Saturday, 27 February 2021

28-02-2021

 

 Janmashtami, the birthday of Lord Krishna is commended with incredible dedication and eagerness in India in the month of July or August. As per the Hindu datebook this religious celebration is praised on the Ashtami of Krishna Paksh or the eighth day of the dull fortnight in the month of Bhadon. Sri Krishna is considered…

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ
ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.
'పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం  చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు  నువ్వుఅ అనుకొంటున్న 'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-కర్లపాలెం హనుమంతరావు

--(())--

పునర్జీవితులు

 ​"చినిగిన వస్త్రాన్ని  త్యజించి   నూతన వస్త్రాన్ని  మానవుడు  ధరించినట్టుగానే, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుందని" భగవద్గీత బోధించినట్టుగా పునర్జన్మ సిద్ధాంతాన్ని హిందూ, బౌద్ధ మతాలు విశ్వసిస్తాయి.

​‘మరణించిన జీవుడి ఆత్మ మరో దేహంలో పునర్జన్మ పొందుతుందని’ యముడు భగీరథుడితో చెప్పినట్టుగా నారద పురాణం తెలుపగా, జన్మల కతీతంగా చిరంజీవులైన వారిగా  అశ్వత్థామ,  బలిచక్రవర్తి ,  వ్యాసుడు, హనుమంతుడు , కృపుడు , విభీషణుడు , పరశురాముడు, మార్కండేయులను పురాణాలు వర్ణించాయి.  

పునర్జన్మ అనగా మరో దేహంతో  జన్మించడమని, పునర్జీవనమనగా అదే శరీరంలో తిరిగి ప్రాణం పోసుకోవడమని మత విశ్వాసం. పురాణాలు, ఇతిహాసాలు పునర్జన్మలను తెలిపే కథలను, పునర్జీవితుల చరితలను పరిచయం చేసా…

"వైవశ్వత మన్వంతరే" అంటే ...

మనం పూజా ప్రార్థనాసమయంలో సంకల్పఃలో మన ప్రవర చెప్పుకుంటూ
"మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ లేక ఉత్తర దిగ్భాగే  శ్రీశైలశ్చ ఉత్తర భాగే, కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశే, శోభన గృహే లేక స్వగృహే, సమస్త దేవతా ప్రీత్యర్ధం  బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, --- అని మనం నివసించే ప్రాంతాన్నీ గోత్ర నామా లనూ చెప్పుకుంటూ పూజ  మొదలెడతాం.

మన దేశం జంబూనది మధ్యలో ఉండేదనీ అందుకే మన భూ భాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారనీ, జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదనీకూడా చెప్తారు !
               
ఈ "సృష్టి"ని పాలించేది మనువులు.
ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కాలం కూడా అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రహ్మకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
               
బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్తుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 (మానవ) సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది.

భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
                
మన్వంతరాలు 14, వాటి పేర్లు:-
 
స్వాయంభువ మన్వంతరం
స్వారోచిష మన్వంతరం
ఉత్తమ మన్వంతరం
తామస మన్వంతరం
రైవత మన్వంతరం
చాక్షుష మన్వంతరం
7.వైవస్వత (ప్రస్తుత) మన్వంతరం
సూర్య సావర్ణిక మనవు మన్వంతరం
దక్షసావర్ణి మన్వంతరం
బ్రహ్మసావర్ణి మన్వంతరం
ధర్మసావర్ణి మన్వంతరం
భద్రసావర్ణి మన్వంతరం
దేవసావర్ణి మన్వంతరం
ఇంద్రసావర్ణి మన్వంతరం

వైవస్వత మన్వంతరం

ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.
తండ్రి - వివస్వంతుడు
తల్లి - సంజ్ఞ
భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషధ్రుడు, వసుమంతుడు, నరిష్యంతుడు, పృషపదుడు.
మనువు పుత్రికలు - ఇల (సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.   
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ, బుద్ద అవతారములు జరిగినవి,, కల్కి అవతరిస్తారు.
సూర్యసావర్ణిక మన్వంతరం
రాబోయే మన్వంతరం. అపుడు ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికిఅప్పగిస్తారు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
ఎం. వి. ఆర్. ఈశ్వర్

--(())--

 దీపారాధన ఉత్తమ భక్తి మార్గం:
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

👉  దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన తిమిరాలను పారదోలే తేజస్సు. అలాగే, భగవంతుడు జ్యోతిస్వరూపుడు. భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతీరోజు ఇండ్లలో పొద్దున, సాయంకాలం, పూజకు ముందు, గుడికి వెళ్లిన తర్వాత దీపారాధన చేస్తాం. ఇంకొందరు అఖండ దీపాలు వెలిగిస్తుంటారు. అవి ఎప్పటికీ అలా ఆరకుండా వెలుగుతూనే ఉంటాయి.

👉  కరెంటు సదుపాయం వచ్చిన తర్వాత సాయంకాలం చీకటి పడగానే లైట్ వేసి ఇక, అదే
 దీపం అనుకొని, దీపారాధన అయిందని, దానికే నమస్కరించే వారుంటారు. కానీ, చమురు దీపాలు వెలిగించడం, అదీ దేవుడి ముందు లేదా పూజగదిలో లేదా ప్రధాన ద్వారానికి ఎదురుగా వెలిగించడమే మన సత్సంప్రదాయం. ఒకటే దీపం వెలిగించవద్దు. రెండు దీపాలు, రెండేసి వత్తులతో వెలిగించడమే మంచిదని పండితులు అంటారు.

👉  రాత్రిపూట హఠాత్తుగా కరంటు పోయిందనుకోండి, అప్పుడు దేవుడి ముందు వెలిగించిన దీపకాంతులు పరిసరాల చుట్టూ పరచుకొంటాయి. అలాగే, పిల్లల పుట్టిన రోజు సందర్భంలో కొందరు కొవ్వొత్తి దీపాలను ఆర్పుతుంటారు. ఇదీ పొరపాటు. మనది దీపాలను వెలిగించే సంప్రదాయమే కానీ, ఆర్పే సంస్కారం కాదు. ప్రతి రోజూ పొద్దున, సాయం సంధ్యా వేళ రెండుసార్లు దేవుని ముందు దీపాలు వెలిగించడం ఉత్తమ లక్షణం.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు.

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు.

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో!
🙏🙏🙏🙏🙏
పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!!
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

👉  భక్తులు అనేవారు నిత్యం లేదా వారానికొకసారైనా ఇంట్లో పూజలు చేస్తారు. అయితే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

👉  పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

👉 ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి.

👉 అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు.పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది. తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

👉   ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు.

👉  తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు.పూజలకు, జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి.

👉  ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

👉  అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.వట్టి నేలపై కూర్చొని జపించరాదు. పూజించరాదు. భుజించరాదు.'పూజ' అంటే 'భోగములను ప్రసాదించునది' అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

 📚✍ప్రభుత్వోద్యోగి  అదృశ్యమైతే....✍📚

♦ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకమా?

♦పైగా ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలా?

♦అదేమి నిబంధనంటూ హైకోర్టు ఆక్షేపణ

♦సంబంధిత జీవో కొట్టివేత

🌻ఈనాడు, అమరావతి: మృతి చెందిన, అదృశ్యమైన ప్రభుత్వోద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామక నిబంధనల్లో వివక్ష తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగి కనిపించలేదని ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటి నుంచి ఆ ఉద్యోగికి ఏడేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉంటేనే కుటుంబసభ్యులు కారుణ్య నియామకానికి అర్హులవుతారన్న నిబంధన వివక్షాపూరితమని తప్పుపట్టింది. 1999 ఆగస్టు 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 378లోని సంబంధిత నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ దాన్ని కొట్టేసింది. ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు వెంటనే కారుణ్య నియామకంతోపాటు అన్ని ప్రయోజనాలు అందిస్తున్నారని.. కనిపించకుండా పోయిన ఉద్యోగి  విషయంలో వీటి కోసం ఏడేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం సరికాదని పేర్కొంది. తగిన పోస్టులో కారుణ్య నియామకం కింద పిటిషనర్‌ శ్రీనివాసరావును నియమించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ప్లాంట్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న టి.సుబ్బారావు 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, 2001 డిసెంబర్‌ 31న ‘ఆచూకీ లభ్యం కాలేదు’ (అన్‌డిటెక్టబుల్‌) అని తుది నివేదిక ఇచ్చారు. ఆ విషయాన్ని 2002 అక్టోబర్‌లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి తెలిపారు. ఆ తర్వాత తన తండ్రి అదృశ్యమై ఏడేళ్లు పూర్తయినందున కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాసరావు విద్యుత్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. పిటిషనర్‌ తండ్రి అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదయినప్పటి నుంచి ఆయనకు ఏడేళ్లకు పైగా సర్వీసు లేదన్న కారణంతో కారుణ్య అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. దీనిపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలన్న నిబంధనను కొట్టేయాలని కోరారు.

♦ఆ షరతులు పథకం ఉద్దేశాన్ని నీరుగార్చేవే
‘అదృశ్యం కేసుల విషయంలో ఉద్యోగి కనిపించకుండా పోయిన ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకానికి విజ్ఞప్తి చేయాలని జీవోలోని నిబంధన చెబుతోంది. మరోవైపు అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదయినప్పటి నుంచి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని పేర్కొంటోంది. ఈ షరతులు కారుణ్య నియామక పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాయి. అదృశ్యమైన ఉద్యోగి.. మరణించారని ఏడేళ్ల తర్వాత ప్రకటిస్తేనే కారుణ్య నియామకానికి కుటుంబసభ్యులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈలోపు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి కుటుంబాల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుందని విశ్వసిస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

 నాన్న కూ కన్నీళ్లు ఉంటాయి👨‍👩‍👧‍👦

🐊 నాన్న మనకోసం ఏం చేశాడో*
ఏం కోల్పో యాడో  మనకు తెలియదు..!*

🐊 జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.
 
🐊 ఎందుకంటే..  నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్య కి అసలు చెప్పడు. అమ్మ లా ప్రేమ ను బయటికి చూపించడం నాన్న కు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*
 
🐊 ఎప్పుడూ పనేనా ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.
 
🐊 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.
🐊 వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*
 
🐊 తన పిల్ల లు గొప్ప వాళ్లు అవుతారని నాన్న కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.
 
🐊 ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా? నాన్న కూడా ఏడుస్తాడు.😰 కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*
 
🐊 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*
 
🐊 నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్న ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*
 
 🐊 కొడుకు ఎంత మంచివాడు ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా తండ్రి ని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.
 🐊 ,పిల్లల కోసం తన రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ ను నాశనం చేసుకుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది.
ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది 🐊 నాన్న లు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీ గా మిగిలిపోయారో.....

ప్రతి నాన్న కు 🙏

 సీతాపతీ పద్యకావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీసము
శ్రీ రామ రూపమ్ము శ్రీ సీత వరముగా
ఆనంద సౌఖ్యము ఆది పరము
శ్రీ ప్రేమ మాహాత్మ్య శ్రీ మతి కరుణయే
మాపైన చూపించి మదిని తెల్పె
శ్రీ శక్తి నామమ్ము రీతిగా కీర్తింతు
శ్రీ కర శుభకర సీఘ్ర మముగ
శ్రీ యుక్తి మనసుయే శ్రీ ముక్తి పరముగా
శ్రీ రామ ప్రార్ధింతు శక్తి మేర
తేటగీతి
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
రక్ష చేయుము మాయందు రమ్య మగును
కనికరముజూపు ఎప్పుడూ కలత తొలగు
కరములను మోడ్చి కోరెద కోర్కె తీర్చు.............25
...........
సీసము
విప్రప్రియుండను పేరు గొన్నావు
కరుణా కరుండయి గ్రాలినావు
ధర్మస్వరూపుడై దానవ నాశన   
సీతకుభర్త యై చెలిగినావు
మాయామృగంబును మర్ధించినాడవు
మహిమాన్వితము చూపి మనసు పంచె
కోరుకున్నారికీ కోరినంత సుఖము
కోటివిద్యుత్కాంతి కూడినావు   
తేటగీతి
ధరణి రఘుకుల శ్రేష్టుండై ధరిణినావు
ధర్మ పరిపాలన తరుణా దిత్యు డుగను
ధర్మ పరిరక్షణ ను చేయు ధర్మ పరుడు
రామచంద్ర రక్షింపుమా రాఘవేశ        ....... 26
--(())--
ऊँ! శ్రీ రాం
----
"సీ.
----
శ్రీభవ్యరూపమ్ము శ్రీభూతి వరముగ
     భావించెదనునేను భాస్కరాక్ష !
శ్రీదివ్యమాహాత్మ్య శీతల కరుణను
     మాపైన సారించు మరుని తండ్రి !
శ్రీశ్రావ్య నామమ్ము రీతిగా కీర్తింతు
    క్షేమశమనమిచ్చు  సిరులకొఱకు
శ్రీముక్తివరదుని శ్రీశుని ప్రార్థింతు
నెపుడును తుష్టిని యిడుమనుటకు
గీ.
--
అబ్జనాభ !  కమలనేత్ర ! యాగకర్త !
కమలహృదయస్థ ! మోహన గానలోల !
కనికరముఁజూపు మాయందు ఫణిసుతల్ప !
కరములనుమోడ్చి వేడెద సురవిశేష !!! "
------------.......,....... 27

No comments:

Post a Comment