Tuesday, 22 December 2020

27--12--2020

 

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

01......*😳2020😨!!*
ఇదే ఈసంవత్సరప్రగతి జగతి ముగిసింది

*ఇరవై ఇరవై* ఇక ముగిసింది
*కరోనా పరమై* బాధల్లో ముంచింది
*మనశ్శాంతి కరువై* భయాన్ని నింపింది
*చుట్టాలే దూరమై* రాకుండా చేసింది

*కాలక్షేపమే భారమై* ఇంటినే పనైంది
*సోమరితనం దగ్గరై* బద్ధకం పెరిగింది
*ఆదాయం ఆవిరై* ఆలోచన పెంచింది
*చింతలన్నీ చేరువై* చిక్కులు పెంచింది

*మమతలన్నీ మాయమై* చదువే మింగింది
*తనువు చిక్కి శల్యమై* సగమైనది
*పండుగలు దండగై* ఖర్చు థగ్గింది
*లోకమంతా చీకటై* వెలగు ఇమ్మంది

*కన్నీరు కాల్వలై* భారమైనది
*అయినవాళ్ళే కానివారై* ఏడంపైనది
*కాలమే గాలమై* వెఝబడించింది
*శాపమే శూలమై*పోటు పొడిచింది

*ప్రకృతే వికృతై* ఎక్కిరించింది
*మరణమే శరణమై*గతౌతున్నది
*రొదచేస్తూ సుధలు మరిపించి*
 *వ్యథను పరిచయం చేసింది*
*ఇరవై ఇరవైలో మనతో కరోనా*
*
కొత్త సంవత్సరం అంతా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని ఆశీద్దాం

కొత్త సంవత్సరం అంతా శుభాలే ఆశిద్దాం అందుకే ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక తెలియచేస్తున్నది.
02.. సంసారంలో సరిగమలు -

కాకి ముక్కుకు దొండ పండు దొరుకు తుందా అని ఎదురు చూస్తాను, 
ఏమిటండి మీరు మాట్లాడేది నాకు మీ మాట అర్ధం  కావటం లేదు అన్నది శ్రీమతి వళ్లి
అది కాదే మనబాబు ఎలా ఉంటాడో నీకు తెలుసు 
వాడికి ఎర్రటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఒకే కూతురై ఉండాలి, కట్నం వద్దు, ఉద్యోగం చేయకూడదు అని ఆంక్షలు పెట్టి మరీ పెళ్లి సంభందాలు చూస్తున్నావు, వాడికి పెళ్లి ఎప్పుడవుతుంతో గాని నేను మాత్రం రిటైర్ అవుతాను అన్నాడు నాగభూషణం.

మనవాడు చాలా బుద్దిమంతుడు, కనీసం ఒక్క చెడు అలవాటు లేదు అన్నది.

 నిజమేనా నీది తల్లి మనసు, వాడు ఇంకా చిన్న పిల్లవాడిగా ఉహించు కుంటున్నావు, ముందే పెళ్లైతే వీడికి 5 గురు పిల్లలు పుట్టి, ఆ పిల్లలు తాతయ్య ఆమ్మోమ్మ నన్ను అక్కడకు తీసికెళ్ళు, ఇక్కడకు తీసికెళ్ళు, నాకు అది కొని పెట్టు , నాకు ఇది కొని పెట్టు అని వేదిస్తుంటే, ఎత్తు కోలేక ముక్కు చీవిడి తీయలేక కొడుకును ఏమి అనలేక అప్పటి పరిస్థితి ఒక్క సారి ఆలోచించు అన్న మాటలకు ఒక్క సా రి ఉలిక్కి పడింది శ్రీమతి వళ్లి.

ఏమండి అటు చూడండి, ఆ క్యాబు లో దిగేది మనబ్బాయ్ అనుకుంటా
అనుకుంటా అంటావేమిటే అక్షరాలా మనఅబ్బాయే
మరి ఆ అమ్మాయి పిల్లలు మరెవరండి
అది మాత్రాము నాకు తెలియదు, నీకే మన్నా తెలిస్తే నాకు చెప్పు అన్నాడు నాగభూషణం. 
ఏడ్చి మొఖం కడుకున్నట్లున్నది మన పెంపకం
మన అబ్బాయి ఎదో నిర్వాహకం చేసిఉంటాడు అంటూ తలుపు దగ్గరకు వచ్చి తీశారు.
ఏమిటమ్మా అలా చూస్తావ్ నీకోడలు
అర్ధం ఆయిందనుకుంటా, అర్ధం కాక చస్తుందా అంటూ గొణుగుతూ 
అక్కడే ఉండమని చెప్పండి
హారతి పళ్లెం తెస్తాను
దిష్టి తీసి కుడికాలు పేట్టి లోపలకు రండి అని పిలిచింది

అత్తయ్యగారు మామయ్యగారు మమ్ము దీవించండి అన్నది
సరే ముందు లోపలకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి

పిల్లలు అడిగారు ఎవరమ్మా వీరు అని 
వీరు మీ తాతయ్య అమ్మొమ్మ అన్నది

తాతయ్య అమ్మొమ్మ అంటూ చుట్టు ముట్టారు

వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీకేమన్న కావాలన్నా   కొనుకొస్తారు, తరువాత ముందు లోపలకు పోదాం పదా అని అన్నది వచ్చిన కోడలు

కొడుకు తల్లితండ్రుల వద్దకు వచ్చి మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించండి, దయచేసి బయటకు వెళ్లి బ్రతకమని అరవకండి, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా ను  తరువాత. మీకోడలని మాత్రం నేను లేనప్పుడు రాచి రంపాన మాత్రం పెట్టకండి. నన్ను నమ్మి వచ్చింది అని చెప్పాడు.

నాన్న ఇంకో విషయం నేను అడిట్ నిమిత్తం హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క 10 రోజుల్లో తిరిగి వస్తాను. అంటూ బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు.
అప్పుడే బయఁటకు వస్తూ భార్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని అన్నది.
జరుగుతున్న వణ్ణి నోరుప్పగించి చూస్తూ ఉండిపోయారు, వల్లి నాగ భూషణం గారు

మావగారు కొడుకు వెళ్ళాకా నీపేరుఏమిటి , మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడిగారు

క్షమించండి మావయ్యగారు, అత్తయ్యగారు, మా పెళ్లి విషయం కానీ పిల్లల విషయం కానీ ఎవ్వరికి చెప్పొద్దని పెళ్ళికి ముందు వప్పందం చేసుకున్నాం అన్నాది.
అదేమిటమ్మా మాఇంటికి వచ్చి విషయాలు చెప్పకపోతే మాకెట్ల తెల్సుస్తుంది. నీమతము, కులము, తల్లితండ్రులు విషయాలు తెలియద్దా.

చూడండి మాతల్లితండ్రులు పార్వతి పరమేశ్వరులు వారికిసేవలు చేయటం తప్పా ఇంకో విషయం చెప్పఁవద్దు అని చెప్పాడు మీ అబ్బాయి, అదే నాకు ఆచరణ

ఇంతకీ నీపేరు అన్నా చెపుతావా

చెపుతాను నాపేరు "ద్రౌపతి " అని చెప్పి పిల్లలకు స్నానం చేయించా లండి, టిఫిన్ తయారు చేసి పెద్ద మనవుడి ద్వారా పంపిస్తాను అన్నది.

కొడుకు క్యాంపుకు వెళ్లినా ఇంటియందు ఉన్న పిల్లలమీద తల్లి తండ్రులమీద మనసు ఉన్నది. 

ఉండ బట్ట లేక ఇంటికి ఫోన్ చేసాడు కొడుకు కోటిలింగం   
హలో అన్నాడు.   

మొదట  పెద్ద కొడుకు ఫోన్ తీసాడు .. 
""నాన్నా వచ్చేప్పుడు నాకోసం బార్బీ బొమ్మ తీసుకురా నాన్నా..
మర్చిపోకు..
లవ్ యు నాన్నా...అని ఫోన్ పెట్టేసాడు..

మళ్ళీ చేసాడు .. 
ఈసారి  భార్య..

""ఏవండీ..మీరు వెళ్ళేప్పుడు డబ్బు పెట్టికెళ్లారు, బంగారు గొలుసు ఉంగరాలు ఉన్నాయి, జాగర్తగా ఉండాలండి, అసలే మీకు మతిమరుపు.. 
 
కాస్త గుర్తుంచుకోండి అంటూ పెట్టేసింది భార్య 

ఈసారి మళ్ళీ చేసాను.. 

ఈసారి మా అమ్మ.. 
ఫోన్ ఎత్తగానే తను అడిగిన విషయం..
""ఏం బాబూ...ఏమైనా తిన్నావా లేదా"

అమ్మా నీవు అమాయకురాలవి .. 

బిడ్డకి ఏమైనా అవుతుందని తల్లడిల్లి పోతుంటావు, నేను క్షేమంగా నే ఉన్నాను . నీవు గాబరా పడ వద్దు . 

అమ్మా అందరి కడుపులు నింపి ఆఖర్న మిగిలిన దాంతో సర్దుకుపోయే అన్నపూర్ణవమ్మా నీవు ..
  
నీ కోడలి కన్న బిడ్డలా చూసుకుంటావని నాకు తెలుసునమ్మా అన్నాడు 

బాబు ఆరోగ్యం జాగర్త, త్వరగా పని చేసుకొని రారా బాబు, ఇక్క డా నాకు అంతా  అగమ్య గోచరం గా ఉన్నది, 

అన్ని సర్దుకు పోతాయమ్మ, నీకు ఓర్పు ఉన్నదని నాకు తెలుసమ్మా అందుకనే నేరుగా ఇంటికి పిల్లలను దాని తెచ్చాను అన్నాడు.      

అమ్మా నాన్నకు ఒక్క సారి ఫోన్ ఇవ్వు అన్నాడు  

నాన్న నా కోసం ఏంతో కష్టపడ్డావు, నన్ను ఎత్తుకొని పెంచావు, చదివించావు  తన చిన్న చిన్న సరదాలు కూడా వదిలేసి నాకే ప్రాధాన్యత నిచ్చావు, నేను ఏది అడిగితే అది కొనిపెట్టావు  . 

నాన్న ఒక్కసారి స్పీకర్ ఆన్చెయ్ కొన్ని నిజాలు చెప్పాలి మీకు 
ఏమిటిరా ఆ నిజాలు 

నేను కాలిజి లో ద్రౌపతిని ప్రేమించాను, ఇద్దరం కలసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము,  అప్పటికే వాళ్ళ నాన్న గారు పట్టు పట్టి రెండో పెళ్ళివానికి ఇచ్చి పెళ్ళిచేసారు. అతనికి అప్పటికే 3 గ్గురు ఆడ పిల్లలు ఒక మోగాపిల్లోడు. అను కొని విధముగా పెళ్లి ఆయన రాత్రి హార్ట్ ఎటాక్ అయి చనిపోయాడు, అబ్బాయ్ తల్లి తండ్రులు ఆదరించక పోగా శాపనార్ధాలు పెట్టారు. 

అప్పుడే నాకు పరిచయ మైనది, మేము గుడిలో పెళ్లి చేసుకున్నాము మాకు మొగ పిల్లవాడు పుట్టాడు పిల్లలందరూ నీకు మనవళ్లే 

ఇదన్న జరిగిన విషయం ఒక ఆడదాన్ని జీవితం బాగు చేయాలని తొందరపడి మీకు చెప్పకుండా కాపురం చేసినందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తాను అన్నాడు. 

బాబు నీవు చేసిన పని మంచి పనే మేముం ఏమీ అనుకోము ఆదేవుడు రాసి పెట్టాడు నీవు అలా ప్రవర్తించావు, ఇందులో తప్పెవరిది లేదు, పెద్ద వారుగా మేము ఉండి అందరి నీ చదివించి ప్రయోజకులుగా చేస్తాము. 

నీవు మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకు 

నాన్న అమ్మా ద్రౌపతి అనే పేరు ఇష్టము లేకపోతే మీకిష్టమొచ్చిన పేరుతో పిలవచ్చమ్మా, 
చూడు బాబు మాకు పేరుతో పని ఏమున్నది కోడలు పిల్ల మమ్ము ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అన్నారు. 

నన్ను నమ్మండి నాన్న మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టదు, 

నిన్ను నమ్మేగదారా లోపలకు రానిచ్చింది దిగులు పెట్టుకోక త్వరగా రా 
అట్లాగే నాన్న                                
--(())--
    
 03....ఏవి_చేయకూడదు? #ఏవి_చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలం లో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి..
6. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చరించకూడదు.. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి.. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

#అన్నం_పరబ్రహ్మ_స్వరూపం అని తెలుసుకున్నాం కదా..కొన్ని నిజాలు చూద్దాం ...

అరటి ఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం.. అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది., వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.. మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి.. . అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది.. ఆరోగ్య వంతులుగా ఉంటారు... 
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది..
బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.. 
జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు..

1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి ...అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు.. మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది.., ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది.. 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము.. సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.. 
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది.. 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది.. 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది.

కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు.

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట దుర్భాష లాడుట చేయరాదు.. 
ఏడుస్తూ తింటూ, గిన్నె/ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు...,దెప్పి పొడువరాదు. 

ఎట్టి పరిస్థితిలో నైనా ఒడిలో కంచెం/పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు..,ఇది చాలా దరిద్రము.., అట్టివారికి నరకము ప్రాప్తించును. 
భోజన సమయంలో నవ్వులాట,తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం...

భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం...

సర్వేజనా సుఖినోభవంతు.
***""""

 
04. పొట్టి పిచిక కథ’...(.చందమామ కధ.)!

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ కధలు

కొందరు తనలో విద్య లేక పోయిన, మాటల చాతుర్యముతో ప్రక్కవారిని నమ్మించి బ్రతుకుతారు, మంచి పాటలు పాడి కొందరిని నమ్మిస్తారు ఒక్కసారి ఈ పిచ్చుక కధ చదవండి మైక్ తెలుస్తుంది .

అనగా అనగా ఒక ఊళ్లో కుంచమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్నచేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలు పెట్టే వరకు రెండు భమిడిలేళ్లూ, రెండు వెండి లేళ్లూ వచ్చి రాత్రిళ్లు తినివేయటం మొదలు పెట్టినై. అవి తినిపోగా ఒకటీ అరా కంకి మిగిలితే మన పొట్టి పిచిక వచ్చి పగలు తిని వేస్తూ ఉండేది.

ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునే సరికి  చేనంతా ఈటుపోయి ఉంది. ఒకటీ అరా అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చిక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది. కోపం వచ్చింది. ఈ పిచ్చిక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు లేశాడు.

పాపం పొట్టి పిచ్చిక అది కాన కుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మడు ఎగిరిగంతేసి దాన్ని చంకలో పెట్టకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చిక ఊరుకుంటుందా? చంకలో కూచునే పాట ఎత్తకుంది!

కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ!
రెండుభమిడిలేళ్లు గూ, గూ, గూ!
రెండు వెండిలేళ్లు గూ, గూ, గూ!
చేనుకాస్త మేశాయి గూ, గూ, గూ!
నేను కూడా తినబోతే గూ, గూ, గూ!
పొట్టివాడొచ్చాడు గూ, గూ, గూ!
పొంచిపొంచి చూశాడు గూ, గూ, గూ!
నన్ను పట్టుకున్నాడు గూ, గూ, గూ!

ఈ పాట వినేవరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. ఊహూ, మన పిచ్చిక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మడు ఏం చేస్తాడూ? ఊళ్లోకి పోతే దీని పాటవిని అంతా నవ్వుతారు! అందుకని ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూచున్నాడు.

మన పిచ్చిక నోరుమూస్తేగా! పాడుతూనే ఉంది.
కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!
కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ! అని.

 దీని పాటవిని శెట్టి బయటకి వచ్చి “ఏమండి శాస్త్రుల్లుగారు మీ జొన్నచేనెంతండీ?” అన్నాడు. బ్రాహ్మడు దోసిట చూపి “ఇంత!” అన్నాడు. “ఇంతేనా?” అన్నాడు శెట్టి. “కాదు!” అని బ్రాహ్మడు రెండు అరచేతులు కాస్త ఎడంగా తీసి “ఇంత!” అన్నాడు.

“ఓసి ఇంతేనా!” అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి రెండు చేతులూ బారచాపి “ఇంత!” అన్నాడు. ఇంకేం చేయి తీసేవరకు మన పిచ్చిక తుర్రున పారిపోయి చెట్టుమీద కూచుని “కుంచమంత బ్రాహ్మడికి గూ, గూ, గూ!

కంచమంత జొన్నచేసు గూ, గూ, గూ!” అని పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.
     
--(())--  

 
05. 'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' యుద్ధరంగంమధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమేకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.
రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారం పోగొట్టేది గురువే! కనకే,   జన్మనిచ్చిన తల్లిదండ్రుల పిదప పూజనీయుడ వెళుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం భారతీయులది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- అభ్యాసానికి కూర్చునేముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన అనంతరం 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించుకొనే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలా అవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలుచేసే ఆ శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడి ముందు అంజలి ఘటించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది. కాబట్టే శ్రీకృష్ణుడు విద్యగరిపిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.

మనసును బట్టియు విద్యను హృదయ స్ప
దనలతో  తెల్పేటి ఆది గురువు 
బాల్యము యవ్వన వృధ్ధప్య చరితకు
భవిషత్తు మార్పుకు ఆది గురువు
చెలిమి సంపదలకు విజయసౌలభ్యము
పొంది బతుకుటకు ఆది గురువు 
ప్రేమపాశములకు మమకార శక్తిని
పూర్తిగా ప్రభవుగా ఆది గురువు


తెటగీతి
గురువు లేనిదే నీవుయు నేను లేను
చదువు లసరశ్వతిమనలో దాగి ఉండు
నరుల జీవన సమరము విద్య వలన
జరుగు వినయము నేర్పును ఆది గురువు
****
గురువును గౌరవించలేనివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం. బాల్యంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుసైతం  చక్రవర్తి అయిన పిదప దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడుశతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయం స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను సానపట్టాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు  కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు సాధారణ  మంత్రివర్యుడే కాదు.. గురువు కూడా.
మనిషి భూమిమీద పడిననాడే బడిలో పడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లిదండ్రులు ప్రేమపాశంచేత కఠినశిక్షణనీయలేరు గనక గురువు అవసరం పెరిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడుకూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు  విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతున్నారనే గదా తన బిడ్డలని విష్ణుశర్మనే పండితుడి వద్దకు విద్యనభ్యసించేందుకు సాగనంపింది!
నాటి విద్యలు నేటి చదువులంత సుకుమారం కావు. వేదాధ్యయనం తరవాత జరిగే పరీక్షలు ఎంతో కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీదుంచిన నిమ్మకాయ దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష గట్టెక్కినట్లు లెక్క. అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచులు కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు దిగేది సూటిగా గొంతులోనే!  అది నారస పరీక్ష. గురువాక్కు  వేదవాక్కుగా సాగిన క్రమశిక్షణ ఆ కాలం నాటిది.

పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రలోనే కాదు..   గురుప్రసక్తిలేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులు విశ్వవ్యాప్తంగా చూసుకున్నా దొరకవు.  'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు చదువు ఎలా సాగుతున్నదో  పర్యవేక్షించాలని ఉబలాటపడ్డాడు జార్జి చక్రవర్తి.  ‘రావద్ద'ని కబురు చేశాడు పాఠాలు చెప్పే గురువుగారు!  'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే ప్రపంచంలో అందరికన్నా   అత్యుత్తమ స్థానంలో ఉన్న పెద్దను. నాకంటే పై స్థానంలో మరొకరున్నారని తెలిస్తేతే, నా మాటవిలువ తగ్గిపోతుంది.. మహాప్రభూ! అది వారి భవిష్యత్తుకు మేలు చేయదు!' అని సవినయంగా విన్నవించుకున్నాడు. మహారాజూ  గురువుగారి కోరికలోని సదుద్దేశంగ్రహించి మన్నించి అటువైపు వెళ్లటం విరమించుకున్నారని ఒక నీతికథ. అదీ ఆ రోజుల్లో గురువులకు సమాజం ఇచ్చిన గొప్పగౌరవం!
దేవతలకూ గురువున్నాడు. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య శుక్రునికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేసే నెపంతో వచ్చి.. చచ్చి బతికిన కథ మనందరకీ తెలుసు. ద్రోణాచార్యుని' పేరుతో క్రీడాగురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి వద్ద  విలువిద్య నేర్చుకోవాలని ఉబలాటపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందుపెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి  శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలిచక్రవర్తి వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి అమాయకంగా సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా.. శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కాబట్టే  మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటంలోనే ఎక్కువ మక్కువ చూపించారు. ఓ తమిళపత్రికకి  ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలుపడి చివరికి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమేనని మీరు భావిస్తున్నారా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని చక్కని సమాధానం ఇచ్చారు  కలాం.
కృష్ణపరమాత్ముడినుంచి.. అబ్దుల్ కలాం వరకు అందరి గౌరవాభిమానాలని అందిపుచ్చుకొన్న  గురువుగారికి నేటి మన చలనచిత్రాలు పట్టిస్తున్న దుర్గతిని చూస్తుంటే దిగులు కలుగక మానదు.. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినీకవి. ‘కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే. గురువు ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు కాబట్టే శిష్యుడీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాడు. 

గురువులు అష్టవిధాలు. అక్షరాభ్యాసం చేయించే గురువు,  గాయత్రినుపదేశించే గురువు, వేదాధ్యయనం చేయించే గురువు, శాస్త్రజ్ఞానం విడమరచి చెప్పే గురువు,  పురోగతి కోరే గురువు, మతాది సంప్రదాయాలని  నేర్పించే గురువు, మహేంద్రజాలాన్ని విప్పి చూపించే గురువు, మోక్షమార్గానికి నడిపించే గురువు. పురాణాలు ఇంత వైనంగా గురుప్రాధాన్యాన్ని  తెలియజేస్తున్నా..పట్టించుకొనే,  వంటపట్టించుకొనే శిష్యపరమాణువులు తగ్గిపోతున్నారు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు పెరిగిపోతున్నారు. దొంగలపాలబడనిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనికలిగించేది,  యాచకులకెంత ఇచ్చినా పెరిగేదేగాని.. రవంత తరగనిది,.. గొప్పనిధి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా ప్రసాదించే  గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది. కనీసం కీడు జరగకుండా ఉండేది.
*మిత్రలకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు*

ఓం నమోః నారాయణాయ
          
06.   గురు శిష్య సంపత్తి

"గురుబ్రహ్మ , గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వరః" అనే స్తుతి
గురువు ఔన్నత్యాన్ని చెబుతుంది.  గురువు అనే మాటకు అంధకారాన్నితొలగించి ప్రకాశాన్ని నింపేవాడు అని అర్ఠం.  విద్యాబోధన ప్రారంభమున గురుశిష్యులు "ఓం సహనావవతు, సహనౌ భునక్తు "అంటూ శాంతిమంత్రం పఠిస్తారు.  గురుశిష్యుల సంబంధం కేవలం విద్యను బోదించడానికో సముపార్జించడానికో పరిమితం కాదు.  ప్రకాశాన్ని నింపే ఙ్ఞానహోమంలో ఉభయులుా నిమగ్నులవుతారు. గురుశిష్య సంప్రదాయం అనేది ఓ ఉదాత్త సంస్కృతికి బీజం. సామాన్యమైన వేదాలు తల్లిదండ్రులనుంచి కుమారులకు సంక్రమించలేదు. గురుశిష్యుల కారణంగానే అవి ప్రాప్తించేయి.  గురువు తాలూకు అపురూప ఙ్ఞాననిదికి శిష్యులే వారసులు. ద్రోణాచార్యులు తన కుమారుడైన అశ్వత్థామకు సైతం వెల్లడించని విద్యా రహస్యాన్ని శిష్యుడైన అర్జునుడికి బోధించాడు. ఙ్ఞానం వారసత్వ సంపద కాదు.  మానవజాతి ఉమ్మడి సంపద. తమగురువులద్వారా పొందిన శక్తియుక్తులన్నింటినీ వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా లోకోధ్ధరణకే వినియోగించారు.  రాముడు రాక్షస సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. కృష్ణుడు అధర్మాన్ని శిక్షించడమే కాకుండా జగద్గురువుగా 'గీత' ద్వారా ప్రపంచానికి ఙ్ఞానపరిమళాన్ని పంచేడు. 
అతి పురాతన, అత్యంత సనాతన గురుశిష్య సంస్కృతి మనది. అత్యంత సహజంగా సంక్రమించిన పవిత్ర వారసత్వ నిధి.
*ప్రాంజలి ప్రభ సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి
9849164250


 
07. * ఎవరు గొప్ప *

       *ఒకరోజు సముద్రానికి, ఉప్పు రాశికి పెద్ద తగవు వచ్చింది. సముద్రానికి ఎదురుగా ఉప్పు రాశి ఉంది. ఆ ఉప్పు రాశుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్లతో బేరమాడుతున్నారు... బాగా చీకటి పడింది.

     *  ఉప్పు రాశి హేళనగా ' సముద్రం! నువ్వు చూడ్డానికి పెద్ద జల రాశి కానీ ఏం లాభం ...? నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు. నేను లేకపోతే ఏ వంటకీ రుచుండదు...శుభకార్యాల్లోనూ నా పేరు మార్మోగుతుంటుంది అంది గర్వంగా..

     *  సముద్రం నవ్వి 'నా నీటి తోనే నువ్వు తయారయ్యావు, నీ ఉనికిని మరచిపోయి, నా నుంచి వేరయ్యే సరికి అహంకారం పెరిగింది?" ఆంది

     * ఉప్పు రాశి గట్టిగా నవ్వి 'నీ నుంచి వచ్చినా నీ కన్నా నేనే గొప్ప.. ,చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ, చెట్టుని ఇష్టపడరుగా!' అంది.
 
     * ఉప్పు రాశి అతి తెలివి, మాట తీరు చూసి సముద్రం ఆశ్చర్యపోయింది. ఎందుకీ వాదన అని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం చూసి ఉప్పు రాశి మరింతగా రెచ్చిపోయింది .

     * నేను నిత్యం అందరికి ఉపయోగ పడుతున్నాను...  నువ్వు దేనికి ఉపయోగపడవు... పైగా అమావాస్య, పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు... అందరికీ భయం కలిగిస్తావు నీకన్నా నేనే గొప్పదాన్ని' అంది ఉప్పు రాశి..

     *  సముద్రానికి నవ్వొచ్చింది.. అప్పుడాయన "ఓ చిన్న.. బాగా ఆలోచించు. పూర్వం ఈ జనమంతా ఓడ, స్టీమర్ ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్లేవారు. లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివశిస్తున్నాయి.  మానవులు తినే చేపలన్నీ నా నీళ్ల లోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు నాలో ఎలాంటి గొప్పతనం లేదంటావా?" అంది... ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది ఉప్పురాశి.

      * 'నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు, అవెవరూ వినరు... ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు... చేపల్లాంటివి మానేసి, ఆకుకూరలు తింటున్నారు' అంది.

     * ఉప్పురాశితో వాదించడం అనవసరo ఆ ఆనుకుంది సముద్రం... మౌనంగా ఉప్పురాశి  వైపు చూడసాగింది..

    *  సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది... ఆ వర్షం కుంభవృష్టిగా మారింది... సముద్రపు కెరటాలు ఎగసిపడి ఒడ్డుని చేరుకోడం మొదలు పెట్టాయి. ఆ వర్షానికి ఉప్పురాశి విలవిల్లాడుతూ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది.

    *  కాసేపటికి ఉప్పురాశి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుంది...

   *** అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఆణగారిపోతారు... ఎవరికైనా వినయ విధేయతలు ముఖ్యం అనుకొంటూ మౌనంగా ఉండిపోయింది.***

ఓం శ్రీ రామ్ .... శ్రీ మాత్రే నమ:
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
 
08. శ్రీమతిగారు! 
ఇవాళ అధ్భుతమైన భోజనము చేసినట్లుగా కలొచ్చింది!

మీ కలలో కన్నా అత్యధ్భతమైన వంటకాల రుచి ఈరోజు చూడబోతున్నారు శ్రీవారూ!

ఆహా! ఏమి నా భాగ్యము! 
ఇలలో స్వర్గమంటే ఇదేరా! 
శ్రీమతిగారూ! నీకేమి కావాలో కోరుకో మరి!

వద్దులెండి, మీకిబ్బందిగా వుంటుందేమో?

నీ కోరిక తీర్చకుంటేనే నాకు నరకం తెలుసా?

అంత మాటనకండి పతిదేవా! 
ఇదిగో నా చిట్టా! 
1 మా అమ్మ నాన్న అన్నయ్య వదిన చెల్లి మరది వాళ్ళ సంతానాలూ వస్తున్నారు, 
వాళ్ళందరినీ జాగ్రత్తగా టేక్సి లో ఇంటికి తెండి 
2 వాళ్ళున్న నెల్లాళ్ళు సెలవు పెట్టి అనేక ప్రదేశాలు తిప్పండి 
3 వాళ్ళు వెళ్ళేప్పడు ఘనంగా సత్కరించి సాగనంపండి! 
మీ పాద ధాసి ఈ చిరు కోర్కె తీర్చండి ప్రభూ!

ఆ... .... ఆ .....
ఆ అట్లాగే ఎప్పటి నుండి ... ఆయా.. ఆ  నేను చూసుకుంటాలే  
ముందు భోజనం పెట్టు ... అంతా  చేస్తా .... నిన్ను కట్టుకున్నాక తప్పుతుందా 


అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి...

భర్త:- ఏమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ)

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది?

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది ...

#అందుకే_నా_మొబైల్_పాస్_వర్డ్_ఎవరికీ_తెలియనిదీ_అసలెవరూ_ఊహించనిదీ_పెట్టుకున్నా_లేపి_తన్నించుకోవడం_ఎందుకులే_అని

ఇదేనండి :భార్య మాట విన్న కష్టము వినక పోయినా కష్టము "
--((**))--
 
09.. గురువుగారికి సాష్టాంగ ప్రణామములు! 

ఏమి నాయనా! పూర్వాశ్రమ వాసనలనుండి పూర్తిగా వైదొలగినట్లేనా! ఇంకా శేషమేమైనా మిగిలి వుందా? 
గురువుగారూ! హంతకుడు, దోపిడీదారుడు, 
స్త్రీ వ్యామోహపరుడనైన నన్ను సన్మార్గమున నడిపిన మీకు శతశహస్ర పాదాభివందనములు, కొంతకాలముగా మనోవేదనకు గురి అగుచున్నాను, తమరు మరొక్కసారి ఈ దీనుని దయతలచి, తరుణోపాయము తెలుప ప్రార్ధన! 

చెప్పు నాయనా! 

పూర్వాశ్రమంలో నేను చేసిన పాపపంకిలము నుండి నేను విముక్తి చెందే మార్గము తెలియజేయ విన్నపము! 

కష్టమైన విషయమిది నాయనా! 

ఎంత కష్టమైనా భరిస్తాను గురుదేవా! 

చూడు నాయనా! ఈ విషయం లో ఏమైనా నీ లోపముంటే మాత్రము, నీకు మరి నాలుగింతల పాపం చుట్టుకుంటుంది సుమా! భోదించిన పాపానికి నేను కూడా నీ పాపములో భాగస్వామ్యం పొందాల్సుంటుంది నాయనా! 

నేను నిష్టగా, నియమబద్దముగా మీరు నాకప్పజెప్పబోవు పనిని నిర్వర్తిస్తానని మీ పాదపద్మము మీద ఆన! 

నీ పాపాన్ని అందరూ పంచుకునే ప్రక్రియ ఇది! 

పాపాన్ని పంచుకునేవారెవరు ప్రభూ? 

వారి సహజ బలహీనతలే నీకు వరమౌతాయి నాయనా! 
నీవు మలి సంధ్య వేళ శ్రుంగార పురుషునిలా అలంకరించుకుని, వివాహితయైన నీ కుమార్తె ఇంటికి పోయి, అచటనే నిద్రించి, తొలి సంధ్య లో నీ స్వగ్రుహమునకు చేరము, 
ఈ విధముగా సంవత్సర కాలము నేను నిను చేరువరకూ చేయవలయును! 

సందేహనివ్రుత్తి చేసుకోవచ్చునా ప్రభూ! 

తప్పకుండా! 

నేనీవిదముగా చేయుట వలన నాకు కష్టమేమీ కనిపించుట లేదు, 
నా పాపాలు పోతాయన్న గురి కూడా కుదరడము లేదు! 

అనురక్తుడవై వినుము! 
నీవీ విధముగా మూడు నెలలు పూర్తి చేయుసరికి, గ్రామ, గ్రామముల ప్రజలు నీ ఈ ప్రవర్తనకు, సహజసిద్ధమైన వాచాలత్వముతో దుష్ప్రచారము జేసి నీమీద అంతులేని అభాండములు మోపి నిన్ను కళంకితునిగా చిత్రీకరించుకొందురు, 
మరో మూడు నెలలు గడచు సరికి 
నీ భార్యా, పిల్లలూ, బందుగణము ప్రజల మాటలను నమ్మి నిన్ను ధూషింతురు! 
అక్కడి నుండి అనుక్షణమూ నీవు నరకయాతనలకు గురి ఔతావు నీ కూతురు నిన్ను ఇంట్లోకి రానివ్వదు, ఐననూ నీవు నీ భాధ్యతలు విస్మరించరాదు సుమా! ఆఖరుకి నీ కుమార్తె ఇంటి చూరుకింద, వీదిలోనూ నిదురించే పరిస్థితి దాపురిస్తుంది, 
క్రమేపీ ప్రజలలో నీమీద సానుకూల ధ్రుక్పదము ఏర్పడుతుంది, 
ఐతే వారందరికీ జరగవలసిన నష్టము అప్పటికే జరిగిపోతుంది, 
వారు నీ వింత ప్రవర్తనకు కారణమడిగినా చెప్పరాదు సుమా! 

ఏది ఏమైనా అన్ని భరించి  న కుమార్తె ఇంటిలో ఉందిమరల రాగాలను అంటూ ఆయాలు దేరాడు  


--((**))--


10. కన్నీళ్ల

*_ప్రేమ, స్పందన, సహానుభూతి కొరవడిన బతుకులు బండరాళ్లతో సమానం. ఓ దుర్ఘటన సంబవించినప్పుడో, ఓ వ్యక్తికి అనుకోని కష్టం వచ్చినప్పుడో సాటి మనిషిగా మన మనస్సు చలించకపోతే, గుండె ద్రవించకపోతే మానవ జన్మకు అర్థమే లేదు...... ,_*

*_మనసులో మార్దవం లేనిదే కళ్ళు చెమ్మగిల్లవు మనలో  ఇంకా మానవత్వం మరణించ లేదనటానికి నిదర్శనమే ఆ సజలనేత్రాలు.._* 

*_వ్యక్తిగతమైన కష్టనష్టాలకు కారే కన్నీటి కన్నా, పరుల బాధలకు కార్చే భాష్పాలు ప్రభావవంతంగా ఉంటాయి ._* 

*_కష్టాల్లోవున్న సాటి మనిషికి ఆ స్పందనతో కూడిన మన సానుభూతి వచనాలు సాంత్వననిస్తాయి. ఒకరి కష్టాన్ని మనం పంచుకుంటున్నామంటే, మన ఆత్మను, మరో ఆత్మతో అనుసంధానం చేస్తున్నామని అర్థం.._*

*_మనలో చాలామంది గుండె కరిగి కన్నీరుగా ఉప్పొంగటం బలహీనత అని భ్రమపడతారు. కానీ  ఆ కన్నీళ్ళలో మనిషి జీవలక్షణం దాగి ఉంటుంది.._*

*_పైగా ఆ కన్నీటిని చిత్రికపడితే అది చెప్పే భావాలెన్నో ! అది విప్పే భాష్యాలెన్నో !ఎప్పటినుంచో భారమై బాధిస్తున్న గుండె బరువు ఒక్క అశ్రుబిందువుతో దూదిపింజె అయిపోతుంది. ..._*

*_అందుకే ఆచార్య ఆత్రేయగారు  " గుండె మంటలారిపే  చన్నీళ్ళు ఈ కన్నీళ్లు...." అంటారు. కష్టసమయాల్లో  కావలసిన వాళ్ళ ముందు కురిసే మన కన్నీటికి ఫలితం ఎంత ఉంటుందో చెప్పలేం. కానీ దుఃఖావేళల్లో ఆ దేవదేవుడికి ఆర్తితో ప్రార్థించినప్పుడు జాలువారే కన్నీటికి మాత్రం వేయింతల ఫలితం ఉంటుంది ._*

*_అందుకే అన్ని మతసంప్రదాయాల్లో  పరితాపంతో కూడిన ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ._*

*_లోకమంతా చేతులెత్తేసిన ఆపదవేళల్లో  ఆయన తన చేయినందిస్తాడు. అలా మన కన్నీళ్లు ఎవరిని కరిగించినా, కరిగించకపోయినా  కరుణాంతరంగుడైన  ఆ పరమాత్మను మాత్రం కదిలిస్తుంది._*

*_కపటంతో కూడిన కన్నీళ్లు మొసలికన్నీళ్ళే అవుతాయి. అవి మనలోని కపటత్వాన్నే తప్ప సహజత్వాన్ని వెల్లడి చేయవు. నలుగురి సానుభూతిని పొందడం కోసమో, సాత్వికులమన్న ముద్రను వేయించుకోవటం కోసమే రప్పించే అశ్రువులు కాగితం పువ్వుల కృత్రిమంగానే కనిపిస్తాయి. తెచ్చిపెట్టుకున్నట్లుగానే  తోస్తాయి.కన్నీరు సహృదయ స్పందనకు సంకేతాలు......_*

No comments:

Post a Comment