🙏 ఓం నమోవేంకటేశాయ 🙏
🍃🌺 ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో సుప్రభాత సేవ రద్దు.. ఎందుకు? దాని స్థానంలో ఏం చేస్తారు?
🍃🌺 కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని మేల్కోల్పడానికే ఓ ప్రత్యేక సేవ ఉంది. అది ప్రపంచ సుప్రసిద్ధం.
🍃🌺అదే సుప్రభాతం, సుప్రభాతం పాడనిదే వేంకటేశ్వర స్వామి నిద్ర లేవడు.
🍃🌺అలాంటి సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతానికి రద్దు చేసింది. దాదాపు నెల పాటు వేంకటేశ్వర స్వామి తనను స్తుతించే సుప్రభాతం వినకుండానే నిద్ర లేచి భక్తులకు దర్శనం ఇవ్వాల్సి ఉంటుంది.
🍃🌺 ఎందుకు? ఏమిటీ?
తిరుమలలో వేంకటేశ్వర స్వామి కైంకర్యాల కోసం ఓ ప్రత్యేక నియమావళి ఉంది. ఆ నియమావళి మేరకే...., అర్చకులు నడుచుకోవలసి ఉంటుంది. ఆరునూరైనా..... ప్రపంచం తల్లికిందులైనా... సరే...!
దానిని ఉల్లంఘించడానికి లేదు.
🍃🌺 16 వ తేదీ నుంచి ధనుర్మాసం రానున్నది. దీనిని సాధారణ భాషలో శూన్య మాసం అంటారు. ఈ శూన్యమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని మేలుకొల్పే సుప్రభాత సేవను రద్దు చేస్తారు.
🍃🌺అంటే వేకువ జాము నుంచి జనవరి 14 తేది వరకూ ఈ సేవ రద్దు అవుతుంది. ఈ నెల రోజులు కూడా వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ లేకుండా నిద్ర లేవాల్సి ఉంటుంది.
🍃🌺మరి సుప్రభాత సేవ స్థానంలో ఏం చేస్తారు? సహజంగా ఇది అందరికీ కలిగే సందేహం.
🍃🌺వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వారిలో ఆళ్వార్లు ఒకరు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన అండాల్ గోదాదేవి విరచిత తిరుప్పావై ఏకాంత సేవ నిర్వహిస్తారు. అండాల్ గోదాదేవి రచించిన పాసురాలను సేకరించారు.
🍃🌺వాటిలో నెల రోజుల పాటు రోజుకు ఒకటి చొప్పున 30 వాటిని ఆలపిస్తారు. ధనుర్మాస వ్రతం అనేది తమిళులకు అత్యంత ముఖ్యమైనది. అందరికీ శుభం కలగాలని పాసురాలతో తిరుప్పావై సేవను నిర్వహిస్తారు. అలా సుప్రభాత సేవ స్థానంలో ఈ పాశురాలు స్వామికి ఆలపిస్తారు.
నమస్కారం చేసే విధానం
ఆధ్యాత్మికత అందిస్తున్న సంస్కారం
నమస్కారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.
తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.
మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష.
సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.
🙏 శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)
🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు..
🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి .
🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.
🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.
🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.
నమస్కారంలోని అంతర్గతం ....
హిందూ సంస్కృతిలో నమస్కారం విశిష్ట ప్రక్ధియ. ఒకరికొకరు ఎదురైతే రెండు చేతులు జోడించి హృదయ
స్థానం దగ్గర ఉంచి నమస్కారం చెప్పడం హిందువు అలవాటు . మామూలుగా చూస్తే నమస్కారం చేయడం అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం నమస్కారం అన్న పదం సంస్కృతం నుంచి వచ్చింది .
సంస్కృతానికి చెందిన నమః అనే పదం నుంచి నమస్కారం అన్న. పదం ఏర్పడిననది .. సంస్కృతంలో నమః
అంటే విధేయత. ప్రకటించామని అర్ధం ..
మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు ...
దీనినే ఆత్మ అంటారు . నమస్కారం పెట్టడం అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను
గుర్తించి దానికి విధేయత ప్రకటించడం ..
ఇది అధ్యాత్మిక పరమైన వివరణ ..
శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి తాకుతాయి మనం చేతి వెళ్ల కొనలకు కళ్ళు చెవి మెదడులతో సంబంధం ఉంటుంది. నమస్కారం చేసేటప్పుడు
చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం ఒత్తుకోవడం వల్ల కళ్ళు చెవి మెదడు కేంద్రాలు ఉత్తేజమవుతాయి దాంతో
కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువ -
కాలం గుర్తు పెట్టుకోవడం . వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం. జరుగుతుంది ..
అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి -
నమస్కారం పెడితే వాళ్ళు మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థము ..
నమస్కారం పెట్టేటపుడు మనం ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరంలేదు దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సోకె ప్రమాదం ఉండదు. భౌతిక సంబంధం లేకపోవడంవల్ల. ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన
ప్రదానం జరుగుతుంది. ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల ఒకరి నుంచి చెడు భావనలు మరొకరిలోకి చొరబడే అవకాశము కూడ. ఉండదు. నమస్కారం అన్నది సత్యగునమైనది . అవకాశం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తికి - మంచి మనస్సు తో చేతులు జోడించి నమస్కంరించడం మంచిది ....
నమస్కారం మంచి సంస్కారం దీన్ని మనం అందరం పాటిదాం . ఎదుట వారికి నమస్కరించటం తో మన విలువ పెరుగుతుంది . ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ , మన పిల్లలకు నేర్పిద్దాం .లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను కొన్ని కధలు వ్రాయటం జరిగినది ౨౦౧౨ నుండి అవి అన్ని పోస్టు చేయ దలిచాను, నా కథలపై మీ అభిప్రాయాలు తెలపండి మీరు వ్రాసినా తెలపండి ప్రాంజలి ప్రభ అందరికొరకు జ్ఞానాన్ని పంచాలని ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఆశయంతో ౧౧ బ్లాగుల్లో నిక్షిప్తం గదా ఉన్నవి పోష్టు చేస్తున్నాను చదవండి -- చదవమని చెప్పండి ... తెలుగుభాషను బతికించండి నచ్ఛితే షేర్ చేసి స్నేహాన్ని పెంచుకోండి
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి ... ఓం శాంతి .. ఓం శాంతి
ఓం నమః శివాయ:
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం
కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ |
గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం
కణ్ఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే || 1 ||
ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే |
స్వభక్తసంరక్షణకామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ || 2 ||
భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుధాలంకృతే
సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే |
బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః
శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే || ౩ ||
మందారమల్లీకరవీరమాధవీపున్నాగనీలోత్పలచమ్పకాన్వితైః |
కర్పూరపాటీరసువాసితైర్జలైరాధత్స్వ మృత్యుంజయ పాద్యముత్తమమ్ || 4 ||
సుగంధపుష్పప్రకరైః సువాసితైర్వియన్నదీశీతలవారిభిః శుభైః |
త్రిలోకనాథార్తిహరార్ఘ్యమాదరాద్గృహాణ మృత్యుంజయ సర్వవందిత || 5 ||
హిమాంబువాసితైస్తోయైః శీతలైరతిపావనైః |
మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమనమాచర || 6 ||
గుడదధిసహితం మధుప్రకీర్ణం సుఘృతసమన్వితధేనుదుగ్ధయుక్తమ్ |
శుభకర మధుపర్కమాహర త్వం త్రినయన మృత్యుహర త్రిలోకవంద్య || 7 ||
పంచాస్త్ర శాంత పంచాస్య పంచపాతకసంహర |
పంచామృతస్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో || 8 ||
జగత్త్రయీఖ్యాత సమస్తతీర్థసమాహృతైః కల్మషహారిభిశ్చ |
స్నానం సుతోయైః సముదాచర త్వం మృత్యుంజయానంతగుణాభిరామ || 9 ||
ఆనీతేనాతిశుభ్రేణ కౌశేయేనామరద్రుమాత్ |
మార్జయామి జటాభారం శివ మృత్యుంజయ ప్రభో || 10 ||
నానాహేమవిచిత్రాణి చీరచీనాంబరాణి చ |
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుధారయ || 11 ||
విశుద్ధముక్తాఫలజాలరమ్యం మనోహరం కాంచనహేమసూత్రమ్ |
యజ్ఞోపవీతం పరమం పవిత్రమాధత్స్వ మృత్యుంజయ భక్తిగమ్య || 12 ||
శ్రీగంధం ఘనసారకుంకుమయుతం కస్తూరికాపూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందారసంవాసితమ్ |
దివ్యం దేవమనోహరం మణిమయే పాత్రే సమారోపితం
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీవిభో || 13 ||
అక్షతైర్ధవలైర్దివ్యైః సమ్యక్తిలసమన్వితైః |
మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ || 14 ||
చమ్పకపంకజకురవకకుందైః కరవీరమల్లికాకుసుమైః |
విస్తారయ నిజమకుటం మృత్యుంజయ పుండరీకనయనాప్త || 15 ||
మాణిక్యపాదుకాద్వంద్వే మౌనిహృత్పద్మమందిరే |
పాదౌ సత్పద్మసదృశౌ మృత్యుంజయ నివేశయ || 16 ||
మాణిక్యకేయూరకిరీటహారైః కాంచీమణిస్థాపితకుండలైశ్చ |
మంజీరముఖ్యాభరణైర్మనోజ్ఞైరంగాని మృత్యుంజయ భూషయామి || 17 ||
గజవదనస్కందధృతేనాతిస్వచ్ఛేన చామరయుగేన |
గలదలకాననపద్మం మృత్యుంజయ భావయామి హృత్పద్మే || 18 ||
ముక్తాతపత్రం శశికోటిశుభ్రం శుభప్రదం కాంచనదండయుక్తమ్ |
మాణిక్యసంస్థాపితహేమకుంభం సురేశ మృత్యుంజయ తేఽర్పయామి || 19 ||
మణిముకురే నిష్పటలే త్రిజగద్గాఢాంధకారసప్తాశ్వే |
కందర్పకోటిసదృశం మృత్యుంజయ పశ్య వదనమాత్మీయమ్ || 20 ||
కర్పూరచూర్ణం కపిలాజ్యపూతం దాస్యామి కాలేయసమాన్వితైశ్చ |
సముద్భవం పావనగంధధూపితం మృత్యుంజయాంగం పరికల్పయామి || 21 ||
వర్తిత్రయోపేతమఖండదీప్త్యా తమోహరం బాహ్యమథాంతరం చ |
సాజ్యం సమస్తామరవర్గహృద్యం సురేశ మృత్యుంజయ వంశదీపమ్ || 22 ||
రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం
హింగూజీరకసన్మరీచిమిలితైః శాకైరనేకైః శుభైః |
శాకం సమ్యగపూపసూపసహితం సద్యోఘృతేనాప్లుతం
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ విభో సాపోశనం భుజ్యతామ్ || 23 ||
కూష్మాండవార్తాకపటోలికానాం ఫలాని రమ్యాణి చ కారవల్ల్యా |
సుపాకయుక్తాని ససౌరభాణి శ్రీకంఠ మృత్యుంజయ భక్షయేశ || 24 ||
శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు |
మధ్యే స్వీకురు పానీయం శివ మృత్యుంజయ ప్రభో || 25 ||
శర్కరామిలితం స్నిగ్ధం దుగ్ధాన్నం గోఘృతాన్వితమ్ |
కదలీఫలసంమిశ్రం భుజ్యతాం మృత్యుసంహర || 26 ||
కేవలమతిమాధుర్యం దుగ్ధైః స్నిగ్ధైశ్చ శర్కరామిలితైః |
ఏలామరీచమిలితం మృత్యుంజయ దేవ భుంక్ష్వ పరమాన్నమ్ || 27 ||
రంభాచూతకపిత్థకణ్ఠకఫలైర్ద్రాక్షారసాస్వాదుమ-
త్ఖర్జూరైర్మధురేక్షుఖండశకలైః సన్నారికేలాంబుభిః |
కర్పూరేణ సువాసితైర్గుడజలైర్మాధుర్యయుక్తైర్విభో
శ్రీమృత్యుంజయ పూరయ త్రిభువనాధారం విశాలోదరమ్ || 28 ||
మనోజ్ఞరంభావనఖండఖండితాన్రుచిప్రదాన్సర్షపజీరకాంశ్చ |
ససౌరభాన్సైంధవసేవితాంశ్చ గృహాణ మృత్యుంజయ లోకవంద్య || 29 ||
హింగూజీరకసహితం విమలామలకం కపిత్థమతిమధురమ్ |
బిసఖండాంల్లవణయుతాన్మృత్యుంజయ తేఽర్పయామి జగదీశ || ౩౦ ||
ఏలాశుంఠీసహీతం దధ్యన్నం చారుహేమపాత్రస్థమ్ |
అమృతప్రతినిధిమాఢ్యం మృత్యుంజయ భుజ్యతాం త్రిలోకేశ || ౩1||
జంబీరనీరాంచితశృంగబేరం మనోహరానమ్లశలాటుఖండాన్ |
మృదూపదంశాన్సహసోపభుంక్ష్వ మృత్యుంజయ శ్రీకరుణాసముద్ర || ౩2 ||
నాగరరామఠయుక్తం సులలితజంబీరనీరసంపూర్ణమ్ |
మథితం సైంధవసహితం పిబ హర మృత్యుంజయ క్రతుధ్వంసిన్ || ౩౩ ||
మందారహేమాంబుజగంధయుక్తైర్మందాకినీనిర్మలపుణ్యతోయైః |
గృహాణ మృత్యుంజయ పూర్ణకామ శ్రీమత్పరాపోశనమభ్రకేశ || ౩4 ||
🕉🌞🌏🌙🌟🚩
నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గాలిలో గాలినై, గాయానికి మందునై ,
చేతిలో చేతినై, చేయూతగ ఉండునై
కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై
పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై ... .... 1
గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే దాన్ని
ఆకాశానికి నీడనై, శబ్దంగా కదిలొచ్చే దాన్ని
సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే దాన్ని
సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే దాన్ని .... 2
మదిలో ప్రేమగా, మౌనవత్వానికి ముందుగా,
కలలో దీపిగా, సోమతత్వానికి ముందుగా
కధలో వెల్గుగా, ప్రేమతత్వానికి ముందుగా
వలలో తోడుగా, ఆశతత్వానికి ముందుగా ... 3
మచ్చికలో చెలిగా, మన్నన కోసం ఉండేదాన్ని
విచ్ఛికతో మదిగా, విందుగ దేహం పంచేదాన్ని
రమ్యతతో రమగా, రంజిత రాగం పాడేదాన్ని
కామ్యతతో కధగా, హృద్యత దాహం తీర్చేదాన్ని .... 4
రెపరెప లాడుతున్నా, రేయింబగలు ఆడుతున్నా,
విలవిల లాడుతున్నా, వేదనలకు పాడుతున్నా
తళతళ టాడుతున్నా, తాపంసెగలు పంచుతున్నా
కళకళ లాడుతున్నా, కోపంవెతలు పొందుతున్నా .... 5
రేపనేది లేకుండా ఉన్నా, రెప్పలా మాటువేసి ఉండేదాన్ని
కోపమేది రాకుండా ఉన్నా, తెప్పలా దాటు చుండి దాటే దాన్ని
కోర్క యేది తేకుండా ఉన్నా, కప్పలా దాటి ఆశ తీర్చె దాన్ని
పట్టుగాను దారంతా ఉన్నా, ఒప్పులా ఓర్పు శక్తి పంచు దాన్ని .... 6
హృదయానికి విలువేదీ, హృద్రోగం పొయ్యేదారి చూపుదాన్ని
సమయానికి పనియేదీ, హృద్భావం తెల్పే మంచి చెప్పు దాన్ని
వినయానికి దరియేదీ, స్త్రీ లక్ష్యం మార్గం తెల్పు చుండె దాన్ని
అనురాగపు కళచూపే, స్త్రీ ధర్మం సత్యం తత్వ మైన దాన్ని ..... ... 7
హృద్య తాపం తీర్చు దారిగా, హృదయంలో శబ్దంలా ఉండేదాన్ని
సత్య భావం తెల్పె దానిగా, తరుణంలో సత్యంగా ఉండేదాన్ని
విశ్వ మొహం ఆపె ఆశగా, వినయంతో మొహాన్నే ఆపే దాన్ని
సర్వ వైనం తెల్పె దాదిగా, విషయంతో వైనాన్నీ తెల్పె దాన్ని .... 8
విరహం విరజాజి పూలులా, విన్నపం విధి కలయికైన దాన్ని
తపనం మరుమల్లె పూలులా, నమ్మకం నిధి మనసుకైన దాన్ని
మధనం చిరుహాస పూలులా, సమ్మతం తిధి ఢమరుకైన దాన్ని
తరుణం మదితెల్పు పూలులా, విస్మయం నది లయలకైన దాన్ని .. 9
--(())--
ముఖ్యంగా స్త్రీలకు తెల్పునది .... తల్లులారా తప్పులు దొర్లినా క్షమించండి
మీకు నచ్చితే షేర్ చేసి అభిప్రాయాలు తెలపండి ఇది నా ఆలోచనలు మాత్రమే
*సమాజంలో మనం ఒకరం..
త్యాగం, ఆదర్శం లోపిస్తే వ్యక్తులకు ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సంపద ఉన్నా అవి మానవాళికి నిష్పయ్రోజనంగా పరిణమిస్తాయి. ఉత్తముడు తన జీవితంలోకి చెడు రానివ్వడు. స్వీకరించిన పనిని నిజాయతీగా చేసే వ్యక్తుల జీవన విధానాల్లో ఆదర్శం, త్యాగం మిళితమై ఉంటాయి. ‘మనం వేరు, సమాజం వేరు’ అనే భావన అహంకారానికి దారితీస్తుంది. మనలాంటివారే మన చుట్టుపక్క ఉన్నవారూ అనే భావన ధైర్యాన్నిస్తుంది.
మన సమాజంలో చాలామందికి ‘నేను ఒక్కణ్నే కష్టాలు పడుతున్నాను’ అనే భావన ఏర్పడుతూ ఉంటుంది. ‘కాదు కాదు... నాలాంటివారు ఎందరో ఉన్నారు’ అని గ్రహిస్తే ధైర్యం కలుగుతుంది. అహంకారంతో నలుగురికీ దూరమైతే బిక్కుబిక్కుమంటూ భయంతో బతకాల్సి వస్తుంది.
ఈశ్వరుడు తప్ప సర్వజ్ఞులెవరూ ఉండరు. తమకు అన్నీ తెలుసునని ఎవరైనా అహంకరిస్తే వాళ్లకు ఏమీ తెలియదని అర్థం! అందరితో కలిసి మెలిసి జీవించడానికి అహంకారం అడ్డువస్తుంది. అహంకారికి లోకం తెలియదు. అందరిలో తానూ ఒకడనే సంగతి గ్రహించినవాడే ధన్యుడు.
విజ్ఞులైనవారు కష్టకాలాన్ని సద్వినియోగ పరచుకుంటారు. అస్త్ర శస్త్ర పరీక్షల్లో ఉత్తముడిగా అర్జునుడు నెగ్గాడు. ఆ తరవాతా అర్జునుడు విద్యాభ్యాసం కొనసాగించాడు. విద్యార్థికి అహంకారం కూడదు. అర్జునుడు నిత్య విద్యార్థి, వినయశీలి. సామాన్యులతో కలిసిమెలిసి జీవించాడు. పన్నెండు సంవత్సరాల అరణ్యవాస కాలంలో వినయంతో గురువులను ఆశ్రయించి ఎన్నో విధాలైన విలువిద్యలను, సిద్దులను సాధించాడు.
కష్టాలను స్వయంగా రుచి చూసినవాళ్లు ఇతరుల కష్టాలకు వెంటనే స్పందిస్తారు. కుంతీదేవి సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా అనుభవించింది. ఇంటి పక్కవాళ్లు శోకిస్తుంటే వెంటనే స్వయంగా వెళ్లి, కారణం అడిగి తెలుసు కున్నది. ఒక రాక్షసుడికి ఆహా రంగా ఇంటివారి కుమారుణ్ని పంపవలసి వచ్చిందని తెలుసుకొని చలించిపోయింది. అతడికి బదు లుగా తన కుమారుణ్ని పంపుతానంది! ఒకరికోసం ఒకరు నిస్వార్థంగా జీవితాలు సైతం అర్పించడానికి సిద్ధపడటంకంటే గొప్ప త్యాగం ఉండదు!
అహంకారి ఒక హద్దుకు పరిమితమై ఉంటాడు. గిరిగీసుకొని దాంట్లో తనను తాను బంధించుకుంటాడు. అదే సర్వలోకం, సర్వస్వం అంటాడు. మొండిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. సమాజ సమగ్ర స్వరూపం, సత్యం తెలుసుకోవడం అతడికి అసాధ్యమవుతుంది. అలాంటివాళ్లకు జ్ఞానప్రాప్తి కలగాలంటే వివేకం అవసరం. వ్యాసుడు మహాజ్ఞాని. శుకమహర్షి బ్రహ్మజ్ఞానం సంపాదించాలని ఆయన కోరిక. తనకు అన్నీ తెలిసినప్పటికీ శుకుణ్ని జనకుడి వద్దకు పంపాడు. ఆశ్రమవాసంలో బ్రహ్మసూత్రాలను నేర్చుకున్నా, జనకుడు కుటుంబ బాధ్యతల మధ్య వాటిని ఆచరిస్తాడు. జ్ఞాన పరిపూర్తికోసం, జ్ఞాన పూర్ణత్వంగల వ్యాసుడంతటి మహనీయుడు శుకుణ్ని జనకుడి వద్దకు పంపాడు. ఇతరుల గొప్పతనం గుర్తించ
డంలోనే గొప్పతనం ఉంది. వ్యాసుడు శుకుడికి ఇచ్చిన ఆదేశం, ఎప్పటికీ సందేశాత్మకం... ‘సమాజంలో ఎప్పుడూ మనకంటే గొప్పవాడు ఉంటాడని గ్రహించడం అవసరం’. అది జ్ఞానుల లక్షణం.
- పి. భారతి
No comments:
Post a Comment