60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .
*********
1) మీరు బాత్రూంలో వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.
2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.
3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .
4) కారు గానీ , స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి.
5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.
6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ ,
మనశ్శాంతిగా వుండే విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు.
7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.
వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.
8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి.
9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర.
10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు.
11) ఇంట్లో వారితోను , బయటి వారితోను
మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.
12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.
13) ఈ వయసులో మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం.
Note = మీరు వీలు చేసుకుని + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.
పోలి అమావాశ్య నాడు దీపములను అరటి దొప్పలలో వదులుతూ చదవవలసిన శ్లోకం
కార్తీక దామోదరా గయా దామోదరా
ఆత్మ దామోదరా లింగ దామోదరా
మోక్ష దామోదరా కృత్తికా మహాలక్ష్మీ
నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో
నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు
లక్ష్మీ దామోదరా రాధా దామోదరా
గోరంత పసుపు కుంకుమ తీసుకొని
కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ !
...............
*పోలి స్వర్గం కథ ఇదీ* 🥀
కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.
అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఈ అమావాస్య సోమవారం కనుక మంగళవారంనాడు పోలి దీపాలను వెలిగించుకోవాలి.
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.
..........
*1.మహాంధ్రోదయం,రుద్రవీణ పలకరింపు' అగ్నిధార'కవెవరు.
2.దున్నడం పదంనుతొలిగా ప్రస్తావించిన వేదబ్రాహ్మణమేది.
3.సుఖాంతప్రేమకథ'యాజ్ యులైక్ఇట్'నాటకకర్త.
4.మధురభక్తిస్త్రీవాదజ్ఞానం,ఆండాళ్ కథకావ్యకర్త.
5.15శతాబ్దం మానవతాధర్మం 'నానాటిబతుకునాటకం'సంకీర్తనెవరిది.
6.1947లోతాత్వికచింతన నాటకం'పురూరవ'వ్రాసందెవరు
7.అష్టదిగ్గజాలలోరాయలప్రీతికర విశిష్టశైవకవి.
8.హరివంశం,నృసింహపురాణం కావ్యకర్త.
9.1930లోపిఠాపురంనుండి4సంపుటాల'వర్ణనరత్నాకరం'కర్త
10.'దిషార్ట్,దిలాంగ్ అండ్ దిటాల్'12కథలసంపుటికర్త.
11.పద్యం,కొత్తతరంమథనం'పాఠకమిత్రవ్యాఖ్య'రూపకర్త.
12.రాజరిక సిద్ధాంతంను వివరించిన వేదగ్రంధం.
13.విఖ్యాతసంపాదకులు,రచయిత 'వీరాజీ'అసలుపేరు.
14.యానాం సాహిత్యకేతనం డా.శిఖామణి అసలుపేరు.
15.లలితసుగుణజాల తెలుగుబాలన్న'కరుణశ్రీ'పేరు.
16.'కవిత్వంమాట్లాడేచిత్రం,చిత్రలేఖనంమౌనకవిత్వం'అన్నది.
17.విశిష్టకవిసమీక్షకులు,వ్యాఖ్యాత'సుధామ'పేరు.
18.స్త్రీవాదరచనోద్యమశీలి 'ఓల్గా'పేరు.
19.చతుషష్టికళల్లో సమాహారకళని దేనినంటారు.
20.ప్రఖ్యాతసాహిత్యవేత్తఅక్కిరాజు రమాపతిరావు కలంపేరు
21.ఆర్గురుదిగంబరకవుల్లో'అగ్నిశ్వాస'నిఖిలేశ్వర్ అసలుపేరు
22.విఖ్యాత'ఎల్లోరా'గొడవర్తిభాస్కరరావు,మరి'అజంతా'పేరు.
23.త్రిపురాసురసంహారం,ద్రాక్షారామమహాత్యంగల'శ్రీనాథ'రచన.
24.నేత్రావథాని,యాజ్ఞి,పిఠాపుర రాజాస్థానకవి,సోమయాజి .
25.దుర్యోధనఘోషయాత్ర,'సౌమిత్ర్యుపాఖ్యానం
......
🕉️ *చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా..!*
శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్..అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.
108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది.
ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం..
ఎక్కడ ఉంది?
తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది.
ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.
ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ వుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.
స్వామి వారు ఈ సమయంలో ..
ఒక చిక్కుపరిస్థితిలో పడతారు..
అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం.
తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.
గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు..
నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా
ముందుకి వెళ్లను.
తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.
ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది.
అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.
అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.
2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.
3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.
5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.
5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది.
ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ వుంటుంది.
ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.
గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు వుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.
అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు.
ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది.
మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.
ఆదిశేషుడు – తన కంకణంగా
కర్కోటకుడు – తాను ధరించే పూలదండగా
పద్మనాభుడు – తన కుడిచెవి ఆభరణంగా
మహా పద్ముడు – ఎడమచేతి ఆభరణంగా
శంఖపాలుడు – తన కిరీటం ఆభరణంగా
గుళికుడు – కుడి చేయి గాజులాగా
తక్షకుడు – వడ్డాణంగా
వాసుకి – జంధ్యంగా
ఇక 9వ సర్పం..ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.
🙏🔔🙏🔔🙏🔔
🔹 గ్యాస్ వినియోగదారులకు శుభవార్త 🔹*
*🔹 ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కూడా చేయక్కర్లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నారా ? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఫోన్ చేయాల్సిన పని లేకుండానే సులభంగానే సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*
*🔹ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*
*🔹 వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ నంబరును మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది.*
*🔹 భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344 నెంబర్ను వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. తర్వాత మీకు రిప్లే వస్తుంది. తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*
*🔹 అదే మీరు ఇండెన్ గ్యాస్ వాడితే. +917588888824 అనే నెంబర్ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది*.
*🔹హెచ్పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు +919222201122 నెంబర్ ద్వారా వాట్సాప్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.*
*🔹 ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు కూడా ఉంటాయి. వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.*
*ఒక చిన్న గదిలో* *నాలుగు మైనపు దీపాలు* *వెలుగుతూ ఉన్నాయి.*
*ఇంతలో పెద్దగా గాలి💨 రావడం మొదలయింది.*
*ప్రశాంతత అనే మైనం:-
ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.*
*ప్రేమ అనే మైనం:- కూడా
ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను* *ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*
*తెలివి అనే దీపం:-
నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూఆ గాలికి ఆగిపోయింది.*
*నాలుగో దీపం మాత్రం:-
నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* *ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది. ఆ గాలిని ఎదిరించి వెలిగింది.*
*దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు* *ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.*
*బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది.*
*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో* *అన్నదట...*
*సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు.*
*నా పేరు నమ్మకంఅని చెప్పింది... ఆ దీపం.*
*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*
🙏 *ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు..
ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*
*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే..
నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...
ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..
మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*
*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*
*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*
*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*
*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*
*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*
*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*.
*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*
*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*
*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*
*ఒక చిన్న గదిలో* *నాలుగు మైనపు దీపాలు* *వెలుగుతూ ఉన్నాయి.*
*ఇంతలో పెద్దగా గాలి💨 రావడం మొదలయింది.*
,...............
*ప్రశాంతత అనే మైనం:-
ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.*
*ప్రేమ అనే మైనం:- కూడా
ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను* *ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*
*తెలివి అనే దీపం:-
నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూఆ గాలికి ఆగిపోయింది.*
*నాలుగో దీపం మాత్రం:-
నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* *ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది. ఆ గాలిని ఎదిరించి వెలిగింది.*
*దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు* *ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.*
*బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది.*
*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో* *అన్నదట...*
*సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు.*
*నా పేరు నమ్మకంఅని చెప్పింది... ఆ దీపం.*
*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*
🙏 *ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు..
ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*
*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే..
నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...
ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..
మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*
*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*
*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*
*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*
*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*
*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*
*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*.
*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*
*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*
*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*
,,....,...
ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది...
ఆమెనడిగాడు... మీది ఏ కులం?
ఆమె సమాధానం "మహిళ"గా చెప్పాలా "అమ్మ"గా చెప్పాలా?
రెండిటినీ కూర్చి చెప్పండి, అన్నాడతడు.
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!
అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు...
ఆమె సమాధానం...
తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి
పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత
పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది.
చివరగా...
పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది.
ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!
గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు...
మాతృమూర్తులందరికి అంకితం
ప్రతి నిత్యం మన జీవితాలని ఉత్సహంగా మలిచే అమ్మ కి🙏
,,............
*🔊ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు*
*🔶ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పంపిణీ*
*🔷ముందుగల రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్*
*🔶ఏ సెంటర్కు పోవాల్నో ముందే మెసేజ్ వస్తది*
*🔷గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్లోకి ఎంట్రీ*
*📜రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్*
*🍥హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల పంపిణీకి ఏర్పాట్లు షురూ అయ్యాయి. పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలనూ వివరిస్తూ గైడ్ లైన్స్ జారీ చేసింది. తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్ల(పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది)కు, మూడో రౌండ్లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్ సాఫ్ట్వేర్లో సెల్ఫ్ రిజిస్ర్టేషన్కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.*
*💥రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే..*
*🌀రిజిస్ర్టేషన్ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల వద్దకు వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఏదైనా నెగెటివ్ రియాక్షన్ వస్తే వెంటనే కొవిన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పింది. వాళ్లకు ట్రీట్మెంట్ అందించేందుకు డాక్టర్లు, మెడికల్ టీమ్లను సిద్ధంగా ఉంచాలని వివరించింది.*
*💥ఒక సెషన్ లో వంద మందికే..*
*💠ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ వ్యాక్సిన్ లు వేయాలని కేంద్రం సూచించింది. హెల్త్ స్టాఫ్కు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, దవాఖాన్లలోనే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. వీరి డేటాను ఇప్పటికే ఆరోగ్యశాఖ సేకరించింది. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను ఆయా శాఖల నుంచి సేకరించి, ఆరోగ్య సిబ్బంది రిజిస్ర్టేషన్ చేయనున్నారు. ఓటర్ లిస్ట్ ద్వారా వృద్ధులను, రోగులను గుర్తించనున్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడానికి హాస్పిటల్స్తోపాటు, ఆఫీసులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లను వాడుకోవచ్చని తెలిపింది. ప్రతి సెంటర్లో వెయిటింగ్ హాల్, వెరిఫికేషన్ హాల్, వ్యాక్సినేషన్ హాల్, వెయిటింగ్ రూమ్ కంపల్సరీగా ఉండాలని చెప్పింది. ప్రతి సెంటర్లో ఒక సెషన్లో వంద మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్ లో ఒక వ్యాక్సినేటర్, నలుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లు ఉండాలి. వ్యాక్సినేటర్గా డాక్టర్ లేదా నర్స్, లేదా ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిన వారు ఎవరైనా ఉండొచ్చు. వీరికి ముందుగానే ఆరోగ్యశాఖ ట్రైనింగ్ ఇవ్వాలి. వ్యాక్సినేషన్ లో మొత్తం 23 డిపార్ట్మెంట్ల సిబ్బందికి డ్యూటీలు వేయాలని, ఏయే డిపార్ట్మెంట్ ఏయే పనులు చేయాలో గైడ్లైన్స్లో కేంద్రం పేర్కొంది.*
*💥వ్యాక్సిన్ వేస్కోవాలంటే ఇదీ ప్రాసెస్*
*♦️వ్యాక్సిన్ కోసం ఆరోగ్యశాఖ వద్ద లేదా కొవిన్ (www.cowin.gov.in ) వెబ్సైట్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.*
*♦️ఏయే వ్యాక్సిన్ సెంటర్లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో ముందుగానే లబ్ధిదారులకు సమాచారం ఇస్తారు.*
*♦️ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోపు ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లాలి.*
*♦️వ్యాక్సినేషన్ ఆఫీసర్గా ఉన్న పోలీస్ సిబ్బందికి ఆ కార్డు చూపించి, వెయిట్ చేయాలి.*
*♦️తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు వచ్చిన ఎస్ఎంఎస్, గుర్తింపు కార్డు చూపాలి. ఆఫీసర్లు కోవిన్ వెబ్సైట్లో రిజిస్ర్టేషన్ వివరాలను వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారు.*
*♦️వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్కు చెప్పాలి.*
*♦️ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కో–విన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన కార్డు ఇస్తారు. లబ్ధిదారు మొబైల్కు కూడా ఎస్ఎంఎస్ రూపంలో లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, వ్యాక్సినేషన్ సెంటర్, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్ వంటివన్నీ ఉంటాయి. అలాగే, సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? అన్న సమాచారం కూడా ఉంటుంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్* *తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ* *కార్డు తప్పకుండా తీసుకురావాల్సి*
*ఉంటుంది.*
Fine ,well information,about all angles,
ReplyDeletePoli Deepam,gas,covid vaccine, moral,all are fine
ReplyDelete