్మించారు. అసలు అటువంటి అబ్బాయి లేడు. మార్కెటింగ్ కోసం సృష్టించబడ్డాడు.

కార్పోరేట్స్ మార్కెట్ పెంచుకోవటానికి ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఈ విధానం తప్పు. ఇది పిల్లల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంది. సహజంగా పిల్లల భవిష్యత్ బాగుండాలి అనుకొనే పేరెంట్స్ ఈ వలలో పడతారు. ఇటీవల కాలంలో బైజుస్ అనే ఆన్లైన్ టీచింగ్ దిగ్గజం, వైట్ హ్యాట్ జూనియర్ అనే సంస్థని కొనేసింది. వైట్ హ్యాట్ జూనియర్ అనే సంస్థ ఈ కోడింగ్ మార్కెట్ మొదలు పెట్టింది. చిన్న వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులను టార్గెట్ చేసింది. బైజుస్ దగ్గర కొన్ని కోట్లమంది పేరెంట్స్ సమాచారం ఉంది. పల్లెటూర్లో ఉన్న పేరెంట్స్ ని కూడా వదలకుండా అందరిని ఇందులో చేర్చే పని లో ఉంది. ఇది డబ్బు దండగ మాత్రమే కాదు పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనౌతారు.

తల్లిదండ్రులుగా మనం పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలి అనుకోవటం తప్పు లేదు. కానీ ఏది మంచిది అని తెలుసుకొనే భాద్యత మన మీద ఉంది. మనకు నెరవేరని కలలు వారు నెరవేర్చాలి అనుకోవద్దు. ప్రతీ పిల్లాడికి ఒక ట్యాలెంట్ ఉంటుంది. ప్రతీ పిల్లాడికి తన కల ఉంటుంది. మీ పిల్లాడికి ఏ రంగం పట్ల ఆసక్తి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహించాలి. మనం ఆరవ తరగతిలో కంప్యూటర్ని చూడలేదు.. కాని ఎంతోమంది ఈ రోజు సాఫ్ట్వేర్ డెవలపర్లు గా పని చేస్తున్నారు. పిల్లలకి 10 వ తరగతి వరకు కావాల్సింది ప్రాధమిక విద్య మాత్రమే.అన్ని అంశాల పట్ల ప్రాధమిక అవగాహన మాత్రమే. ఈ కార్పోరేట్ మాయలో పడి మీ డబ్బు వృధా చేసుకొని, పిల్లల్ని ఒత్తిడికి గురిచేయవద్దు.

ఒక చేప పిల్ల యొక్క బలం, అది చెట్టు ఎక్కగల సామర్థ్యం కలిగి ఉందా అని పోల్చి అంచనా వెయ్యకూడదు. ఎవరి ట్యాలెంట్ వారిది. ఇది ఐన్స్టిన్ గారు చెప్పిన మాట. Never judge the capacity of a fish by its ability to climb a tree.

ఈ విషయం ఇంగ్లీష్ మాధ్యమాల్లో వచ్చింది. ఇంకా తెలుగు మాధ్యమాల్లో రాలేదు. ఈ మెసేజ్ ని మీకు తెలిసిన సర్కిల్స్ లో ఫార్వార్డ్ చెయ్యండి.

...........

ఎక్కువ ఒత్తిడి లేదా గందరగోళం ఉన్న ఏదైనా శరీరం దీన్ని మళ్లీ మళ్లీ చదవాలి ..... నా సమాధానాలన్నీ వచ్చాయి..ఇది ప్రయత్నించండి ..
 
కృష్ణ & నేటి అర్జున్ మధ్య అరుదైన సంభాషణ. కుటుంబానికి బిగ్గరగా చదవండి,
ఇది నేను చూసిన ఉత్తమ సందేశాలలో ఒకటి ...
 
1. అర్జున్: - నాకు ఖాళీ సమయం దొరకదు. జీవితం తీవ్రమైంది.
కృష్ణ: - * కార్యాచరణ మీకు బిజీగా ఉంటుంది. కానీ ఉత్పాదకత మీకు ఉచితం. *
2. అర్జున్: - ఇప్పుడు జీవితం ఎందుకు క్లిష్టంగా మారింది?
కృష్ణ: - * జీవితాన్ని విశ్లేషించడం ఆపు ... ఇది క్లిష్టంగా మారుతుంది. జీవించండి. *
3. అర్జున్: - అప్పుడు మనం ఎందుకు నిరంతరం సంతోషంగా ఉన్నాము?
కృష్ణుడు: - * చింతించడం మీ అలవాటుగా మారింది. అందుకే మీరు సంతోషంగా లేరు. *
4. అర్జున్: - మంచి వ్యక్తులు ఎప్పుడూ ఎందుకు బాధపడతారు?
కృష్ణ: - * వజ్రం ఘర్షణ లేకుండా పాలిష్ చేయలేము. అగ్ని లేకుండా బంగారాన్ని శుద్ధి చేయలేము. మంచి వ్యక్తులు పరీక్షల ద్వారా వెళతారు, కానీ బాధపడకండి. ఆ అనుభవంతో వారి జీవితం మెరుగ్గా ఉంటుంది, చేదుగా ఉండదు. *
5. అర్జున్: - అలాంటి అనుభవం ఉపయోగకరంగా ఉంటుందని మీరు చెప్పారా?
కృష్ణ: - * అవును. ప్రతి పదం లో, అనుభవం ఒక కఠినమైన గురువు. ఇది మొదట పరీక్షను మరియు తరువాత పాఠాలను ఇస్తుంది. *
6. అర్జున్: - చాలా సమస్యల కారణంగా, మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు…
కృష్ణుడు: - * మీరు బయట చూస్తే మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు. లోపల చూడు. కళ్ళు దృష్టిని అందిస్తాయి. హృదయం మార్గం అందిస్తుంది. *
7. అర్జున్: - సరైన దిశలో వెళ్ళడం కంటే వైఫల్యం బాధపడుతుందా?
కృష్ణుడు: - * విజయం ఇతరులు నిర్ణయించిన కొలత. సంతృప్తి అనేది మీరు నిర్ణయించిన కొలత. *
8. అర్జున్: - కఠినమైన సమయాల్లో, మీరు ఎలా ప్రేరేపించబడతారు?
కృష్ణుడు: - * మీరు ఎంత దూరం వెళ్ళాలో కాకుండా మీరు ఎంత దూరం వచ్చారో ఎల్లప్పుడూ చూడండి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ లెక్కించండి, మీరు తప్పిపోయినది కాదు. *
9. అర్జున్: - ప్రజల గురించి మీకు ఆశ్చర్యం ఏమిటి?
కృష్ణుడు: - * వారు బాధపడుతున్నప్పుడు వారు "నన్ను ఎందుకు?" వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు "ఎందుకు నన్ను?"
10. అర్జున్: - నేను జీవితంలో ఉత్తమమైనదాన్ని ఎలా పొందగలను?
కృష్ణ: - * విచారం లేకుండా మీ గతాన్ని ఎదుర్కోండి. మీ వర్తమానాన్ని విశ్వాసంతో నిర్వహించండి. భయం లేకుండా భవిష్యత్తు కోసం సిద్ధం చేయండి. *
11. అర్జున్: - చివరి ప్రశ్న. కొన్నిసార్లు నా ప్రార్థనలకు సమాధానం లభించదని నేను భావిస్తున్నాను.
కృష్ణుడు: - * జవాబు లేని ప్రార్థనలు లేవు. విశ్వాసం ఉంచండి మరియు భయాన్ని వదలండి. జీవితం పరిష్కరించడానికి ఒక రహస్యం, పరిష్కరించడానికి సమస్య కాదు. నన్ను నమ్ము. ఎలా జీవించాలో మీకు తెలిస్తే జీవితం అద్భుతమైనది. *
ఆశీర్వదించండి మరియు
ఎల్లప్పుడూ సంతోషంగా ఉం

 ,

కోడింగ్ మోసం.

ఇటీవల కాలం లో కొన్ని ఆన్లైన్ టీచింగ్ కార్పోరేట్స్ , పిల్లలకి 6 వ తరగతి నుండి కోడింగ్ నేర్పిస్తాం అని తెగ మార్కెటింగ్ చేస్తున్నారు. వారి మార్కెట్ ని పెంచుకోటానికి, ఉల్ఫ్ గుప్తా అనే అబ్బాయిని సృష్టించారు. ఈ పిల్లాడు చిన్నప్పటి నుండి కోడింగ్ నేర్చుకొని ఇప్పుడు 150 కోట్ల వరకు సంపాదించాడు అని, అతని వయసు ఇప్పుడు 14 సంవత్సరాలే అని నమ్మించారు. అసలు అటువంటి అబ్బాయి లేడు. మార్కెటింగ్ కోసం సృష్టించబడ్డాడు.

కార్పోరేట్స్ మార్కెట్ పెంచుకోవటానికి ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఈ విధానం తప్పు. ఇది పిల్లల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంది. సహజంగా పిల్లల భవిష్యత్ బాగుండాలి అనుకొనే పేరెంట్స్ ఈ వలలో పడతారు. ఇటీవల కాలంలో బైజుస్ అనే ఆన్లైన్ టీచింగ్ దిగ్గజం, వైట్ హ్యాట్ జూనియర్ అనే సంస్థని కొనేసింది. వైట్ హ్యాట్ జూనియర్ అనే సంస్థ ఈ కోడింగ్ మార్కెట్ మొదలు పెట్టింది. చిన్న వయసులో ఉన్న పిల్లల తల్లిదండ్రులను టార్గెట్ చేసింది. బైజుస్ దగ్గర కొన్ని కోట్లమంది పేరెంట్స్ సమాచారం ఉంది. పల్లెటూర్లో ఉన్న పేరెంట్స్ ని కూడా వదలకుండా అందరిని ఇందులో చేర్చే పని లో ఉంది. ఇది డబ్బు దండగ మాత్రమే కాదు పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనౌతారు.

తల్లిదండ్రులుగా మనం పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలి అనుకోవటం తప్పు లేదు. కానీ ఏది మంచిది అని తెలుసుకొనే భాద్యత మన మీద ఉంది. మనకు నెరవేరని కలలు వారు నెరవేర్చాలి అనుకోవద్దు. ప్రతీ పిల్లాడికి ఒక ట్యాలెంట్ ఉంటుంది. ప్రతీ పిల్లాడికి తన కల ఉంటుంది. మీ పిల్లాడికి ఏ రంగం పట్ల ఆసక్తి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహించాలి. మనం ఆరవ తరగతిలో కంప్యూటర్ని చూడలేదు.. కాని ఎంతోమంది ఈ రోజు సాఫ్ట్వేర్ డెవలపర్లు గా పని చేస్తున్నారు. పిల్లలకి 10 వ తరగతి వరకు కావాల్సింది ప్రాధమిక విద్య మాత్రమే.అన్ని అంశాల పట్ల ప్రాధమిక అవగాహన మాత్రమే. ఈ కార్పోరేట్ మాయలో పడి మీ డబ్బు వృధా చేసుకొని, పిల్లల్ని ఒత్తిడికి గురిచేయవద్దు.

ఒక చేప పిల్ల యొక్క బలం, అది చెట్టు ఎక్కగల సామర్థ్యం కలిగి ఉందా అని పోల్చి అంచనా వెయ్యకూడదు. ఎవరి ట్యాలెంట్ వారిది. ఇది ఐన్స్టిన్ గారు చెప్పిన మాట. Never judge the capacity of a fish by its ability to climb a tree.

ఈ విషయం ఇంగ్లీష్ మాధ్యమాల్లో వచ్చింది. ఇంకా తెలుగు మాధ్యమాల్లో రాలేదు. ఈ మెసేజ్ ని మీకు తెలిసిన సర్కిల్స్ లో ఫార్వార్డ్ చెయ్యండి.

-రాజేష్ పిళ్ళా

.........మహాస్వామి - మక్కాయాత్ర

మార్చినెల ఉషోదయ వేళ. జనవరిలో మొదలైన చల్లని గాలి తిమ్మెరలు ఇంకా విస్తూనే ఉన్నాయి. తెలవారకుండానే టార్చిలైటు వెలుగులో ఒక పల్లకి నదీతీరంలో ఊరేగింపుగా వెళ్తోంది. ముందు పల్లకి, వెనుకగా కొంతమంది జనం, ఏనుగులు, గుర్రాలు, లోట్టిపిట్టల గుంపులు అలా వెళ్తోంది. మాయనూర్, హరిశ్చంద్రపురం, తిట్టచేరి దాటి వెళ్లి నాట్టం అనే ఊరు చేరగానే పల్లకి తలుపులను దండంతో కొట్టిన శబ్దం వినబడింది. వెంటనే నడకను ఆపారు.

అక్కడ ఒక వినాయకుని దేవాలయం ఉంది. అక్కడితో దారి కుడి ఎడమలు రెండుగా వెళ్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అక్కడినుండి ఎడమవైపుగా ప్రయాణించాలి. కాని మరలా లోపలినుండి శబ్దం రావడంతో మాలి అనే భక్తుడు అది తాము ఎడమవైపు కాకుండా కుడివైపు ఉన్న దారిలో వెళ్లాలని అర్థం చేసుకుని ప్రయాణాన్ని కుడివైపుగా మరల్చారు.

“ఇది బహుశా మన్మంగళం వెళ్ళే దారిలా ఉంది” అని గుంపులో నుండి ఒకరు అన్నారు. మనకు లోపలి నుండి ఆదేశం వచ్చింది కాబట్టి మనం దాని ప్రకారం నడచుకోవాలి. ప్రతి విషయానికి ఎదో కారణం ఉంటుంది అని మాలి చెప్పడంతో ఇక ఎవరూ ఏమి మాట్లాడలేదు.

మన్మంగళం ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఒక ఇంటిలోనుండి గృహిణి బయటకు వచ్చి ఇంటి ముందర మట్టి దీపం ఒకదానిని వెలిగించి వెంటనే దగ్గరలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఒక దీపం వెలిగించి వచ్చింది. ఇంటి ముందర చట్ట ఊడ్చి, కళ్ళాపి చెల్లి శుభ్రపరచడం మొదలుపెట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఊరేగింపుని చూసింది. ఆ ఊర్లో అంతటి గజ తురగ జన సమూహంతో వస్తున్నా పల్లకిని చూసి నిశ్చేష్టురాలయ్యింది.

సరిగ్గా ఆ గృహిణి ఇంటికి దగ్గరగా రాగానే లోపలినుండి మరలా చప్పుడవ్వడంతో పల్లకిని కిందకు దించారు బోయీలు. సూర్యుని దర్శనంతో పూలు విచ్చుకున్నట్టుగా ఆరోజు అంతటి అనుగ్రహం కలిగింది మన్మంగళం గ్రామానికి.

వారి దర్శనంతోనే సూర్యుడు ఉదయిస్తాడేమో అన్నట్టుగా పల్లకి తెరలు తొలగించుకొని బయటకు రాగానే సూర్యుడు కూడా అరుణ వర్ణ శోభితుడై ఉదయించి ఆ ఊరిని పావనం చేసిన ఆ పాదపద్మాలను తన కిరణములతో తాకాడు.

ఆ ఊరు పావనమైనది. ఆ ఊరి ప్రజల అదృష్టము అంతా ఇంతా కాదు వారిని కరునించడానికే వచ్చినట్టు నడిచే దైవం, కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు ఆఊరి నేలపై అడుగు పెట్టారు.

ఇంటి ముందర శుభ్రం చేస్తున్న ఆమె అంతటి అనుగ్రహాన్ని ఊహించలేదు. కొన్ని క్షణాలు తన కళ్ళను నమ్మలేక అలా చూస్తుండిపోయింది. వెంటనే తేరుకొని లోపలి వెళ్లి తన భర్తకు విషయం చెప్పింది. భార్య చెప్పిన మాటలు విన్నవెంటనే ఆయన లేచి త్వరత్వరగా స్నానాదులు పూర్తిచేసుకొని, విభూడి పూసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అతని భార్య నీళ్ళు మంగళహారతి సిద్ధం చేసింది.

దంపతులిద్దరూ స్వామివారి కాళ్ళు కడిగి, హారతిచ్చి, స్వామికి నేలపై పది నమస్కారాలు చేసి మహాస్వామి వారిని ఆహ్వానించారు. కొద్ది క్షణాల్లోనే ఇంటి ముందర అరుగును శుభ్రపరిచి రంగవల్లులు తీర్చిదిద్దారు. మహాస్వామివారు అక్కడ కూర్చున్నారు.

ఈలోగా ఏనుగులు, గుర్రాల అరుపులకి మొత్తం ఊరు నిద్ర నుండి మేల్కొంది. అందరూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి పళ్ళాలలో పూలు, పళ్ళు తీసుకుని చాలామంది వచ్చారు. ఒంటెలు, ఏనుగులను నది దగ్గరకు తీసుకుని వెళ్ళారు. మహాస్వామి వారి పరివారానికి చక్కని వసతి, ఆహారము ఏర్పాటు చేశారు.

అందరికి ఒక్కటే ప్రశ్న, “స్వామివారు ఇక్కడికి ఎలా/ఎందుకు వచ్చారు?”. ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా శ్రీమఠం మకాం చెయ్యదు. హఠాత్తుగా కంచి నుండి ఇక్కడికనే కూడా రారు.

“ముందు అనుకున్నది నేడుంగరై వెళ్ళాలి అని. కాని పరమాచార్య స్వామివారు ఇక్కడికి రావాలని ఆదేశించారు. మేము వారి ఆజ్ఞానుసారం ఇక్కడకు వచ్చాము. ఎదో ముఖ్య కారణం ఉంది ఉంటుంది” అని చెప్పారు వైద్యనాథన్.

రెండు రోజులుగా స్వామివారు మౌనంలో ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఇలా రావడం ముందుగానే తెలిసుంటే ఊరి పొలిమేరల నుండే పూర్ణకుంభ స్వాగతం పలికి ఉండే వాళ్ళం అని అనుకున్నారు ఆ ఊరిజనం. కాని స్వామివారి ఆలోచన ఏముందో.

అందరూ స్నానాలు చేసి, పూజ ముగించారు. భోజనాలు కూడా అయ్యాయి. స్వామివారు కేవలం ఎండుద్రాక్ష, పాలు మాత్రమె తీసుకున్నారు. తక్కినవారికి ఆ గ్రామస్తులు చక్కగా అరటిఆకులో భోజనం పెట్టారు. స్వామివారి ఆగమనం వార్త చాలా జోరుగా వ్యాపించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దర్శనానికి రావడం మొదలుపెట్టారు. అది మార్చి మధ్యకాలం అవ్వడంతో వ్యవసాయ పనులు అన్ని అయిపోవడంతో చాలామంది దర్శనానికి వచ్చారు. తామర పూలు, కొబ్బరి బొండాలు, అరటి బోదలు మొదలైనవి తెచ్చి స్వామికి సమర్పించారు. రోజు కూలీగా తనవంతు వచ్చిన ధాన్యాన్ని తెచ్చి సమర్పించింది ఒక ముసలి అవ్వ. మొత్తం ధాన్యాన్ని స్వామిముందు ఉంచి నమస్కరించింది. అప్పుడు చూడాలి ఆన్నదా పారావశ్యాలతో ఉన్న ఆ అవ్వ ముఖం. అరుగు మొత్తం భక్తుల సమర్పణలతో నిండి పోయింది.

గ్రామప్రజలకు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి స్వామివారితో మాట్లాడడానికి. పెళ్లి ఆలస్యం, గృహం కట్టడానికి ఆటంకాలు, ఆస్తి పంపకంలో తగాదాలు, ఇలా చాలా సమస్యలను స్వామివారి ముందు ఉంచారు.

కాని స్వామివారు ఏమీ మాట్లాడక మౌనంగా అన్నీ వింటున్నారు. చేతులెత్తి అక్కడున్న అందరిని ఆశిర్వదించారు. కొందరికి బిల్వాదళాలు, కొందరికి నిమ్మకాయలు ఇచ్చారు. సమయం కదులుతూ ఉంది. కాని స్వామివారు మౌనం విడలేదు. హఠాత్తుగా మాలిని పిలిచి సైగలతో ఏదో చెప్పారు. చేతులతో శివలింగం, గోపురం మొదలైనవి చూపిస్తున్నారు. బహుశా ఈ ఊళ్ళో అవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నారేమో.

మాలి సైగలను అర్థం చేసుకున్నాడు. అక్కడున్న ఊరిజనంతో, “ఈ ఊళ్ళో శివాలయం ఎక్కడ ఉంది?” అని అడిగాడు. కాని ఎవ్వరినుండి జవాబు రాలేదు. వారిలో ఉన్న ముసలాయన, “ఇక్కడ ఒక విష్ణు ఆలయం ఉంది. అదికాక ఒక దేవీ ఆలయం, గ్రామ దైవం అయ్యనార్ ఆలయం, ఊరి పొలిమేరున గణపతి ఆలయం ఉన్నాయి. శివాలయం గురించి మాకు తెలియదు” అని చెప్పాడు. తొంబయ్యేళ్ల వృద్దునికే తెలియకపోతే ఇక వేరేవారికి ఏమి తెలుస్తుంది.


మహాస్వామివారు మరలా కొన్ని సైగలు చేశారు. ఊరికి పైభాగాన విష్ణు ఆలయం ఉంది అంటే కింది భాగాన ఖచ్చితంగా శివాలయం ఉండి ఉంటుంది. కాని ఇప్పుడు అది లేదు అంతే. కాని గ్రామప్రజలకు ఆ విషయం ఏమి తెలియదు. అందరూ మౌనంగా ఉన్నారు.


ఈ సంభాషణ జరుగుతుండగా అక్కడకు ఒక మహమ్మదీయ దంపతులు ఒకరు వచ్చారు. అతను తనని తానూ లతీఫ్ భాయ్ అని, తన భార్య మేహరున్నిసా అని పరిచయం చేసుకున్నాడు. వారితో పాటు తెచ్చిన రెండు అరటి గెలలను, రోజా పూలను స్వామివారికి సమార్పించారు. మహాస్వామివారు వారిని ఆపాదమస్తకం ఒక్కసారి చూశారు. స్వామివారిని దర్శించుకున్న పూజ్యభావం వారి కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లతీఫ్ భాయ్ తేరుకుని చెప్పడం ప్రారంభించాడు. అతని సంభాషణ వల్ల ఒక విషయం తెలిసింది.

కొన్ని శాబ్దాల క్రితం ఇక్కడ ఒక శివాలయం ఉండేది. కాలాంతరంలో అది కాస్త పాడయిపోయి భూమిలో కలిసిపోయింది. ఆ భూమి ఎంతోమంది చేతులుమారి చివరకు లతీఫ్ భాయ్ ఆధీనంలోకి వచ్చింది. “మా నాన్నగారి హయాంలో దర్గా భూములు చూసుకుంటున్నప్పుడు కొన్ని దేవాలయ భూములను కూడా తీసుకుని వ్యవసాయం చేస్తుండేవారు. శివుని భూములను చూసుకుంటూ మోసం చెయ్యడం వల్ల వంశం పాడవుతుందని గట్టిగా నమ్మేవారు. ఈశ్వరుని కృప వల్ల ఆ భయం, భక్తి, మంచితనం నాకు కూడా అబ్బింది. కాని ఏం చెయ్యాలి. మాకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు మానసిక రుగ్మత వల్ల పదేళ్ళ క్రితం చనిపోయింది.

నాకు అనిపిస్తుంది తెలిసో తెలియకో మేము ఎదో పాపం చేశాము అందుకే అల్లాహ్ మాకు ఇలా చేశాడు అని నిభాయించుకొన్నాము. కాలం వేగంగా గడిచిపోయింది. నిన్న ఇంటి వెనుక మట్టిలో ఎదో పని చేసుకుంటుండగా ఒక శభ్దం వినబడింది. కొద్దిగా మట్టిని తీసి చూడగా ఒక పెద్ద శివలింగం కనపడింది. రాత్రి నాకు నిద్రపట్టలేదు. మేము చాలా ఆందోళన పడి, దాన్ని ఏం చెయ్యాలో పాలుపోక అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము. ఉదయం అవ్వగానే చుట్టుపక్కల వారు మీరాక గురించి మాట్లాడుకుంటుండంతో వెంటనే ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో పరమాచార్య స్వామివారే సెలవియ్యాలి“ అని స్వామికి నమస్కరించారు.

“మనస్ఫూర్తిగా ఆ భూమిని ఇవ్వడానికి నేను సిద్ధం. దానికి బదులుగా నాకు డబ్బు కూడా వద్దు. పూర్వం శివాలయం ఎలా ఉండేదో అలాగే నిర్మిద్దాం. అది గ్రామ ప్రజాలకు సమ్మతమైతే ఆల్లాహ్ కూడా సంతోషిస్తాడు” అని కాళ్ళ నిరు పెట్టుకుంటూ తన్మయత్వంతో చెబుతున్నాడు. కేవలం మాటలు చేప్పడమే కాదు.

“మావంతుగా శివాలయ నిర్మాణం కోసం ఈ కానుకని స్వికరించండి అని 101/- రూపాయలను సమర్పించారు. తొలి సమర్పణగా దిన్ని భావించండి” అని ఒక పళ్ళెంలో తాంబూలంతో సహా సమర్పించారు. అక్కడున్నవారంతా మాటలురాక అలా చూస్తుండిపోయారు.

ఇప్పటిదాకా మహాస్వామివారి ఆ మహామ్మదియుడు చెప్పిన విషయాలను మందహాసంతో వింటున్నారు. సైగల ద్వారా స్వామివారు ఎదో అడిగారు. అతనికి అదేమిటో అర్థం కాకపోవడంతో ఒక పాలక బలపం తీసుకుని వచ్చి స్వామివారికి అందించాడు. స్వామివారు ఆ పలకపై అతను మక్కా యాత్ర చేశారా అని అడిగారు. అందుకు అతను లేదని, అల్లా మాకు అంత ధనం ఇవ్వలేదని తెలిపాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్నా వెళ్ళడం కుదరలేదని తెలిపాడు.

వెంటనే మహాస్వామివారు వైద్యనాథన్ వైపుకి తిరిగి విచారిస్తున్నట్టుగా, “స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డ ఇంతటి ఉత్తమమైన వ్యక్తి, మరి మనం ఏదైనా సహాయం చెయ్యాలి కదా? అతని అవసరం కూడా ఇప్పుడు మనకు తెలుసు కదా!” అన్నారు. పరమాచార్య స్వామివారి ఆలోచనని గ్రామ్పరజలకు తెలిపారు వైద్యనాథన్.

అది విన్న వెంటనే ఊరిప్రజలు అందరూ మరొక ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. వాళ్ళు మహాస్వామితో, “వారి మక్కా - మదీనా యాత్రకు అయ్యే ఖర్చును మేము భారిస్తాము పెరియావ” అని చెప్పారు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. స్వామివారు ఆ దంపతులిద్దరిని గ్రామప్రజలను ఆశీర్వదించారు.

తరువాత స్వామివారు నిదానంగా పైకిలేచి గోడకు ఉంచిన దండాన్ని తీసుకొని పల్లకిలోకి వెళ్లి కూర్చున్నారు. వారివైపు చూసి నవ్వుతూ అందరిని ఆశీర్వదించారు. మరలా అందరితో కలిసి యాత్ర బయలుదేరింది. అప్పుడు మహాలింగం అన్నారు, “ఇప్పుడు అర్థం అయ్యింది ఎందుకు మహాస్వామివారు ఈ ఊర్లో పల్లకి ఆపమన్నారో! ఎ కారణం లేకుండా ఏమి జరగదు. పరమాచార్య స్వామివారి ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుంది”

--- వైద్యనాథన్ ‘శంకర భక్త జ్ఞాన సభ’ కార్యదర్శి

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#కంచిపరమాచార్యవైభవం....

==(())==

*తొలి అడుగు - తుది అడుగు*

భరతజాతి ఉన్నత నైతిక ప్రమాణాలకు దైవ నమ్మకం, విశ్వాసాలే కారణం. గతంలో మన దేశాన్ని సందర్శించిన ఎందరో విదేశీయులు మన జాతి ఔన్నత్యానికి నమ్మకమే పునాది అని అంగీకరించారు.

గ్రీకు దౌత్యవేత్త మెగస్తనీస్‌ మన దేశాన్ని సందర్శించినప్పుడు ఇళ్లకు తలుపులు, తాళాలు లేకపోవడం గమనించాడు. ఆ విషయం తాను రాసిన ‘ఇండికా’ గ్రంథంలో ప్రస్తావించాడు. మహారాష్ట్రలోని శిరిడికి సమీపంలో ఉన్న శని సింగనాపూర్‌లో నేటికీ ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. అక్కడి ప్రజలకు దైవం మీద ఉన్న సంపూర్ణ నమ్మకమే వారి నిర్భయానికి కారణమని  చెబుతారు.

మనిషికి అమ్మ చెప్పిన నాన్న ఓ నమ్మకం. నాన్న ఇచ్చే భరోసా మరో నమ్మకం. బాల్యం నుంచి తల్లిదండ్రులు పిల్లల మనసులో నాటే ఆధ్యాత్మిక బీజాలు ఇంకో నమ్మకం. ఈ మూడింటినీ త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు... మనకు తెలియకుండానే మనలో నైతికత, ఆధ్యాత్మికత, బాధ్యత వేళ్లూనుకుంటాయి.

తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మనకు విలువల తొలి అడుగులు నేర్పిస్తారు. అవే భావి జీవితంలో నమ్మకానికి, నిజాయతీకి ఆలంబనగా నిలుస్తాయి. మనం ఎదుగుతున్న కొద్దీ వాటి ప్రభావం అదృశ్యంగా పనిచేస్తూ సొంత ఆలోచనలకు, నమ్మకాలకు పునాది వేస్తాయి.

ఎవరైతే నమ్మకాన్ని బాధ్యతగా భావిస్తారో వారికి దైవం అండ లభిస్తుంది. ఎదుటివారిని నమ్మడం నేర్పుతుంది. నమ్మకద్రోహం తలపెట్టే వారిని పిరికితనం, అభద్రతాభావం ఎల్లప్పుడూ వెంబడి స్తుంటాయి. నమ్మిన పనిని దైవకార్యంగా భావించి దానికోసం శ్రమించాలి. అప్పుడే అపజయం ఆమడ దూరంలో ఆగిపోతుంది.  మనం ఏ సత్కార్యం తలపెట్టినా దాన్ని దైవారాధనతో మొదలు పెడతాం. అది మన ఆధ్యాత్మిక సంస్కృతిలో భాగమై పోయింది.

నమ్మకం ఆలోచింపజేయాలి... నమ్మినదాన్ని ఆచరించే ముందు ఒక్క క్షణం విచక్షణతో ఆలోచించాలి. అప్పుడే పర్యవసానాలు బోధపడతాయి. దశరథుడు వేటాడే సమయంలో అంధులైన వృద్ధ తల్లిదండ్రుల దాహం తీర్చేందుకు శ్రవణుడు నీటికోసం వెళతాడు. నదిలో కుండ ముంచి నీళ్లు పడుతుంటే బుడబుడ శబ్దం వస్తుంది. అక్కడ జంతువు ఉందనుకుని అనాలోచితంగా దశరథుడు బాణం వేస్తాడు. శ్రవణుడు మరణిస్తాడు. ఫలితంగా దశరథుడు వృద్ధుల శాపానికి గురై, చివరి దశలో రాముడి ఎడబాటు భరించలేక పుత్రశోకంతో ప్రాణాలు విడుస్తాడు.

గుడ్డి నమ్మకం ఎల్లవేళలా తగదని పెద్దలు చెబుతారు. పక్షి సహజంగా చెట్టు కొమ్మల పైన కూర్చుంటుంది కానీ ఆకుల మీద కూర్చోదు... చెట్టు ఎంత బలమైనదైనా... కూర్చున్న కొమ్మను పక్షి నమ్మదు. ఎందుకంటే చెట్టు కూలినా, కొమ్మ విరిగినా... సులభంగా ఎగిరిపోవడానికి తన రెక్కలపై పూర్తి విశ్వాసంతో సదా సిద్ధంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేడు ఎంతోమంది యువతీయువకులు గుడ్డి నమ్మకాలతో ప్రేమ, పెళ్ళిళ్ల ముసుగులో పరస్పర నమ్మకం కోల్పోతున్నారు. చివరికి ఒకరినొకరు మోసగించుకుంటూ... హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం.


తనను తాను పరిపూర్ణంగా నమ్మిన తరవాతే ఏ కార్యాన్నయినా మొదలుపెట్టాలి. అందులో ‘తొలి అడుగు’ నీదైతే ‘తుది అడుగు’ సైతం నీదే కావాలి.

ఎం. వెంకటేశ్వర రావు

................

🙏 *శ్రీ వేంకటేశ్వర లీలలు* 

🍒 *భాగము 2* 🍒 

🌻 *సూతులవారు శౌనకాదులకు శ్రీ వేంకటేశ్వర లీలలు చెప్పనారంభించుట* 🌻

🍃🌹ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి. 

🍃🌹అంతట సూతులవారు – మునులారా! భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును. 

🍃🌹తను భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు. 

🍃🌹అనగా విని శౌనకాదులు సౌత! ఆర్షవిజ్ఞాన పునీతా! ఆర్ష విజ్ఞాన పునీతా!ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము, ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి. 

🍃🌹అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను, కాని మీరు ఆసక్తితో భక్తి శ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన ఏవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను. 

🍃🌹అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. 

🍃🌹అనంతరము శౌనకాది మహర్షులతో ఇట్లు చెచెప్పసాగిరి

--(())--

:

ఓ వరుణ దేవ గంభీర స్వభావ
ఓ కరుణ రాజ నిర్వాహస్వభావ
ఓ పరమ చక్ర ఔదార్య స్వభావ
ఓ జలపు దాత సంతృప్తి స్వభావ

 మార్గశిరమాసము మహి మాణ్యితము
వర్షము కుర్సెను పరమాద్భుతము
స్నానమును చేియు ట జలమాత్యునిని
గౌరవముగా మధుమతి ఆహ్వానము

నీవు దాతవు ఔదార్యుడవు
ధర్మనిష్టకు సాహిత్యుడవు
పాడి పంటకు జీవాత్ముడవు
భక్తితో నిను కొల్చే నిపుడు

ధనుర్మాస పుణ్యవ్రతము సర్వ శ్రేస్టము
సమత్వమ్ము సామర్ధ్యతను పెంచు మార్గము
హితన్మేఘ వర్షాజలము తృప్తి తత్వము
స్వధర్మా సమత్వా పరము  యిష్టతత్వము

బాహ్యశుధ్ధికై సర్వులు భక్తి మనసు
శ్రీని వాసుని సేవింప శ్రీకరమ్ము
పుష్కలమ్మగా వర్షమ్ము పుడమి పైన
వరుణ దేవకృపాకటాక్షములు పొందె
 

 🌹. గీతోపనిషత్తు  -102 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 30. బంధమోచనము -   బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును.  కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము.  ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. 🍀

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః 34

తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి, వ్యకిగతముగ వారికి సేవచేసి, వినయముగ వారిని సమయా సమయ వివేకముతో ప్రశ్నించియు, బంధమోచన జ్ఞానమును ఉపదేశపూర్వకముగ పొందుము. బంధమోచన జ్ఞానము, బంధమోచనులైన ముక్తి జీవుల వద్ద దర్శింపవచ్చును. జ్ఞాన మనగ బంధమోచన జ్ఞానమే అని తెలుపబడినది గదా! తెలిపినంత మాత్రమున తెలుసుకొనిన వాడు ఆచరింపలేడు.

ఫలాసక్తి లేక కార్యము నాశ్రయించి, కర్మను నిర్వర్తించవలెనని సర్వసామాన్యముగ అందరు వినియే యుందురు. అంతమాత్రముచేత ఆచరింప గలుగుచున్నారా? కర్మాచరణము దైవము తెలుపురీతిలో ఆచరించుట అంత సులభము కాదని అందరును అంగీకరింతురు. కోరిక ప్రధానముగ జీవించు మానవుడు, తన వ్యక్తిగత కోరిక కన్న కర్తవ్యమే ప్రధానమని భావించుటకు సంస్కారబలముగ చాల మార్పు రావలెను.

కేవలము విషయ పరిజ్ఞానము వలన ఎవ్వడును జ్ఞాని కాలేడు. నిజమగు జ్ఞాని సాన్నిధ్యము వలననే జ్ఞాని యగుటకు వీలగును. ఇచ్చట జ్ఞాని యనగ బంధములను పరిష్కరించుకొనుచు, చేయు కర్మలవలన మరల బంధములను సృష్టించుకొనక జీవించు విధానము. ఈ విధానమున జీవుడు బంధమోచనుడై, స్వతంత్రుడై దివ్యవైభవమున నుండును. అట్టివాడే జ్ఞాని. అతని నిత్యజీవన ఆచరణమే నిజమగు దర్శన జ్ఞానము. జ్ఞానుల జీవన విధానము ఆకర్షణీయమై యుండును. వారు కర్మలాచరించు తీరు, ఫలాసక్తి లేని సూటియైన కర్తవ్యాచరణము, వ్యామోహము లేని జీవనము గమనించినచో ఆచరించుటకు వలసిన స్ఫూర్తి, సంకల్పబలము కలుగును.

అట్లాచరించు బుద్ధిమంతుడు నిర్వర్తించవలసిన మరియొక కర్తవ్యము దైవమిచట బోధించు చున్నాడు. జీవన్ముక్తుడగు జ్ఞాని దరిచేరుట, అతని జీవన విధానమును అవగాహనము చేసుకొనుట, సున్నితముగ అతడు కర్మ నిర్వర్తించు విధానము తెలుసుకొనుట, స్ఫూర్తితో ఆ విధానము ననుసరించుటతో బాటు, అట్టి జ్ఞాన పురుషునికి సేవ చేయుట, సాష్టాంగ దండప్రణామము చేయుట, అనుగ్రహమున వారు తెలిపిన సుళువులను, సూత్రములను హృదయస్థము గావించుకొని, వాచాలత్వము లేక వినయముతో ఆచరించుట.

భగవద్గీత యందలి ఈ శ్లోకము సద్గురు శుశ్రూష బంధ మోచనము కోరువానికి ఉపకరణము కాగలదని తెలుపుచున్నది. స్వంతముగ తమకు తాము నిర్వర్తించుకొనుట కన్న తెలిసిన వారి సాన్నిధ్యమున నిర్వర్తించుకొనుట ఉత్తమము. తెలిసినవారి అనుగ్రహము పొందుట ఉత్తమోత్తమము.

అనుగ్రహ మనునది అయస్కాంతీకరణము వంటిది.  అయస్కాంత సన్నిధిని యినుప ముక్క త్వరితగతిని అయస్కాంతము కాగలదు. ఒక మనిషికి సేవ చేయుట, అతనికి సాష్టాంగ దండ ప్రణామము చేయుట, అతనిని వినయముతో అడిగి తెలుసుకొనుట అహంకారులకు సాధ్యము కాదు. అహంకారమున్నంత కాలము బంధమోచనము కలుగదు.

సాధకుని యందు సత్త్వము పెరుగుటకు ఈ మూడు సూత్రములను దైవము సూచించినాడు. అదియే మన పాద నమస్కారము, సేవ, పరిప్రశ్నము. కృష్ణ భక్తుల విషయమున ఈ మూడును గమనింపదగును. దైవభక్తుల జీవితమున ఈ మూడును దినచర్యగ పాటింపబడును. అట్టివారే దైవానుగ్రహ పాత్రులు కాగలరు. సద్గురువు రూపమున దైవమే వారిని అనుగ్రహించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[19:16, 19/12/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 300 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴
73. అధ్యాయము - 28

🌻. సతీ యాత్ర- 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

దక్షుని యజ్ఞమునకు దేవతలు, ఋషులు వెళ్లుచున్న సమయములోనే సతీదేవి గంధమాదన పర్వతమునందుండెను (1). దక్షపుత్రియగు సతి ఎత్తైన అరుగులతో కూడిన ఈత కొలను యందు సఖురాండ్రతో గూడి చిరకాలము క్రీడించెను (2). దక్షుని పుత్రియగు సతి ఆనందముతో క్రీడించుచూ, రోహిణీతో కలిసి దక్ష యజ్ఞమునకు వెళ్లుచున్న చంద్రుని చూచెను. ఆమె వెంటనే క్రీడలనుండి సెలవు తీసుకొని (3), తనకు ప్రాణ ప్రియురాలు, తనక్షేమమును చేయునది, విజయ అను పేరు గలది అగు తన సఖి కేశాలంకారమును చేసుకొనుచుండగా చూచెను. ఆ సతీదేవి ఆమెతో నిట్లనెను (4).

సతీదేవి ఇట్లు పలికెను -

ఓ విజయా! నీవు నాకు ప్రాణసమమైన ప్రీతిగల, సఖురాండ్రలో కెల్ల శ్రేష్ఠమైన సఖివి. ఈ చంద్రుడు రోహిణితో గూడి ఎచటకు వెళ్లుచున్నాడు? వెంటనే తెలుసుకొని రమ్ము (5).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సతి అట్లు ఆజ్ఞాపించగా, విజయ వెంటనే చంద్రుని వద్దకు వెళ్లి ఎచటకు వెళ్లుచుంటివి? అని మర్యాదగా ప్రశ్నించెను (6). విజయ యొక్క ప్రశ్వను విని చంద్రుడు తాను దక్షుని యజ్ఞమనే ఉత్సవమునకు వెళ్లుచున్నానని చెప్పెను. మరియు ఆదరపూర్వకముగా వివరములనన్నిటినీ చెప్పెను (7).

ఆ మాటలను విని ఆశ్చర్యమును పొందిన విజయ వేగముగా సతీదేవి వద్దకు వెళ్లి, చంద్రుడు చెప్పిన ఆ వృత్తాంతమునంతనూ చెప్పెను (8). ఆ మాటను విని నీలవర్ణముగల ఆ సతీదేవి చాల ఆశ్చర్యమును పొందెను. అట్లు జరుగుటకు గల కారణమును గూర్చి ఆలోచించిననూ, ఆమెకు తెలియలేదు. ఆమె తన మనస్సులో ఇట్లు తలపోసెను (9).

నా తండ్రియగు దక్షుడు, తల్లియగు వీరిణి మమ్ములనిద్దరినీ ఏల ఆహ్వానించలేదో! ప్రియకుమార్తెనగు నన్ను మరచినా యేమి? (10). దీనికి గల కారణమును గూర్చి శంకరుని అడిగెదను. ఇట్లు తలపోసి ఆమె ఆ యజ్ఞమునకు వెళ్లుటకై నిశ్చయించుకొనెను (11). అపుడా దాక్షాయణీ దేవి తన ప్రియ సఖియగు విజయను అచటనే యుంచి వెంటనే శివుని వద్దకు వెళ్లెను (12). సభామద్యములో అనేక గణములతో, నంది మొదలగు మహా వీరులతో, శ్రేష్ఠులగు గణాధ్యక్షులతో చుట్టు వారబడియున్న ఆ శివుని చూచెను (13).

ఆ దాక్షాయణి తన భర్తయగు ప్రభువును అచట చూచి, ఆహ్వానము రాకుండుటకు గల కారణమునడుగుటకై శంకరుని సన్నిధికి వెంటనే వెళ్లెను (14). శివుడు తన ప్రియురాలగు ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో, ఆదరముతో మాటలాడగా, ఆమె చాల సంతసించెను (15). అపుడు గొప్ప లీలలను ప్రకటించువాడు, సర్వేశ్వరుడు, సత్పురుషులకు సుఖములనిచ్చువాడునగు శంభుడు గణముల మధ్య విరాజిల్లువాడై ఆదరముతో వెంటనే సతీదేవితో నిట్లనెను (16).

శంభుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఈ సభా మధ్యములోనికి విస్మయముతో గూడిన దానవై నీవు వచ్చుటకు గల కారణమును ప్రీతితో నాకు వెంటనే చెప్పుము (17).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మహేశ్వరుడు అపుడిట్లు పలుకగా, శివపత్నియగు సతి చేతులు జోడించి నమస్కరించి వెంటనే ఇట్లు పలికెను (18).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[19:16, 19/12/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 187 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి  - 7 🌻

39. చాలా సంపాదించాననుకుంటే అది ఉండగా మనంపొతాం. మన పుణ్యం బాగుండకపోతే, మనముండగానే అవి పోతాయి. రెండూ దుఃఖమే. తపోధనం సంపాదించాలి. ఆ తపోధనానికి హేతువైన ఎలాంటి శరీరం ఉండాలి, ఎలాంటి మనస్సు ఉండాలి అంటే – అందుకు శౌచమే విధించారు. మితాహారంవల్ల అది వస్తుంది.

40. ఎంత బలిష్ఠుడయినా, వాడికి ఏదో రోగం వస్తే ఒక మూల పడుంటాడు. వాడిని గౌరవిస్తారా? వాడి ఆత్మగౌరవం అంతా ఏమయింది? వాడి గర్వం అంతా ఏమయింది? నశించలేదా? అతడికి కేవలం పశువుకు చేసినట్లు చికిత్స చెయ్యరా వైద్యులు? కాబట్టి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రతిపత్తి, గౌరవము, దర్పము-వీనియందు ఆధారపడి ఉండకూడదు. ఆత్మగౌరవంతో తనను తాను గౌరవించుకునే స్థితిలో ఎప్పుడూ ఉండాలి. శౌచం చేత, గుణంచేత, “నాలో దోషం లేదు” అని తనను తాను గౌరవించుకోవాలి.

41. ఆత్మగౌరవం అంటే, “ఏ లక్షణములు నాయందు ఉన్నాయో అవి గౌరవహేతువులు. నన్ను నేను అవమానపరచుకోవలసిన ఆవశ్యకత నాకు లేదు. నా గుణములవల్ల నా యందు నాకు గౌరవమే ఉంది” అనుకోవాలి. అయితే అది అహంకారం కాదు, దర్పంకాదు. అట్టి ఆత్మగౌరవానికి యోగ్యత సంపాదించాలి. అంతేకాని ఇంకొకళ్ళు ఇచ్చేది గౌరవంకాదు. తనయందు తనకుండే గౌరవమే గౌరవం. కలియుగంలో ఈ ధర్మాలు ఎక్కువగా చెప్పారు పురాణాలలో.

42. అట్టి అపూర్వధర్మనిర్ణాయకుడు విశ్వామిత్రుడు. దీక్షకు, పట్టుదలకు మరోపేరు ఆయన. పట్టుదలలేని వాడు దానికోసం ఒకసారి విశ్వామిత్రుణ్ణి తలచుకోవాలి. బాగా ఆలోచించి ఒక నిర్ణయంతీసుకున్నాక, ఇక ఎంత కష్టం వచ్చినా దాని అంతు కనుక్కోవలసిందే! ఆ పట్టుదలే ఆర్యుల లక్షణం. ఈ పట్టుదల రజోగుణంవల్లనే వస్తుంది. ఆ రజోగుణంలేనిదే తపస్సులుకూడా ఫలించవు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[19:16, 19/12/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 126 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 5 🌻

520. "నేను ఎవడును?" అన్న భగవంతుని తొలిపలుకునకు ఇచ్చట విజ్ఞన్నభూమికలో "నేను భగవంతుడను"అని సమాధానము వచ్చినది.

521. ఆదిలో భగవంతుడు భగవంతునిగా నుండెను. ఇప్పుడు భగవంతుడు భగవంతుడయ్యెను.

522. భౌతిక , సూక్ష్మ, మానసిక ప్రపంచములలో యదార్థముగా, భగవంతుడు భగవంతునిగా లేకుండెను.

523. ఇచ్చట భగవంతుడు తన అనంత యదార్థ స్థితిఃని ఎఱుకతో అనుభవించుచున్నాడు, భగవంతుని దివ్య స్వప్నము ఇక్కడితో అంతమై పోయినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[19:16, 19/12/2020] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90  / Sri Vishnu Sahasra Namavali - 90 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

ధనిష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀 90. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !! 🍀

 🍀 835) అణు: -
సూక్షాతి సూక్షమైనవాడు.

🍀 836) బృహుత్ -
మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.

🍀 837) కృశ: -
సన్ననివాడై, అస్థూలమైనవాడు.

🍀 838) స్థూల: -
స్థూల స్వరూపము కలిగియున్నవాడు.

🍀 839) గుణభృత్ -
సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.

🍀 840) నిర్గుణ: -
గుణములు తనలో లేనివాడు.

🍀 841) మహాన్ -
దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.

🍀 842) అధృత: -
సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.

🍀 843) స్వధృత: -
తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.

🍀 844) స్వాస్య: -
విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.

🍀 845) ప్రాగ్వంశ: -
ప్రాచీనమైన వంశము కలవాడు.

🍀 846) వంశవర్థన: -
తన వంశమును వృద్ధినొందించువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 90 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Dhanishta 2nd Padam

🌻 90. aṇurbṛhatkṛśaḥ sthūlō guṇabhṛnnirguṇō mahān |
adhṛtassvadhṛtasvāsyaḥ prāgvaṁśō vaṁśavardhanaḥ || 90 || 🌻

🌻 835. Aṇuḥ:
One who is extremely subtle.

🌻 836. Bṛhat:
The huge and mighty.

🌻 837. Kṛśaḥ:
One who is non-material.

🌻 838. Sthūlaḥ:
Being the inner pervader of all, He is figuratively described as Stula or huge.

🌻 839. Guṇa-bhṛt:
The support of the Gunas. He is so called because in the creative cycle of creation, sustentation, and dissolution, He is the support of the Gunas – Satva, Rajas and Tamas – with which these functions are performed.

🌻 840. Nirguṇaḥ:
One who is without the Gunas of Prakruti.

🌻 841. Mahān:
The great.

🌻 842. Adhṛutaḥ:
One who, being the support of all supporting agencies, like Pruthvi (Earth), is not supported by anything external to Him.

🌻 843. Svadhṛtaḥ:
One supported by oneself.

🌻 844. Svāsyaḥ:
One whose face is beautiful and slightly red like the inside of a lotus flower.

🌻 845. Prāgvaṁśaḥ:
The family lines of others are preceded by the lines of still others, but the Lord's descendent, namely, the world system, is not preceded by anything else.

🌻 846. Vaṁśavardhanaḥ:
One who augments or destroys the world-system, which is His off-spring.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

2 comments: