Monday, 28 December 2020

30-12-2020

 

Top 60+ Best Lord Dattatreya Images | Datta Guru Wallpaper Images (HD)

pranjali prabha     🌹 శుభోదయం 😀
           --------------------
                      తేదీ :- 30.12.2020

🌻 మహనీయుని మాట🙏
         ------------------------

ద్వేషాన్ని దూరం చేయ గలిగేది ప్రేమ ఒక్కటే ద్వేషంతో కానే కాదు.

       --------------------------
🌺 నేటి మంచి మాట🦜
       ---------------------------

ఆత్మగౌరవం,ఆత్మవిశ్వాసం,  అత్మస్థైర్యం, ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి.        
          
పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం, ఆచరిస్తే అంతులేని ఆనందం.

                                       


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
Image may contain: night and outdoor 


 

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ ) ప్రాంజలి ప్రభ
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పంతులుగారు బాగున్నారా
ఆ ఆ  బాగున్నా,   ఎలాగయ్యా ఇప్పుడు మీకు సెలవులు వచ్చినట్లున్నాయి
ఎప్పుడూ ఒకరకంగా ఉంటే ఈ గురువులు అసలు గుర్తుకు రారు కదా
అవునవును
ఈ మధ్య ప్రవేటు స్కూల్లో పనిచేసే అధ్యాపకులకు కష్టం గా ఉందట గదండీ
అవును బాబు ఎవరికి చెప్పుకొనేటట్లు లేదు , అధ్యాపకులు బతుకుతెరువు కోసం  ఎదో ఒక పనిచేస్తున్నారు, ప్రభుత్వం వారు మమ్మల్నసలు పట్టించు కోవటం లేదు ఏంచేద్దాం
ఇంటర్నెట్ విద్య నేర్చుకొని విద్య చెప్పక పొయ్యరా    
చూడు ఇది ఒక గురువుది కాదు సమస్య , అందరి గురువులది.  మహమ్మారి రావటం వల్ల అటు విద్యార్థులు, ఇటు గురువులు, తల్లితండ్రులు, బాధ పడుతున్నారు  
బాబు మేము డబ్బు కోసం కాదు పనిచేసేది విద్యావంతులుగా మార్చుటయే మా లక్ష్యం.
దేనికి మా ( గురువుల ) ఆదాయం మాత్రం...  ప్రజల యొక్క జ్ఞానం,  శ్రేయస్సు మరియు
దేశ అభివృద్ధి పెరుగుదలతో .పెరుగుతుంది  అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్తిస్తారు ....
పంతుళ్ళం కాదు...    మేం "తరాల" తయారీదారులం...
ఏముంది పంతుళ్ళు... ఏదో వస్తారు ....  పోతారు.నాలుగు మాటలు తోచింది చెప్తారు. *లేకుంటే సెలవులు...  ఇదీ సమాజంలో ........ఉపాధ్యాయులపై చిన్న చూపు.*
మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను,
యాక్టర్లను, ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను,టీచర్లను,నాయకులను,
అధికారులను...ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా....
"తరాలు"......., "తరాలు" ......తయారుచేసే నిత్య ఉపాధ్యాయులం  మేము.
*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.......
చెమటను సాక్ష్యం గా చూపడానికి......
మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు......
అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...
అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ,
పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు .....
చూపలేని నిస్సహాయులం...
*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...
కించపరచకండి....ప్రతి వృత్తీ లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు.....
వాళ్ళను దృష్టి లో పెట్టుకోని.....మంచిగా పనిచేసే వాళ్ళ ను...మాటలతో... బాధించకండి
మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...తూలనాడకండి...
అవును పంతులుగారు నేడు పరిస్థితి మారింది
అయినా ఇప్పుడు ఆధునిక విద్య అంటూ సెల్లు కొనిపించి ఆన్ లైన్ విద్య అంటూ చెప్పటం  తప్పఁని పరిస్థితి అవునుబాబు
కాలం మారుతున్నది మేము ఎం చేయలేక పోతున్నాం
మాభవిషత్తుకు ఎవరు ఎవరు సహాయపడతారో వేచి చూస్తాను
పంతులుగారు కాఫీ త్రాగుదామా
ఒక శిష్యుడుగా అడుగుతుంటే కాదనటం నేటి స్థితిలో అంత మంచిదికాదు పదా త్రాగుదాం
నోటికి మాస్కు చేతికి వ్యాజలీన్ వ్రాసుకో బాబు
ఏపుట్టలో ఏపామున్నదో ఎవరూ చెప్పఁలేరు అసలే సినిమాలలో మొదటి భాగం రెండవభాగం అంటున్నారు అట్లాగే రోగంలో కూడా మొదటి కరోనా రెండవ కరోనా అంటున్నారు మనజాగర్తలో మనం ఉంటె మంచిది   
మాఇంట్లో కాఫీ త్రాగుదాం అక్కడా ఇక్కడా ఎందుకూ
అట్లాగే పంతులుగారు ...
ఆ ........ ఆ......
--(())--
 

కాంతామణి గోపికమ్మా వచ్చినామమ్మా
మమ్ములను లేపదననే చెప్పితివి గదమ్మా
వేకువ కాలేదని బూకరిస్తివి నీవమ్మా
 మేమే వచ్చినానమ్మా ఇక నీవు లేవమ్మి

మంచి మాట కారివి నీవు గడుసు దానివమ్మా
నాలుకుందని మాట్లాడి సిగ్గును తెలపకమ్మా
కన్నులు తెరచి చూడు మేమసత్యమాడవమ్మా
అభిమానవతివమ్మా ఇక లేచి రావమ్మా

నీవు వేళ్ళే మార్గములో తోట బావుందమ్మా
కళ్ళుమూసి నడిచిన నిన్ను హరించి వేయునమ్మా
కలువలు వికసించె కలువలు మకులించేనమ్మా.
భక్తితో పూజచేయు పరిపూర్ణ జ్ణానివమ్మా

శంఖచక్రములతో ఉన్న కృష్ణుని చూడమ్మా
దీర్ఘబాహువులున్నట్టి కృష్ణుని ప్రేమించమ్మా
పంకజనేత్రుని సేవకు భక్తితో కీర్తించుటకమ్మా
నిత్యకైంకర్యాలకై అనునిత్యం సేవలకమ్మా

మార్గశి నెలలోన మగువల వ్రతముతో గోపికలమ్మా
పుణ్య వతులు చేయు పూజ నేడు చేసి చుండిరామ్మా   
గోదదేవి తెలిపి గోవిందు మహిమను ఈ తరుణమమ్మా  
భక్తి తోడ నిన్ను భజన చేయు సత్య మార్గమమ్మా   

సఖియ లంత జేయ  సౌభాగ్య వ్రతము ఇది యమ్మా  
పూల మాలలన్ని పూజ కొరకు ఏర్పాటు చేసిరామ్మా  
ముక్తి కోరు వారు భక్తితో చేయగ సంతోషపడితిరమ్మా  
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు నిజాయితీలమ్మా  

--(())--



          
       05....     జీవిత పరమార్ధం...!✍️️
                 ➖➖➖

   రుచించక పోయినా ఇదే యదార్థం!

   మూసిన కన్ను తెరవకపోయినా,    తెరిచిన కన్ను మూయకపోయినా,    శ్వాస తీసుకుని వదలకపోయినా,    వదిలిన శ్వాస తీయకపోయినా,    ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి             చూపు!

   మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం     నిర్థాక్ష్యిణ్యంగా   మరచి పోయేలా చేస్తుంది కాలం!

విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.

ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు!

  ఈ క్షణం మాత్రమే నీది,   మరుక్షణం ఏవరిదో?   ఏమవుతుందో ఎవరికి తెలుసు?

  ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే      అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా   నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో   
  పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు!

  ఈ ప్రపంచాన్ని శాసించేంత   గొప్పవారైనా, సంపన్నులైనా   బలవంతులైనా   అవయవక్షీణం-ఆయుఃక్షీణంను  
  తప్పించుకోజాలరు.   ఈ సృష్టిలో మనమే మొదలు కాదు,   చివర కాదు.

  ఈ దేహంలో మనం అద్దెకు   ఉండటానికి వచ్చాము.   అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు
  మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు   మనం చేసిన కర్మలను మనతో   మోసుకువెళ్లక తప్పదు...!

  చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న     ఆయుర్థాయం కూడా మనకి లేదు.  ఈ భూమ్మీద కాలమనే వాహనంలో   
  ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.     మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు
  అన్నీ భ్రమ, మాయ.

  అశాశ్వతమైన వాటిని   జపధ్యానములతో ఛేధిద్దాం.   అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం    ధ్యానం!

  అందుకే మనుషుల్లా జీవిద్దాం.   మనిషి ఎలా జీవించాలో చెప్పిన   రామాయణ,భారత, భాగవతాదులను  
  ఈ జీవితం ముగిసేలోపు   తెలుసుకుందాం. అందులోని   సంశయాలను తీర్చుకుందాం.

  దీపం ఉండగానే ఇల్లు   చక్కపెట్టుకోవడం అంటే పదవిలో   ఉండగానే సంపాదించుకోమని కాదు.

  భగవంతుడు ఈ శరీరాన్ని   ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు   ఆచరించి ఈ జీవకోటిలో మనిషి
  మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను   ఆచరించాలని పరమార్థం.

  ఓపిక ఉండగానే నిత్యం గురువుని   ఆశ్రయించి ఉపదేశంపొంది   ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం!

   నిరంతరం భగవత్     ధ్యానంతోఉంటూ,సత్యమైన మార్గం    ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి    ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా    జీవిద్దాం!..✍️️

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

****

06... 🙏 శ్రీమల్లికార్జున సుప్రభాతం 🙏
 
ప్రాతస్స్మరామి గణనాథమనాథబన్ధుం
సిన్దూర పూరపరిశోభితగణ్డయుగ్మమ్ ।
ఉద్దణ్డవిఘ్నపరిఖణ్డనచణ్డదణ్డ-
మాఖణ్డలాదిసురనాయకబృన్దవన్ద్యమ్ ॥ ౧॥

కలాభ్యాం చూడాలఙ్కృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున-
ర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ ౨॥

నమస్తే నమస్తే మహాదేవ! శమ్భో!
నమస్తే నమస్తే దయాపూర్ణసిన్ధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబన్ధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ ॥ ౩॥

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాఙ్కితమస్తకాం ప్రణమతాం నిస్సీమసమ్పత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరామ్బికాం స్మితముఖీం శమ్భోస్సఖీం త్వాం సుమః ॥ ౪॥

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ ॥ ౫॥

శమ్భో ! సురేన్ద్రనుత ! శఙ్కర ! శూలపాణే !
చన్ద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గఙ్గాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౬॥

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వమ్భర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౭॥

కల్యాణరూప ! కరుణాకర ! కాలకణ్ఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదలనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౮॥

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాఙ్ఘ్రే !
గన్ధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గణ్డావలమ్బిఫణికుణ్డలమణ్డితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౯॥

నాగేన్ద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ।
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౦॥

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః ।
సంహారశక్తిరపి శఙ్కర ! కిఙ్కరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౧॥

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శఙ్కధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౨॥

పాతాలగాఙ్గజలమజ్జననిర్మలాఙ్గాః
భస్మతిపుణ్డ్రసమలఙ్కృతఫాలభాగాః ।
గాయన్తి దేవమునిభక్తజనా భవన్తం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౩॥

సారస్వతామ్బుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుమ్బితకృష్ణవేణ్యాః ।
సోపానమార్గమధిరుహ్య భజన్తి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ ॥ ౧౪॥

శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత
స్తోత్రం పఠన్తి భువి యే మనుజాః ప్రభాతే ।
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శామ్భవం పదమవాప్య ముదం లభన్తే ॥ ౧౫॥

ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సమ్పూర్ణమ్ ।


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
07... 🌻 రుద్రుని ప్రతి రూపాలే రుద్రాక్ష 🌻

🍃🌼రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము.

🍃🌼రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.

🍃🌼రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.

🍃🌼ఎలాంటి కష్టనష్టాలు రావు.

🍃🌼అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష.

🍃🌼ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది.

🍃🌼రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

🍃🌼తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు.

🍃🌼అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.

🍃🌼అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది.


08... 🙏 ఓం నమః శివాయ 🙏


🍃🌺సమస్త జ్ఞానానికీ మూలమైనవాడు శివుడు. ఆయనే దక్షిణామూర్తి. అమ్మవారితో కలిసి సాంబసదాశివుడు. పదకొండు రుద్రులుగా దేవతలను రక్షించే మహారుద్రుడు. భక్తకింకరుడైన శంకరుడు. దేవతలందరికీ ఆరాధ్యుడైన మహాదేవుడు.

🍃🌺శ్రీమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, పరమశివుడు నూట ఎనిమిది రుద్రావతార లీలల్ని ప్రదర్శించి లోకాలకు శుభాలను ప్రసాదించాడు. జీవుల కర్మదోషాలకు శిక్షలు విధించే నవగ్రహాలకు శివుడే అధిపతి. అందుకే గ్రహబాధల నుంచి రక్షణకు శివారాధన చెయ్యాలంటారు.

🍃🌺పూజ, అర్చన, ఆరాధనలు- వివిధ స్థాయులకు చెందినవి. శివుడికి సంబంధించి అర్చన, ఆరాధన అనే మాటలు ఉపయోగిస్తారు. రుద్రార్చనలో నమక చమక మంత్రాభిషేకం, బిల్వార్చనలు ఉంటాయి. ఆరాధనలో ‘యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అనే సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ప్రతి చర్యా ఆయన సేవే అనుకోవాలి.

🍃🌺శివశరణం లభించడమంటే రుద్ర కవచం మనకు దక్కినట్లే. త్రిశూలపాణి మనకు అండగా ఉన్నట్లే. అయితే, వీటిని పొందగల అర్హత మనం ఆర్జించుకోవాలి.

🍃🌺అలా ఆర్జించుకోవాలంటే, రుద్ర నమక మంత్రం ‘సౌమనసశ్చమే’ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. రుద్ర మంత్రాల ద్వారా మనం అనేక మహత్తరమైన ఆకాంక్షలను శివుడికి విన్నవించుకుంటాం. వాటిని మనకు అనుగ్రహించమని అర్థిస్తాం. అలాంటిదే ‘సౌమనసశ్చమే’. ‘మంచి మనసును నాకు ప్రసాదించు శివా!’ అనేది ఈ మంత్రార్థం.

🍃🌺మనిషి కష్టాలన్నీ మంచి మనసు లేకపోవటం వల్లనే కలుగుతున్నాయి. స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి మహాపాషాణ విషాలు మన మనసులో తిష్ఠవేసుకుని ఉంటాయి. క్షీరసాగర మధన వేళ ఉద్భవించిన లోకభీకరమైన మహా వినాశనకారి అయిన హాలాహలాన్ని స్వీకరించిన పరమశివుడు మన మనసులోని పాషాణ విషాలను సైతం హరించివేయాలని మన ప్రార్థన, అభ్యర్థన. అవి తొలగిపోతే కానీ మనసు అమృతీకరణం చెందదు.

🍃🌺 అమృతీకరణం చెందిన మనసు అందరి క్షేమాన్నీ కోరుతుంది. ఉదారంగా, సౌమ్యంగా, సర్వజన ప్రియంగా వ్యవహరిస్తుంది. అప్పుడిక శత్రువులంటూ ఉండరు. శత్రుబాధలు లేనప్పుడు అశాంతి ఉండదు. ఇదే ఆనంద రహస్యం.

🍃🌺భగవంతుడు మనపట్ల ఉదారంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎవరి పట్లా ఉదారత చూపం. ఆర్తితో అలమటిస్తున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటాం. ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న నాణేన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం. అలా ఉంటుంది లోభత్వం.

🍃🌺మూడు రకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు. తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్తపరులు కనిపిస్తారు. తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయులూ ఉంటారు.

🍃🌺భగవంతుడు అలాంటి అమృత హృదయుల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే, దయగలవారే దైవ సమానులు. దయామూర్తులే దైవ పరివార సభ్యులు. దీనులకు దైవపరివారమే బంధువులు.

🍃🌺జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు. ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది. నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసునూ శుభ్రం చేసుకోవాలి. అందుకు శివారాధన అత్యుత్తమం.

🍃🌺 శివప్రీతికరమైన మాస శివరాత్రులు, సోమవారాలు, కార్తిక మాసంలో ప్రతి రోజును మనం శివారాధనలో సద్వినియోగం చేసుకుంటే, సౌమనస్కులుగా ఉండగలుగుతాం!


🙏 ఓం నమః శివాయ 🙏

09. 🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 44 & 45 🕉

తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలంగ మహోద్యోగముసేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపాశములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివైచి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!

📍 తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడునది ఏమనగా  ’మనస్సు అత్యంత ఆసక్తి తో పరస్త్రీలతో సంగమించి సుఖించ గోరుచున్నది.

🌹పరద్రవ్యములను దొంగిలించవలెనను కొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది.

🌹నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము.

🌹పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము.


🙏 ఓం నమః శివాయ 🙏
 

 *******

  10. రాముడొచ్చాడు!      (శ్రీరామచంద్రుని లీల)


                       ➖➖➖✍️

{చిన్నప్పుడు పుస్తకాలలో రామదాసుని రామలక్ష్మణులు వచ్చి ఆదుకున్నారని తానిషాకు  అప్పుతీర్చి   రామదాసుని రుణవిముక్తుడ్ని చేసారని చదువుకున్నాం.

కానీ ఈ మధ్య ఓ మిత్రుడు వాట్సాప్ లో ప్రస్తావించిన  ఓ సంఘటన నన్ను దాదాపు కళ్లనీళ్లపర్యంతం చేసింది.

అది మీతో పంచుకోవాలనిపించి ఈ క్రింద పొందుపరుస్తున్నాను.}

      వీధి గదిలో  ఆత్రంగా   అటూ ఇటూ తిరుగుతూ.. .హాల్లోని టీవీ వైపు ఆత్రుతగా చూస్తున్నారు సీతారావమ్మ గారు. అప్పటికే ఆవిడ స్నానం చేసి, మడిగట్టుకుని దేవుడి పూజ ముగించేరు.

ఆవిడ ఆత్రుత గమనించిన కోడలు వాణి, నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అరుగు మీద ఆడుకుంటున్న   మనవడు రామాన్ని పిలిచి 'టైము తొమ్మిదిన్నర కావొస్తుందేవిట్రా?' అని అడిగితే 'లేదు మామ్మా.. తొమ్మిదింపావు అయ్యింది' అంటూ పెరట్లోకి తుర్రుమన్నాడు.

'ఇంకో పావుగంటే ఉంది... కోడలు టీవీ పెడుతుందో లేదో.. అసలే ఇవ్వాళ సీతా స్వయంవరం కూడా..!పోనీ..నేనే వెళ్లి టీవీ పెట్టమని అడిగితే? ఒద్దులే.. మళ్ళీ ఏదో మాటందంటే బాధపడాలి.. అయినా బాధేముందీ? ఆ రాముణ్ణి చూడ్డం కోసం
ఎన్ని మాటలైనా పడొచ్చు' అనుకుంటూ ఉండగానే 'అత్తయ్యా.. టీవీ పెడుతున్నాను.. మీరు రావొచ్చు' అంటూ కోడలు పిలిచింది.

హమ్మయ్య అనుకుని వంగిన నడుముతో, పరుగులాంటి నడకతో గబగబా హాల్లోకొచ్చి టీవీ ముందు చేతులు జోడించి, ముడుచుక్కూచున్నారు సీతారావమ్మ గారు.

వాణి ఆ డయనోరా టీవీ కవరు పైకెత్తి, టీవీ పెట్టేసరికి 'రామాయణ్ కీ ప్రస్తుత్ కర్తా కోల్గేట్ పామోలివ్' అంటూ అడ్వర్టైజ్మెంటొస్తూంది. 'ఆ హిందీ ఏమో మీకు రాదు.. అయినా చిన్నపిల్లలా టీవీ చూడాలని ఆత్రుతొకటి' అంటూ వాణి విసుక్కుంటున్నా ఆ మాటలు పట్టనట్లు సీతారావమ్మ గారు రామాయణం చూడటంలో మునిగిపోయేరు.

పిఠాపురం పక్కనే ఉన్న కందరాడలో పుట్టిన సీతారావమ్మ గారికి చిన్నప్పటినుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి.   ఆవిడ పన్నెండో యేట తాలుకాఫీసులో పనిచేస్తున్న భమిడిపాటి రామానుజం గారితో వివాహం కుదిరినప్పుడు స్నేహితురాళ్ళు ఒకటే ఏడిపించేరు... 'నీ పిచ్చికి తగ్గట్టే మీ ఆయన పేరు కూడా రాముడే' నని.

రాజమాత వీధిలో రామాలయం దగ్గిరే రామానుజం గారిల్లు. సీతారావమ్మ గారు భర్త ఆఫీసుకెళ్ళిన తర్వాత పగలంతా ఇంటి పనులు చేసుకుని, పెరట్లోని పువ్వులు కోసి గుళ్ళోకి మాలలు కట్టడం, పడిపోయిన కొబ్బరి మట్టలు విరగ్గొట్టి వంటచెఱకు చెయ్యడం, రాలిపోయిన బూరుగుకాయల్లోంచి దూది తీసి బొంతలూ, దిళ్ళూ కుట్టడం లాంటి పనులు చేసుకుంటూండంతో గడిపేవారు. సాయంత్రప్పూట      ఇంటి      దగ్గిరున్న రామాలయానికెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునేదావిడ.

పురిట్లోనే ఎందరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుకు పురుషోత్తం. వీడి తర్వాత ఇంకొకరు పుడితే మొదట పుట్టిన వాణ్ణి అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది.. మనకొక్కడు చాలన్నారు రామానుజం గారు.

1983 లో    అనుకుంటా   ఎన్టీఆర్ ముఖ్యమంత్రయ్యాడు. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ యాభై ఐదేళ్లకి తగ్గిస్తూ జి. ఓ ఇచ్చారు .       ఆ తర్వాత  రోజు కి రామానుజం గారికి     యాభై ఐదేళ్ళు నిండుతాయనగా, గుండాగి నూరేళ్ళు నిండిపోయాయి. ఆయన ఉద్యోగం పురుషోత్తం కి వచ్చింది. భర్త పోయిన కొంత కాలానికి కొడుకు పెళ్లి చేసేరు సీతారావమ్మ గారు.

అప్పట్నుంచీ ఆవిడ కష్టాలు మొదలయ్యాయి. గదిలోంచి బయటకొస్తే చాలు 'ఏంకావాలత్తయ్యా.. మీ గదిలోంచి బయటికొచ్చేరు? ' అంటూ కోడలడిగేది. ఏం కావాలి అంటే ఏమని చెబుతుంది.. తన పెళ్లైన తర్వాత నుంచీ తిరిగిన ఇల్లు మరి. అదే మధ్యాహ్నం పెరట్లోకి వెళ్లి పని చేసుకుంటూంటే మటుకు ఏమీ అడిగేది కాదా వాణి.

రామానుజం గారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే కొడుకు బజారుకెళ్ళి పాతిక వేలెట్టి డయనోరా టీవీ కొనుక్కొచ్చేడు. 'అదే డబ్బుతో నువ్వు ఓ ఇల్లో, స్ధలమో కొనుక్కునుంటే బావుండేది నాయనా' అని ఆవిడనేసరికి కొడుకు, కోడలు వారం రోజుల పాటు మాటలు మానేసేరు.

ప్రతీ నెలాఖరుకీ తల్లికి పట్టుచీర కట్టి
పెన్షన్ డబ్బలకోసం రిక్షా లో తీసికెళ్ళేవాడు, పెన్షన్ డబ్బులు తీసుకుని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది.

శ్రీ రామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకుని, ఆ మడి బట్టలతోనే రేడియో ఎదురుగా కూర్చుని సీతారామకళ్యాణం వ్యాఖ్యానం అంతా వినిగానీ ప్రసాదం తినేది కాదావిడ.

రెండుమూడుసార్లు అడిగిందావిడ కొడుకుని 'ఒరేయ్.. ఆ భద్రాచలం రాముడి కళ్యాణం చూడాలనుందిరా' అని. 'చూద్దాంలేవే' అంటూ దాటేసేవాడు. ఓరోజు కోడలంది 'ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలీదత్తయ్యా.. ఆయన్ని భద్రాచలం, తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి'.
ఆ తర్వాత ఇంకెప్పుడూ సీతారావమ్మ గారు భద్రాచలం ప్రసక్తి ఎత్తలేదు.

టీవీ లో రామాయణం చూస్తూంటే 'టీవీ మూలంగా కరెంటు వృధా అయిపోతూందని మీ అబ్బాయి బాధ పడుతున్నారు' అనేది వాణి.

దాంతో కోడలు టీవీ పెట్టి, పిలిస్తే చూడ్డం, లేకపోతే ఆ వీధి గదిలో కూర్చుని రాముణ్ణి తల్చుకోవడం.

ఆ ఏడాది పురుషోత్తం అడిగాడు 'నీ కోడలు, మనవడు వేసవిలో ఊటీ వెళ్దామని సరదా పడుతున్నారు.మేము ముగ్గురం వెళ్ళేమనుకో
ఇంట్లో ఒక్కదానివీ ఉండగలవా అమ్మా?'

'నిక్షేపంగా ఉంటారు.. మనం ఉంటే ఇబ్బంది గానీ లేకపోతే మహారాణీ లా ఉంటారు అత్తయ్య గారు ' జోకేసాననుకుని కిసుక్కున నవ్వింది వాణి.

'హాయిగా వెళ్లి రండి నాయనా.. నా గురించి మీరు ఇబ్బంది పడక్కరలేదు' అన్నారు సీతారావమ్మ గారు.

పురుషోత్తం వాళ్ళు    వెళ్ళిన తర్వాత అర్ధమైందావిడకి తను చేసిన తప్పు.
రేడియో కొడుకు గదిలో ఉండిపోయింది.. కోడలు ఆ గదికి తాళం పెట్టుకునెళ్ళిపోయింది. ఎల్లుండి శ్రీ రామనవమి... ఈసారి తన రాముడి కళ్యాణం ఎలా వినాలి?  పోనీ పక్కింటికెళ్తే? వద్దులే.. మళ్ళీ వాళ్ళు తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు.

ఆవిడలా మధనపడుతూంటే తటాలున వచ్చిందా ఆలోచన.    పోనీ భద్రాచలం వెళ్లిపోతే? అవును.. అక్కడికెళ్ళాలే గానీ ఆ రాముడే తనను చూసుకుంటాడు. వెంటనే గబగబా తన ఒత్తుల డబ్బా వెతికిందావిడ.. డబ్బులెంతున్నాయో చూద్దామని.

అన్నీ కలిపి ఐదు రూపాయలు దొరికాయావిడకి. ఏం చెయ్యాలో తోచలేదు. ముందుగా బస్టాండుకెళ్ళి కనుక్కుందాం.. టిక్కెట్టు ఎంతవుతుందో.. ఏమైనా తను
తన రాముడి కళ్యాణం    చూడ్డానికి వెళ్తూంది.    తనను తీసుకెళ్ళే బాధ్యత
ఆ రాముడిదే అనుకుంది. నాలుగు చీరలు మూట కట్టుకుని, బయటకొచ్చేసి, భర్త కట్టిన ఆ ఇంటికేసోసారి ఆప్యాయంగా చూసి బస్టాండుకి నడుచుకుంటూ వెళ్ళింది.

బస్టాండు లో    కనుక్కుంటే చెప్పారు, భద్రాచలానికి మధ్యాహ్నం రెండింటికి బస్సుందని, యాభై రెండు రూపాయలు టిక్కెట్టనీ. ఏంచెయ్యాలో అర్థం కాలేదావిడకి. ఏదైతే అయ్యింది.. ఆ డ్రైవరు కాళ్ళట్టుకునైనా
వెళ్ళిపోదామనుకుంది.

రెండూపదవుతూండగా బస్సొచ్చింది. ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు. కొంచెం రద్దీగా ఉండుంటే గుంపులో గోవిందలాగా టిక్కెట్టు కొనడం తప్పించుకోవచ్చు. ఇప్పుడు తప్పదు..ఇంకా డ్రైవరూ, కండక్టర్ల కాళ్ళట్టుకోవల్సిందే. వాళ్ళ కాళ్ళట్టుకుంటాను కానీ వాళ్లు ఒప్పుకునేలా చూడు తండ్రీ అని రాముణ్ణి తల్చుకుంది. బస్సెక్కి ఆఖరి సీటులో కిటికీ పక్కన కూర్చుంది.

కాసేపటికి బస్సు బయల్దేరింది. కండక్టర్ తీరిగ్గా అందరి దగ్గిరకీ వెళ్లి టిక్కెట్లు కొడుతున్నాడు. సీతారావమ్మ గారి దగ్గిరకొచ్చి టిక్కెట్టమ్మా అనేసరికి ఆవిడకి నోటమాట రాక ఐదు రూపాయల చిల్లర చూపించి చేతులెత్తి దణ్ణం పెట్టేరు.

కండక్టర్ చిరాగ్గా చూసి 'టిక్కెట్టు డబ్బులివ్వకుండా అలా చేతులెత్తి దణ్ణం పెడితే ఎలాగమ్మా?' అని ఆవిడ కాళ్ళ దగ్గిరున్న చేతిసంచీ తీసుకుని, అందులోనుంచి యాభై నోటూ, ఈవిడ చేతిలోంచి రెండు రూపాయలూ తీసుకుని చేతిలో టిక్కెట్టెట్టి వెళ్ళిపోయేడు.

ఆవిడకి మతోయింది.. ఆ సంచీ నిండా డబ్బులు!  ఈ సంచీ తనది కాదు.. ఎవరి డబ్బో తనకెందుకు? ఆ డ్రైవరు, కండక్టర్లు ఏవైనా దయ తలిస్తే వెళ్దామనుకుంది కానీ ఇంకొకరి డబ్బుతో కాదు.

నిశ్చయించుకుని కండక్టర్ దగ్గిరికెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి, ఈ సంచీ తనది కాదంది. ఆ కండక్టరు 'భలే వారమ్మా మీరు.. ఇది ఆడాళ్ళ చేతిసంచీ..ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమనిషి మీరొక్కరే. అలాంటప్పుడు ఇది మీది కాక వేరెవరిదవుతుందీ? ఏవయ్యా.. ఈ సంచీ మీదా?' అని బస్సులో ఉన్న మిగతా పాసింజర్లని అడిగితే వారంతా మాది కాదన్నారు.

డ్రైవరు అన్నాడు 'మీదే అయ్యుంటాదమ్మా.. మీరెళ్ళి హాయిగా ఆ సీట్లో పడుక్కోండి.. భద్రాచలం వచ్చిన తర్వాత లేపుతాం'

ఇంకేం చెయ్యలేక వెళ్లి తన సీట్లో రాముణ్ణి తల్చుకుంటా కూచున్న సీతారావమ్మ గారికి మాగన్నుగా నిద్దరట్టేసింది.

తెలవారుతూండగా కండక్టర్ నిద్ర లేపి 'భద్రాచలం వచ్చేసిందండి.. మీ రాముడి కళ్యణానికెళ్ళండి' అనేసరికి అప్పుడే భద్రాచలం వచ్చిందా.. తన రాముడి ఊరికొచ్చేసేనా.. ప్రభూ అంతా నీ దయ అనుకుంటూ మళ్లీ వెళ్లి ఆ డ్రైవరు, కండక్టర్లతో చెప్పింది 'బాబులూ.. ఈ డబ్బులు నిజంగా నావి కావు.. ఎవరివో ఏంటో మీరే కనుక్కుని ఇచ్చేద్దురూ'

'ఆ డబ్బులు మీవే అయ్యుంటాయమ్మా..మీరెక్కువగా ఆలోచించక మీ రాముడి కళ్యాణం చూసుకోండి' అన్నాడు కండక్టరు.

' ఈ సొమ్ము ఆ రాముడి సొమ్మే అనుకుని హుండీలో వేసేస్తాను.. నన్ను భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను బాబూ.. మీ పేర్లు? ' అని సీతారావమ్మ గారడిగితే కండక్టరు నవ్వేసి' పెద్ద గొప్ప పేర్లేవీ కాదులెండి.. నా పేరు లక్ష్మణరావు, ఆ డ్రైవరు గారి పేరు రామారావు ' అనేసి ఆ తెల్లవారుజాము చీకట్లో కలిసిపోయారాళ్ళు.

ఇది నిజంగానే జరిగిందా లేక రచయిత కల్పనో తెలియదు కానీ నిజమైతే బాగుండును అన్న ఓ చిన్న ఆశ తో ముగిస్తున్నా. ✍️ 

శుభరాత్రి... ఆనందమస్తు

నేడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి

 శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంక్షిప్త చరిత్ర తెలుసుకుందాము.🙏🙏🙏

శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంక్షిప్త చరిత్ర

ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు ‘బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా’ దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

బాల్య లీలలు :
————–
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు – ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు – ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక – నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో – నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై – కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.

వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
———————
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు –

ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా – ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.

శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది – అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.
జిల్లా
శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II

తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.

కార్త వీరార్జుని వృత్తాంతం :
————————-
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు “కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు.” అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.

ఙ్ఞానబోధ :
———-

దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
——————-
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.

**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.
ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

తా II కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు.

 జై గురుదత్త జై గురుదత్త
pranjali prabhaku pampinavari ki  krutajnatalu
సౌజన్యం...
 శ్రీ చొప్పకట్ల.సత్యనారాయణ
రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్



1 comment:

  1. అందరూ చదివి తెలుసుకోవలసిన కధలు

    ReplyDelete