Sunday, 28 February 2021

01-03-2021

 https://i.pinimg.com/originals/c3/95/0d/c3950db2ce15a4872be2499258c9d6bf.jpg

 


సమ్మోహనాలు ... పాదాలు  1311 ... 1320   
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
 

దేవుడే దిగివచ్చి
వచ్చీ నడిచివచ్చి
వచ్చి వెల్లె పాదాలు గుర్తులు ఈశ్వరా 


అడుగు జాడలు బతుకు
బతుకు వెలుగుల మెతుకు
మెతుకు లేనిదె  జీవితములేదు ఈశ్వరా
 

పాదముద్రలు చూచి
చూచియే గమనించి
గమనించి నడకను సాగించు ను ఈశ్వరా
 

హరి పాదమును పట్టు
పట్టు అదియే మెట్టు
మెట్టు మెట్టు ఎక్కించేది హరి ఈశ్వరా
 

రామ పాదము అడుగు   
అడుగు అదియే గొడుగు
గొడుగు లా రక్ష చేయును అడుగు ఈశ్వరా    
 

జ్ఞాపకాల అడుగులు
అడుగులు జీవితాలు
జీవితాలు అడుగుల్లా మారును ఈశ్వరా
 

మధురానుభూతిగా
అనుభూతి అడుగుగా
అడుగులో అడుగువేసి నడుచుటె ఈశ్వరా
 

ఇసుకలో పాదాలు
పాద లతో గుర్తులు
గుర్తులు శాశ్వితమ్ము కావులే ఐశ్వరా
 

మూడు పాదాల హరి
మూడు కన్నుల శిరి
శిరి నిలకడ ఉంచని పాదాలు ఈశ్వరా
 

మృత్యు పదాలు కదులు
కదలి పొందు శోకాలు
శోకాలు కావు ఋణానుబంధ ఈశ్వరా
--(())--

ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక
నేటి మధురిమలు .. దైవలీలన్నా
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సంసారం పడవన్నా
కెరటంలా కదుల్లన్నా
కదలికల సాగరన్నా
ఉరకలే తప్పఁదన్నా

ప్రకృతి పరిశీలనన్నా  
కలసి తెలుసుకోరన్నా
ప్రేమ కనుమురోరన్నా
చిత్తం మెలగాలన్నా  

మాయ మోసమేరన్నా
జాగర్త పడాలన్నా
తలుకు బెళుకులే రన్నా
నీదనేది లేదన్నా

ముచ్చట్లే వెంటున్నా
దోబూచుల ఆటన్నా
స్వప్నాలతొ పంటన్నా
కాలముమనదేనన్నా

కృషియే చేయాలన్నా
దైవకృపకు నిత్య మన్నా
మోక్షదామం  దొరుకన్నా
బ్రహ్మజ్ఞానమేనన్నా

మానవత్త్వం ఉంచన్నా  
ధర్మంగా ఉండన్నా
ప్రయత్నం చేయాలన్నా
బ్రతికించే కళ లన్నా

నిత్యం ఉండన్నా
మానసంబున అన్నా
సత్ప్రవర్తనతొ అన్నా
సత్ససంకల్ప మన్నా

శుద్ధమై చిత్త మన్నా
ఆత్మగా అవునన్నా
మురికియె లేకుండన్నా
నిర్మలమ్ము ఉంచన్నా

దేవున్నీ  నమ్మన్నా
దేశాన్నీ నమ్మన్నా
పంచకోశమ్ము లన్నా
ఆత్మజ్యోతియే అన్నా

చెంతలోనె ఉండన్నా
మధ్య దూర మొద్దన్నా
వెతుకుట ఆటే లన్నా
హృదయం లో ఉండన్నా

ఆత్మలే జ్యోతిగున్నా
కాలమే వెల్గులన్నా
శాంతమే జీవమన్నా
మోక్షమే దారి అన్నా

--(())--

విదేశ వ్యా మొహం  ... వాస్తవం (కధ)

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   
వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  
అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..
ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.
"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...
అన్నారు"  ముకుందం గారు...
:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...
"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...
ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...
మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...
"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?
సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..
ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....
కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....
ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...
'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...
పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...
కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...
కరుణాకర్ గారి విషయం...
ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...
ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...
కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..
కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...
పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..
ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...
ఇలా అనేక రకాలుగా...
కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...
అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...
చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...
ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...
ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...
మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..
మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...
నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...
మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...
పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం... ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...
పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...
దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...డబ్బుకు చూసుకోలేదు... పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...ఒకటే ధ్యేయం... ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...
మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు.. ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం... ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి... మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు... అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ... వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు.. అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు.. బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది... మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము... రెండో వాడు  ెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...
మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....
మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...
దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...
మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...
అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...
అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం... ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...ఇంకా పండగ మాకు...
కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...
మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...
మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ డేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...
వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...
మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం... వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...
వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో
మేము రిటైర్ అయిపోయాం....
మాకు మనవలు కలిగారు...
మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం... రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...
తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...
కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...
ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్... చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...
కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం.... అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....
కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...
మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...
మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...
మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...
పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...
అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...
మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...
ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...
ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...
నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...
వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....
ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి... నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి... మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...
మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా... వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...
వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...
అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం.. ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....
ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా, వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం.... మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...
వంటమనిషిని పెట్టుకుందామంటే భయం... కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...
మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...
ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ ట్టుకుపోయాడు.అని విన్నాం... సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...
మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...
కానీ ఎంత మాత్రం కాదు...
మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!
మమ్మల్ని ఆనంద పెట్టారు...!
వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!
మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...
మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...
ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...
అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...
అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...
అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...
ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...
మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...
ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...
ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...
మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...
నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...
మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...
మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...
ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...
మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...
మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...
మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...
ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...
మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...
అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...
మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...
అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...
మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...
అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు,
ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....
మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....
పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....
వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...
కామన్ హాల్ లో పెద్ద టీవీ....
ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....
ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....
అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...
ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...
వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...
మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...
మేము ఒక విధంగా అదృష్టవంతులమే...
పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...
కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...
కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...
ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...
US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...
అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...
కనీసం అక్కడ ఉంచితే, రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...
వైద్య సదుపాయం ఉంటుందని....
మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...
వాళ్ళని విమర్శించకండి...
దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...
మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...
మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....
మా మీద జాలి పడకండి...
నమస్తే....
అని ఆయన ఆపేశారు...
కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..
....


ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక (4)
సీతాపతీ పద్యకావ్యము
సీసము

ధనమున్న లేకున్నా దరఖాస్తు లేకున్నా
    మనసున్న  మనిషి లో మమత పెరుగు
వద్దన్న అవునన్న విధ్యతో వినయమ్ము
    విభజన బంధము వద్దె వద్దు
స్నేహము వల్లనే చింతలు తొలగును
    దానము వల్లనే దరిని చేరు
రాముని నమ్మినా రమ్యమైన మనసు
    ఆంజనేయుని నమ్ము ధైర్య మోచ్చు

తల్లి దండ్రియు  నాకు ధరణి లోన  రామ
బ్రాత నాకు,ధరణి జాత విభుడు రామ  
సఖుడు నాకు రామ చంద్రుండు సర్వ మవ్వు  
మరయ రాముండతని నాశ్ర యింతు నేను ...28

*****

సీసము
కష్టముల్ ఇష్టముల్ కావులే శాశ్వతం
      బులు నీటిబుడగలే - బురద పామె
కన్నీళ్లు వేవిళ్లు కలకాల ముండవు
    నవ్వుళ్లు పువ్వుళ్ళు నడచు చుండు
రోగముల్ బంధముల్ రాగముల్ వెళ్లెను
    చీకటి వెల్గులా  చింత మార్చు
ధైర్యమ్ము మరవకు ధర్మమ్ము వదలకు
    దానమ్ము చేయుము ధరణి యందు

తేటగీతి
అమృత పలుకులు పల్కెను ఆదిదేవ
అరమరికలులేని కళలు ఆదు కొనును
అప్పులేని బతుకు జీవి హాయి గాను
దాశరధి ధ్యాన మొనరింతు తప్పకెపుడు .... 29
==))((--

ఏకత్వ మా ...... బహుతత్వమా

ఎక్కడ ఏకత్వం  సంభవిస్తూ వుందో.. బహుశా అక్కడ రెండు (భాహుతత్వం) వుండివుండాలి.   నేనూ నా ఆనందపుస్థితి మరవలేక అక్కడ  'నేను' మాయమై నా ఆనందాన్ని పంచలేక మిగిలి పోగలనో అక్కడ నా బుద్ధి ప్రేమగా వ్యక్తమౌతుంది. అది ఇంకొకరికోసం వెంబర్లాడుతుంది.   
అలాంటి   'నేను' లేని ఏకత్వపు ఆనందస్థితి ఎవ్వరికోసం  ఎంతకాలం కొనసాగుతుందో   
అంతకాలం..ఆ' ప్రేమ' భావనా ఉంటూనే  అనుభూతి నిలిచి వుంటుంది అది ఎంతవరకో అర్ధం కాదు నా భవి షత్తు తెలియదు ప్రేమ చావదు    

ఏకత్వపుస్థితి ప్రేమ అనుకుంటే  నిజానికి అది ఓ విధమైన ధారణ మైనది అది బతక నియ్య నియ్యదు ఓ ప్రవహించే నదిలా..జాలువారే  ఓ  జలపాతంలా..ఓ గులాబీలా..    ఓ ఉషోదయంలా..ఓ పౌర్ణమిలా ఉంటుంది నాలో
ప్రేమకూడా ఓ ప్రవాహం. ఎప్పటి  కప్పుడు నిత్యనూతనం. కనుకనే మరచిపోనిది కనుకనే  
    ప్రేమలోని ఆ సజీవత్వపు అనుభూతి  ఆనందాన్ని ఇస్తుంది.
ఎక్కడ ఏకత్వం  సంభవిస్తూ వుందో.. బహుశా అక్కడ రెండు (భాహుతత్వం) వుండివుండాలి.   
ఓ పువ్వుగానీ,  సూర్యుడిగాని, నీరుగానీ..అలాగే  నిలిచివుంటే ఆ సౌందర్యం అర్ధం చేసుకోవటం తేలిక  వుండదు.  సజీవత్వం వుండదు. స్వేచ్ఛలో భ్రమిస్తూ, జీవిస్తూ , సహకస్తూ,  అనుకరిస్తూ   
పరిణమిస్తూ వున్నవే సజీవత్వంతో ఉంటాయి.

ఏది సజీవమో సహజమో ఏది అసహజ జీవమొ తెలుసుకోలేము ప్రేమలో అందుతాయా ప్రేమ  
ఏది గతియో ఏది మతియో ఏది గమనమో, ఏది నిజమో ఏది బతుకు ఏది అతుకుల బతుకు అర్ధం తెలిపేది ప్రేమ ఒక్కటే
   

--(())--
 

ऊँ! శ్రీ రాం.... శ్రీ మాత్రే నమః..
ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
-----
మత్తకోకిల..(పంచపాది)
మాటమంత్రము తెల్పినంతనె మోత్త మంతయు వీడునే
మోహమంతయు తేటతెల్లము మాయ మవ్వునె ఇప్పుడే
మారు పల్కులు తొల్గి పోవును మాయ ముండుట లోకమే
మానసంబున రామనామము మేలు చేయును నిత్యమూ
ఆంజనేయుడు ధైర్య మిచ్చును అల్ప సౌఖ్యము పొందుటే
****(((*)))****
 

ఆశ పెర్గియు వచ్చు భయ్యము అంతు చూడును ఆదియే
గెల్పు ఓటమి వచ్చు లక్ష్యము‌ గాళ మల్లెను ఉండునే
బత్కు బాధలు  నోట పాలకులు బంధం మల్లెను చుట్టునే  
సంతసమ్మును పొందు చున్నను సామ రశ్యము తక్కువే
ధైర్య ముంచియు వేయు అడ్గులు ధర్మమార్గము చూపునే
ధరణి యందు
"మత్తకోకిల ( పంచపాది )..
-----
 

కాలకంఠునిఁదల్చినంతనెగౌ రవంబనుభావమున్
కీలనేత్రునిఁగొల్చినంతనెకీడుపోవునునంద్రుగా
వ్యాళభూషికిసేవఁజేయగవంతలుండవు యూహకున్
శూలపాణినినమ్మినంతనెశోభఁగల్గుట తథ్యమౌ
బాలచంద్రునిరేఖఁగల్గుకపాలిఁ గోరెద శ్రేయముల్ !!! "

*************


స్నేహశీలి

శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl
సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl
సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంల్

ప్రభాత సూర్యునికి ప్రణామం ప్రణామం,  ఆత్మబంధువులందరికీ "శాంతి" శుభోదయం. ఎన్ని సమస్య లొచ్చినా చిరునవ్వు చెదరక పోతే సమస్యకి విసుగొచ్చి పారిపోతుంది. పోగొట్టు కో నంతవరకు మన వద్ద వస్తువు విలువ కానీ మనిషి విలువ కానీ తెలుసుకోలేము. నీవు ఎవరిదగ్గరైతే నిర్భయంగా, నిస్సంకోచంగా నీ మనసులోని మాటల్ని చెప్పుకోగలుగుతావో వారే నిజమైన స్నేహితులు!!

ప్రపంచంలో వున్న ఏ గొప్ప వస్తువు కూడా మంచి స్నేహితు డికి  సమానం కాదు. మనం ఇతరులకి ఇచ్చే సంతోషమే మనం నిజంగా అనుభవించే నిజమైన సంతోషం,  మనం ఏ పని చేసిన సర్వశక్తులను,మనసుని,దానిపై స్థిరంగా కేంద్రీకరించి నప్పుడే ఆ పనిని సక్రమంగా చెయ్యగలుగుతాము. మన వెనుక కూడా మన గురించి మంచిగా మాట్లాడేవాల్లే నిజమైన స్నేహితులు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం పోతుంది !!

*********

ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక (5)
తిరిగి వచ్చిన వసంతం

చదువుతో వృద్ధి జరిగే
మనసులో మధుర రాగం
శ్రద్ధ చూపితే మెరుగే
విద్యార్ధిగ అనురాగం

సంస్కారముతో పరుగే
సద్వినియోగం తరుణం
సంతోషాలే జరిగే
ఇదియే ప్రేమల నిలయం

ఇదే కష్టాల పరుగే
నైనా ఒక అవకాశం
చిరునగవుల వల్ల మెరుగే
ఇదేనులే కవిహృదయం

వెయ్యి తుపాకుల పరుగే
వ్యతిరేకించు ప్రయాణం  
వార్తా పత్రిక జిలుగే
ఆశ లతో   ప్రయాణం

చదువుతో వృద్ధి జరిగే
మనసులో మధుర రాగం
శ్రద్ధ చూపితే మెరుగే
విద్యార్ధిగ అనురాగం

తలను వంచి యుండెఁ దరుణీలలామ దా
చారెడున్న కనులు బారెడున్న
వాలు జడతొ ,  తనువు భాగాల వంచుచూ
ధాత్రిఁ జూచె దిగులు దగిలి నటుల !
*****
ప్రాంజలి ప్రభ
భోజన నియమాలు
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.  
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.  
4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.
5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  
7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  
8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  
9. నిలబడి (బ ఫై)అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.
10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.
11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.
12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.
13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)
14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)
16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ  వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.
21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు)
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.
26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    
28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.
29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  
30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.  
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.
32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.
 

Saturday, 27 February 2021

28-02-2021

 

 Janmashtami, the birthday of Lord Krishna is commended with incredible dedication and eagerness in India in the month of July or August. As per the Hindu datebook this religious celebration is praised on the Ashtami of Krishna Paksh or the eighth day of the dull fortnight in the month of Bhadon. Sri Krishna is considered…

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ
ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.
'పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం  చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు  నువ్వుఅ అనుకొంటున్న 'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-కర్లపాలెం హనుమంతరావు

--(())--

పునర్జీవితులు

 ​"చినిగిన వస్త్రాన్ని  త్యజించి   నూతన వస్త్రాన్ని  మానవుడు  ధరించినట్టుగానే, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుందని" భగవద్గీత బోధించినట్టుగా పునర్జన్మ సిద్ధాంతాన్ని హిందూ, బౌద్ధ మతాలు విశ్వసిస్తాయి.

​‘మరణించిన జీవుడి ఆత్మ మరో దేహంలో పునర్జన్మ పొందుతుందని’ యముడు భగీరథుడితో చెప్పినట్టుగా నారద పురాణం తెలుపగా, జన్మల కతీతంగా చిరంజీవులైన వారిగా  అశ్వత్థామ,  బలిచక్రవర్తి ,  వ్యాసుడు, హనుమంతుడు , కృపుడు , విభీషణుడు , పరశురాముడు, మార్కండేయులను పురాణాలు వర్ణించాయి.  

పునర్జన్మ అనగా మరో దేహంతో  జన్మించడమని, పునర్జీవనమనగా అదే శరీరంలో తిరిగి ప్రాణం పోసుకోవడమని మత విశ్వాసం. పురాణాలు, ఇతిహాసాలు పునర్జన్మలను తెలిపే కథలను, పునర్జీవితుల చరితలను పరిచయం చేసా…

"వైవశ్వత మన్వంతరే" అంటే ...

మనం పూజా ప్రార్థనాసమయంలో సంకల్పఃలో మన ప్రవర చెప్పుకుంటూ
"మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ లేక ఉత్తర దిగ్భాగే  శ్రీశైలశ్చ ఉత్తర భాగే, కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశే, శోభన గృహే లేక స్వగృహే, సమస్త దేవతా ప్రీత్యర్ధం  బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, --- అని మనం నివసించే ప్రాంతాన్నీ గోత్ర నామా లనూ చెప్పుకుంటూ పూజ  మొదలెడతాం.

మన దేశం జంబూనది మధ్యలో ఉండేదనీ అందుకే మన భూ భాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారనీ, జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదనీకూడా చెప్తారు !
               
ఈ "సృష్టి"ని పాలించేది మనువులు.
ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కాలం కూడా అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రహ్మకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
               
బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్తుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 (మానవ) సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది.

భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
                
మన్వంతరాలు 14, వాటి పేర్లు:-
 
స్వాయంభువ మన్వంతరం
స్వారోచిష మన్వంతరం
ఉత్తమ మన్వంతరం
తామస మన్వంతరం
రైవత మన్వంతరం
చాక్షుష మన్వంతరం
7.వైవస్వత (ప్రస్తుత) మన్వంతరం
సూర్య సావర్ణిక మనవు మన్వంతరం
దక్షసావర్ణి మన్వంతరం
బ్రహ్మసావర్ణి మన్వంతరం
ధర్మసావర్ణి మన్వంతరం
భద్రసావర్ణి మన్వంతరం
దేవసావర్ణి మన్వంతరం
ఇంద్రసావర్ణి మన్వంతరం

వైవస్వత మన్వంతరం

ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.
తండ్రి - వివస్వంతుడు
తల్లి - సంజ్ఞ
భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషధ్రుడు, వసుమంతుడు, నరిష్యంతుడు, పృషపదుడు.
మనువు పుత్రికలు - ఇల (సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.   
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ, బుద్ద అవతారములు జరిగినవి,, కల్కి అవతరిస్తారు.
సూర్యసావర్ణిక మన్వంతరం
రాబోయే మన్వంతరం. అపుడు ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికిఅప్పగిస్తారు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
ఎం. వి. ఆర్. ఈశ్వర్

--(())--

 దీపారాధన ఉత్తమ భక్తి మార్గం:
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

👉  దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన తిమిరాలను పారదోలే తేజస్సు. అలాగే, భగవంతుడు జ్యోతిస్వరూపుడు. భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతీరోజు ఇండ్లలో పొద్దున, సాయంకాలం, పూజకు ముందు, గుడికి వెళ్లిన తర్వాత దీపారాధన చేస్తాం. ఇంకొందరు అఖండ దీపాలు వెలిగిస్తుంటారు. అవి ఎప్పటికీ అలా ఆరకుండా వెలుగుతూనే ఉంటాయి.

👉  కరెంటు సదుపాయం వచ్చిన తర్వాత సాయంకాలం చీకటి పడగానే లైట్ వేసి ఇక, అదే
 దీపం అనుకొని, దీపారాధన అయిందని, దానికే నమస్కరించే వారుంటారు. కానీ, చమురు దీపాలు వెలిగించడం, అదీ దేవుడి ముందు లేదా పూజగదిలో లేదా ప్రధాన ద్వారానికి ఎదురుగా వెలిగించడమే మన సత్సంప్రదాయం. ఒకటే దీపం వెలిగించవద్దు. రెండు దీపాలు, రెండేసి వత్తులతో వెలిగించడమే మంచిదని పండితులు అంటారు.

👉  రాత్రిపూట హఠాత్తుగా కరంటు పోయిందనుకోండి, అప్పుడు దేవుడి ముందు వెలిగించిన దీపకాంతులు పరిసరాల చుట్టూ పరచుకొంటాయి. అలాగే, పిల్లల పుట్టిన రోజు సందర్భంలో కొందరు కొవ్వొత్తి దీపాలను ఆర్పుతుంటారు. ఇదీ పొరపాటు. మనది దీపాలను వెలిగించే సంప్రదాయమే కానీ, ఆర్పే సంస్కారం కాదు. ప్రతి రోజూ పొద్దున, సాయం సంధ్యా వేళ రెండుసార్లు దేవుని ముందు దీపాలు వెలిగించడం ఉత్తమ లక్షణం.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు.

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు.

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో!
🙏🙏🙏🙏🙏
పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!!
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

👉  భక్తులు అనేవారు నిత్యం లేదా వారానికొకసారైనా ఇంట్లో పూజలు చేస్తారు. అయితే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

👉  పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

👉 ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి.

👉 అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు.పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది. తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

👉   ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు.

👉  తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు.పూజలకు, జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి.

👉  ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

👉  అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.వట్టి నేలపై కూర్చొని జపించరాదు. పూజించరాదు. భుజించరాదు.'పూజ' అంటే 'భోగములను ప్రసాదించునది' అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

 📚✍ప్రభుత్వోద్యోగి  అదృశ్యమైతే....✍📚

♦ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకమా?

♦పైగా ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలా?

♦అదేమి నిబంధనంటూ హైకోర్టు ఆక్షేపణ

♦సంబంధిత జీవో కొట్టివేత

🌻ఈనాడు, అమరావతి: మృతి చెందిన, అదృశ్యమైన ప్రభుత్వోద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామక నిబంధనల్లో వివక్ష తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగి కనిపించలేదని ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటి నుంచి ఆ ఉద్యోగికి ఏడేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉంటేనే కుటుంబసభ్యులు కారుణ్య నియామకానికి అర్హులవుతారన్న నిబంధన వివక్షాపూరితమని తప్పుపట్టింది. 1999 ఆగస్టు 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 378లోని సంబంధిత నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ దాన్ని కొట్టేసింది. ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు వెంటనే కారుణ్య నియామకంతోపాటు అన్ని ప్రయోజనాలు అందిస్తున్నారని.. కనిపించకుండా పోయిన ఉద్యోగి  విషయంలో వీటి కోసం ఏడేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం సరికాదని పేర్కొంది. తగిన పోస్టులో కారుణ్య నియామకం కింద పిటిషనర్‌ శ్రీనివాసరావును నియమించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ప్లాంట్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న టి.సుబ్బారావు 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, 2001 డిసెంబర్‌ 31న ‘ఆచూకీ లభ్యం కాలేదు’ (అన్‌డిటెక్టబుల్‌) అని తుది నివేదిక ఇచ్చారు. ఆ విషయాన్ని 2002 అక్టోబర్‌లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి తెలిపారు. ఆ తర్వాత తన తండ్రి అదృశ్యమై ఏడేళ్లు పూర్తయినందున కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాసరావు విద్యుత్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. పిటిషనర్‌ తండ్రి అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదయినప్పటి నుంచి ఆయనకు ఏడేళ్లకు పైగా సర్వీసు లేదన్న కారణంతో కారుణ్య అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. దీనిపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలన్న నిబంధనను కొట్టేయాలని కోరారు.

♦ఆ షరతులు పథకం ఉద్దేశాన్ని నీరుగార్చేవే
‘అదృశ్యం కేసుల విషయంలో ఉద్యోగి కనిపించకుండా పోయిన ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకానికి విజ్ఞప్తి చేయాలని జీవోలోని నిబంధన చెబుతోంది. మరోవైపు అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదయినప్పటి నుంచి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని పేర్కొంటోంది. ఈ షరతులు కారుణ్య నియామక పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాయి. అదృశ్యమైన ఉద్యోగి.. మరణించారని ఏడేళ్ల తర్వాత ప్రకటిస్తేనే కారుణ్య నియామకానికి కుటుంబసభ్యులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈలోపు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి కుటుంబాల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుందని విశ్వసిస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

 నాన్న కూ కన్నీళ్లు ఉంటాయి👨‍👩‍👧‍👦

🐊 నాన్న మనకోసం ఏం చేశాడో*
ఏం కోల్పో యాడో  మనకు తెలియదు..!*

🐊 జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.
 
🐊 ఎందుకంటే..  నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్య కి అసలు చెప్పడు. అమ్మ లా ప్రేమ ను బయటికి చూపించడం నాన్న కు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*
 
🐊 ఎప్పుడూ పనేనా ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.
 
🐊 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.
🐊 వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*
 
🐊 తన పిల్ల లు గొప్ప వాళ్లు అవుతారని నాన్న కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.
 
🐊 ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా? నాన్న కూడా ఏడుస్తాడు.😰 కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*
 
🐊 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*
 
🐊 నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్న ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*
 
 🐊 కొడుకు ఎంత మంచివాడు ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా తండ్రి ని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.
 🐊 ,పిల్లల కోసం తన రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ ను నాశనం చేసుకుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది.
ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది 🐊 నాన్న లు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీ గా మిగిలిపోయారో.....

ప్రతి నాన్న కు 🙏

 సీతాపతీ పద్యకావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీసము
శ్రీ రామ రూపమ్ము శ్రీ సీత వరముగా
ఆనంద సౌఖ్యము ఆది పరము
శ్రీ ప్రేమ మాహాత్మ్య శ్రీ మతి కరుణయే
మాపైన చూపించి మదిని తెల్పె
శ్రీ శక్తి నామమ్ము రీతిగా కీర్తింతు
శ్రీ కర శుభకర సీఘ్ర మముగ
శ్రీ యుక్తి మనసుయే శ్రీ ముక్తి పరముగా
శ్రీ రామ ప్రార్ధింతు శక్తి మేర
తేటగీతి
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
రక్ష చేయుము మాయందు రమ్య మగును
కనికరముజూపు ఎప్పుడూ కలత తొలగు
కరములను మోడ్చి కోరెద కోర్కె తీర్చు.............25
...........
సీసము
విప్రప్రియుండను పేరు గొన్నావు
కరుణా కరుండయి గ్రాలినావు
ధర్మస్వరూపుడై దానవ నాశన   
సీతకుభర్త యై చెలిగినావు
మాయామృగంబును మర్ధించినాడవు
మహిమాన్వితము చూపి మనసు పంచె
కోరుకున్నారికీ కోరినంత సుఖము
కోటివిద్యుత్కాంతి కూడినావు   
తేటగీతి
ధరణి రఘుకుల శ్రేష్టుండై ధరిణినావు
ధర్మ పరిపాలన తరుణా దిత్యు డుగను
ధర్మ పరిరక్షణ ను చేయు ధర్మ పరుడు
రామచంద్ర రక్షింపుమా రాఘవేశ        ....... 26
--(())--
ऊँ! శ్రీ రాం
----
"సీ.
----
శ్రీభవ్యరూపమ్ము శ్రీభూతి వరముగ
     భావించెదనునేను భాస్కరాక్ష !
శ్రీదివ్యమాహాత్మ్య శీతల కరుణను
     మాపైన సారించు మరుని తండ్రి !
శ్రీశ్రావ్య నామమ్ము రీతిగా కీర్తింతు
    క్షేమశమనమిచ్చు  సిరులకొఱకు
శ్రీముక్తివరదుని శ్రీశుని ప్రార్థింతు
నెపుడును తుష్టిని యిడుమనుటకు
గీ.
--
అబ్జనాభ !  కమలనేత్ర ! యాగకర్త !
కమలహృదయస్థ ! మోహన గానలోల !
కనికరముఁజూపు మాయందు ఫణిసుతల్ప !
కరములనుమోడ్చి వేడెద సురవిశేష !!! "
------------.......,....... 27

Friday, 26 February 2021

26--02--2021

Indian Painting Art Print featuring the painting Radha Krishna by Jitendra r Sharma

నేటి ఛందస్సు

UUU  UIII IIU UIU UIUU

సర్వాగన్ సుందరుడవు మనో నిర్మలుఁడైన దైవం
సర్వార్థా రమ్యమును సకలార్ధమ్ముగా సాత్వి భావం
శ్రీ రమ్యా ధార్మికగుణములో ప్రేమయే పంచుదైవం
సూర్యా వంశా బ్ధి లొ వెలుగులే పంచుటంలోను భావం

శాంతాకారం సుభగ నయణం పద్మనాభం శురేషం
శ్రీ లక్ష్మీ శ్రీ కరశుభకరా సర్వ శోభాయమానం
శ్రీ వత్సాం హృద్య శిరి కమలం సర్వ విజ్ఞాన దైవమ్
శ్రీ రంగాశ్రీ రమణ రమణీ పర్వ పీఠాభిదైవం

సర్వార్ధమ్మే సమయ సమరోత్పన్న సంతోష భావం
సమ్మోహమ్మే వినయము విధేయమ్ము సంభావ భాష్యం
ధర్మార్ధమ్మే సకల జన శీగ్రమ్ముగా  స్నేహా రాజ్యం
విశ్వసంమ్మే కరణ చరితం దివ్యభావమ్ము దీపం  

"మందాక్రాంతః..
----
శ్రీవాణ్యంబాం వనజధవళస్థప్రపీఠాధిదేవీం ,
గైర్వాణీం తాంవిధిరసనవైరాజినీం శారదాభామ్ !
కావ్యాలంకారసువిదితభాషానువిజ్ఞానదాత్రీం ,
వాక్సౌందర్యప్రవిలసితవాణీంప్రవందేऽనునిత్యమ్ !!! "

--(())--

కామ్యఫలం -జ్ఞానఫలం 🌻


🍃🌺కర్మలవల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్య ఫలం త్వరలో లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకు పరుగులు పెడుతుంటారు.

🍃🌺సంసార కూపం నుంచి బయట పడే దారికి జ్ఞానమే మార్గం. కామ్యకర్మలు - కర్మ ఫలాలు అనేవి గానుగెద్దు లాగా, ఏతం బావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణ మౌతూ, సంసారచక్రం లోంచి బయటకు రానీయవు.

🍃🌺పుట్టేందు కెందుకంటే చచ్చేదానికి, మరి చచ్చేది ఎందుకంటే మళ్ళీ పుట్టేందుకు - అనేట్లు జీవితం చర్విత చర్వణంగా ( నమిలినదాన్నే మళ్ళీ మళ్ళీ నమలడంగా ) తయారవుతుంది.

🍃🌺అదే విషయాన్ని భాగవతంలో ఇలా చెప్పారు :

🍃🌺అచ్చపు చీకటింబడి, గృహవ్రతులై,  విషయ ప్రవిష్టులై, పుట్టుచు చచ్చుచున్,  మరల చర్విత ఛర్వణులైన వారికిన్,  చెచ్చెర పుట్టునే  పరులు చెప్పిననైన, నిజేచ్ఛనైన,ఏమిచ్చిననైన,  కానలకు ఏగిననైన హరి ప్రభోదముల్!

🍃🌺పోనీ అలానే పుడుతూ చస్తూ ఉందామంటే :

🍃🌺ఈ నర జన్మ 83,99,999 జన్మల తరువాత పరమేశ్వరుని కరుణా కటాక్షంతో వచ్చిన మానవ జన్మ. ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఎందుచేతనంటే :

🍃🌺" పునః గ్రామం, పునః క్షేత్రం, పునః విత్తం, పునర్ధనం, పునః శుభాశుభః కర్మ, న శరీరే పునః పునః"- అన్నారు పెద్దలు.

🍃🌺అంటే, మనం మళ్ళా మళ్ళా గ్రామం మారవచ్చు, మళ్ళా మళ్ళా భూమి కొనవచ్చు, మళ్ళా మళ్ళా ఆస్తి -పాస్థులు పొందవచ్చు, మళ్ళా మళ్ళా ధనం సంపాయించవచ్చు. కానీ, ఈ శరీరం మళ్ళీ మళ్ళీ రాదు.

🍃🌺ఈ శరీరం తోనే మనం ఏమైనా సాధించాలి. అందుచేత ఈ శరీరం పోయేలోపే మనం జ్ఞానం సంపాయించాలి.

🍃🌺ఈ జ్ఞానం సంపాయించడానికి, వేదాలు, పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం, ఉపనిషత్తులు మొదలైన గ్రంధాలనన్నింటినీ చదవ వలసిన పనిలేదు. ఒక్క భగవద్గీత అనే చిన్న గ్రంధాన్ని  చదవడం వల్ల మొత్తం జ్ఞానం అర్ధమై పోతుంది.

🍃🌺భగవద్గీతలో :  భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

🍃🌺ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌.

🍃🌺సంతృప్తి - సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే : గీతను అర్థం చేసుకోవాలి. ఇది :

🔴 ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

🔴 కర్తవ్యం గురించి చెబుతుంది.

🔴 నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

🔴 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.

🔴 సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.

🔴 ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.

🔴 పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.

🔴 ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.

🔴 జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.

🔴 ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.

🔴 ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.

🔴 మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.

🔴 పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.

🔴 కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

🔴 నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
 
🍃🌺అందుకే భగవద్గీత  జాతి, మత,ప్రాంత, దేశ,  లింగ, వయో భేదాలు లేకుండా  సర్వమానవాళి  శ్రేయస్సు కోసం - సాక్షాత్తు  పరమాత్మ చేత స్వయంగా బోధింపబడింది.

🍃🌺అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.

🍃🌺నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది..

--(())--
 తేదీ : 26-02-2021 శుక్రవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#జ్ఞానశర్మ_కథ - (#మాఘ_పూర్ణిమ)*
గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను... తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను.. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నా రాకను గోరి తపమచరించితి యెందులకు ? నీ మనస్సులో నేమి యున్నది చెప్పుమని యడిగెను.
అప్పుడా విప్రుడు.. 'స్వామీ ! నాకు పుత్ర వరము నిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను.. కాని నారద మహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచ రించితినని శ్రీహరికి విన్నవించెను..
అప్పుడు శ్రీహరి.. 'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వ జన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగి యుండినది. ఆమె భర్తయగు నీవు ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించి నందున యీ జన్మ యందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయక పోవుట, భర్త చెప్పినను చేయకపోవుట యను రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతము నందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును.
ఓయీ ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘ స్నానము చేయని వారికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు.
 మాఘ మాస స్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసిన వారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు.., మాఘ వ్రత మహిమ కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘ వ్రత పారాయణులు మాత్రమే మాఘ వ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.
బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘ వ్రత గంగా జలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసము నకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా ! మాఘ వ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడ నిచ్చును. ఈ వ్రతము అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను..
ఇతి శ్రీ మాఘ పురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం సంపూర్ణం..

 ॐ శ్రీ గరుత్మంతుడి కధ -20 వ చివరి భాగం ॐ

         #గరుడపురాణంఅసలురహస్యం..!

🙏 వ్యాసభగవానుడు మనకు అందించిన 18 మహా పురాణాలలో ఒకటైన 'గరుడ పురాణంలో' 28 రకాల నరకాలున్నాయి.

⭕ మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని మన పెద్దలంతా బలంగా కోరుకున్నారు. రాముడైనా, యముడైనా వారి సంకల్పం సామాజిక సంక్షేమమే! మన పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.

⭕ మనం చేసే పాపాలను బట్టి యముడు ఆయా నరకాలకు మనను పంపుతుంటాడట. "అపరిచితుడు" సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు, ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పులు చేయాలంటే కాస్త భయం కలిగిందని చెప్పవచ్చు.

👉 అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం‌. మన తప్పులు సరిచేసుకుందాం.

🔥 1.తమిశ్రం:- ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసే ఇదో చిమ్మచీకటి నరక కూపం.

🔥 2. అంధతమిశ్రం:-  ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.

🔥 3. రౌరవం:-  రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.

🔥 4. మహారౌరవం:- న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.

🔥 5. కుంభీపాకం:-  వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.

🔥 6.కాలసూత్రం:-  ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది...

🔥 7. అసితపత్రవనం:-  విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.

🔥 8.సూకరముఖం:- అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.

🔥 9. అంధకూపం:- చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.

🔥 10. తప్తమూర్తి:-  ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

🔥 11: క్రిమిభోజనం:-  ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.

🔥 12. శాల్మలి:-  దీన్నే 'తప్తశాల్మలి' అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.

🔥 13. వజ్రకంటకశాలి:-  జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.

🔥 14. వైతరణి:-  అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.

🔥 15. పూయోదకం:-  వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.

🔥 16. ప్రాణరోధం:-  కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.

🔥 17. వైశాసనం:-  పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.

🔥 18. లాలభక్షణం:- అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. …

--(())---

 మాలాధారణకు అర్హులెవ్వరు?

జవాబు : మాలాధారణకు కొన్ని నియమ నిష్ఠలు గలవు. అట్టివి 108 , మాలకు గల పూసలు
108 నియమములు కూడ వీటిని పాటించుటలోగల ఆవశ్యకత మాల ధారణతో ముడివేయబడి యున్నది. మాలాధారణకు అర్హులెవ్వరు అను ప్రశ్న ఇక్కడ అవసరమై యున్నది.  ఎవరైతే నియమములను పాటించుదురో స్వామి యందు ప్రేమానురాగములు కలిగి యుందురో వారే అర్హులు , స్త్రీలలో 5 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు , 50 సంవత్సరములు దాటిన అనగా బహిష్టులు లేని వృద్ధ స్త్రీలు అర్హులు. మధువు , మగువ , చెడు అలవాటులకు దూరముగా యుండి సత్యమును పలుకువాడు మాలధారణకు అర్హులు , విద్యావంతులు కానివారునూ అర్హులే. ఉత్తమ గురువుల ద్వారా మాలధారణము చేసుకునుటకు  భక్తులు ఇష్టపడుదురు. ఉత్తమ గురువు అనగా ఎల్లవేళల నియమ నిష్ఠలు పాటించువారు. మధు మాంసములు మాని , ధూమ పానములు తదితర దురభ్యాసములు లేనివారు , స్వామి భక్తులు , దినచర్యలయందు ప్రతినిత్యము భగవంతుని మరువని వారే మాలధారణ చేయుటకు అర్హులు.  కేవలము మండల పూజ కాలములో దీక్ష తీసుకొనుట , ఆ తరువాత నియమములను పాటించకుండ యుండువారు మాలధారణ చేయవచ్చునా అను ప్రశ్నను తన్ను తాను అవలోకనము చేసుకొనుట అవసరము. కేవలము నలుబది దినములు సరిపోదు. ఎల్లవేళలా మధు పానము , ధూమ పానము , మానవలయును మరియు ప్రతినిత్యము కనీసము అర్చనను 2 పూటలు చేసుకొను వారలే మాలధారణ చేయుట మంచిది.


శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప

శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప

లోకాః సమస్తా సుఖినోభవంతు

--(())--

  పెద్దరికం తరలిపోతోంది ముస

లితనపు మేలి ముసుగులో..

ప్రపంచాన్ని మనకన్నా ముందే చదివేసిన వాళ్ళ జాగ్రత్తలు మనకి చాదస్తాలు..

ఆ పెద్దాయన నెలకొకసారి తెచ్చే పింఛన్ నీకు కావాలి కానీ కష్ట కాలం లో అయన సలహా అక్కర్లేదు..

ఆయనకి పెట్టె గుప్పెడు మెతుకులు లెక్కపెట్టే మనం,, అయన మనకోసం గడిపిన నిద్రలేని రాత్రుల లెక్కలు గణించగలమా..

వాళ్ళు వారి పిల్లలకి పురాణ కధల్లో నీతులు చెప్పి పెంచితే మనం మన పిల్లలకి కార్తీక దీపం లో పిల్లల ఓవర్ డైలాగులు చూపించి పెంచుతున్నాం..

నువ్వు ఎక్కడ అర్ధాకలితో ఉంటావో అని ఆయన  పస్తులతో పడుకుంటే,,  నువ్వు మాత్రం నేడు నీ పిల్లలు తినగా మిగిలింది అయన పళ్లెం లో ముష్టి వేస్తున్నావ్..

మూడేళ్ళ నీ కూతురు అల్లరి ఆస్వాదించే నువ్వు డబ్భై దాటిన ఆ పెద్దాయన చెప్పుకునే బాధ గోనుగుడు గా మారిందా...

పదహారెళ్ల నీ కొడుకు ఆడుకోవటానికి వెళ్లి అరగంట ఆలస్యంగా వస్తే కంగారు పడే నువ్వు,, నీ కుటుంబంతో సినిమాకి వెళ్లే నువ్వు బయట ఉన్న ముసలిదానికి ఒక మాట చెప్పాలన్న ఇంగీతం లేకపోతె ఎలా..

 నీకు జ్వరం వచ్చి రెండు రోజులు మాగన్ను నిద్ర పొతే నీకోసం ముడుపులు కట్టిన వాళ్ళకి నేడు వాళ్ళ కళ్ల జోడుకి డబ్బులు నిన్ను అడుక్కోవాలా...

 ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో,, ఇంకెన్నో,,మరెన్నో

నీకోసం వాళ్లిద్దరూ ఎన్నోసార్లు గొడవ పడ్డారు వాళ్ళ కోసం నీలో సగానికి నువ్వు సర్దిచెప్పుకోలేవా..

తప్పు ఎప్పుడు ఓక వైపే ఉంటుంది అని నేను అనుకోను నీ ఎన్నో తప్పులు కాచి వాళ్ళ ఓపికకు మించి నీ కాళ్లపై నువ్వు నిలబడే వరకు నిన్ను పెంచారు రోజులో ఒక్క పూట కనీసం ఒక గంట వాళ్లతో ఓపిగ్గా మాట్లాడలేవా..

రేపు నీకు మాట్లాడాలి అనిపించినా మాట్లాడటానికి వాళ్ళు ఉండకపోవచ్చు...

--(())--

 

సమ్మోహనాలు ... ప్రశ్న 1301 ... 1310   

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సరిగమ సంగీతము 

సంగీతం పాఠము 

పాఠము జీవిత సంగీత మే ఈశ్వరా 


సంగీత స్వరాలు  

స్వరాలే మధురాలు

మధురాలు మనసునే దోచేను ఈశ్వరా  


యువతకే ఉల్లాసం  

ఉల్లాస ప్రభావం 

ప్రభావం సంగీత స్వరాలే ఈశ్వరా 

  

సంగీత కచేరీ

కచేరీ విహారీ 

విహారి మనసుకునేర్పు  లహరీ  ఈశ్వరా 

 

కొందరి జీవితాలు 

జీవ సంగీతాలు

సంగీత వృత్తియే జీవమ్ముఁ ఈశ్వరా


లింగ భేదము లేదు

లేదు మతమును లేదు 

లేదు సంగీత స్వరము మనషె ఈశ్వరా  


కాలానుగుణంగా 

గుణ ప్రభావంగా 

ప్రభావ సంగీత సాహితియే ఈశ్వరా

 

అపారమగు సంగీత 

సంగీత సమర్దత  

సమర్ధత కీర్తి ప్రతిష్టలే ఈశ్వరా

 

అత్యధికోత్సాహము 

ఉత్సాహ యవ్వనము 

యవ్వన దూకుడులు,గెంతులే ఈశ్వరా 

  

రమణీయ గీతమ్ము  

గీత ఆనందమ్ము  

ఆనంద సర్వ  సంగీతమే ఈశ్వరా 

--(())--

ఒంటె- సింహం- శిశువు: 🌻

ఒంటె అనుకూలమైతే, సింహం ప్రతికూలమైనది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దదే అయినప్పటికీ, అవి రెండూ ఒకే ప్రదేశంలో ఉంటాయి. పసిగుడ్డు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. అదే ప్రదేశంలో గొంగళి పురుగు కదలడం ప్రారంభిస్తుంది.  అంటే ఒకే ప్రదేశంలో కదలిక పుట్టినట్లే కదా!

మీరు ఒంటెలా ఉండడమనేది సమాజం మీకిచ్చిన బహుమతి అయితే, మీరు సింహంలా ఉండడమనేది మీరు మీకిచ్చుకునే బహుమతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే, మీరొక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలనుకోకపోతే, ప్రస్తుతం నడుస్తున్న దానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రమాదాన్ని స్వీకరించే సాహసం మీకు లేకపోతే మీరు ఆ పని చెయ్యలేరు.

కానీ, ఒంటె తత్వాన్ని సరిగా అర్థంచేసుకుంటే మీరు సింహంలా అవుతారు. ‘కాదు’అని చెప్పలేని మీరు ఎప్పుడూ ‘అవును’అని పదే పదే చెప్పడంవల్ల, ఏదో ఒకరోజు ‘అవును’అని చెప్పడం మీకు చాలా చిరాకు కలిగిస్తుంది. అందువల్ల ఏదో ఒక మార్పు కోసం ‘కాదు’అని చెప్పాలనిపిస్తుంది ఎవరికైనా.

అలా ఒంటె తొలిసారిగా సింహంలా మారినట్లు కలలుకనడం ప్రారంభిస్తుంది. ఒకసారి అపనమ్మకంతో సింహంలా సందేహిస్తూ ‘కాదు’అని చెప్పడంలోని రుచిమరిగిన తరువాత మళ్ళీ మీరు ఒంటెలా మారలేరు, ‘అవును’అని ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే, సింహంలా ‘కాదు’అని చెప్పడం మీకు ఎంతో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇస్తుంది.

అజ్ఞానులైన అనేకమంది ఒంటెస్థాయి వద్ద ఆగిపోతారు. వారికంటె చాలా మెరుగైన కవులు, కళాకారులు, భావుకులు, తత్వవేత్తలు, విప్లవకారులు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు వంటి మేధావులు సింహం స్థాయివద్ద ఆగిపోతారు. అంతమాత్రాన గమ్యం చేరుకున్నట్లు కాదు. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదు. అదే ‘శిశువు’స్థాయి అయిన మూడవ దశ.

జాగ్రత్తగా వినండి: తొలి దశ అయిన ఒంటె స్థాయిని మీకు సమాజమే ఇస్తుంది. రెండవ దశ అయిన సింహం స్థాయిని మీకు మీరే ఇచ్చుకుంటారు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడే మూడవ దశ అయిన శిశువుస్థాయి మీకు లభిస్తుంది. లేకపోతే అది మీకు ఎప్పటికీ లభించదు.

కేవలం కదలడం మాత్రమే తెలిసిన గొంగళిపురుగు ఏమాత్రం అర్థంలేకుండా తనకు రెక్కలొస్తాయని, హాయిగా ఎగరగలనని, తర్కవిరుద్ధంగా ఎలా ఊహించగలదు? అది అసంభవం. కేవలం నేలపై కదలడం మాత్రమే తెలిసినవారు గాలిలో ఎగరగలమని ఎలా ఊహించగలరు? అదంతా వేరే కోణం- నిట్టనిలువు కోణం.

ఒంటె సింహంలా మారడం పరిణామం, సింహం శిశువుగా మారడం విప్లవం. సమాజం మిమ్మల్ని ఒంటెగా మార్చగలదు. మీకుమీరే సింహంలా మారగలరు. కానీ, సింహం శిశువుగా మారేందుకు మాత్రం సీతాకోకచిలుకలా పరిణామం చెందిన బుద్ధుడు, మహావీరుడు, రూమీ లాంటి గురువులు చాలా అవసరం. అప్పుడే మీరు వారిలా అవాలనే కలలుకనగలరు. లేకపోతే, మీకు తెలియని వాటి గురించి మీరు ఎలా కలలు కనగలరు?

హిమాలయాలలో నివసిస్తున్న అతి ప్రాచీన ఆదివాసీలు తాము ఎప్పుడూ చూడని ‘‘మోటారు వాహనం (కారు)’’ గురించి కల కనలేరుకదా! కాబట్టి, ఏదైనా చూసినప్పుడే దాని గురించి మీరు కల కనగలరు.

బుద్ధుడు,  బోధి ధర్మలను చూసినప్పుడే అలాంటి మహానుభావులు ఉన్నారని మీకు తెలుస్తుంది. చూసేందుకు వారుకూడా మీలాగే మామూలు మనుషులుగా కనిపిస్తారు. కానీ, వారు మామూలు మనుషులు కారు. అనంత దిగంతాల ఆవలి తీరంలో ఉన్న ఏదో తెలియని శక్తి వారి ఉనికిలోకి ప్రవేశించినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మీరు ప్రేమతో, దయతో వారిని సమీపించినప్పుడు వారి అంతర్గత ఆకాశం మీకు లీలగా కనిపిస్తుంది. అప్పటినుంచి మీరు దానికోసం కలలుకంటూ ఎలాగైనా, ఎప్పటికైనా వారిలా అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. గురువు నుంచి శిష్యునికి సంక్రమించే అంటురోగం అదే. అలా మూడవ దశ అయిన ‘శిశువు’దశ మీకు గురువునుంచి సంక్రమిస్తుంది. అదే పరస్పరాలంబనతో కూడుకున్న సృజనాత్మకత.

మొదటి దశ అయిన ఒంటె దశ పరాధీనమైనది. రెండవ దశ అయిన సింహం దశ స్వతంత్రమైనది. కానీ, మూడవ దశ అయిన శిశువు దశ పరాధీనమైనది కాదు, స్వతంత్రమైనది కాదు. అస్తిత్వమంతా పరస్పరాలంబనతో కూడుకున్నదే. అందులో ఉన్నవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడ్డవే. అందుకే అవి అన్నీ ఈ అస్తిత్వంలో ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి.

‘‘నేను, నీవు’’అనేవి లేవు. అలాగే ‘‘అవును, కాదు’’అనేవి కూడా లేవు. ఎప్పుడూ విధేయతతో ‘అవును’అని, అవిధేయతతో ‘కాదు’అని చెప్పవలసిన అగత్యంకూ
డా ఏమాత్రంలేదు. సర్వస్వ జ్ఞానోదయమంటే అదే. కాబట్టి, అందరూ మరింత సమయస్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించే సమయం ఆసన్నమైంది.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

[26/02, 6:36 am] : *క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ*…


ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండదు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్ట్ట డం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.

ఆసురీ గుణాలు

కామం…

అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.

క్రోధం…

క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.

లోభం…

లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.

మోహం…

మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.

మదం…

ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸°వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.

మాత్సర్యం…

ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.

రాగము…

ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.

ద్వేషం…

ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.

ఈర్ష్య…

తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.

అసూయ…

తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.

దంభము…

తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.

దర్పం…

నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)

అహంకారం…

అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు

ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశా నుసారం కర్మ చేయాలి.

మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?


పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.

ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.


మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

బుద్ధుడు తిరిగి రాని  విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.

మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

త్రికరణములు: 3 పనిముట్లు 1 మనస్సు 2వాక్కు3శరీరం.వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2రకాలు.1బైటికి కనిపించేవి. 2కనిపించనివి.వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ  2రకాలు.పుణ్యకర్మలు.పాపకర్మలు.పుణ్యకర్మలవల్ల

సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం

సూక్ష్మ శరీరం గా(మనోబుధ్ధిచిత్యహంకారములు)

ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.

బాల్యం లోజరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం

కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటి

వన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. కర్మ ను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి 

స్థూలంగా కర్మ అకర్మ వికర్మలను గురించి తెలుసుకుందాం. 1కర్మ:శాస్త్రవిహితమైనవే

అంటే శాస్త్రము బోధించే కర్మలు. 2అకర్మ:ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన

సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 3వికర్మ:శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిధ్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.

మరొక విధంగా కర్మ 3రకాలు.1సంచిత.2ప్రారబ్ధ3ఆగామి.

సంచితకర్మ:ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.

ప్రారబ్ధం :సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.

ఆగామి :ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే

జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. మన

ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగి కిమాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిధ్ధిస్తుంది.

కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు. 

కర్మ సిద్ధాంతము : మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.

కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టు కు కారణం విత్తు అట్లే తండ్రి కారణం కొడుకుకార్యం మళ్ళీ ఆ కోడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …

అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుందిఅందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్ప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినా

 *జీవిత సత్యం*


తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి

అందులో జీవనం కొనసాగిస్తుంది.....

చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...


కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు

ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....

అయ్యో

నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర

రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....

అయితే 

మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం

ఆ తామర రేెకులను తొలచలేదా....

ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...


కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...

లేక 

నన్నేదో బంధించింది అన్న

భావన దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావనను

నమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న 

దాన్ని నమ్మింది...

అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...


మన జీవితంలో సమస్యలూ అంతే,

సమస్య బలమైంది కాదు....

మనశక్తిని

మనం మర్చిపోవడమే దాని బలం...

మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,

గుర్తించడమే, నమ్మడమే దాని బలం...


"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత....

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.

తెలుసుకో 

అదే..జీవిత సత్యం

శ్రీ ఆకెళ్ళ శ్రీనివాసరావు

No photo description available.

Thursday, 25 February 2021

25--02--2021

 


సమ్మోహనాలు ... ప్రశ్న 1291 ... 1300   
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రేమలేక రాశా
రాసి నా ఓ ఆశా
ఆశా పాశము కు చిక్కాలే ఈశ్వరా

అమితమైన ప్రేమ
ప్రేమ సుఖము దుఃఖమ
దుఃఖము తప్పదు జీవితములో ఈశ్వరా

ధనము కీర్తి ప్రతిష్ట
ప్రతిష్ఠ మనకు నిష్ట
నిష్ట మనిషిగా సంతృప్తియే ఈశ్వరా

మనసులో భోగమ్ము
భోగమ్ము తరుణమ్ము
తరుణమ్ము ప్రేమ లేఖ తోనె ఈశ్వరా

ఇంద్రియములు మనస్సు
మనస్సు కళ తపస్సు
తపస్సు సౌఖ్యమ్ము కొరకుకళలు ఈశ్వరా

నేడు ప్రేమలేఖలు
లేఖతొ పరిచయాలు
పరిచయం ఇరు మనసులను కలిపె
ఈశ్వరా

లోకము ప్రేమమయము
ప్రేమలొ అనురాగము
అనురాగముతో ఇంద్రియసుఖము ఈశ్వరా
 
లేఖనే రాసితిని
రాసియే ఆగితిని
ఆగియు ప్రేమ పంచుటకు లేఖ ఈశ్వరా

కరుణ చూపు ప్రేమా
ప్రేమ తోనె యుగమా
యుగము అంత జీవిత ప్రేమే ఈశ్వరా

ఉషోదయ వెలుగులే
వెలుగుతొ  ప్రేమలే
ప్రేమ జీవితాన నిత్య లేఖ ఈశ్వరా

--(())--
 తేదీ : 25-02-2021 గురువారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#విప్రుని_పుత్రప్రాప్తి*
గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.  మహర్షీ ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా ? నా సందేహమును తీర్చుమని అడుగగా గృతృనమద మహర్షి యిట్లనెను..
జహ్నమునీ ! వినుము.. మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తి నందును. అట్టి కథనొక దానిని చెప్పెదను.. వినుము అని యిట్లు పలికెను.
పూర్వము గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమ శీలుడు, ఆచార వంతుడు, నీతి దయ జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు... అతని భార్యయు నుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో... "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునని విచారపడెను".. అప్పుడామె... నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో ? అందువలన మనకు సంతానము కలుగలే దనుకొందును అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు.. ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదనని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగా తీరమునకు పోయిరి.
బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరి ని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతుల యందును శంఖము, చక్రము, గద, వరమాలను ధరించి యుండెను. వరమాలను పచ్చని పట్టుబట్టను కట్టెను.. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.
తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు.. "విప్రా ! నేను నీకు వరము నీయవచ్చితిని. నీ తపమును మెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై , బాహ్య జ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.
*#విప్రకృత_విష్ణుస్తుతి*
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిల రూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృత మూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)
జహ్నుమునీ..! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శత నామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను.. శ్రీహరి మాటలను విన్న విప్రుడు.. 'స్వామీ ! నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము , ఇహలోకమున పర లోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానము నిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను... శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడ నగుదునని పలికి  అంతర్థానం నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్య మిక్కి లాభము నందినవానివలె సంతసించి తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.
కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచార మగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. "నాధా నీవు తీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితి.. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా ! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను ?" అని భర్తతో పలికెను.
ఆ విప్రుడును భార్య మాటలను విని బాధ పడుచు నామెనోదార్చి యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది.. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా ? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువత నైన మరణింపక తప్పదు కదా ! మరి యీ ముందు వెనుకలు వయస్సులకు కలదు..కాని మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము.. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల ? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము.
ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మ ననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా ? కావున సోకించకు అని యామనూరడించెను... మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము.. అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను..
ఇతి శ్రీ మాఘ పురాణం చతుర్దశ అధ్యాయం పారాయణం సంపూర్ణo...

*💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑*

💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

💖 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.

💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!

💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

💖 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.2ES

💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

💖 నేలకు జారిన తారకలై

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

💖 సప్తపది ఏడు అడుగులు

మొదటి అడుగు - అన్న వృద్ధికి

రెండవ అడుగు - బలవృద్ధికి

మూడవ అడుగు - ధన వృద్ధికి

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐదవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.

💖 వివాహాన్ని సుఖమయం

 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

💖 కలిమి లేములతో...

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

💖 మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)

ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

💖 భర్తకి భార్య బలం కావాలి

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదుభార్యా భర్తల బంధం 

అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.

మనసులోనిప్రేమని,బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

💐💐💐💐💐💐💐💐💐💐

✍️ 60, 65 సంవత్సరాలు దాటిన ఆడ, మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు 🌴

👉 (1) మీరు బాత్రూంలో వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు. మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.

                                                                                                       👉 (2) తడిగా ఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ, టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు, అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.

                                                                                                          👉 (3) ఫ్యాన్ లు, ఫోటోలు తుడవడానికి గానీ, రిపేరు చేయటానికి గానీ, గుడ్డలు ఆరవేయటానికి గానీ స్టూళ్ళు, కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి.

                                                                                                          👉 (4) కారు గానీ, స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి. 

                                                                                                           👉 (5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటి కంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. 

                                                                                                                              👉 (6) మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ, ఆనంద పరిచే విషయాలలో గానీ, మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు. 

                                                                                                                👉 (7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా, మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను) తీసుకవెళ్ళండి. వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.

                                                                                                                      👉 (8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించేయండి. జాగ్రత్తగా ఉండండి. 

                                                                                                                  👉 (9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర, రెండోది మీ భార్య దగ్గర. 

                                                                                                                              👉 (10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం రావచ్చు. 

                                                                                                                   👉 (11) ఇంట్లో వారితోను, బయటి వారితోను మాట్లాడే టప్పుడు మర్యాదగా, మృదువుగా మాట్లాడండి. కోపంగాను, రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.

                                                                                                                     👉 (12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ, జరిగేదాని గురించి గానీ, జరుగబోయే దాని గురించి గానీ ఆలోచించ వద్దు, జరిగేది జరుగక మానదు.

                                                                                                                👉 (13) ఈ వయసులో మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం. 

                                                                                                        ✍️ Note : మీరు వీలు చేసుకుని + ఓపిక చేసుకుని చదవండి చదవమనండి 

 *శ్రీ మహావిష్ణువుకే వరాలిచ్చిన వాడు గరుడుడు* 

🙏🕉️🛕🏵️🦅🐄🌹🛕🙏

      గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహా బలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. *ఈ గరుడుడు మహావిష్ణువుకు వాహనం ఎలా అయ్యాడు.?* 

      కశ్యప ప్రజాపతి, వినత ల రెండవ పుత్రుడు గరుడుడు. సూర్యుని రథసారథి అనూరుడు ఇతని అన్న. కశ్యప ప్రజాపతి మరో భార్య కద్రువ. ఈమె సర్పములకు తల్లి. అనూరుడు తన తల్లికి ఇచ్చిన శాప ఫలితం వినత, కద్రువకు దాసీగా అయి పోతుంది.

       తల్లికి దాసిత్వం  నుండి విముక్తికి,  కద్రువ అమృతం కోరుతుంది. గరుడుడు అమిత శక్తి శాలి. తారక్ష్యుడు -అనేది గరుత్మంతుడికి మరోపేరు. కశ్యపాత్మజుడైన గరుడుని బలపరాక్రమాలు అనన్య సామాన్యాలు. సువిశాల మైన రెక్కల చేత విసర బడిన గాలులు పర్వత సమూహాలను సైతం చలింప చేస్తుండగా, వేగం మహా సముద్రాలనే అల్లకల్లోలం చేస్తుండగా, తన శరీర కాంతి సూర్యప్రకాశాన్నే అధిగమించగా జన్మించిన వాడు గరుడుడు.

      తల్లికి ప్రీతిని కలిగిoచ అమృతానికై, మహావేగంతో ఒక్కసారిగా ఆకాశవీధిలోకి ఎగిరాడు. కద్రువ పుత్రులు నాగరాజులైతే వినత సుతులు పక్షినాథులు. గరుడుడు స్వర్గంలో నున్న అమృతం ఉంచిన కోశాగారం వెళతాడు. అతని పై యుద్ధానికి వచ్చిన దేవతలు, గరుడుడు రెక్కల గాలి ధాటికి తమ వాహనాల పై నుండి క్రిందికి పడిపోతారు. 

    అమృతానికి రక్షగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి ఉంటారు దేవతలు. దాని పేరు *కర్తరీ యంత్రం* . ఈ యంత్రం మనో వేగంతో తిరుగుతూ, తన వద్దకు ఏది కానీ ,ఎవరు  వచ్చినా కానీ, ఖండ ఖండాలుగా చేస్తుంది. గరుడుడు తనరూపాన్ని వెయ్యివో వంతుకు కుదించి యంత్రo క్రిందకు చేరి, వాయువును శరీరంలో బంధించి, శక్తినంతా కూడగట్టుకొని, అమృతం తీసుకొని ఆకాశమార్గాన బయలు దేరుతాడు. అతనిని ఎదిరించ,  భయపడిన దేవతలు విష్ణువుకు చెబుతారు. విష్ణువు, గరుడుడుని ఎదిరిస్తాడు 

     కొద్ది సేపు పోరాటం జరిగిన పిదప, అతని సాహసానికి, మాతృ భక్తికి మెచ్చి, గరుడుడితో నేను ప్రసన్నుడయ్యాను ఏమి కావాలో కోరుకోమని, విష్ణువు నుడువగా, ప్రతిగా గరుడుడే నవ్వుతూ, *నేనే ప్రసన్నుడయ్యాను "నీవే రెండు కోర్కెలు కోరుకో'-* అని విష్ణువుతో అంటాడు. 

       అందుకు చక్రి *"ఓ పక్షీoద్ర! నీవు నాకు వాహనం కావాలి, రెండవది ఈ అమృతం తో నీతల్లి దాస్యవిముక్తి గావించి, దీన్ని వారు స్వీకరించే ముందే తెచ్చి దేవతలకు ఇవ్వాలి";* అని  రెండు వరాలు పుచ్చుకుంటాడు, శ్రీహరి.

      దాశ్యం నుండి విడుదలయిన తల్లి, 'దాశ్య పాపవిముక్తి"కి, కాశీ వెళ్లగా తాను కాశీ వెళతాడు గరుడుడు. అక్కడ శాoభవి లింగాన్ని తాను ప్రతిష్ఠింప, తల్లి ఖఖోల్కడు అనే అదిత్యుని ప్రతిష్టించి, తపం చేస్తారు. సూర్యుడు ఒక వైపు,  లింగం నుండి హరుడు, ప్రత్యక్షం అవుతారు. భవుడు గరుడుడితో నీవు ప్రతిష్టించిన  ఈ లింగం ' *గరుడేశ్వర'* మను పేరిట ఖ్యాతి పొందుననియు, నీవు విష్ణువుకు వాహనం కమ్ము"- అనిచెబుతూ, విష్ణువు అయినా నేనైనా ఒకటే, మా మధ్య భేదం లేదని, అనేక వరాలిచ్చి, అంతర్ధానమవుతాడు.

    *ఇదే విష్ణువాహన కథ.* 

🔱🔱🔔🔱🔱🔔🔱🔱🔔

సందర్భోచిత పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కవి కలంకదిలేన్యాయ కౌలు కొరకు
ధర్మ దేవత కన్నీరు తుడుపు కొరకు
నిజము నిద్రపో కయు ఉండి నడుపు కొరకు
మనిషి జీవితంలో మాయ మాపు కొరకు

భాగ్యు రాలిని నీరాగ భావ వ్యాప్తి
భవ్య చరితము ప్రేమతో బలము తృప్తి
హృదయ వాసిని ఆశయం కొదమ దీప్తి
కౌగిటను బంది చేయరా కలల ప్రాప్తి

కళ్ళ చూపులు అలలాగ కదులు చుండె
ఆద మరచిచార్చిన చీర కళ్ళు తాకె
ఆకలికి తాళలేక యు కళ్ళ మెరుపు
స్వర మేదోను పిలుపుగా చీర కళ్ళు

రమ్య మైనట్టి రాగమే రసమయమ్ము
అంత రంగాన ఆనంద రమ్య మయ్యె
ప్రకృతి పరవశం  నాలోన ప్రీతి గొలిపె
వెన్నెల తరంగ మాధుర్య వేగుచుక్క

కలలు తీర్చేటి మనసైన కావ్య కొవ్వు
మనసు మైమరి పించేటి మగువ నవ్వు
ఎదలొ కలవర పరిచేటి ఎర్ర పువ్వు
ఎదను పందిరి చేసియు ఏక మవ్వు

అడుగులాగవు కలగతి కవిత కొరకు
కనికరము కాల నిర్ణయం కవిత మల్లె
అలుపెరుగని ది కవిగాంచు భానుమతి యు
చరమ గీతము కళలేలు కవిత లేలు

ఒకరి కొకరిగా కలసియు ఓర్పు చూపి
ప్రేమ విలువను నలుగుర్కి పెంపు చేసి
వయసు కూడాను చూడక విద్య వ్యాప్తి
పరుల సేవపరముగాను పలుకు తెల్పు


దివ్య జ్ఞాన సరస్వతి దేవి పిలుపు
దివ్య హృదయపు జ్యోతి గా  దేవి పిలుపు
దివ్య రూపమే మనసులో దేవి పిలుపు
దివ్య సందర్శనతొ దయ దేవి పిలుపు

అతని నివాసము నిత్య తెలుగు భాష
అతని కవిత్వ ముకలల తెలుగు భాష
అతని అమృతభాండముగాను తెలుగు భాష
అతడు కృష్ణ శాస్త్రి గారు గురువు గారు

మెరుగు పెడితే ను వజ్రాన్కి మెరుపు వచ్చు
కష్టములను ఎదుర్కొన కలలు తీరు
వెల్గు దీపమె వ్యక్తిత్వ వేగుచుక్క
బుధ్ధి వెలుగుల నీడలా మారు చుండు


 *సుబ్రహ్మణ్యుడు..హనుమంతుడు* 

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

*మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!*

*హనుమంతుని వాహనమేది?* 

వాయు వేగంతో ఎక్కడికైనా వెళ్లగలిగిన స్వామికా వాహనం అవసరమా! లేదు. కానీ ఒకానొక సమయంలో ఆ స్వామి ఒంటెను తన వాహనంగా చేసుకొన్నారు. హనుమకు మొట్టమొదటి సారి, శ్రీరామచంద్ర దర్శనం, పంపానదీ తీరంలో జరుగుతుంది. అప్పుడు సుగ్రీవమైత్రి జరిగిన పిమ్మట, ఆ నదీ తీరంలో తిరుగుతూ వుంటారు. వారి దర్శనార్థం ఇసుక తిన్నెలపై నడవడానికి ఒంటెను వాడినట్లుగా, పరాశరసoహితలో పేర్కొన బడినది.

       అదీగాక రామసేతు సముద్రతీరంలో, ఆ సేతువును ఒంటె పై, ఆ ఇసుకలో సంచరించినట్లు, రామాయణంలో వ్రాయ బడినది.

 *సుబ్రహ్మణ్యుడికి ఇద్దరు భార్యలా?*  

ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయము అయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచము లోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్నుగాయ పరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ప్రతి స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడ లేను అనుకుని నెమలి వాహనుడు  బ్రహ్మచారిగా వుండి పోయాడట.

      ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగాసుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో పూజిస్తారు.  సుబ్రహ్మణ్యస్వామి వారికి ఇద్దరు భార్యలుఅంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథ శక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలా ధార చక్రములో ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.

         ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియ శక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీ దేవి, దేవసేనా అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడి కి పత్నులు.

 *అరుణాచల గిరి ప్రదక్షిణం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

అరుణాచలేశ్వరుడు 

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. 

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.  అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. 

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. 

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. 

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

(మూలం : శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారి ప్రవచనం ఆధారంగా)

*నెమలి పించం*

చాలాకలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఈక అయినప్పటికీ... మన రోజు వారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే... నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుంది. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా... వారికి నెమలి పించం ఇస్తే చాలు... మార్పు వస్తుంది. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. మార్పు కనిపిస్తుంది. నెమలి పించంను ఎలా వాడాలో తెలుసుకుందాం.

రాహు దశలో ఉంటే 

 కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ (Pillow) కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుంది.

పనులు ఆలస్యమవుతుంటే : గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే... అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

ఏకాగ్రత పెరగడానికి : పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే... పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే... అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి.

వాస్తు దోష నివారణకు : నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతోపాటూ... ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు... ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తులు)ని కూడా తరిమికొడుతుంది.

 *మంగళవారం కొత్త బట్టలు కొనకూడదట..*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


May be an image of 1 person

  మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు.

👉  ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.

👉  శనితో సంబంధమున్నందను మంగళవారం నూతన దుస్తులుతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.

👉  అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది.

👉  ఆర్థికం పురోగతి కోసం మంగళవారం నుదిటిపై కుంకుమ లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

 *గరుడ కవచ స్తోత్రం :*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

👉 కాలసర్పదోష(యోగం) నివారణకు, నాగదోష నివారణకు, బందనముల నుండి విముక్తి కొరకు, శత్రుభాదల కొరకు గరుడ కవచ స్తోత్రం త్రికరణ శుద్దితో పఠించిన సర్వ పాపములు తొలగిపోవును. గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది.

👉 జాతకచక్రంలో గ్రహాలు అన్ని రాహు కేతువుల మద్య ఉండి మిగతా రాశి భావాలు ఖాళీగా ఉండటం వలన ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి.

👉 కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.

👉 మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.

👉 పంచమంలో రాహువు ఉండటం వలన పూర్వజన్మలో శాపం వలన ఈ జన్మలో సంతాన దోషాన్ని అనుభవిస్తున్నారని పరాశర మహర్షి తెలియజేసిన గ్రంధాల ఆదారంగా తెలుస్తుంది. వీటి నివారణకు గరుడ కవచ స్తోత్రాన్ని గురు ముఖంగా పఠించటం వలన సంతాన దోషాన్ని తొలగించుకోవచును.

👉 దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగదేవతను గాని దుర్గాదేవిని గాని పూజించుకుంటూ గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక బాధలు తొలగించుకోవచ్చును.

👉 అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

] Akiraju Sridhar: ఇప్పుడొక గోదావరి జిల్లా కామెడీ సంఘటన.

శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ పెళ్ళికి రెండు రోజులు ముందుగా హైదరాబాద్ నుండి బయల్దేరి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు.

శ్రీనివాస్ తన ఫ్రెండ్ వెంకట్ వాళ్ళ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే శ్రీనివాస్ ని చూసి వెంకట్ తల్లి "రా బాబూ రా. బావున్నావా? ఇంతకీ దేనికొచ్చావ్?" అనడిగింది. శ్రీనివాస్ కి "దేనికొచ్చావ్?" అన్న ప్రశ్న ఎందుకడిగారో అర్ధం కాలేదు. కొంపదీసి పెళ్ళి ఈ నెల కాదా అనుకొని కాళ్ళు కడుక్కోవడానికెళ్ళాడు. అంతలో టవల్ తీసుకొచ్చిన వెంకట్ చెల్లెలు శ్రీనివాస్ ని "అన్నయ్యా బావున్నావా? దేనికొచ్చావ్?" అని అడిగింది. మళ్ళీ "దేనికొచ్చావ్?" అనే ప్రశ్న.  శ్రీనివాస్ కి "పెళ్ళి తేదీ తనేమన్నా తప్పుచూసాడా ఏంటీ, ఎందుకొచ్చావ్ ఎందుకొచ్చావ్" అని అడుగుతున్నారు" అని అనుమానం పెద్దదైంది. పెళ్ళి తేదీ ఎప్పుడు అని అడిగితే ఏమనుకొంటారో అని మొహమాటంతో అడగలేదు. కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వెళ్ళగానే అక్కడ వాలు కుర్చీలో కూర్చున్న వెంకట్ తండ్రి శ్రీనివాస్ ని "బాబూ బాగున్నావా? దేనికొచ్చావ్?" అనడిగాడు. శ్రీనివాస్ "ఏంటీ ఇంట్లో అందరూ దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే ప్రశ్న. కొంపదీసి పెళ్ళిగాని కేన్సిల్ అయ్యిందా ఏంటీ". అదేమాట అడుగుదామా అనుకొని ఫ్రెండ్ వచ్చాక వాడినే అడుగుదాం అని బయటకెళ్ళిన ఫ్రెండ్ వెంకట్ రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన వెంకట్ శ్రీనివాస్ ని చూస్తూనే "ఏరా శ్రీను ఎంతసేపైంది వచ్చి? దేనికొచ్చావ్?" అన్నాడు. శ్రీనివాస్ కి సహనం సన్నగిల్లింది. ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా పెళ్ళికి పిలిచి ఇప్పుడు ఇంట్లో అందరూ "దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. పెళ్ళి కేన్సిల్ అయ్యిందా ఏంటీ?" అని అడిగాడు. వెంకట్ నవ్వాపుకొంటూ అరేయ్ "దేనికొచ్చావ్? అంటే గోదావరోళ్ళ అర్ధం ఏ బండెక్కి వచ్చావ్? బస్సుకా, రైలుకా? తెలుసుకోవడానికి" అని చెప్పగానే శ్రీనివాస్ కి విషయం అర్ధమై నవ్వుకొన్నాడు. 😂😀
సో... గోదావరోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు "దేనికొచ్చావ్?" అనడిగితే కంగారుపడిపోకండి సుమీ! 😀
 

 Akiraju Sridhar: " నవసాహితి " AP chapter వాట్సాప్ గ్రూపులో DR . Rajarao Tripuraneni గారి పోస్ట్ ఇది . నాకు బాగా నచ్చింది .  వారి అనుమతి తీసుకుని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .

                         🙏🙏🙏🙏🙏🙏🙏

'' నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.

ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న  విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ  పట్టలేకపోయేవారు.

ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.

ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే !  

ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego]  నింపాయి.

ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర  వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి.
ఆయన ఇలా అనుకొన్నాడు ...

నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కుతాను .

అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది.

శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.

దేవత వెతుకుతూ వస్తోంది.
ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి .
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు.
అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! ''  అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో
 '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అబద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేక పోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది "  అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.

అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు ,  ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.

మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి  
" అహం " తీసేస్తే మిగిలేది " భావం " అంటే " అర్థం "

అర్థమైతే అనర్థం జరగదు.

--(())--