Saturday, 26 December 2020

29-12-2020


ఉపవాసం

ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరీరానికి నూనె ఎందుకు రాసుకోరాదు?* 🌻

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిసున్న రోజులలో తలకు

మరియు దేహానికి నూనె రాసి స్నానం చేయకూడదు

నూనెను అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి వుంది

శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది. 

ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది 

కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. 

తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

--(())--


☘️ *తులసి మొక్క ప్రాధాన్యత* ☘️

తులసి మాత

🍃🌹భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

🍃🌹అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

🍃🌹మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియనివి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

🍃🌹మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

🍃🌹కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచి పెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

🍃🌹తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

🍃🌹అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

🍃🌹తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

🍃🌹తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

🍃🌹తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

🍃🌹తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

🍃🌹ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

🍃🌹తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

🍃🌹అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

🍃🌹తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

🍃🌹అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

🍃🌹మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

🍃🌹తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

     *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 90 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 20*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*గోపికా వస్త్రాపహరణం:* 

భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో *గోపికా వస్త్రాపహరణ ఘట్టము* పరమ ప్రామాణికమయినది. 

ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. 

బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. 

ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడయిన వరుడు ఒక యింట్లో ఉన్నాడనుకోండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడైనా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చేయరు. కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. 

ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో ఒక వ్రతము చేశారు. యథార్థమునకు *భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం.* వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. 

*కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు.*  పార్వతీదేవిని ఉపాసన చేశారు. 

కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ పార్వతీదేవిని ఉపాసన చేస్తే, కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? 

ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. 

*శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి వీరు భార్యాభర్తలు కాదు. అన్నాచెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు.* 

గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు. 

*కాత్యాయని మహామాయే మహాయోగి న్యధీశ్వరీ* 

*నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమ!!*

*కం.*

*ఓ కాత్యాయనీ భగవతి*

*నీకున్ మ్రొక్కెదము మేము నెడనుకంపన్*

*మాకిందఱకున్ వైళామ*

*శ్రీకృష్ణుడు మగడుగాగ జేయుము తల్లీ!*

అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా! నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. 

ఆ వ్రతమును ముప్పది రోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునా నదీ తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కదంబవృక్షం, కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది. అమ్మవారికి *‘కదంబ వనవాసిని’* అని పేరు. 

అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. 

ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకున్నారు. 

ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. 

కానీ వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంత సేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. 

ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. కానీ యిక్కడ ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుంది అని మనకి అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇప్పడు ఇక్కడ అంతటా వున్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును యివ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు. 

కృష్ణుడు గోపాల బాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపొండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రముల నన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇపుడు స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు అన్నారు 

*కొంటివి మా హృదయంబులు;*

*గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్*

*గొంటి; వికనెట్లు చేసెదొ;* 

*కొంటెవు గద!నిన్ను నెరిఁగికొంటిమి కృష్ణా!!*

ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా యివి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. కాబట్టి మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.

                   ‌‌‌‌‌‌           (ఇంకాఉంది)


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


**  (సశేషం.....)

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 91 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 21*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


*గోపికా వస్త్రాపహరణం:* 


గోపకాంతల వస్త్రములనన్నిటిని పట్టుకుని కడిమి చెట్డు ఎక్కి కూర్చున్నాడు కృష్ణుడు. ఇపుడు స్త్రీలందరూ నీళ్ళల్లో ఉన్నారు.  ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా యివి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. కాబట్టి మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడి నుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.


'మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా! ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనస్సులను హరించాడని తెలుస్తోంది. వాడిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. 


వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది. 


ఆయన అన్నారు – నిజంగా మీరు నా యింటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటి నుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు. 


ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అటువంటి స్త్రీ తానుచేసిన ప్రతి పనిలో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.  ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి.


“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోనున్న వాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల వున్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రదులై ఉన్నారు.  వ్రతమును చేయగలుగుతున్నారు.  మీరు నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు. వ్రతం చేస్తున్నారు. కానీ ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము కానీ ఫలితం రాలేదని అంటారు. 


ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రత ఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. 


30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రత భంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. అపుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. అపుడు నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. 


వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.


భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్త్రుత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? 


ఒకటి అయిపోవాలి అంటే రెండుగా వున్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు. 


ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటె కృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి వుందాము అనుకున్నారు. 


మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గజగజ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని తర్జనభర్జనలు చేస్తున్నారు. 


అప్పుడు అందులో ఒక గోపిక అంది – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాము. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేస్తాను. మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్న దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాము అంది. 


మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితం రాదు. 


క్రతువులో దోషం జరుగుతోంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి వుంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు వున్న దోషమును విరుస్తుంది. 


అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు. 


ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. 


‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు యిచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు యిస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పొతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. 


ఉన్నది ఒక్కడే. కానీ స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది. 


ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. 


చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనునది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటే, మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు. మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు. 


‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో. కాత్యాయనీ వ్రత ఘట్టంలో యిన్ని రహస్యములు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల. 


యీలీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ మీ మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. అలా కాకుండా నామము అర్థం తెలియకపోయినా, అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మీరు నామము స్మరిస్తూ పూజచేసినా, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాశము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు. 

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమయి పోతావు. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.



          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

 *శ్రీ భాగవతం - 93 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 23*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*శ్రీకృష్ణుని_రాసలీల*

రాసలీలా ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా వుంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలైన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. 

కాని రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.

శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునా నదీ సైకతమునందు ఒడ్డున నిలబడి ఆయన వేణునాదం చేశారు. 

ఆవేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు. గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక యింట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. 

ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన ఆ వంశీరవము వినబడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై యిక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. 

మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. 

కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు. 

వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా, మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?” అని అడిగారు. 

ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. 

అపుడు శుకబ్రహ్మ,  ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు. 

రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా యిదే మాట చెప్పాడు. 

యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? 

సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమునా. యమునా ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నాము అని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. అది ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాల స్వరూపమయి ఉన్నాడు.  యమున కాలప్రవాహమునకు గుర్తు. 

ఇప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావన యందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయన యందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. 

ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? 

అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. అటువంటి సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, 

ఏవి నిరంతరమూ కృష్ణా అను భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.


శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో, ఉండదు. 

మరి కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? 

వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి నేను పరుగెడతాను అని పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. 

కానీ యిక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా?వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? 

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. 

వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినది అని చెప్పారు. అనంగవర్ధనము అనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేశారు. కృష్ణుడు వేయలేదు. ఆయన వేశారు. 

అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినది. ఇది బాహ్యార్థము. 

రాసలీల అనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా ఇపుడు అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. 

జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది. 

ఆత్మోన్ముఖులు అయ్యారు అని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. కానీ శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే పరమాత్మ. కాబట్టి ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త. జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.

*పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ఁ శాశ్వతగ్ఁ శివమచ్యుతం’*

వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. కాబట్టి ఇపుడు స్త్రీయా? పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు. మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది.  అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. అనగా వారికి అనంగవర్ధనం అయినది. 

పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మ సుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధుర భక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. 

ఇక్కడ వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. 

మీకు అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట. 

కాబట్టి రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. 

ఇపుడు గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. *“ఎవరు నీ పాదములు పట్టుకుండున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది”* అన్నారు.

అపుడు కృష్ణ పరమాత్మ అన్నారు – *‘అలా మీరు రానూకూడదు. నన్ను అడుగనూకూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు. అది చాలా తప్పు. మీరు అందరూ యింటికి వెళ్ళిపోవాలి”* అన్నారు. 

వాళ్ళు అన్నారు, *“ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా, నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు. మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది”* అని అన్నారు.

వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు. వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. 

*రాసలీల* పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు. సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.

*అంగనామంగనామంతరే మాధవో* 

*మాధవం మాధవం చాంతరేణాంగనా ||*

*ఇతథి మాకల్పితే మండలేమధగః* *సంజగౌ వేణునా దేవకీ నందనః ||*

గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. 

మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపల ఉన్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగి పోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాధియందు లోపల వున్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. ఇప్పుడు తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. 

అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.

యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. 

ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. 

*‘నేను ఆత్మ దర్శనమును పొందాను’* అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ *‘నేను ఎక్కడి నుండి వచ్చింది”* ఆత్మగా ఉన్నాను అనాలి. *నేను* అనుకుంటే మరల జరుగు మెట్లు ఎక్కినట్లే లెక్క. అప్పుడు వారందరూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. 

అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.


*నల్లని వాఁడు పద్మ నయనంబుల వాఁడు గృపా రసంబు పైఁ*

*జల్లెడు వాఁడు మౌళిపరిసర్పిత పింఛము వాఁడు నవ్వు రా*

*జిల్లెడు మోము వాఁడొకడు చెల్వల మానధనంబుఁ దెచ్చెనో!* 

*మల్లియలార! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే!!*

వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే *రాసలీల* . అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని యిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని *రాసలీల* అని పిలుస్తారు.

రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడు?” అని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. 

అపుడు శుకుడు, “ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినా ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. 


*అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అందువలన అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు యిచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అల నీవు భావించగలిగితే రాసలీల నీకు ఏమి యిబ్బంది?”*

అని అడిగాడు. 

ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. కాబట్టి ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను. అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది” అని చెప్పాడు. 

కాబట్టి ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏


🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

🌸02.....మహాభారతంలో_విదురుని_నీతులు :*🌸 


ఒక సమయంలో ధృతరాష్ట్రుడు విదురుని తో "నా మనసు అశాంతి తో కుమిలిపోతున్నది... అమృతం వంటి నీ మాటలతో నా హృదయానికి శాంతి కలిగించు" అంటాడు..

" మహారాజా..!మీకు నిద్ర పట్టలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. బలవంతునితో విరోధం తెచ్చుకొన్న బలహీనునికి, ధనం పోగొట్టుకొన్న వానికి, దొంగతనం చేయడానికి ఎటుపోవాలని ఆలోచించే వానికి, కామాసక్తి గలవానికి..... ఈ నలుగురికి నిద్ర పట్టక అశాంతితో కుమిలి పోతుంటారు.... ఈ గుణాలేవీ మీలో లేవనుకొంటాను...! మీరు ఇతరుల సొత్తు అపహరింపదలచారా...? నిద్రరాక కుమిలి పోవడానికి...? నిజమైన కారణమేమిటో చెప్పండి..? అని అడిగాడు.

విదురా..! ధర్మరాజు సంజయునితో ఏమి చెప్పి పంపాడో తెలియక మనసు వికలంగా ఉంది... నాలుగు మంచి మాటలతో నాకు మనశ్శాంతి కలిగించు అని ధృతరాష్ట్రుడు అన్నాడు..

 "మహారాజా..! లోకులు నిందించే పనులేవీ చేయరాదు... పరుల సంపదలను చూసి అసూయ పడరాదు... అందరితోనూ మంచిగా ఉండాలి...  కోపం, పొగడ్తలకు ఉబ్బిపోవడం, గర్వం, అసంతృప్తి, అహంకారం, ఏ పనీ చేయకపోవడం..... ఈ ఆరూ చెడ్డవారి లక్షణాలు.

👉🏻ధనం, విద్య, వంశం అనేవి దుర్మార్గులకు గర్వం కలిగిస్తాయి. మంచివారికి అణకువ, వినయం కలిగిస్తాయి.నేర్పరియైన విలుకాని వాడి బాణం ఎవరికీ తగలకుండా వ్యర్థం కాదు. సమర్థుడైన వాని నీతిమార్గం శత్రురాజును, అతని రాజ్యాన్ని నాశనం చేస్తాయి.

👉🏻తీపి పదార్థాలను ఒకరికి ఇవ్వకుండా తినరాదు. అందరూ నిద్రిస్తున్నప్పుడు తానొక్కడే మేల్కొని ఉండరాదు. ఏ సమస్యనూ ఒంటరిగా నిర్ణయించరాదు. సత్ప్రవర్తనమనే సముద్రం పై ఎట్టి ప్రమాదం లేకుండా ప్రయాణం చేయడానికి సత్యమనే నావకు మించిన సాధనం లేదు.

👉🏻ఓరిమి గలవారిని చూసి లోకులు అశక్తులు అనుకొంటారు. ఓరిమి ఉత్తములకు అలంకారము. ! పరుష వాక్యం పలుకక పోవడం వల్ల, పాప కార్యాలు చేయక పోవడంవల్ల, మనిషి మంచివాడు అనిపించుకొంటాడు. 

👉🏻ఇతరులు తనకు అపకారం చేసినప్పుడు వారికి కీడు చేయగల శక్తి ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించే వారినీ, బీదరికంలో ఉన్నప్పటికీ తనకున్న దానిలోనే అడిగిన వారికిచ్చి సంతోష పరచే వారినీ పుణ్య పురుషులు అంటారు పెద్దలు... న్యాయంగా సంపాధించిన ధనంతో నిజంగా అవసరమున్న వారికి సహాయం చేయడం మంచిది.

👉🏻స్త్రీ వ్యామోహం, జూదం, మద్యపానం, వేట, కఠినంగా మాట్లాడడం, కఠినంగా దండించడం, ధనాన్ని దుబారాగా ఖర్చు పెట్టడం మంచి వారికి కూడని పనులు.

👉🏻తనకు తగిన వేషం దరించడం, తనను తాను పొగడుకొనకుండుట, తనను బాధించిన వారికి కూడా కీడును కోరకుండుట, ఒకరికిచ్చిన దానిని గురించి బాధపడకుండుట  ఎన్ని కష్టాలోచ్చినా నీతిమార్గం వదలకుండుట మంచివారి లక్షణాలు." అని విదురుడు ఉపదేశించాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

03... పాలు చేసిన తపస్సు  ..

(ఒక చిన్న కథ)

ఒకసారి "పాలు" తపస్సు చేసిందట - దేవుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అన్నాడట -

అప్పుడు "పాలు" ఇలా చెప్పిందట. దేవుడా నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగానే ఉంటాను.  అయితే ఈ పాపిష్టి మానవుడు నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు.

అప్పుడు దేవుడు ఓ నవ్వు నవ్వి "ఓ పాలు" ఇది విను నీవు "పాలలా" జీవించాలి అని ఆశ పడే ముందు ఈ మాటలు విను నీవు

పాలలాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు 

పాలకు పెరుగు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు 

పెరుగుని చిలికితే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు 

మజ్జిగ లోంచి వచ్చిన వెన్న అయితే వారాలు వారాలు అయినా ఏమీ కాదు. 

వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో  చాలా రోజులు ఉంటావు. అలాగే మందులకు వాడుతారు,

ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు....

ఇప్పుడు చెప్పు 

ఒకరోజు పాలగా ఉండి "పాలలాగానే" చస్తావా లేక 

క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా అని దేవుడు ప్రశ్నించాడు....

దేవుని మాటకి "పాలు" మూగవోయింది, దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది.  దేవుని ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది..

*******

04.....జై వాసవి,

#ఇంట్లో_ఎవరైనా_మరణిస్తే_ఏడాది_వరకు_పూజలు_చేయకూడదా.....?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి.. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు.. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు.., దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు.. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు..

 అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభ స్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు... అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు.. 

నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్య ప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు... మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు..  కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే,సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయ దర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా... కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి.

 ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు...

ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనడం కంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుంది.!!

హిందూ సనాతన సంప్రదాయాల పాటించండి -- గౌరవించండి..

సర్వేజనా సుఖినోభవంతు...🙏

🌷🌷🌷🌷🌷🌷

05...

ఫ్రెండ్సు నేను శివయ్య ను ఎప్పుడు ఒకటే కోరుకుంటా నాకు కోపమైనా భాదైనా వచ్చినప్పుడు

నా కళ్ళనుండి ఎంతైనా కన్నీరు రానివ్వు పర్లేదు 

కానీ నా నోటి నుండి మాట రానివ్వకు

 నామనసుకి పంతం పట్టింపులు రానివ్వకయ్య అనీ.

ఫ్రెండ్స్ ఎందుకలా అంటారేమో ఇక్కడ ఎన్నాళ్లు ఉంటామో ఎవరికి ఎరుక

రాత రాసిన పరమాత్మకే ఎరుక. అలాంటప్పుడు ఉన్నన్నాళ్లు మన అనే వాళ్ళతో ఆనందంగా ఉండక పంతాలు పట్టింపులు బాధపెట్టుకోంటలు అవసరమా చెప్పండి.

ఇప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్స్  చుట్టాలు ఇంకా అన్ని బంధలు ఏ జన్మ బంధల్లో ఎవరికీ ఎరుక ఏదో జన్మలో మనం కోరుకుంటేనే ఈ జన్మలో బంధాలు ఏర్పడతాయి. లేదా మనిషిని చూసినా మాట్లాడినా మన అనీ హృదయం స్పంధీస్తుంది. ఇక్కడ ఇంకో మాట తిగారి తిగారి స్పందన కాదు ఆ స్పందన స్వచ్ఛమైనది పవిత్రమైనది హృదయానికి సంబంధించినది.

కన్నీళ్లు ఎందుకు అంటారేమో.

కన్నీటితో నాలో కలిగిన బాధ కోపం కొంతసేపటికి  పోతుంది కానీ మాట జారితే వారికి బాధ కలుగుతుంది.నాకు ఎంత భాదైనా కోపమైనా తట్టుకునే శక్తి వరం గా నా తండ్రి శివయ్య ఇచ్చాడు

కానీ ఎదుటి వారికి ఆ శక్తి ఉందో లేదో తెలియదు కదా. అందుకే వద్దు తండ్రి వద్దు ఎవరినీ బాధ పెట్టే పరిస్థితి కల్పించకు అనీ ప్రతి నిమిషం కోరుకుంటా.నిజం గా నేను తెలిసి ఎవరిని బాధపెట్టలేదు ఒకవేళ తెలియకుండా బాధపెట్టాను అనీ అనిపిస్తే వేంటనే సారీ చేప్తాను క్షమించమ్మని అడుగుతను.అసలు అందరం ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని

నా ఆభిప్రాయం.🙏


ఒక జీవుడు ఊహ చెబుతాను చదవండి 🙏

ఉదయం 6 గంటల సమయం.......ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం

చేస్తున్నాను. కానీ......లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి......

" ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? " ఒక్క నిమిషం ఆలోచించాను.

నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత

నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు

తెలియదు.....

కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.

ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా

ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దేవుడా!

నేను చనిపోయానా?

బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా

పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి

నా పక్కగదిలోకి తొంగి చూశాను.... నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.

కొడుకును పట్టుకుని.......భార్యను పిలిచాను........తనకు నా మాటలు

వినిపించలేదు........మరో గదిలోకి వెళ్ళి చూశాను......

ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు

దు;ఖంలో.......

" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.......ఎవ్వరూ నన్ను

చూడటం లేదు..

బయటికి పరుగెత్తి వచ్చాను.......అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా

ఏడుస్తున్నాడు.....వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.......

నా స్నేహితునితో నాకు గొడవవచ్చి...........వాడితో సంవత్సరం నుండి నేను

మాట్లాడ్టం మానేశాను.......ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి

వాడెందుకు ఏడుస్తున్నాడు.........అవును నేను చనిపోయాను......నిజంగానే

చనిపోయాను.

దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని

ఇవ్వు.....ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా

ప్రేమగా చూసుకోలేకపోయాను.....నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..

నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను........

నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను......నేను వచ్చేలోగానే నాబిడ్డ నిద్రపోయేవాడు......

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాను.

చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని

వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను." అని బి్గ్గారగా

ఏడుస్తున్నాను......." దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు......నా తల్లి మొహంలో నవ్వును చూడాలి.........నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు

ప్రాణబిక్ష పెట్టు స్వామీ! అని బిగ్గరగా అరుస్తూ  దేవుడిని బతిమిలాడుతున్న.

ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు......కళ్ళు తెరిచి చూశాను.

నా భార్య......" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.

ఏమైంది మీకు ?" అని అడుగుతోంది.

అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.

నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నాభార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి

" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని.....నీలాంటి అమ్మాయి నాకు

భార్యగా దొరకడం......నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను......ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,


చూసేరా ఫ్రెండ్స్  మీకు నాకు  ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇకనైనా ఈగోలను

పక్కనపెట్టి మన కుటుంబాన్ని మన అనుకున్న వాళ్ళను ఆప్యాయంగా స్వచ్ఛంగా ప్రేమిద్దాం .

అన్నీ పోగొట్టుకున్న తర్వాత

బాధపడి ఏమీ లాభం లేదు......కుటుంబంతో గడుపుదాం స్నేహితులతో

మంచిగా ప్రవర్తించూదాం  ఈ జన్మ దేవుడిచ్చినది......ఆనందంగా

జీవించి ఎందరికో ఆదర్శంగా నిలుద్దాం

ఆదర్శంగా నిలవాక పోయిన  కనీసం మన కుటుంబమైనా మన వల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మనమే.  ఎంతకాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా ఎందరి మనసులకు సంతోషం కలిగించాం అన్నది ముఖ్యం అని నా అభిప్రాయం.

06...హరిఓం   ,                🙏

ఒకసారి ఒక ఊరినుండి ఊరి పెద్దమనుషులు పరమాచార్య స్వామివారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు. వాళ్ల ఊరిలో ని వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కొసం మీ దగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు.

మహాస్వామి వారు “మీ ఊళ్ళో చెరువు ఉందా?” అని అడిగారు.

“అవును ఉంది పెరియవ”

“అందులో నీళ్ళు ఉన్నాయా?”

వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని “గ్రామ పంచాయితి శుభ్రం చెయ్యనందున నీళ్ళు కొన్ని మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

“చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకూ పశువులకూ ఉపయోగమే కదా?” ”అవును పెరియవ”

“సరే ముందు మీరు చెరువులో పూడిక తీసి, బాగా నీరు నిలువ ఉండేటట్టు చెయ్యండి” అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్టుగా వారికి ప్రసాదమును ఇచ్చారు. వచ్చినవారు చాలా నిరాశపడి, విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది కానీ  మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమి మాట్లాడలేదు అని అనుకున్నారు. 

చెరువు పూడిక తీయటం ప్రభుత్వం చేయవలసిన పని. అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు. కానీ  కొంతమంది పెద్దలు “మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే. వారి మాటలను నిరాకరించి లేని పోని బాధలను ఎందుకు తెచ్చుకోవటం” అని అన్నారు. 

మనము ఏమి చేయలేము. ఇదంతా మనము చేసుకున్నదే. దీన్ని వాయిదా వెయ్యటంకంటే ఇప్పుడు చేసెయ్యడమే మంచిది అని తీర్మానించుకున్నారు.

ఒక రోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయులు అందరూ కలిసి పలుగు పార పట్టుకుని చెరువు పూడిక తీసే పని ప్రారంభించారు. కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిని కొట్టగా “టంగ్” మన్న శబ్ధం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం (పోయిన విగ్రహం కాదు). మరి కొద్దిసేపటి తరువాత మళ్ళా “టంగ్” మన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తరువాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం మొత్తంగా శివ పరివారమే లభించింది. 

అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు. ”మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము. కానీ  మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది” అని వారి ఆనందానికి అవధులు లేవు.

“చెరువు ప్రక్కన ఒక కొట్టం వేసి, ఆ విగ్రాహాలను అక్కడ ఉంచి దీపారధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి“ అని మహాస్వామి వారు చెప్పారు.

“మరి దేవాలయం?” అడిగారు ఊరి పెద్దలు. ”వినాయకుడు వచ్చాడు కదా? ఇంకేం అంతా ఆయనే చూసుకుంటాడు” అన్నారు మహాస్వామి......................             -                        🙏🙏                   -                                                    

 07...పంచ పునీతాలు అంటే ఏమిటి?

*మొదటిది.... వాక్కు శుద్ధి*

వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

*రెండవది….. దేహశుద్ధి:*

మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

*మూడవది…..భాండ శుద్ధి:*

శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

*నాలుగవది…….కర్మశుద్ధి:*

అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.

*ఐదవది……….మనశ్శుద్ధి:*

మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్దీ.

†*******

08....శుభోదయం.

మనం రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జాగృతి, రెండు మౌనము. మనం మేలుకొని ఉంటే ఏదైతే వుందో, దాని అనుభవాన్ని ఇప్పుడే, ఇక్కడే పొందుతాము.  మీరు మౌనంగా ఉంటేనే మెలకువతో వుండగలరు. లేని పక్షంలో మీ ఆలోచనలు మిమ్మల్ని గతంలోకో, భవిష్యత్తులోకో తీసుకుని పోతాయి. 

మారడం కోసం ప్రయత్నం చేయని వాడంటూ ఎవరూ ఉండరు. అయితే తాను ఎక్కడున్నాడో అక్కడ నుంచే మారాలని అనుకుంటాడు. కానీ అది కుదరదు. ఎవరు తాను ఎలావున్నా, తనని తాను స్వీకరించుకోగలడో, అలాంటి వ్యక్తి మాత్రమే మారగలడు.

తామస ప్రవృత్తి కలవారు యజ్ఞాదికలను, రాజస ప్రవృత్తి కలవారు వేదాదులను, సాత్త్విక ప్రవృత్తి కలవారు సద్గురువులను ఎంచుకుంటారు. సద్గురువు లభించే దాకా శాస్త్రం యొక్క అవసరం ఉంటుంది. గురువు లభించాలి అంటే శాస్త్రాన్ని ఎంచుకోవాలి. కర్మకాండని ఎంచుకోకూడదు. శాస్త్రాన్ని అర్ధం చేసుకోవాలి. శాస్త్రమున్నది అర్ధం చేసుకోడానికి, చేయడానికి కాదు. అర్ధం చేసుకోవడం వలన ముక్తి కలుగుతుంది. ఒకవేళ శాస్త్రం కూడా లభించక పోతే, అప్పుడు కర్మకాండ. కర్మకాండ భగవంతుని చివరి ప్రతిధ్వని.

ఒకటే తపస్సు, అది మీరు లేకుండా పోవడం.

ఒకటే యజ్ఞం, అది కూడా మీరు లేకుండా పోవడం.

ఒకటే దానం, మీరు మిమ్మల్ని మీకు దానం చేసుకోవడం.

ఇవన్నీ అయ్యాక ఏది మిగులుతుందో,

కెరటం లేకుండా పోయినప్పుడు, ఏ సముద్రం మిగిలివుంటుందో అదే

ఓం తత్ సత్.

 09...:--* ఈరోజు *మంచి మాటలు 

       నీవు ఎప్పుడైనా ఏమైనా *కోల్పోయినచో* దాని గురించే *ఆలోచిస్తూ* కూర్చుంటే *ఉన్నవాటిని* కూడా కోల్పోవాల్సివస్తుంది . మన  *మిత్రులు* మన *కోర్కెలు* తీర్చలేరేమో కానీ *అవసరాలను* .తప్పక తీరుస్తారు .

        నీవు *ఎక్కువగా* ఎవరిని నమ్మకు *మోసపోతావు* , ఎవరి కోసమూ *ఆలోచించకు* వాళ్ళకే *అలుసైపోతావు* , ఎదుటి వారికి ఎక్కువ *విలువ* ఇవ్వకు నీవు *గౌరవాన్ని* కోల్పోతావు , ఎవరిని *ప్రశ్నించకు శత్రువు* అవుతావు , ముందుగా *నా వాళ్ళు* అని ఆలోచించడం *తగ్గించు* ఎవరి నుంచి ఏం *ఆశించకు* నీ *జీవితం* చాలా బాగుంటుంది .

         మనతో *చనువు* ఎక్కువైతే ఎదుటి వారి నుండి మనకు *చులకన* తప్పదు . ఎదుటి వారు మనకు *దగ్గర* ఎక్కువైతే *దూరం* తప్పదు . మనలో 

*నమ్మకం* ఎక్కువైతే *ద్రోహం* తప్పదు . *ప్రేమ* ఎక్కువైతే *బాధ* తప్పదు . *ఆశ* ఎక్కువైతే 

*దుఃఖం* తప్పదు . ఇదే మన *జీవిత సత్యం* .

        మనల్ని *అర్థం* చేసుకునే 

వారికి మన *రూపంతో* అవసరం లేదు మన *మనస్సుతో* పని . మనల్ని *బాధపెట్టేవారికి* మన *మనస్సుతో* అవసరం లేదు వారి *అవసరంతోనే* పని మన *స్నేహం* కోరేవారికి మన *స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతో* పని మనల్ని *దూరం* పెట్టేవారికి మన *ఆలోచనలతో* అవసరం లేదు వారి  *స్వార్థంతోనే* పని .

     సేకరణ ✒️ *మీ ... ప్రాంజలి ప్రభ


10.. తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.

ఎందుకు ? 

ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 

వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 

టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

        *శ్రీ భాగవతం - 94 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 24*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


*అక్రూరుడు బృందావనముకు ఏతెంచుట*


అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడోనని చాలా ఆందోళనలో ఉన్నాడు. 


ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న నారదుడు వచ్చి,  


‘కంసా! ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు? నేను చెప్పేస్తున్నాను. 


నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారము తలుపులు తెరుచుకుంటే కృష్ణుని యమునానదిని దాటించి నందవ్రజంలో నందుని దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమ గర్భంలో పుట్టాడు’ అని చెప్పాడు. అనగానే,  ‘ముందు ఆ వసుదేవుని చంపేస్తాను అని కత్తి తీశాడు కంసుడు. అపుడు నారదుడు ‘ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోదు. ఎందుకు దేవకీ వసుదేవులను చంపడం’ అన్నాడు.


అపుడు కంసుడు దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. 


తరువాత నారదుడు ఒకమాట చెప్పాడు,  ‘నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యం చెప్తాను విను’ అన్నాడు. 


ఈ విషయమును మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ‘మావంశంలో ఒక మహా పురుషుడు పుట్టాలండీ’ అంటూ ఉంటారు. మహాపురుషుడు పుట్టాలని అనుకున్నవాడు, కావలసిన రీతిలో నడవడిని కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యమును కంసుడితో చెప్తున్నాడు. 


నీవారు నీకు శత్రువులు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడకి భర్త్రు సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనబడే గంధర్వుడు ఇతరుల మనస్సులను కనిపెట్ట గలిగిన వాడు ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనస్సు తెలుసు. నీతల్లి మనస్సును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చిన వాడు తన భర్త కాడేమోనని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తరక్షణం వాడు తన నిజ స్వరూపంతో నిలబడ్డాడు. ఆవిడ ఆగ్రహించింది. 


అపుడు వాడు ‘ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడను, నీవు మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్య కాంతలతో సుఖము అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు.  నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమము కలిగిన వాడు బుద్ధి కలిగినవాడు అయిన కుమారుడు జన్మిస్తాడు’ అని యింకా ఏదో చెప్పబోతున్నాడు. అపుడు ఆవిడ,  ‘పరమ దుర్మార్గుడా! నా మనస్సులో భర్త్రు సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్తరూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకును ఇస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వెయ్యి మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్ప.'


నీవు యిటువంటి దుర్మార్గమయిన పని చేశావు కనుక, అని అంటూ ద్రవిళుడిని శపించబోయింది. తనని శపిస్తుందేమోనని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. అపుడు ఆమె,  ‘నీ వలన నాకు పుట్టబోవు కొడుకు దుర్మార్గుడు అగుగాక! ఋషులను ద్వేషించుగాక! పరమ కిరాతకుడు అగుగాక! వానిని పదికాలముల పాటు రాక్షసునిగా చెప్పుకొనెదరు గాక’ అంది. 


అపుడు వీడు తానుకూడా శాపిస్తేనే ఆవిడ సంతోష పడుతుందని,  ‘అతడు తనవారి చేత తాను ద్వేషింపబడుగాక’ అని అన్నాడు. అందుకని నీవారి చేత నీవు ద్వేషింపబడతావు. నీతల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించింది. ద్రవిళుడు కూడా శపించాడు. అందుకే నీ బ్రతుకు ఇలా అయిపొయింది. అందుకే నీవారు అన్నవారు నిన్ను ద్వేషిస్తారు’ అన్నాడు. 


నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులనందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. ‘వీళ్ళందరూ నన్ను చంపేవాళ్ళే, వీళ్ళని నేను చంపేస్తాను’ అని అక్రూరుని పిలిచాడు. 


‘అక్రూరా! నీకు తెలుసు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. అందుకని నీవు వెంటనే బృందావనం వెళ్ళి కృష్ణుడిని తీసుకురా. నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. చూడడానికి నీవు బయల్దేరి రావలసింది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిష పెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదోరకంగా చంపేస్తాను. మన దగ్గర *కువలయాపీడము* అనే ఏనుగు ఉంది. ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. *చాణూర ముష్టికులు* అనే యిద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్లయుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేను చంపేస్తాను. కాబట్టి బెంగలేదు. ఎలాగయినా సరే మామయ్యా పిలుస్తున్నాడని తీసుకురా’ అన్నాడు. 


అక్రూరుడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతున్నాడు.


మధురానగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అక్రూరుడికి కృష్ణుడి మీద యింత భక్తి ఎలా ఏర్పడింది?


అక్రూరుని తల్లిదండ్రులు గాందిని, శ్వఫల్కుడు. గాందిని తండ్రిగారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునే వాడు. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో మూడువందల అరవై అయిదురోజులు ‘ప్రతిరోజూ నేను ఒక ఆవును దానం చేస్తాను’ అని మూడువందల అరవై అయిదు రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజూ ఒక ఆవు చోపున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాందినికి అక్రూరుడు జన్మించాడు. 


ఈ అక్రూరుడు జన్మతః విశేషముగా కృష్ణ భక్తి కలిగినవాడు. ముందుతరం కాక ఆ ముందుతరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం నుండి యిటువంటి మహాపురుషుడు పుట్టాడు. అక్రూరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుకచేత యింతభక్తి గతంలో చేసిన పుణ్య వలన వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యమును చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడు అని మనకు అక్రూరుని జీవితం తెలియజేస్తుంది. 


అక్రూరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకే నమస్కారమునకు అక్రూరుని చెపుతారు. అలా వెళ్తూ ఒకసారి భూమిమీదకి చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడిన చిన్నిచిన్ని పాదముద్రలు కనిపించాయి. అనగా ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా! అనుకొని ఒక్కసారి రథమును ఆపాడు. ఒళ్ళంతా ఆనందముతో పొంగిపోయింది. కన్నులవెంట భాష్పధారలు కారుతుండగా స్వర్ణదండము రథము నుండి కిందపడిపోతే ఎలా పడిపోతుందో అలా రథమునుండి క్రిందపడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను క్రింద పడ్డాను అనుకుని దోర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటిమీద పోసేసుకుని నందుడు ఉండే యింటి దగ్గరకు వెళ్ళాడు.


ఆవుల మందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్త్వము నందుని యింట్లో పాలు పితుకుతోంది. ‘రాశీభూతమైన పరబ్రహ్మమును నా మాంస నేత్రములతో చూస్తున్నాను. నా జన్మ ధన్యమయిపోయింది’ అనుకుని వెళ్ళి,  కృష్ణుడికి బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ యిద్దరిని చూసి ధన్యత చెందాను’ అన్నాడు.


బలరాముడు అక్రూరుడిని గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు. పాద్యం ఇచ్చాడు. మంచి భోజనం పెట్టాడు. మధుపర్కం ఇచ్చాడు. ఒక గోవును దానం చేశాడు. తాంబూలం ఇచ్చాడు. 


బలరామకృష్ణులు వచ్చి అక్రూరుని ప్రక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడు అవుతాడో చూడండి!


అక్రూరా! మధురలో అందరు కుశలమా! అని అడగబుద్ధి వేయలేదు. ప్రభువు ధూర్తుడయిన చోట క్షేమం ఎక్కడ ఉంటుంది? 


కంసుడు పరిపాలిస్తుండగా మధురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పనిమీద మీరు యింత దూరము వచ్చినారో చెప్పవలసినది’ అన్నారు. 


అపుడు అక్రూరుడు ‘మహానుభావా, మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగము అనే మిషతో మల్లయుద్ధములను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అంతరమునందు కోర్కె వేరు. మీ యిద్దరిని చంపడం కోసం మధుర పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీమీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగా నయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను’ అన్నాడు. 


వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ వున్న పెద్దలను పిలిచి ‘మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలయిన భాండములను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అక్రూరుడితో మధురా నగరమునకు వెడతాము. కంసమామ మమ్మల్ని యాగమునకు పిలిచాడు. వెడతాము’ అన్నారు. 


ఈవార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమయిన అనుబంధం పెంచుకున్నారు. ఇపుడు వారందరి కోపం అక్రూరుడి మీదకు మళ్ళింది. 


ఇతని పేరు అక్రూరుడా! ఇతని పేరు క్రూరుడు. అని కృష్ణుని రథమునకు ఆడ్డుపడ్డారు. దామోదరా! గోవిందా! కేశవా! నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణములు లేని శరీరములులా పడిపోతాము’ అన్నారు. 


పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. 


‘వాళ్ళని ప్రక్కకి తొలగమనండి ఇది నా ఆజ్ఞ. నేను మధురకు బయల్దేరుతున్నాను’ అన్నాడు. పక్కకి తొలిగారు. రథము వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. అక్కడ కంసుని వలన ఏ ప్రమాదము వస్తుందోనని ఆమె బెంగపెట్టుకుని ఉంది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి యిళ్ళకు వచ్చేశారు. 


అలా వెళుతుండగా అక్రూరుడు ఒక చిత్రమయిన పని చేశాడు. రథమును యమునా నది ఒడ్డున ఆపి ‘ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణా’ అన్నాడు.


చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవమును జపించి ఒకసారి ఆ యమునా నది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటిమీద బలరామ కృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి, రథం మీద నుండి దిగి నీటిమీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. అలా కనపడడం ఈశ్వరుని దివ్యశక్తి అనుకుని యమునానదీ స్నానం చేద్దామని మునకవేశాడు. ఎవ్వరికీ ఇవ్వని దర్శనము పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. అంతేకాకుండా అక్రూరుడు యమునలో మునిగేటప్పటికి సనక సనందనాది మహర్షులు మొదలగువారు అందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరము నందు ఆదిశేషుని మీద అలవోకగా పవళించిన ఆదితత్త్వమయిన ఆదినారాయణుని దర్శనమును పొందాడు. 


అపుడు అక్రూరుడు పరమాత్మను అద్భుతమయిన స్తోత్రం చేశాడు. 

మనం అటువంటి మూర్తినే తిరుపతిలోని గోవింద రాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాము. గోవిందరాజస్వామి పెద్ద పాముచుట్ట మీద తలవెనుక పెద్ద సోల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాభికమలము నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటభులనే రాక్షసులతో సహా మనకి దర్శనం యిస్తారు. ఆయన పొట్టమీద అడ్డంగా తులసిమాలలు వ్రేలాడదీయబడి వుండగా కన్నులు మూసుకుని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం యిస్తాడు. అపుడు మనము అక్రూరుని మనసులో తలుచుకుని అక్రూరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్త్వము యిక్కడ కనపడుతోందని గోవింద రాజస్వామిని దర్శించవచ్చు.


అటువంటి దర్శనమును పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరమును చేరుకున్నాడు. కృష్ణుడిని తన యింటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసినదని కోరాడు. 


అపుడు కృష్ణుడు నేను యిప్పుడు రానులే,  రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుని సంహరించిన తరువాత యోగ్యమయిన కాలమునందు వచ్చి, నీయింట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను’ అని మాట యిచ్చి బలరామకృష్ణులు ఊరిబయట పడుకున్నారు. మరునాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేశారు.



          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏



🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏


*నాగ సుబ్బయ్య పైడి*  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

1 comment:

  1. గోపికా వస్త్రాపహరణం కధ బాగున్నది

    ReplyDelete