
తాత మనవుడి ముచ్చట్లు కాఫీ చిన్న కధ (8)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది యదార్ధ ప్రాంజలి ప్రభ గాధ )
2020 లో జరిగిన ముచ్చట్లు కాఫీ చిన్న కధ (11)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
: 🙏 *శ్రీ వేంకటేశ్వర లీలలు* 🙏
🍒 *భాగము 15* 🍒
🌻 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట*
🍃🌹గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వాని పై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి! ఒక్కరోజయినా నీవు ని సాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు.
🍃🌹నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.
🍃🌹ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను.
🍃🌹ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.
🍃🌹రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును. ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది.
🍃🌹మందలించుటయేమి – హెచ్చరించినది, ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడ’’నన్నాడు వినయముగా గోపాలుడు.
🍃🌹రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది.
🍃🌹ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది.
🍃🌹ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.
🍃🌹కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.
🍃🌹ఆయన తలపై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేల పైబడి మూర్చపోయినాడు. అంతట ఆవు అంబా, అంబాయని అరుచుకొనుచు కన్నుల వెంబడి నీరుకారుచుండగ పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను. ఎన్నడూ పొందని ఆశ్చర్యము పొందినాడు రాజు.
🍃🌹వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొన నిశ్చయించినాడు. మహాశ్చర్యభరిత ఆలోచనా సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయముగా ఆ ఆవు ననుసరించి పర్వతాన్ని అదిరోహించి పుట్ట చెంతకు చేరాడు. పుట్ట నుండి రక్తము వచ్చుట ఎట్టు జరుగుచున్నది? గోపాలుడు మూర్చబోవడానికి కారణము ఏమిటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి! ఇంతలో...
🍃🌹ఇంతులో ఏమి జరిగినదీ అంటే గాయమూ, రక్తమూ కలిగిన తలతో శ్రీమహావిష్ణువే పుట్టవెలుపలికి వచ్చేశాడు. వచ్చి, చోళరాజును జూచినవాడై ఆగ్రహముతో ‘‘ఓరీ! మదాంధా! నీచరాజా! నీకు కళ్ళు ఎంతగా మూసుకొనిపోయినవి? లేకున్న నీకు యెగ్గూ తలపెట్టని నన్ను. నీ గోపాలుని చేత గండ్రగొడ్డలితో కొట్టించుటకు సాహసించి యుందువా! నా కోపమునకు, నా బాధకు నీవు కారణమైతివి గనుక, ఇదిగో శపించుచున్నాను, ఆ తప్పు ని కాదు. ఆ గోపాలునిదే అనగలవేమో! సేవకుల దోషములకు యజమానులకు దండన వుండి తీరును, అందువలన నీవు పిశాచమయిపోయెదవు గాక!’’ యని శపించెను.
🍃🌹భరించలేని పిశాచరూపము పొందునట్లు స్వామి తీవ్రకోపముతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయెను. అతడు స్వామి పవిత్ర పాదముల పై కుప్పగా కూలిపోయాడు. విలపించడం ప్రారంభించాడు.
🍃🌹‘‘ఓ స్వామీ! పవిత్రమూర్తీ నేను ఏ పాపమున్నూ యెరుగను. గోపాలుని గండ్ర గొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు యాజ్ఞపించలేదు స్వామీ! నిజముస్వామీ నమ్ము స్వామీ! నన్ను పిశాచముగా మారిపోవుట యెందులకు మీరు శపించినారు. ఎంత ఘోరమయిన శాపమిచ్చినారు? స్వామీ!’’ అసలు మీరీ పుట్టలో నున్నట్లు నాకు తెలియనే తెలియదు. రక్షించు స్వామీ! అని అతిదీనముగా విలపించసాగినాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 97 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 27*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*రుక్మిణీ కళ్యాణం*
భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమస్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు.
పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు.
భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు.
రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
*వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం*
*డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం*
*డనఘుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై*
*మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.*
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.
*పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు*
*నబలలతోడ వియ్యంబు లందు;*
*గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి*
*చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;*
*రమణీయ మందిరారామ దేశంబులఁ*
*బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;*
*సదమల మణిమయ సౌధభాగంబుల*
*లీలతో భర్మడోలికల నూఁగు*
*బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు*
*శారికా కీర పంక్తికిఁ జదువుఁ సెప్పు*
*బర్హి సంఘములకు మురిపములు గఱపు*
*మదమరాళంబులకుఁ జూపు మందగతులు*
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది.
రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమైన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది.
ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది.
ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము, సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై, ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
*బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద" మంచు శేముషీ*
*సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డుపెట్టి దు*
*స్సంధుడు రుక్మి కృష్ణునెడఁజాల విరోధము జేసి "మత్తపు*
*ష్పంధయవేణి నిత్తు శిశుపాలున" కంచుఁ దలంచె నంధుడై!!*
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు.
అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం?
అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది.
శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు.
ఇపుడు రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది.
‘మహానుభావా నేను శ్రీకృష్ణపరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది.
వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.
కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయనకు పాద సంవాహనం చేస్తూ,
అయ్యా! మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది’ అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.
ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు.
వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది.
రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది.
నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే, మనస్ఫూర్తిగా వారి పాదములు ఒత్తి పెట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.
ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము.
ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.
రుక్మిణీ! నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.
ఈశ్వరా! నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగలిగిన నాడు ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా! నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి?
నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన”.
నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషులవాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
*నాగ సుబ్బయ్య పైడి* (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 48* 🕉
*కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో*
*వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో*
*దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో*
*ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_
🌹శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా.
🌹మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా?
🌹కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
అమృతస్య పుత్రా: శ్రీరమణ మహర్షి
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ రమణ మహర్షి .....
(డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.
వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.
ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.
శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.
పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వల్ల సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.
స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.
రమణ మహర్షిని గూర్చిన ఒక వ్యాసం వ్రాసాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత సోమర్ సెట్ మామ్ రాసాడు.
30 డిసెంబరు 1879 లో జన్మించిన భగవాన్ రమణమహర్షి. 20 వ శతాబ్దపు మహర్షి
అని అనేకులచే కీర్తించబడిన భగవాన్ రమణులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అనేక మంది ఉపాసకులు అనుభవాల ద్వారా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి విచారమార్గాన్ని చూపిన గురువులు రమణులు.
----------------------
భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే మౌన తపస్సు అంటారు మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌన సాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని ఉపదేశించేవారు అరుణాచల రమణులు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 1879 డిసెంబర్ 30న వెంకటరామన్గా జన్మించిన రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్లి, భగవత్కృపతో బతికి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.
అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు.
రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు. ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, క్రైస్తవులకు జీసస్గా, ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. అతడు, ఆమె అనే సంబోధించేవారు. పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.
‘‘గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అని చెప్పిన రమణులు అరుణాచలంలో అడుగిడినప్పటినుండి సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారానే అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించారు.1950, ఏప్రిల్ 14న తనువు చాలించేవరకు ఆయన కొన్ని వేల మందికి తన ఉపదేశాల ద్వారా ఉపశమనం కలిగించారు. కొన్ని వందలమందిపై చెరగని ముద్ర వేశారు. కొన్ని తరాల వారిపై బలంగా ప్రభావం చూపారు. ఇప్పటికీ కూడా అనేకులు రమణ మహర్షి నిజంగా భగవానులే అని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు, చేయరు కూడా! ఎందుకంటే వారి నమ్మకమే ఎంతో రమణీయమైనది మరి!
రమణ వాణి
మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం అవివేకం. మానవత్వాన్ని వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతదూరంలో ఉంటాడు. సావధానంగా వినటం, సంయమనంతో సమాధానమివ్వటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం, ప్రశాంతంగా జీవించటం అందరికీ అవసరం. నీ సహజస్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది బయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం. భగంతుని అనుగ్రహం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిని పొందడానికి అవసరమైనవే ప్రయత్నం, సాధన. మన జీవితంలో అనివార్యమైన, నిశ్చయమైన ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి, చనిపోయేవరకు సకల జీవుల పట్ల సంయమనంతో, విచక్షణతో మెలగడం అందరికీ అత్యవసరం. జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అయితే అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని తెలుసుకుని, భారాన్ని ఆయన మీద వేసి, వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. సజ్జనులతో సహవాసం జన్మజన్మల వాసనలను రూపుమాపడంలో తోడ్పడుతుంది. మనం నమ్మిన వారిని భౌతికంగా మాత్రమే కాదు, వారిని స్మరించడం, ధ్యానించడం, వారితో మానసికంగా అనుబంధం పెట్టుకోవడం ద్వారా కూడా వారి సాయం లభిస్తుంది. నీ విశ్వాసమే నీ ఆయుధం.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు..
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ప్రతిరోజూ ఉదయం 5 గం.లకు క్రమంతప్పకుండా భగవాన్ కూర్చునే హాలు తెరచేవారు, భక్తుల దర్శనార్ధం. స్వామి సమక్షమే ఈశ్వరసందర్శనం లాగా, స్వామి ప్రమేయం లేకుండానే, భక్తులు సాష్టాంగ నమస్కారాలు చెయ్యడము ఉపనిషద్ పారాయణం, ధ్యానం చెయ్యడం జరిగిపోతూ ఉండేవి. ఆశ్రమ నియమాల ప్రకారం స్త్రీలు రాత్రులందు ఆశ్రమంలో వుండకూడదు కావున, బయటనుండి స్త్రీలు ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చేవారు.
ఆరున్నరగంటలకు స్వామి స్నానంముగించి ఫలహారం సేవించి కొండమీదకు వెళ్ళేవారు. మిగిలినవారు తమ దైనందిన పనులు చూసుకునేవారు. అంటే, తోట నుండి పూలు తెచ్చి పూలు కట్టడం, వంటకు కావలసిన సంభారాలు వూరిలోనికి వెళ్లి తేవడం, వంటపని, పశువులను శ్రద్ధగా చూసుకునే పని యిలాంటివి. మరి కొందరు ఆశ్రమకార్యాలయంలో పఠనాలయమ్ నిర్వహణా కార్యక్రమం లో వుండేవారు.
వేదపాఠశాల నిర్వహించేవారు మాతృభూతెశ్వరునికి, దేవి యోగంబకు, స్కందునికి, వినాయకునికి, శ్రీచక్రమునకు, ఆగమవిధి ప్రకారము పూజలు చేశేవారు. పర్వదినాలలో విశేషపూజలు చేసేవారు.
ఎనిమిది గంటలకు స్వామి మరల హాలులో సోఫాలో కూర్చునేవారు. ఎక్కువగా మౌనంగా ధ్యానముద్రలో వుండేవారు. ఆసమయంలో భక్తులు తాము వ్రాసిన స్తోత్రాలు, పాటలు పాడేవారు. కొందరు తమ వాదనా
పటిమ స్వామి ముందు ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. వారికికూడా మౌనమే స్వామి సమాధానం. ప్రశ్నలు అర్ధవంతమై, అవతల వ్యక్తి జిజ్ఞాసతో కూడినది అయితే సమాధానం ఇచ్చేవారు. చాలా మంది మటుకు స్వామివదనం చూస్తూ ఆత్మవిచారము, ధ్యానము సులభంగా అభ్యాసము చేశేవారు.
ఆవిధంగా కొద్దిసేపు గడిచిన తరువాత, 9 గం. లకు దేశవిదేశాల నుండి వచ్చిన లేఖలకు గణపతిముని వ్రాసిన జవాబులు చూసి, అవసరము అనుకున్న చోట్ల సరిచేసేవారు. తిరిగి భక్తులతో గోష్టి . పదకొండున్నర గంటలకు మధ్యాహ్న భోజనము. ఆపై రెండుగంటలవరకు స్వామి వార్తాపత్రికల చదవడమో, విశ్రమించడం చేశేవారు.
సుమారు రెండున్నర గంటలకు భక్తులందరకూ తేనీరు. మళ్ళీ హాలులో స్వామి కొలువుతీరి సాయంత్రం వరకు దేశవిదేశీ భక్తులతో సత్సంగం. కొందరు సందేహనివృత్తి చేసుకునేవారు.
కొందరు స్వామి తేజోవంతమైన కన్నులవైపేచూస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తుండేవారు. సాయంకాలం 4.30 గం. లకు స్వామి కొండపైకి వెళ్ళేవారు. తిరిగిరాగానే, 5.30 నుండి ధ్యానసమయం. ఈ సమయంలో స్వామి వసారాలో కూర్చుని దర్శనమిచ్చేవారు. చుట్టుపక్కల అనూహ్యమైన ప్రశాంతత. వేదవిద్యార్ధుల నమక చమక పారాయణ, శ్రీ సూక్త పురుషసూక్తాలతో పరిసరాలు మారుమ్రోగిపోయేవి.
ఆతరువాత కొద్దిసేపు ఉపదేశసారము, వివిధ పుస్తక పారాయణము. ఆ సమయానికి మాతృభూతేశ్వర పూజ జరిగేది. ఆ తరువాత స్త్రీలు భోజనం చేసి నిద్రించడానికి వూరిలోనికి వెళ్ళేవారు.
స్వామి రాత్రి 7.30 ని. లకు లఘుభోజనము. ఎనిమిదిన్నరవరకు శిష్యుల ఘోష్టి. అనంతరం శిష్యులు నమస్కరించి శలవు తీసుకునేవారు.
ఆహా! యెంత నియమనిష్ఠలతో కూడిన దినచర్య. ఇట్టి దినచర్యలో స్వామితో పాలుపంచుకున్న ఆనాటి భక్తులు యెంతధన్యులో కదా! వారికి జీవన్ముక్తి కలిగింది అనుకోవడంలో అణుమాత్రం సందేహంలేదు. ఈ నాటికీ రమణాశ్రమంలో చరమాంకజీవితం గడుపుతున్న వారి జీవితాలు యెంత ప్రశాంతతను సంతరించుకున్నవో కదా!
రమణ = క్రీడించువాడు, రూప సంపదచేత సంతోషింప జేయువాడు; రమాయణీయుడు,సుందరుడు,మనోహరుడు, మనోజ్ఞుడు (ప్రియుడు,భర్త):;యోగులు రమించెడి నిత్యానంద స్వరూపమగు పరబ్రహ్మ,ఇచ్చాను సారము రామనీయమైన మూర్తిని వహించునట్టివాడు.
సర్వజీవుల హృదయములో ఎరుకగా క్రీడించెడివాడు.
భగవాన్ శ్రీ రమణమహర్షి చిన్ననాటి పేరు వెంకట్రామాన్.
బ్రాహ్మణ స్వామిగా విరూపక్ష గుహలోనున్న సమయంలో కావ్య కంఠ గణపతిముని వారికి ఈ పేరు ప్రసిద్ధ మొనర్చారు. జగద్విఖ్యాతిగాంచిన పేరు ఇదే.
భగవాన్ ఆత్మయొక్క శుద్ధచిత్ స్వరూపంలో క్రీడించారు.
రమణీయమే వారి బోధ. రమాణీయము అంటే ఆనంద సౌందర్యముల అనుభూతి. ఈ అనుభూతి చెడులో లేదు.
మంచిలో లేదు,అసత్యంలో లేదు,సత్యంలో ఉంది; ద్వేషంలో లేదు, ప్రేమలో లేదు ; సంఘర్షణలో లేదు, శాంతిలో ఉంది.
అంతస్సు బహిస్సును అనుగమిస్తుంది,అధోగమిస్తుంది. కనుక అంతర్ముఖత్వం వ్యక్తిత్వానికి పూర్ణత్వం ఇస్తుంది.
కేవలం ధ్యాన సమాధి నిమగ్నతలోనే కాక ,ప్రాపంచిక కర్యకలపాలలో కూడా ఆనంద రసామృతాన్ని ఆస్వాదింపజేస్తుంది.
శ్రీ రమణ మహర్షి రచించిన అక్షర మణమాల అర్థ విశేషాలలోని కొన్ని....
87. మౌనియై రాయిగా నలరకయున్నచో
మౌనమిది యగునొ అరుణాచలా !
భావం
అరుణాచలా ! కటికరాయి వలె ఉన్న మౌన స్థితి నిజమైన మౌనము
కాదు.అది ఆదర్శ నీయము కాదు.
విశేషాలు
మనసునిజముగానే మౌనమవటానికి హృదయమనే పద్మం పూర్తిగా వికసింప వలసిన అవసరము ఉన్నదని రమణులు ఈ చరణంలో ప్రబోధిస్తున్నారు. మనస్సుని మౌనముగా చేయటమే అసలైన మౌనం. అనగా అహంకారం నశించి. కోరికల ఆలోచనలు లేని మౌనమని తాత్పర్యం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళదలిస్తే శ్రీ భగవానులవద్దకు వచ్చి
"వెళ్ళవచ్చునా" అని అనుమతి తీసుకునే వారు. " నేను మద్రాసు వెళుచున్నాను లేక ఇంకెక్కడికో ప్రయాణం చేయవచ్చునా"? అని అడుగగా భగవానులు ఒక్కొక్కసారి " సరే" అని మరికొన్ని సందర్భాలలో మౌనంగా ఉండిపోయేవారు. భగవాన్ అంగీకరించారని ఎంతో సంతోషంగా భక్తులు
ప్రయాణమయ్యెడివారు. ఎవరైనా నిజంగా ఆయన అనుమతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనవద్దకేగి ఏమైనా అడిగితే రమణులు తమ అంగీకారాన్ని మౌనంగా ప్రకటించేవారు. మౌనం ఆధ్యాత్మిక సాధనకు మార్గం అయితే.. జపాలు, తపాలు, కీర్తనల మాటేమిటి? ఇవన్నీ దైవంపై మనసు కేంద్రీకృతం చేయడానికి ఉద్దేశించినవే! అయితే దైవత్వాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడానికి మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని చెబుతుంది రమణుల జీవితం. జపం చేస్తున్నామనుకోండి. పెదవులు మంత్రాన్ని పలుకుతుంటాయి. చేతిలో జపమాల
తిరుగుతుంటుంది. మనసు జప సంఖ్యపైకి మళ్లుతుంది. చివరగా..
సంకల్పం పక్కదారి పడుతుంది. సాధన సమర్థవంతంగా
సాగాలంటే జపం ఆగిపోవాలి. జపమాల తిప్పడం మరచిపోవాలి మనసులో మౌనం ఆవహించాలి. అప్పుడు ధ్యానం ఉన్నతస్థితికి చేరుకుంటుంది. మంత్రసాధనలో ఉన్నతమైనది మౌనసాధన.మౌనం శక్తిమంతమైనది, ప్రశాంతమైనది. ఇదే మహర్షి.
🕉🌞🌎🌙🌟🚩
తల్లితండ్రుల పుణ్యఫలం 🌻
🍃🌹మా తల్లితండ్రుల తాతల పుణ్యఫలం వల్ల ఆశీర్వచనం వల్ల మేము సుఖంగా ఉన్నామనే మాట వినబడుతుంది.
🌻 ఒకరి పుణ్యం మరొకరికి ఎలా సంక్రమిస్తుంది? 🌻
🍃🌹అవశ్యమనుభోక్తవ్యం కృతంకర్మ శుభాశుభం అనికదా సూక్తి. కర్మ మరొకరికి సంక్రమిపజేయవచ్చునా అన్నది ప్రశ్న.
🍃🌹ఇక్కడ మనం విచారించ వలసిన అంశం జన్మపొందే జీవులు తన తల్లిదండ్రులను ఎన్నుకోవచ్చునా? లేదా యాదృచ్చికమైన గర్భప్రవేశమే నా అంటే ఇది యాదృచ్చికం కాదనీ, ఇక్కడా ఒక నియతి ఉందనీ తెలుస్తుంది.
🍃🌹భగవంతుని అవతార కధలలో తల్లిదండ్రులు పూర్వజన్మలలో తపము చేసి సంతతిని పొందినట్లుగా ఉన్నది. యోగులు తపస్వులు కూడా తమ తల్లిదండ్రులను ఎన్నుకో వటం కూడా వారి జన్మగాధల లో గోచరిస్తుంది. భగవద్గీత చెప్తున్నది “శుచీనాం శ్రీమాతాం గేహే యోగభ్రష్టోభిజాయతే” అని.
🍃🌹తల్లితండ్రుల కర్మబలం వల్లనే తన కర్మబలం తోడి అనుకూల్యం వల్లనే జీవుడు గర్భప్రవేశం చేస్తాడని అనుకో వలసి ఉన్నది. పుట్టుకతోనే – రాజగృహంలోను పేద ఇంటి లోనూ పుట్టిన జీవులు తల్లిదండ్రుల కర్మానుభవ పరిమితులలోనే పెరుగుతారు కదా! సంతతి పరిణతి పొందే దాకా పొందే సుఖదుఃఖాలు తాను పెరిగిన ఇంటిలోనుంచి సంక్రమించేవే.
🍃🌹ఇది చిత్రమైన సంక్లిష్టమైన వ్యూహపరిణతి. మాతా పితురులకు సంతతికి నడుమ కర్మఫల ప్రభావం తప్పకుండా ఉంటుంది. సంతతి శరీర ప్రాణ మనో భూమికల నిర్మాణంలో వంశ పారంపర్య లక్షణాలు సంక్రమించటం, అవి ఏర్పరచే పరిమితులలోనే జీవనం కొనసాగటం, కర్మ మార్గంలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అందువల్ల జీవుని చిత్తంలో ప్రతిఫలించే పితరుల పుణ్య పాపములు సంస్కారాలకు చాలా వరకు హేతువులవు తున్నవి.
🍃🌹కొన్న్నికొన్ని సందర్భాలలో మాతాపితరులకు సంతతికి నడుమ అత్యంత వైరుధ్యం ఉన్న బ్రతుకు ధోరణులు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితి సందర్భాలలో అలాంటి స్థితికి తల్లితండ్రుల గూఢ కర్మకానీ, పుత్రుల బలవత్ కర్మభావం కానీ హేతువులు కావచ్చును.
🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼
🙏 మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు? 🙏
🍃🌺ఏ ప్రార్థన చివరిలోనయిన మన ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.
🍃🌺ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చల్లారుగాక)
🍃🌺ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లారుగాక)
🍃🌺ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లారుగాక)
🍃🌺1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని
🍃🌺2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
🍃🌺3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట. ఈ
‘ఓం శాంతి శ్శా…
🙏 రేపటి తిరుప్పావై ప్రవచనం 🙏
🌻 16 వ రోజు - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే 🌻
🌺 పాశురము 🌺
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
🍃🌹మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు.
🍃🌹ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాల్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.
🍃🌹"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు.
🍃🌹అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ద్వజం.
🍃🌹ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్ " మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు.
🍃🌹మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు.
🍃🌹అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం " మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళ్ళం తీయవయ్యా.
🍃🌹ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు.
🍃🌹మా కర్మ ఇలా ఉంది కాని, "* నెన్నలే వాయ్-నేరుందాన్"* నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటె "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా.
🍃🌹ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని "వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు,
🍃🌹ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
🙏 శ్రీ వేంకటేశ్వర లీలలు 🙏
🍒 భాగము 15 🍒
🌻 చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట 🌻
🍃🌹గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వాని పై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి! ఒక్కరోజయినా నీవు ని సాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు.
🍃🌹నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.
🍃🌹ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను.
🍃🌹ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.
🍃🌹రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును. ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది.
🍃🌹మందలించుటయేమి – హెచ్చరించినది, ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడ’’నన్నాడు వినయముగా గోపాలుడు.
🍃🌹రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది.
🍃🌹ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది.
🍃🌹ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.
🍃🌹కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.
🍃🌹ఆయన తలపై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేల పైబడి మూర్చపోయినాడు. అంతట ఆవు అంబా, అంబాయని అరుచుకొనుచు కన్నుల వెంబడి నీరుకారుచుండగ పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను. ఎన్నడూ పొందని ఆశ్చర్యము పొందినాడు రాజు.
🍃🌹వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొన నిశ్చయించినాడు. మహాశ్చర్యభరిత ఆలోచనా సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయముగా ఆ ఆవు ననుసరించి పర్వతాన్ని అదిరోహించి పుట్ట చెంతకు చేరాడు. పుట్ట నుండి రక్తము వచ్చుట ఎట్టు జరుగుచున్నది? గోపాలుడు మూర్చబోవడానికి కారణము ఏమిటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి! ఇంతలో...
🍃🌹ఇంతులో ఏమి జరిగినదీ అంటే గాయమూ, రక్తమూ కలిగిన తలతో శ్రీమహావిష్ణువే పుట్టవెలుపలికి వచ్చేశాడు. వచ్చి, చోళరాజును జూచినవాడై ఆగ్రహముతో ‘‘ఓరీ! మదాంధా! నీచరాజా! నీకు కళ్ళు ఎంతగా మూసుకొనిపోయినవి? లేకున్న నీకు యెగ్గూ తలపెట్టని నన్ను. నీ గోపాలుని చేత గండ్రగొడ్డలితో కొట్టించుటకు సాహసించి యుందువా! నా కోపమునకు, నా బాధకు నీవు కారణమైతివి గనుక, ఇదిగో శపించుచున్నాను, ఆ తప్పు ని కాదు. ఆ గోపాలునిదే అనగలవేమో! సేవకుల దోషములకు యజమానులకు దండన వుండి తీరును, అందువలన నీవు పిశాచమయిపోయెదవు గాక!’’ యని శపించెను.
🍃🌹భరించలేని పిశాచరూపము పొందునట్లు స్వామి తీవ్రకోపముతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయెను. అతడు స్వామి పవిత్ర పాదముల పై కుప్పగా కూలిపోయాడు. విలపించడం ప్రారంభించాడు.
🍃🌹‘‘ఓ స్వామీ! పవిత్రమూర్తీ నేను ఏ పాపమున్నూ యెరుగను. గోపాలుని గండ్ర గొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు యాజ్ఞపించలేదు స్వామీ! నిజముస్వామీ నమ్ము స్వామీ! నన్ను పిశాచముగా మారిపోవుట యెందులకు మీరు శపించినారు. ఎంత ఘోరమయిన శాపమిచ్చినారు? స్వామీ!’’ అసలు మీరీ పుట్టలో నున్నట్లు నాకు తెలియనే తెలియదు. రక్షించు స్వామీ! అని అతిదీనముగా విలపించసాగినాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺 తాళపత్రం 🌺
🥀 27 వ రోజు 🥀
🌻 సూర్యుడి వైపు ఏ సమయాలలో చూడరాదు? 🌻
🍃🌹భారతీయులు నూర్యదర్శనానికి (భక్తితో ఉదయించే సూర్యుడికి వందనం చేయడం) మరియు సూర్య నమస్కారాలకు (ఆసనాల ద్వారా సూర్యుడిని ఆరాధన చేయు విధానం) ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మన విశ్వాసం ప్రకారం ఉదయించే మరియు అస్తమించే సూర్యకిరణాలు
🍃🌹మన శరీర తేజస్సును పెంచుతాయి. అయినప్పటికీ రోజులోని కొన్ని సమయాలలో సూర్యుని వైపు చూడరాదని తెలుపడం జరిగింది
🍃🌹అనేక కథలు మరియు కవితల ద్వారా సూర్యుడు భూమండలంపై జీవితాన్ని నిర్దేశిస్తాడని అతని వైభవాన్ని కొనియాడారు. అలా అప్పటి నుండి సూర్యుడు మరియు సూర్య సంబంధమైన గృహ నక్షత్రాలు మానవుడికి ఆరాధ్యులుగా మారాయి ఒరిస్సాలోని కోణార్క్ గుడి (సూర్యాలయం)ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది
🍃🌹భూమి నుండి 15 కోట్ల కిలోమీటర్ల ఆవల నున్న సూర్యుడు మనకు తెలిసిన అగ్ని వేడికంటే ఎంతో వేడిగా ఉంటాడు. సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రత 580 కెల్విన్స్ (Kevin), అలాగే సూర్యుడి అంచు (Core) 15.6 కోట్ల కెల్విన్లు.
🍃🌹సూర్యుడి విస్తీర్ణం 14 లక్షల కొలోమీటర్లు కాగా 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ ప్రతీ సెకండుకు హీలియంగా మారుతుంటుంది. న్యూక్రియర్ మ్యూజన్ (Nuclear Fusion) వల్ల సౌరశక్తి ఉత్పన్నమౌతుంది. గామా కిరణాలుగా ఒక సెకండుకు దాదాపు 50 లక్షల టన్నుల శక్తి సూర్యుడి నుండి ఉత్పన్నమౌతుంది.
🍃🌹సూర్యుడు నింగిలో 450 కోట్ల సంవత్సరాల నుండి వ్యక్తమై ఉన్నాడని ఇంకా అనేక కోట్ల సంవత్సరాలు ఉంటాడని విశ్వసింపబడుతోంది
🍃🌹సూర్యుడిని మధ్యాహ్నం మరియు నీటిలో ప్రతిబింబంగా చూడరాదని పెద్దలు చెప్పారు. సైన్స్ .కూడా ఈ విషయానికి అంగీకారం తెలుపుతోంది సూర్యుడు అధిక ప్రకాశంగా మరియు వేడిగా ఉన్నప్పుడు చూడడం కంటి చూపుకు చాలా ప్రమాదకరం.
🍃🌹అలా చూస్తే కంటిచూపు ఎంతగానో దెబ్బతినే అవకాశం మెండు. ఈ విషయాన్ని సూర్యశాపంగా ప్రాచీన భారతీయులకు తెలుపడం జరిగింది. సూర్యుడిని ప్రతిబింభంగా నీటిలో చూడడం వరణుడికి సూర్యుడికి మధ్య ఘర్షణా భావాన్ని తెలుపుతుందనే విశ్వాసాన్ని ప్రాచీనులు కలిగి వుండి అల్లా చూడరాదని సెలవిచ్చారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
☘️ శ్రీనివాస వైభవం శ్రీవారి సేవలు ఉత్సవాలు 🦜
🍒 భాగము 137 🍒
🙏 సప్తగిరీశుని సంవత్సరోత్సవాలు 🙏
🌺 తిరుమల తిరుప్పావై 🌺
🍃🌸ఆర్తత్రాణ పరాయణుడైన ఘన వేంకటగిరి నాధునికి ప్రతిరోజు ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి.
🍃🌸ఇంత మాత్రమేగాక తిరుమల స్వామికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు పక్షోత్సవాలు, వారోత్సవాలు, వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి.
🍃🌸ఇలా ఎన్నో సేవలు జరుగుతున్నప్పటికీ ప్రతిదినం శ్రీవేంకటేశ్వరస్వామివారి దిన చర్య “కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే!” అను సుప్రభాత స్తవంతోనే ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవ ధనుర్మాసంలో ఒక్క నెలరోజులపాటు తప్ప మిగిలిన సంవత్సరమంతా సాగుతున్నది.
🍃🌸ధనుర్మాసంలో ఒక నెలరోజుల పాటు గోదాదేవి (ఆండాళ్) శ్రీ వేంకటేశ్వరుణ్ణి కీర్తించిన “తిరుప్పావై” సంకీర్తనాగానం జరుగుతుంది. ఈ ధనుర్మాసం సాధారణంగా మార్గశిర పుష్య మాసాల్లో వస్తుంది. అంటే సౌరమానం ప్రకారం డిసెంబర్ 15, 16 వ తేదీల్లో ప్రారంభమై జనవరి 14 తో ముగుస్తుంది.
🍃🌸తమిళ సాహిత్యంలో నాలుగు వేల పాటలు (పాశురాలు) గల “నాలాయిర దివ్య ప్రబంధం” చాలా ప్రసిద్ధమైంది. దీనిని వైష్ణవ భక్తాగ్రేసరులైన పండ్రెండుగురు ఆళ్వారులు, భక్తులు చెప్పారు. వీరినే దివ్యసూరులని, పరమ యోగులని అంటారు.
🍃🌸పరమయోగులైన ఈ ఆళ్వారులు శ్రీ మహావిష్ణువును గూర్చి పరవశించి పాడిన పాశుర ప్రబంధాలు వేదాలవలే సంభావింప బడుతున్నాయి.
🍃🌸అందులో “తిరుప్పావై' అనే ముప్పది పాశురాల కర్త గోదాదేవి. ఈమె 'పెరియాళ్వారు' అని ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తుని పెంపుడు బిడ్డ శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్రశాయియైన శ్రీమహావిష్ణువుకు, విష్ణు చిత్తుడు కైంకర్యం చేస్తున్న పూలమాలల్ని ముందుగా తాను ధరించి, మళ్లీ వాటిని స్వామి వారి కైంకర్యానికి పంపినందువల్ల ఈమెకు “ఆముక్తమాల్యద" అనే, "శూడికొడుత్తనాచియార్" అని ప్రసిద్ధమైన పేర్లు ఏర్పడ్డాయి.
🍃🌸ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ భగవానుని భర్తగా పొందవలెననే ఉద్దేశంతో మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేశారు. అలాగే గోదాదేవి కూడ తనను తాను గోపికగా భావించుకొని, ధనుర్మాసంలో (మార్గళి) ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించింది.
🍃🌸నెలరోజులపాటు ప్రతిదినం వేకువ జాముననే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్ర శాయి అయిన శ్రీమహావిష్ణువును గూర్చి రోజు కొక్క పాశురాన్ని (పాట) పరవశించి పరమగానం చేసేది.
🍃🌸ఆమె ఈ వ్రతం చేసి చివరకు శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడి ఆండాళ్ గా ప్రసిద్ధి పొందింది. ఆండాళ్ అనగా భగవంతుణ్ణి వశం చేసుకున్న స్త్రీ అని అర్ధం. ఈమె చేసిన వ్రతం “తిరుప్పావై గా పేరు పొందింది.
🍃🌸తిరు = శ్రీ, పావై= వ్రతం. అంటే శ్రీ వ్రతమన్నమాట. ఈమే గోదాదేవి. కోదా అంటే మాలిక. అంటే పాశురాలు మాలిక చేత కీర్తించి భగవంతుణ్ణి వశం చేసుకొన్నది కనుక ఆమె 'గోదాదేవి'. ఆనాటినుండి శ్రీరంగంలో "తిరుప్పావై గానం చేయబడుతున్నది.
🍃🌸వైష్ణవ భక్తాగ్రేసరులు అనేకమంది దర్శించి కీర్తించిన వైష్ణవ ప్రధాన క్షేత్రం తిరుమల. పోయే ఆళ్వారు, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వారు...మున్నగువారు శ్రీ వేంకటాచలపతిని దర్శించి అనేక రీతుల కీర్తించి గానం చేశారు. ఏకైక స్త్రీ ఆళ్వారుగా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కూడా తిరుమల సందర్శించి ఇలా కీర్తించింది.
వెయ్యదోర్ తళలు మిళ్ శక్కెరక్కై వేంగడ వర్ైన్నై విదికిత్తియే
🍃🌸వేయి వెలుంగులతో ప్రకాశిస్తున్న శంఖ చక్రాలను ధరించినట్టి తిరువేంకటపతికి నన్ను నేను పూర్తిగా అంకితమైనానని చెప్పి “నాచ్చియార్ తిరుమొళి” లో విన్నవించుకొంది.
🍃🌸గోదాదేవి చెప్పిన ఈ అంకిత భావాన్ని దృ స్టిలో వుంచుకొని భగవద్రామానుజులవారు తిరుమల తిరుపతి ఆలయాల్లో తిరుప్పావై” పఠనను ప్రతి ధనుర్మాసంలో అనుష్ఠింప జేశారు రామానుజాచార్యుల వారికి గోదాదేవి మీదా, ఆమె చెప్పిన “తిరుప్పావై' మీదా అత్యంత భక్తి, ప్రపత్తీ కూడ. ఈ తిరుప్పావై సర్వవేదసారమని వ్యాఖ్యానించి ప్రచారంచేసిన శ్రీరామానుజులు, “తిరుప్పావై జీయర్" ప్రసిద్ధి పొందారు.
తిరుప్పావై గురించి రేపటి భాగములో ఇంకా తెలుసుకుందాం..........
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
ఓం శ్రీ రాం
ReplyDelete