ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ:
సేకరణ ... రచయత . సంపాదకులు . మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..
న య న య స గ - ప్రియకాంత -10
III IUU III IUU IIUU
నేటి కవిత్వం - ప్రియకాంత
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లలన విలాపం వలన లలాటం నిను చేరే
కలువ సరాగం మనకు కలాపం విని నంతే
మలుపు సకాలం మనసు మయూరం వెలిగించే
వలపు సమానం జరుప వలే మాయలు గావే
చిలక ల చిన్నాటలకు చిముగ్గే పరిచేగా
కులుకు లు చూసే వినయ కుమారం విరజాజై
చిలికి తరించే మదన చినో నేత్రము పెర్గే
గలగల పెంచే విషయ గమానం దరి చేరే
కలయిక కాలం కలల కలాపం పురి విప్పే
నిలకడ వేగం వలపు నిదానం వరి చేనై
విలువల వేషం తలకకి తాపం ఉసిగొల్పే
తొలకరి చిన్కే తడిపె తలత్వం విడమర్చే
అలకల వైనం ఎదురగ సాగే చిరుహాసం
మలి ముసుగై చామరము మాపే మరుమల్లే
భలి భలె సంతోష నగభ చూపే దరహాసా
మలి కల నైజం సరియమ పాఠం దరిచేర్చే
--(())--
01. లంకె బిందెలు కధ
సూరయ్య కొడుకు పట్నంలో కాపుర ముంటున్నాడు. ఇక్కడ తనను చూసేవారు ఎవ్వరూ లేరని, ఇల్లు అమ్మి పట్నంలో ఓచిన్న ఇల్లు తీసుకోవాలని కోరిక.
ఎంత మంది వచ్చి భేరమాడినా లక్షకన్నా ఎక్కువకు అడగడం లేదు. ఈయనకు కావలసింది రెండు లక్షలు.
ఇలా కాదని మంత్రగాడితో మంతనాలు జరిపాడు. ఎలా చేస్తావో ఏమో లక్షకు పైన వస్తే చెరిసగం తీసుకుంటాము. ఇంక నీ ఇష్టం "అన్నాడు సూరయ్య.
ఓరోజు సూరయ్య ఇంటిపక్కనున్న రోశయ్య తో" "ఇంతకాలం శనిపట్టి వున్నావు సూరయ్య స్థలంలో లంకె బిందులున్నాయి.రాత్రి అంజనలో చూశాను. జంట పాముల్లాగా పెనవేసుకుని వున్నాయి అవి కోట్లు విలువ చేస్తుంది." అని మాయమాటలు చెప్పి మూడు లక్షలకు కొనేటట్టు చేశాడు మాంత్రికుడు.
సూరయ్య చెప్పిన ప్రకారం పంచుకున్నారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి మాంత్రికుడు చెప్పిన స్థలంలో తవ్వకాలు ప్రారంభించారు.
రెండు నిలువులు తోతుకు త్రవ్వగా బిందుల సంగతి దేవుడెరుగు నీళ్ళు పట్టాయి నీళ్ళు ఎత్తి పోస్తూ, జరిగిన దంతా మంత్రగాడికి చెప్పాడు.
అది బయట పడిందంటే ముందు మిమ్మల్ని బలితీసుకుంటుంది ఎవరినైనా ప్రాయంలో వుండే వాడిని చూడండి , బలిఇచ్చి బిందెలు తీసుకుంటాము"అన్నాడు.
రోశయ్య యువకుడి కోసం వెదుకు తున్నాడు
ఆ సంగతి ఆనోట ఆనోట గ్రామ పెద్ద చెవిన పడింది.
మంత్రగాడిని పిలిపించి కట్టేసి జాటీకోడుతో నాలుగు పెరుకులు పెరికాడు.మొదటి నుంచి జరిగిన దంతా చెప్పేశాడు.
ఈ మధ్య మోసకారి మాంత్రికులు మాటలు నమ్మి, దురాశతో బిందెలు దొరుకుతాయని, అమాయకులను బలి ఇచ్చేందుకు కూడా తెగబడ్డారు.
ఈ మూఢ నమ్మకాలు అనే జాడ్యం ఎప్పుడు పోతుందో ఏమో బిందెల కోసం సాటి మనిషిని చంపే దశకు వచ్చారు ఈ మూర్ఖులు
మళ్ళీ బిందెలని అన్నావో నిన్నే బలియిస్తా అని భయం పెట్టి పంపాడు గ్రామ పెద్ద
బ్రతుకు జీవుడా అని వెళ్ళి పోయిన మాంత్రికుడు పనిచేసుకుని హాయిగా బ్రతక సాగాడు.
జంజం కోదండ రామయ్య
--(())--
02. తల్లి రుణం గురించి ఓ చిన్న కధ
***********
ఓ గురువుగారు తన శిష్య గణంతో గురు బోధనలు చేస్తూ ఓ ఊరు చేరాడు,
ఊరి జనం అంతా తండోపతండాలుగా వచ్చి గురువు గారు చెప్పే బోధనలు వింటూ ఆయనకు సపర్యలు చేయసాగారు,
గురువు గారి గురించి ఊరంతా గొప్పగా చెబుతుంటే అది విన్న శ్రవణుడు తనూ వెళ్ళి గురువు గారిని కలిసాడు,
అప్పుడు గురువు గారు కన్నతల్లి యొక్క గొప్పతనం గురించి బోధ చేస్తున్నారు, అప్పుడు
శ్రవణుడు లేచి "స్వామీ! నాదోక సంశయం "అన్నాడు
గురువు గారు ఏమిటి నాయనా ? అన్నారు, స్వామీ, నేను నా కన్నతల్లి ని నేను చూసుకున్నంత గొప్పగా ఎవరూ చూసుకోలేదని నా అభిప్రాయం, ఇంతవరకు ఆమె కోరికలన్నీ తీర్చాను, ఇప్పటివరకు కూడా కాలు క్రింద పెట్టకుండా నేనే దగ్గరుండి సపర్యలు చేస్తున్నాను, ముందు, ముందు కూడా చేస్తాను, నేను నా తల్లి రుణం తీర్చుకున్నట్టేనా స్వామీ! అనడిగాడు.
అందుకు గురువు గారు శ్రవణుడి తల నిమిరి చిరునవ్వు నవ్వారు,
స్వామీ! మీరు నా ప్రశ్న కు సమాధానం చెప్పనేలేదు, అన్నాడు.
అందుకు ఆ గురువు గారు "వత్సా! నీకు నీ తల్లి మీద ఉన్న ప్రేమ కు సంతోషం, కానీ...... ఇంతవరకు నువ్వు చేనిన సపర్యలన్నీ నీ తల్లి నిను కనడానికి బాధ తట్టుకోలేక వేసిన ఓ కేక కు సమానం కావు.. తల్లి రుణాన్ని కొలవదగ్గ కొలమానం ఇంతవరకు పుట్టలేదు నాయనా "
మాత్రు దేవోభవ !
ఆదిశంకరాచార్యులవారు తన తల్లి గురించి ఈవిధంగా సెలవిచ్చారు...
"ఆస్తాం తావడియం ప్రసూతి సమయే....
దుర్వార శూలవ్యధా"...
అర్ధం...
నాకు జన్మ నిచ్చినప్పుడు అంత నెప్పి ని ఎలా భరించావమ్మా ?
నాపుట్టుక కోసం నీ కళా కాంతులు కోల్పోయావు,
మలినమైన శయ్య పై బాధ తో
వంకర్లు తిరిగిపోయావు,
నీవు మనిషివి కావు, దేవతవు,
మాతా... నీకివే నా ప్రణామాలు..!!!
అవతారపురుషుడైనా ..
ఓ అమ్మకు కొడుకే.. 🙇♂️👏
03. 🐂గోవు పాదాల యందు - పితృదేవతలు ఉంటారు.
🐂కాళ్ళ యందు - సమస్త పర్వతములు ఉంటాయి.
🐂భ్రూమధ్యమున - గంధర్వులు ఉంటారు.
🐂గోవు దంతముల యందు - గణపతి ఉంటాడు.
🐂ముక్కున - శివుడు ఉంటాడు.
🐂ముఖమున - జ్యేష్ఠాదేవి ఉంటుంది.
🐂కళ్ళయందు - సూర్యుడు ఉంటాడు.
🐂గోవు చెవుల యందు - శంఖు చక్రములు ఉంటాయి.
🐂కంఠమునందు - విష్ణుమూర్తి ఉంటాడు.
🐂భుజమున - సరస్వతి ఉంటుంది.
🐂రొమ్మున - నవ గ్రహములు కొలువై ఉంటాయి.
🐂వెన్నులో - వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు.
🐂తోక యందు - చంద్రుడు ఉంటాడు.
🐂చర్మమున - ప్రజాపతి ఉంటారు.
🐂గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు.
🌹🐂అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది🐂
04. : అప్పులు అయ్యేలా *ఖర్చుచేయకండి*
పాపమయ్యేలా *సంపాదించకండి*
అజీర్తి అయ్యేలా *తినకండి*
మనస్పర్ధలొచ్చేలా*మాట్లాడకండి*
ఆలస్యమయ్యేలా *నడవకండి*
ఆలస్యం చేస్తూ *కాలాన్ని నిందించకండి*🤫
అర్థం చేసుకోకుండా *అవమానపర్చకండి*😌
నాదే లోకం అనుకోకుండా *ప్రపంచాన్ని చూడండి*
ద్వేషాన్ని వదిలేసి *ప్రేమను ఆహ్వానించండి*
ఇతరులు తక్కువ అనకుండా *మనమే తక్కువ చేసుకోండి*
కోపంగా 10 మాటలు కాదు *ప్రేమగా ఒక్క మాట చాలు*🤝
ముందు ఎంతున్నది కాదు *వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి* 👌
ఎంత సీనియారిటి అన్నది కాదు *ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం*
ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు *ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం*👍
ఏమి సాధించామన్నది కాదు *ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం*
ఎంత మంది స్నేహితు లన్నది కాదు *ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం*
శుభోదయం నా ఆత్మబంధులకు....
05. : అప్పగింతల పాట లిరిక్స్..
పల్లవి..
కళ్ళెత్తి సూటిగా చూడబోకమ్మా..
పన్నెత్తి గట్టిగా మాట్లాడకమ్మా..
చరణం..1
పొరుగిళ్ల వారితో పొరబోకమ్మా..
నలుగురి నోళ్ళలో నానబోకమ్మా..
నీ ఇంటి మర్యాద మరచిబోకమ్మా..
చరణం..2
మమతలెఱిఁగిన మనసు మార్చుకోకమ్మా..
నీ నోట పరుషాలు పలుకబోకమ్మా..
నీ బాట ముళ్లయిన సాగిపోవమ్మా..
చరణం..3
నీ అత్తమామలను ఆదరించమ్మా..
నీ ఆడబడుచులను అలరించవమ్మా..
నీ బావలను నీవు గౌరవించమ్మా..
నీ తోడికోడళ్ల శాసించకమ్మా..
చరణం..4
నీ దయాశాంతులు వీడకేఅమ్మా..
నీ ఇల్లు కోవెలగా భావించవమ్మా..
నీ పిల్లపాపలతో శోభిల్లవమ్మా..
నిత్యసౌభాగ్యాలతో జీవించవమ్మా..
రచన..అన్నాప్రగడ
గానం..నిభానుపూడి శ్రీవాణి.
ప్రియమైన Fb మిత్రులకు సాంప్రదాయ గీతాల సేకరణలో భాగంగా ఈ"అప్పగింతలు"పాట మీకు అందజేస్తున్నాను. శ్రీమతి
05. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భాగవతం - 88 వ భాగం చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం దశమ స్కందము శ్రీకృష్ణ లీలలు - 17
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
ధేనుకాసుర వధ:
ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.
మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగేరోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు.
కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా, ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్యా, మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ, అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.
కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు.
‘బాలరామా, ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు పెద్దపెద్ద తాటిపళ్ళు ఉన్నాయి. అవి ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో వున్న రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా ఆ తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే యిది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతలా వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి వాళ్ళు అన్నారు – మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉంది. బలరామా, మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్డమును కల్పించవా’ అని అడిగారు.
అపుడు బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు. బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్దాభాసురుడు చూశాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరు తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అపుడు బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇంకొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.
పుట్టుకతో మీ అంతటమీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడి చెట్టు తినదు.
నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు.
ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవు దగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు.
ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే.
పశువులు, పక్షులు, చెట్లు అన్నీ యితరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేతకాదు. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపో…
--(())--
06. శిష్టపరిపాలక గోవిందా :
🌹శిష్టులు అంటే మంచివారు. మంచి వారికి కష్టాలు వచ్చినపుడు గోవిందనామ స్మరణ చేస్తే వారి కష్టాలు తొలగిస్తాడు.
🌹 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం!
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే..
ఉ|| ప్రహ్లాద, సతీ సక్కుబాయి.
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 37 🕉
నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే
కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు.
🌹దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు.
🌹ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనా
ర్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు.
🌹వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవైపునకు రావలయును కదా...కాని అట్లు వచ్చుటలేదు.
🙏 ఓం నమః శివాయ 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
07.
మహాకవి కాళిదాసు
మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట
మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె
దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....
గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు? 'అంటుంది....
కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని అంటాడు....
ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’ అంటుంది....
కాళిదాసు కాసేపు ఆలోచించి "నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకుంటాడు..
"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.
ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....
అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....
తెల్ల ముఖం పెట్టి మాతా! "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....
వాళ్ళు సూర్యచంద్రులు’ అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....
కాళిదాసు దీనంగా "నేను అతిథిని" అని బదులిస్తాడు....
"మీరు
మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఒకటి ధనం, రెండోది
యవ్వనం అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు" అంటుంది ముసలావిడ...
కాళిదాసు "నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి" అని వేడుకుంటాడు....
"ఈ
ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం
వేసిన కాళీదాసుతో "ఒకటి భూమి, రెండోది వృక్షం" అని భోద పరచి" ఇప్పుడు నిజం
చెప్పండి మీరెవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఓపిక నశించిన కాళిదాసు "నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి" అని సాగిల పడతాడు....
ఆ
అవ్వ నవ్వుతూ" ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ
రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం
చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే
పండితుడు" అని అంటుంది....
ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....
ఆ
అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.* ‘నాయనా! విద్యతో వినయం వృద్ధి
చెందాలి, అహంకారం కాదు. కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి
చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.
--(())--
బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు.
వరం కోసం తొందర పడిన "ఆకాశం" అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు
బ్రహ్మ.
ఆకాశం మీద కూర్చునే వరాన్ని "సూర్యుడు" కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.
వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన "జలం" మేఘాల రూపంలో మారి... ఆకాశం మీద
పెత్తనం చలాయిస్తూనే.. కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.
పై ముగ్గురినీ జయించే శక్తిని "వాయువు" కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం....
సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.
చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి పై నలుగురూ నాకు సేవచేయాలని కోరడంతో
బ్రహ్మ అనుగ్రహించాడు.
అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.
వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.
సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి ..
మిగతా భూతాలు సేవకులయ్యాయి.
సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు.
సహనానికి ప్రతిరూపం స్త్రీ🌹
అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతి- రూపంగా చెప్పారు పెద్దలు.
సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం.
బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.
కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.
🌹సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది.
--(())--
గారెల రాజ్యంలో... పులిహోర పురం రాజధానిగా.... దద్దోజనం చక్రవర్తి..చక్రపొంగలి రాణితో...
మలై కాజా మహా మంత్రి సలహాలతో...సమోసా సైన్యధిపతిగా పరిపాలిస్తుండగా...అతడి తమ్ముడు అప్పాలు...
వంకాయ బజ్జీ వంకర మాటలువిని...వేడి వేడి పకోడీల్లా వేరుపడి...కుడుముల రాజ్యం చేసుకుని...
రవ్వ లడ్డు రాజధానిగా...మిరపకాయ బజ్జీ మంత్రిగా...సేమ్యాపాయసం సేనానిగా... రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి,నీరుల్లి వడలా వగ పడ్డాడు..మడత కాజా లెవల్లోని లేఖకునితో...అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి...
కలాకండతో కబురంపాడు...లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని..మిర్ఛి బజ్జీ బండిలో..తీపి గారెల కబుర్లు వింటూ...
కలాకండ వెళుతుండగా...ఇది వేసవి కాలం కావటాన వేరుశనగ ఉండల్లా వడదెబ్బతగిలి...
పరమాన్నపురంలో...సున్నుండల సలహాతో...ఇడ్లీ ఇంట విశ్రమించి...మినపట్టు మెడికల్ సేవలతో...
మొక్క జొన్న వడల మందేసుకుని...టమాట జామ్ తో సేదతీరి..పాయసం ఫలహారం చేసి...
మసాలా పకోడితో మంచం దిగి... బ్రెడ్ హల్వా బండిలో...కరివేప వడ కళ్ళెం పట్టుకోగా...
పాలకోవా బాట చూపగా...పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది...వెజిటబుల్ వడ వెంట వస్తుండగా...
బర్ఫీ బిగువుతో...సున్ని ఉండల కొండలూ...కజ్జికాయల కోనలూ...పూతరేకుల పర్వతాలూ...
సగ్గుబియ్యపాయస సముద్రాలూ... ఖర్జూరం హల్వా కోనేరునూ..కొబ్బరి పాయసపు కొలనునూ...
జాంగ్రీల జాగీరు నూ దాటుకుని...ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా..బూరెల దొంగలూ...
కట్లెట్ కర్రలతో అడ్డుకోగా...రవ్వ కజ్జి కాయల రక్షకులు...బూందీ లడ్డు బూరలూది...
కాజాల జాగిలాలను రప్పించి...సేమ్యా హల్వా శూలాలతో..బొబ్బట్లు బొబ్బలతో భయపెట్టగా...
తొక్కుడు లడ్డు దొంగలంతా...ఆవడల అరణ్యంలోకి పారిపోయారు...రాజభక్తి గల రవ్వ కేసరి...
వడియాల వేగులూ...బఠానీ వడ బంట్రోతులు..చెర్రి జామ్ చారులూ...కలాకండ కారణం లేని రాక తెల్సుకుని...
అన్నం పరవాన్నం పారించి...ఉల్లిపాయ పకోడి, అరటికాయ బజ్జీలూ దారికడ్డం వేసి..అరిసెలు బండి అడ్డంపెట్టి...
ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి...గవ్వలతో గవదలూడ గొట్టి..పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి...
బాదం కేకుతో బాది... కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి..గులాబ్ జామ్లతో గుచ్చి గుచ్చి..ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి...
పాయసం తో పనిష్ చేసి...బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి..అదిరి పోయే అల్లం, బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి...ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు...చిమ్మిరుండల చారులూ...సజ్జప్పాల సమాచరకులూ...
వెనిల్లా వేగులూ...అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని...బూంది బాబాయ్ పెట్టిన భయంతో...
కొబ్బరి వడలా వణికిపోయి...మిర్ఛి బజ్జీ మైత్రితో...పెసరట్టు దొంగ ప్రేమతో..మైసూరుపాక్ మైత్రితో...
జీళ్ళ జాయింట్లు జారిపోయి...చిలకడ దుంపల లడ్డులా చింతించి...సజ్జ బూరెల్లా స్వాంతనపడి..పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి...ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా... కరుణగల క్యారట్ పాయసపుదేవుని కారుణ్యంతో...మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి...మినప్పిండి అప్పడాల్లా ముసిరిన ఆలోచనలు వదిలి...నువ్వుండల నయ వంచకత్వం...చెగోడీల చెప్పుడు మాటలూ...బీరకాయ బజ్జీ బీరాలూ...జిలేబీల జాడ్యాలూ అంటించినవి వదలుకుని...
అప్పాల్లా ఆగి ఆగి...క్యారట్ కేక్ లా కేకలేసి...ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి..హల్వా లా అరచి అరచి...
బొబ్బట్ల లా బొబ్బలేసి...వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు.పూర్ణం లా పూర్తిగా మారిపోయి...
బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి...బాస్మతి బియ్యపు పరవాన్నంలో... స్పాంజ్ కేక్ తోస్నానం చేసి...సగ్గుబియ్యం వడియంలా శుధ్ధిపడి... బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి..జీడిపప్పు మైసూరుపాక్ లాంటి "అన్నప్రేమ " తల్చుకుని, మైమరచి...ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని..ఉప్మా తో దేవుని ఉపాసించి..పైనాపిల్ కేక్ లా ఫ్రెండ్సును పక్కకు నెట్టి...నకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు...పిండి వడియంలా పరవసించి... అప్పడాల వంటి అన్నను చూడాలని...పకోడి పళ్ళెం పట్టుకుని...బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని...కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని..ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు...స్నేహితుల కోసం సొరకాయ వడియాలు..మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు...ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ...కొలువులోవారి కోసం కొబ్బరి ఉండలు.
సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసంతీసుకుని...అన్నపు పాయసం లాంటి అన్నను చేరి...
కొబ్బరి హల్వా పాయసం వంటి పాదాలు పట్టుకుని..కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా...
అన్న ఆల్మండ్ చాకొలెట్ బార్ లా కౌగలించుకుని...తీపికాజా లాంటి తమ్ముడ్ని...
ఆవడలా ఆలింగనం చేసుకుని...బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి...
బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు...రవ్వ లడ్డు లాంటి వారి లవ్వుకు...
శాండ్ విచ్ వంటి సభికులంతా...ఆవపెట్టిన పనసపొట్టు కూరలా ఆనందించారు
ఏమైనా మన తెలుగు రాష్త్రాల్లో లభించే మన తెలుగు వంటకాలు ని మర్చిపోయుంటే గుర్తుచేయగలరు.
ఈరోజు అమ్మవారి అవతారము బ్రహ్మచారిణికి వందనమ్ము లోక మంతయు సంచారి బ్రహ్మచరిణిమామనసు నందు కలలతో సుస్వరూపి నిత్య మాయింట ఉండేటి సుహాసినివి మా మనసులోన మాత్రిని గాను దేవి
జ్ఞాన విజ్ఞాన ములనేవి నంద చేయు
సర్వ లక్షణా లనుచూపు సర్వ మయవి
సకల సంపద లందించి ఆశ పెంచు
సర్వం ప్రకాశిం పగ చేస్తు ఉన్న దేవి
బ్రహ్మచారిణికి వందనమ్ము
బ్రహ్మచారిణికి వందనమ్ము
శ్రీకరమ్ముమై శబ్దము మాకు చూపు
వాక్కు చాతుర్యమును పెంచు దేవి లక్ష్మి
సత్వ గుణ తమో రజో గుణాలు నుంచి
మాతృ శబ్దముచేయుచు సత్య దేవి
పంచిన బ్రహ్మచారిణికి వందనమ్ము
బ్రహ్మచారిణికి వందనమ్ము
రక్షణలుగ శ్రీచక్రము తిరుగు చుండి
సర్వులకుసహ నమునిస్వా ర్దమును పంచి
సకల లోకరక్షణకును సహకరించి
దు:ఖమును మాపి సంతసమ్ము లను పంచు
బ్రహ్మచారిణికి వందనమ్ము
బ్రహ్మచారిణికి వందనమ్ము
లోకానికి బ్రహ్మచారిణి
మా కలల స్వరూపిణి
మా యింట నివాసిని
మా మనసుకు మాత్రిని
బ్రహ్మచారిణికి వందనమ్ము
బ్రహ్మచారిణికి వందనమ్ము
--((***))--
ఓం శ్రీ రాం
ReplyDelete