దేవుడున్నాడు హృదయంలో... కధ
కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు.
"స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.
సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.
"దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను.
అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు.
"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు.
పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.
"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.
"మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి.
"మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.
"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల.
అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి.
తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.
ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది..
అతని దగ్గరకు వెళ్లి.ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కక్కి అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".
కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.
"మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది.
దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు.
సేకరణ....దేవిని సంకల్పం
.........
సమ్మోహాలు .. కలువ (851-860)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లోకంలో స్త్రీలే
స్త్రీలే దీపాలే
దీపాలు కుటుంబానికి వెలుగు ఈశ్వరా
భర్త కళల వృధ్ధే
వృద్ధి తరుణి బుద్ధే
బుద్ధి తో సమయతృప్తి ఇచ్చేది ఈశ్వరా
కళ్ళలో కన్నీరు
కన్నీరు పన్నీరు
పన్నీరు పంచేది స్త్రీలే ఈశ్వరా
చెలిమి చలవ ఒప్పే
ఒప్పు తరుణ మెప్పే
మెప్పు చుక్కనిలా స్త్రీలు ఉండు ఈశ్వరా
ప్రీతి యన్న దేదీ
ఏది అంటె బందీ
బందీ లో సుఖము స్త్రీపురుషులు ఈశ్వరా
ప్రేయసి కళ ఓర్పే
ఓర్పు కలసి తీర్పే
తీర్పు ధర్మబద్దముగా ఉండు ఈశ్వరా
కన్నులు కదులు తీరు
తీరు తో కన్నీరు
కన్నీరు మనసుకదలికలేను ఈశ్వరా
చిరునగవు కన్నీరు
కన్నీరు సెలయేరు
సెలయేరగును స్త్రీల కన్నీరు ఈశ్వరా
విషయవాంఛల తీరు
తీరు మారిన ఏరు
ఏరు వాకసాగరము స్త్రీలకు ఈశ్వరా
చీకటి వెలుగు తీరు
తీరు బతుకు నీరు
నీరు కన్నీరు నిత్య వేదన ఈశ్వరా
--(())--
[15/12, 5:18 am] . Mallapragada: ప్రాంజలి ప్రభ ... ఆరోగ్య ప్రభ
✍️చలికాలం - ఆహార జాగ్రత్తలు!
👉చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీ కోసం వివరిస్తున్నాము.
👉చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.
👉మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
👉ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
👉మొలకెత్తిన గింజలు ఈ సీజన్లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.
👉ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
👉నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్ను వృద్ధి చేస్తాయి.
👉శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.
👉వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.
👉వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.
👉కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయలేక చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారు కొంత సమయం ఎండలో నడవడం మంచిది.
👉పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.
👉వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
👉పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది.
👉ఈ కాలంలో శరీరం పొడిబారడం, కాళ్ళు పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి కాళ్లకు రాసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
👉తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాకు తెలపండి. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే ప్రయత్నం 100% జరుగుతుంది. మా వద్ద మందులు తీసికుని వాడిన మరియూ వాడుతున్న మిత్రులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
మిత్రులందరికీ మా నుండి ఒక విన్నపం.. ఈ పేజీ చాలా విలువైన ఆరోగ్య విషయాలను అందరికి ఉచితంగా అందించాలనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో చేయడం జరిగింది. ఈ పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి సహకరించగలరని విజ్ఞప్తి. మీ మనసుకి ఇష్టమై మీకు బాగుంది అనిపిస్తే దయచేసి ఈ పేజీని లైక్, ఫాలో చేసి మరియు షేర్ చేయగలరని మనవి..
మీ ఆయుర్వేద అమృతం💐🙏
[15/12, 5:44 am] . Mallapragada: UU U UII IIUU
లోకంలో ప్రాంత కళల వృధ్ధే
సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే
చక్రంలా తిర్గు వినయ శుధ్ధే
శ్రీ కారం తెల్పె మనిషి శక్తే
లోకంలో ప్రేమ పరుగు నిప్పే
సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే
వక్కానిచ్చే తరుణము మెప్పే
చుక్కానిచ్చే మలుపుల యుక్తే
లోకంలో ప్రేయసి కళ ఓర్పే
చీకూచింతా కళ నిజ మార్పే
చీకట్లే మార్చు వెలగు నేర్పే
వాకిట్లో కల్సి బతుకు తీర్పే
లోకంలో ప్రీతి యనున దేదీ
లేకుండే కాని మన సనేదే
ఏకంగా ప్రేమ కలలు కాలం
ఈ కొద్దీ స్నేహ మధుర మయ్యే
సమ్మోహమ్మే సమయతలంపే
సద్భావమ్మే మనసున శక్తే
సందర్భమ్మే కరుణతొ యుక్తే
సౌందర్యమ్మే వయసున రక్తే
[15/12, 5:53 am] . Mallapragada: నేటి పద్యాలు
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇంద్రకీలాద్రి వనవాసినిగను అమ్మ
సింహివాహిని చారు రూపిణిగ అమ్మ
మందహాసిని రాజమాతంగి అమ్మ
దండధారిని శారదా దివ్య ధాత్రి
తనువు అంతయు ప్రమిదగా విస్థరించి
హృదయ మనసునే తైలమ్మగాను మార్చి
బుధ్ధి అనునది వత్తులుగాను చేర్చి
గుణము అందర్కి కార్తీకదీప మయ్యె
ఎల్లలోకాలు నల్లా నల్వని కృష్ణుడు
కృష్ణుడు చల్వని వాడె గోపాల కృష్ణుడు
కృష్ణుడు మెల్లగా ఉండు గోపికా కృష్ణుడు
కృష్ణుడే జగమంత తానై యున్నవాడు
మనిషికే జీవన గతినే మార్చు తలపులు
తలపులు చేరువయ్యే వరకునే వలపులు
వలపులు నిరంతరం ప్రవాహాలై కళలు
కళలు అన్నీ భవిష్యత్తు వైపు ఉరుకలు
మనసును తట్టుతూ భావోద్వేగాల కళ
కళతో కళ్ళనే గుంభనంగ కమ్ము వేళ
వేళలో మనసున మాతృభూమి సేవకళ
కళ తల్లిదండ్రులు ప్రేమను పంచు వేళ
తొలి తొలి తొలి చూపులు నా మనసునే చేరి
చేరి గిలి గిలి గింతలు పెట్టి తనువు కోరి
కోరి చిరు చిరు నవ్వులతో నాట్యమయూరి
మయూరి చెక చెక సంధించే పూలబణము
నా మదిలోని కళలను ఇక నీప్రేమకే
ప్రేమకే పెదవి వనికినే నీపిలుపుకే
పిలుపు హృదయములోన ప్రణయ పాఠముకే
పాఠములతో క్షణము క్షణము ప్రేమలకే
గోపాల పరమప్రియము ఇప్పుడు మాకిక
మాకిక పరమ పాదములే చూపు మాకిక
మాకిక ధరిత్ర అనంతసౌఖ్యము మాకిక
మాకిక సుఖశాంతుల నిలయమే గోపాల
--(())--
సమయానుకూలంగా వెళ్దాం.. లేకపోతే ???
``1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్ను అమ్మారు.. కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది .. కోడాక్ దివాళా తీసింది మరియు అతని ఉద్యోగులందరూ రోడ్డుపైకి వెళ్లారు..
HMT (చూడండి)
బజాజ్ (స్కూటర్)
డైనోరా (టీవీ)
మర్ఫీ (రేడియో)
నోకియా (మొబైల్)
రాజ్డూట్ (బైక్)
అంబాస్డోర్ (కార్)
మిత్రులారా,
వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్కు దూరంగా ఉన్నాయి !!
కారణం ???
కాలక్రమేణా అవి మారలేదు. !!
రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..
నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…
ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్వేర్. సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అతను ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.
సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.
Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
యుఎస్లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు, ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్వేర్ క్షణంలో మంచి న్యాయ సలహా ఇస్తుంది. రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 10% ఆదా చేసే వారు.. వారు సూపర్ స్పెషలిస్టులు అవుతారు.
వాట్సన్ అనే సాఫ్ట్వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు ఎక్కువ చేస్తుంది. 2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా తెలివైనవి.
రాబోయే పదేళ్లలో, 90% కార్లు ప్రపంచంలోని రోడ్ల నుండి అదృశ్యమవుతాయి.. సేవ్ చేయబడేవి ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ అవుతాయి.. రోడ్లు ఖాళీగా ఉంటాయి, పెట్రోల్ వినియోగం 90% తగ్గుతుంది, అన్ని అరబ్ దేశాలు దివాళా తీస్తాయి .
మీరు ఉబెర్ వంటి సాఫ్ట్వేర్ నుండి కారును పొందుతారు మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది.. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.
కార్లు డ్రైవర్ లేని కారణంగా 99% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.
డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై ఉండదు. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు స్వయంచాలకంగా అదృశ్యమవుతాయి ... ఎందుకంటే ఒక కారు ఈ రోజు 20 కార్లకు సమానంగా ఉంటుంది.
5 లేదా 10 సంవత్సరాల క్రితం, పిసిఓ లేని చోట అలాంటి స్థలం లేదు. అప్పుడు అందరి జేబులో మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు, అప్పుడు పిసిఓ మూసివేయడం ప్రారంభించింది .. అప్పుడు ఆ పిసిఓ ప్రజలందరూ ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్లైన్లో ప్రారంభమైంది.
మీరు ఎప్పుడైనా గమనించారా ..?
ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణంలో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.
ఇప్పుడు అంతా పేటీఎమ్తో పూర్తయింది.. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు .. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్ను ప్లాస్టిక్ మనీతో ముందే మార్చారు, ఇప్పుడు అది డిజిటల్గా మారింది. ఒక లావాదేవీ.
ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు తెరిచి ఉంచండి, లేకపోతే మీరు వెనుకబడిపోతారు..
కాలక్రమేణా మార్చడానికి సిద్ధం.
అందువల్ల ...
ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.
"టైమ్ టు టైమ్ అప్డేట్ & అప్గ్రేడ్"
సమయంతో కదిలి విజయం సాధించండి. ''
,........
*🔊ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు*
*🔶ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పంపిణీ*
*🔷ముందుగల రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్*
*🔶ఏ సెంటర్కు పోవాల్నో ముందే మెసేజ్ వస్తది*
*🔷గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్లోకి ఎంట్రీ*
*📜రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్*
*🍥 దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలనూ వివరిస్తూ గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల(పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది)కు, మూడో రౌండ్లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్ సాఫ్ట్వేర్లో సెల్ఫ్ రిజిస్ర్టేషన్కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.*
*💥రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే..*
*🌀రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల వద్దకు వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్మెంట్ అందించేందుకు డాక్టర్లు, మెడికల్ టీమ్లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.*
*💥ఒక సెషన్ లో వంద మందికే..*
*💠ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు. ఓటర్ లిస్ట్ ద్వారా వృద్ధులను, రోగులను గుర్తించనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్స్తోపాటు, ఆఫీసులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లను వాడుకోవచ్చని తెలిపింది. ప్రతి సెంటర్లో వెయిటింగ్ హాల్, వెరిఫికేషన్ హాల్, వ్యాక్సినేషన్ హాల్, వెయిటింగ్ రూమ్ కంపల్సరీగా ఉండాలని చెప్పింది. ప్రతి సెంటర్లో ఒక సెషన్లో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్ లో ఒక వ్యాక్సినేటర్, నలుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉండాలి. వ్యాక్సినేటర్గా డాక్టర్ లేదా నర్స్, లేదా ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన వారు ఎవరైనా ఉండొచ్చు. వీరికి ముందుగానే ఆరోగ్యశాఖ ట్రైనింగ్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ లో మొత్తం 23 డిపార్ట్మెంట్ల సిబ్బందికి డ్యూటీలు వేయాలని, ఏయే డిపార్ట్మెంట్ ఏయే పనులు చేయాలో గైడ్లైన్స్లో కేంద్రం పేర్కొంది.*
*💥వ్యాక్సిన్ వేస్కోవాలంటే ఇదీ ప్రాసెస్*
*♦️వ్యాక్సిన్ కోసం ఆరోగ్య శాఖ వద్ద లేదా కొవిడ్ (www.cowin.gov.in ) వెబ్సైట్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.*
*♦️ఏయే వ్యాక్సిన్ సెంటర్ లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో ముందుగానే లబ్ధిదారులకు సమాచారం ఇస్తారు.*
*♦️ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లాలి.*
*♦️వ్యాక్సినేషన్ ఆఫీసర్గా ఉన్న పోలీస్ సిబ్బందికి ఆ కార్డు చూపించి, వెయిట్ చేయాలి.*
*♦️తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన ఎస్ఎంఎస్, గుర్తింపు కార్డు చూపాలి. ఆఫీసర్లు కోవిన్ వెబ్సైట్లో రిజిస్ర్టేషన్ వివరాలను వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారు.*
*♦️వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్కు చెప్పాలి.*
*♦️ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కో–విన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన కార్డు ఇస్తారు. లబ్ధిదారు మొబైల్కు కూడా ఎస్ఎంఎస్ రూపంలో లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, వ్యాక్సినేషన్ సెంటర్, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ వంటివన్నీ ఉంటాయి. అలాగే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? అన్న సమాచారం కూడా ఉంటుంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ కార్డు తప్పకుండా తీసుకు రావాల్సి ఉంటుంది.*
[14/12, 9:11 pm] +91 99633 02905: మీ చిన్నతనం గుర్తు రావాలంటే విజయవాడ రేడియో స్తెషన్ వారి భక్తిరంజని ప్రోగ్రామ్ లోని స్తోత్రాలన్ని ఉన్నాయి వినండి. మీకూ నచ్చుతాయాని పోస్ట్ చేస్తున్నాన
https://www.youtube.com/playlist?list=PLgFOpEoSgN0G4cgO2yqitY4IxqD1NBl7P
††**********
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది ఇప్పుడు చట్టంగా మారింది.
*ఈ అగ్రికల్చర్ బిల్లు -2020 లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం
ఎంతసేపూ వాళ్ళూ వీళ్లు చెప్పింది వినడమే కాకుండా ఈ బిల్లు రైతులకు లాభం చేస్తుందా నష్టం చేసేలా ఉందా అని ప్రతి ఒక్క రైతు కూడా సొంతంగా ఆలోచించుకోవాలి.
ఈ కొత్త వ్యవసాయ బిల్లు గురించి పూర్తిగా అవగాహన పొందండి
🚫నిన్నటిదాకా ఉన్న రూల్స్ ప్రకారం రైతులు ధాన్యం తప్పనిసరిగా అయితే మార్కెటు కమిటీల అమ్మాలి లేకుంటె వాళ్ళ మండల పరిథిలో లేదా అదే జిల్లా పరిథిలో ఉండే ప్రయివేటు లేదా ప్రభుత్వ యార్డుల్లో మత్రమే అమ్ముకోవాలి అని చెప్తుండే . కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం లేవు.
🚫 రైతులు పండించిన ధాన్యం మన రాష్ట్రం దాటద్దు , పక్క రాష్ట్రాలకు తీసుకుపోయేదుంటే మా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, మధ్య మధ్యలో వచ్చే చెక్ పోస్టులు తప్పిచుకోడానికి వాల్లకు వీళ్లకు చేతులు తడపాలి అనే బాధల నుండి రైతులు ఇప్పుడు బయటపడ్డారు.
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకి ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం:-
✅ కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇకపై రైతులు తమ పంటలను ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకోవచ్చు.
✅ మార్కెటు కమిటీ ల మంచి రేటు ఉంటే మర్కెట్ ల అమ్ముకోవచ్చు (లేదా) ప్రయివేటు సేటు ఎక్కువ రేటు ఇస్తా అంటే సేటు కి అమ్మొచ్చు , (లేకుంటె) పక్కన ఇటు మహారాష్ట్రల - అటు కర్ణాటకల ఎక్కడ ఎక్కువ ధర ఉంది అంటే అక్కడికి ఒక పది మంది రైతులు జమ అయి ధాన్యం పట్టుకుపోయి మంచి రేటుకి అమ్ముకోవచ్చు.
✅ నీ పంటను నువ్ వేరే రాష్ట్రం తీసుకొనిపోయి అమ్మలేవు అనుకుందాము. అలాంటప్పుడు ఎలెక్ట్రానిక్ విధానములో నువ్ నీ పంట ఫొటొ తీసి ఆన్ -లైన్ లో పెట్టి నాణ్యమయిన ఫలానా రకానికి చెందిన ఫలానా పంట నాదగ్గర ఇన్ని క్వింటాళ్లు రెడీగా ఉన్నయ్. క్వింటాలుకు ఈ రేటుకి అమ్ముతా అని ఆన్ -లైన్ లో పెడితే నువ్ పెట్టిన రేటు దేశం మొత్తం మీద ఎందరో చూస్తారు. నువ్ చెప్పిన ధర ఎవరికి తక్కువ రేటులా అనిపిస్తె వాళ్ళే మనదగ్గరికొచ్చి కొనుక్కుని వెళ్తారు. ఇది కూడా రైతుకి లాభమే కదా....
✅ నీ పంట నాణ్యత నచ్చితే రిలయన్స్ ఫ్రెష్ , వాల్ మార్ట్, హెరిటేజ్ లాంటి కంపెనీలు సైతం నేరుగా నీ పొలం వద్దకే వచ్చి నగద్ పైసలతో నీ ధాన్యం , నీ పండ్లు ఫలాలు,కూరగాయలను కొనుక్కుని పోతాయ్. నువ్ పండించే పంట నాణ్యత చాలా బాగా ఉంటున్నాయి అని అనిపిస్తే అవే కంపెనీలు రాబోయే పంటను మాకే అమ్మాలి అనో లేదా ఇన్ని క్వింటాళ్ల పంట మేము కొంటాం అని నీతో ముందస్తుగానే అగ్రీమెంటు చే సుకోడానికి కూడా ఇష్టపడతాయి. అంటే నువ్ పంట పండించే కంటే ముందే నీకు మంచి రేటు దొరికినట్టే కదా....
📌 ఇక్కడ కొంతమంది రైతులని తప్పుదోవ పట్టించడానికి ఎం చెపుతున్నారంటే ప్రయివేటు కంపెనీలతో ముందస్తుగా అగ్రీమెంటు చేసుకుంటే భవిష్యత్తులో బయట మార్కెట్లో మద్దతు ధర బాగా ఎక్కువగా ఉన్నా కూడా అగ్రీమెంటు చేసుకున్న రైతులు యే రేటుకి ఇస్తం అన్నారో అదే రేటుకి పంట అమ్మి నష్టపోతారు అని రైతులను భయ పెడుతున్నారు. కానీ నిజానికి అలా మోసం చేయడానికి ప్రయివేటు కంపెనీలకు ఆస్కారం లేదు. అగ్రిమెంటు రాసుకునే సమయంలోనే అగ్రిమెంటులో మేము పంట కొనే సమయానికి ఉన్న మద్దతుధర లేదా అగ్రీమెంటు లో రాయబడిన ధరలలో ఏది ఎక్కువగా వుంటే ఆ ధర చెల్లించి మీ దగ్గర ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అని కంపెనీలతో అగ్రీమెంటు చేసుకోవచ్చు.
📌 ఇంకొకటి ఏం చెబుతారంటే ప్రయివేటు కంపెనీలు మీకు పెట్టబడి ఇచ్చి మీతో ఎక్కువగా పంట తీయించడానికి ఎక్కువగా ఎరువులు క్రిమిసంహారకాలు వాడించి మీ భూములలో సారాన్ని పీల్చి పిప్పి చేస్తాయి అని భయపెడతారు. రైతుసోదరులు గమనించాలి , ఏ కంపెనీ అయినా సరే రైతులకి పెట్టబడి ఇచ్చి ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అంటాయి, లేదా నీకు ఇచ్చిన పెట్టబడి డబ్బులను నువ్ అమ్మే పంటల డబ్బులో పట్టుకుని నీకు మిగతా డబ్బులు ఇస్తాయి. అంతే కానీ కంపెనీలే నీకు కొంత డబ్బులు ఇచ్చేసి నీ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకునే విదానం ఉండదు. ఒకవేళ అలాంటి కంపెనీయే ఉండి పొరపాటున వాల్లే నీ దగ్గరికి వస్తే కూడా నువ్ ఇయ్యకు కదా వాళ్లకి. నీ భూమి నీ ఇష్టం . నువ్ కంపల్సరీ ఇయ్యాలని కండిషన్ ఎం లేదు కదా.....
📌 కొంత మంది చెపుతున్నట్టుగా ఈ బిల్లులో మార్కెట్ కమిటీలను మూసివేయాలి అనో లేదా మద్దతు ధర ప్రకటించడం బంద్ అయితదనో ఏం లేదు. దేశ వ్యప్తంగా ఏ పంటకు ఎంత మద్దతు ధర (MSP) ఉందో కేంద్రం ప్రకటిస్తూనే ఉంటది, ఆ రేటు నచ్చిన రైతులు ఆ రేటుకే అమ్ముకోవాలి అనుకుంటే మార్కెటు కమిటీలలో అమ్ముకొనే అవకాశం కూడా ఉంటది. ఈ ఫెసిలిటీని తొలగించడంలేదు. ఒకవేల మార్కెటు కమిటీలో ఉన్న మద్దతుధర నాకు నచ్చలేదు, నా పంట ను నేను పక్క జిల్లాలొ లేదా పక్క రాష్ట్రంలో అమ్ముకుంటా అనే వాళ్ళు మార్కేట్ కమిటీకి పోకుండా బయటికి పోయి దారిలో ఎవ్వరికి రుపాయి చలానా కట్టకుండా పంట అమ్ముకుని పైసలు తెచ్చుకునే ఛాన్స్ రైతులకి కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
†*************
*1). కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.*
*2). కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.*
*3). కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.*
*4). కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.*
*5). ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.*
*6). పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.*
*7). పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.*
*8). పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.*
*9). పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.*
*10). పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.*
*డా.నయీమ్ ఖాన్*
********
*ఓ రైతు తన గాడిదను ఎప్పటిలాగే రాత్రి ఓ చెట్టుకు కట్టివేశాడు... రాత్రిపూట ఓ దెయ్యం చూసి, జాలిపడి తాళ్లు విప్పి వదిలేసింది...
గాడిద కదా, దానికేం తెలుసు..? వెంటనే ఓ పొలంలో పడింది... తినేంత కాడికి తిన్నది, మిగతాది ధ్వంసం చేసింది...
ఆ పొలం రైతు భార్యకు తిక్కరేగి, ఆ గాడిదను నరికి చంపేసింది... నా గాడిదను చంపేస్తావా అని గాడిద యజమాని ఆగ్రహంతో ఆమెను చంపేశాడు... నా భార్యను చంపుతావా అని ఆమె భర్త ఈ గాడిద యజమానిని ఖతం చేశాడు... నా భర్తను చంపుతావా అని కోపంతో గాడిద యజమాని భార్య సదరు రైతు ఇంటికి నిప్పు పెడుతుంది... నా ఇంటినే కాలబెడతావా అంటూ ఆ రైతు ప్రతీకారంగా ఆమెను, పిల్లల్ని చంపేస్తాడు...
ఈలోపు తనకు దెయ్యం కనిపిస్తుంది, తనే గాడిద కట్లు విప్పానని, ఈ అరిష్టాలు ఊహించలేదని చెబుతుంది... నీ కళ్లు చల్లబడ్డాయా అని దెయ్యాన్ని రైతు నిందిస్తాడు...
ఒరే మూర్ఖుడా..? నేనేం చేశానురా, కేవలం గాడిద తాళ్లు విప్పాను... అంతే... మీరే మీలోని అసలు దెయ్యాల్ని బయటికి తీశారు... చంపుకున్నారు... ఇక నోర్మూసుకో అని వెళ్లిపోయింది ఆ దెయ్యం...
తరువాతకాలంలో ఆ దెయ్యపు సంతానమే ఇండియన్ మీడియాగా అవతరించింది... రోజుకొక గాడిదను, అంటే ఏదో ఓ వివాదాన్ని తాళ్లు విప్పి వదులుతుంది ఈ సంతానం...
ఇక ప్రజలు వాదనలతో, తిట్లతో, డిబేట్లతో, దాడులతో చంపేసుకుంటున్నారు... స్నేహితుల్లేరు, పెద్దాచిన్నా లేదు... పక్కింటివారని లేదు, చుట్టాలని చూసేది లేదు... తన్నుకోవడమే...
(ఓ ఆంగ్ల పోస్టుకు నా స్వేచ్చానువాదం ఇది...)
............
*ప్రతీ ఒక్కరు చదివి తీరాల్సిన...విషయం*
* ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు
15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు
ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు
అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు.
దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.
20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.
అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.
దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా...
ఒకరోజు దొరికిపోయాడు.
మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.
మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ రోజును చెప్పేసారు
చివరగా అతని కోరిక ఏమని అడగగా
తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు
అతని కోరిక మేరకు వారిని పిలిపించారు
*కన్నవాళ్ళు...కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు*
పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు
అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు* 👇
నా పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు మండలించాడని చెప్పగానే బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు. 14 ఏళ్ల వయసు లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు వచ్చారు.
అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.
అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం
ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు
*చిన్నప్పుడు తప్పు చేయగానే ఉపాధ్యాయుడు శిక్షించకపోతే,మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు*
👉చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..
👉పిల్లల్ని చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వారి *అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు.*..
No comments:
Post a Comment