మధురిమలు --- మాతృశ్రీ ప్రేమ సాగే
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చీకటైన వెల్గు ఉన్న - తల్లి మనసు సాగే
మక్కువైన కోపమున్న - మాతగా మాతొ సాగే
చిక్కులు తేలికై వున్న - అమ్మగా మార్పు సాగే
తక్కువైన ఎక్కువున్న - అమ్మ కోపమే సాగే
అన్న నైన అక్క నన్న - మము ఆదుకుంటూ సాగే
ఎన్నిచెప్పి మబ్బు లన్న - వర్షమె పడినా సాగే
మన్నన గుణ మార్పులన్న - విధి భావమే అని సాగే
నే ననే నెపమే నన్న - పలు మాటలన్ని సాగే
మంచిఅన్న చెడ్డ అన్న - ఉన్నమాట లతొ సాగే
ఉన్న పంది కొక్క అన్న - గుంటనక్కలుగ సాగే
వచ్చి చెప్పె వాక్కు విన్న - తల్లిగాను మము సాగే
ఇచ్చమున్నను లేకున్న - మనోగతం విని సాగే
మూడుకన్నులే ఉన్న - తక్కువ యన్నా సాగే
పంచి చెప్పడాని కున్న - ఏమీ అనకా.సాగే
ఒప్పడాన్కి తెల్పియున్న - మము జూచి కాచి సాగే
చీకటైన వెల్గు ఉన్న - మమతయు రాగము సాగే
దైవ పార్వతి నన్న - మమ తల్లిగా సాగే
మక్కువైన కోపమున్న - మాతగా మము సాగే
చిక్కులున్న తేలికన్న - అమ్మగా మమ్ము సాగే
తక్కువైన కృపా అన్న - ఎక్కువైన నే సాగే
--(())--
#మాఘ_పురాణం - #1_వ_అధ్యాయము
తేదీ : 12-02-2021 శుక్రవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#మాఘమాస_మహిమ*
☘☘☘☘☘☘☘☘☘
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
ప్రపంచ దేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశం లో హిమాలయాది పర్వతములు, గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకు రానిది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి..'స్వామీ ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్ది ప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట.., ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాస మేర్పరచుకొన్నారు.
వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూ వుండేవారు. అలాగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.
ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము నొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూత మహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూత మహర్షి ! మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్ట వశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.
సూత మహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి.., పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను.
అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు.
అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు.
మహర్షులారా.! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది.. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువు కొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.
పార్వతీదేవి పరమేశ్వరునితో.."విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. #మాఘ_మాస మహిమను వివరింప గోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు.. "కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది.. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమి ఉండును ? తప్పక చెప్పెదను , వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా #మాఘ_మాసము న ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగోట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడును. ప్రయాగలో #మాఘ_మాసం లో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో గాని, సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా.. , తెలిసి కాని , తెలియక కాని , బలవంతంగా కాని #మాఘ_మాసము న ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియు పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.
మాఘస్నానమును మాని, విష్ణువు నర్చింపక, దానము చేయక పురాణమును వినక #మాఘ_మాసము ను గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపము లెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మద గర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మల నొందుదురు సుమా.., దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘ స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , #మాఘ_మాస ప్రాతఃకాలము యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని, బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘ స్నానము చేయలేక పోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానము గాని చేసిన స్నానఫలము నొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యము కల్గును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ ! మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము.. దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో #మాఘ_మాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో #మాఘ_మాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్త వృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘ మాస స్నానము చేయువారిని నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరుపర్వతము ఉత్తమము. కావున మాఘ మాస స్నానము అంత పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సు నొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు..'మహారాజా ! పరమ పవిత్రమైన #మాఘ_మాసము న నీ సరస్సున స్నానము చేయకుండ పోవుచున్నావేమి. #మాఘ_మాసమున చేయు నదీస్నానము కాని , సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పుడని కోరగానతడు... రాజా.. నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము.. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
దిలీప మహారాజు మాఘ మాస స్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కుల గురువైన వశిష్ట మహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘ మాస స్నాన మహిమను తెలుప గోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. #మాఘ_మాసము చాలా విశిష్టత కలిగినది. #మాఘ_మాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. #మాఘ_మాసమున ప్రాతఃకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలము లనిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ, పురాణ శ్రవణాదుల వలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘ మాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి.. అట్టి వారిలో భృగు మహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశము నందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము, మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి.. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడోకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై, మనోహరమై, విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులి మొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగా నున్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యము లన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా ! ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు., నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులి మొగము నాకు బాధాకరముగ నున్నది. దీనిని పోగొట్టుకొనుట యెట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుట లేదు. దయయుంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించెను.
భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది.. వానికి సాయపడవలయు ననుకొన్నాడు. నాయనా.. పురాకృతకర్మము యెవనిని విడువదు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను #మాఘ_మాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికము చేసినచో వచ్చు ఫలితము.., #మాఘ_మాసము లో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని యే స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును యే ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభము.. కావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘ స్నానమును, యిష్టదేవతా పూజను అచట నున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘ స్నానమును, తీరమున యిష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞడై, మునికి భార్యతో బాటు నమస్కరించెను. అతని యాశీర్వాదము నొంది తన భార్యతో బాటు తన లోకమున కెగెను.
దిలీప మహారాజా..! మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను...
#మాఘ_పురాణం 1వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..
🌻 *"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట!!* *ఎందుకని?* 🌻
🍃🌺కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్య.
🍃🌺లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి.
🍃🌺ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.
🍃🌺లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే ప్రింటింగ్ ప్రెస్సువచ్చిన తరువాత. లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు ".
🍃🌺పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించుకొని తినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు. ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి.
🍃🌺ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో. ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది.
🍃🌺ప్రింటిగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు.
🍃🌺వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది.
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు నుండి సేకరణ)
🙏 *ఆపదమొక్కులవాని నిత్యార్చన ఎలా వుంటుంది?* 🙏🍃🌺కలియుగప్రత్యక్షదైవమైన శ్రీవెంకటేశుని ప్రతినిత్యం ఎన్నో రకలైన సేవలతో కొలుచుకుంటూ పునీతులయ్యే భక్తులకు, స్వామివారి ఆలయం తెరిచే విధానం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత సహజంగానే కలుగుతుంటుంది.
🍃🌺భక్తుల పాలిటి కొంగుబంగారం, ఆపదమొక్కులవాడు, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ పుణ్యఫలమే తప్ప, మరేమీ కాదు.
🍃🌺తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం, ప్రతిరోజూ సుప్రభాతమనే మేలుకొవుపు సేవతో ప్రారంభమై బంగారువాకిళ్ళు తెరవబడతాయి.
🍃🌺తిరుమలలో ప్రప్రథమంగా శ్రీవారి దర్శనభాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి సన్నిధిగొల్ల. శ్రీస్వామి సన్నిధిసేవతో సంబంధించిన వ్యక్తి ఆబట్టి ఈయన్ని సన్నిధిగొల్లని పిలుచుకుంటాం...
🍃🌺ప్రతిరోజూ బ్రాహ్మీముహూర్తంలో సన్నిధిగొల్ల దివిటీని పట్టుకుని తిరుమల ఉత్తరమాడ వీధిలోనున్న వైఖానసులైన అర్చకుల తిరుమాళీగకు (ఇంటికి) వెళ్ళీ, ఆరిని ఆలయానికి రమ్మని ఆహ్వానించడాం జరుగుతుంది.
🍃🌺వెంటనే అర్చక స్వాములు, జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు శ్రీవైష్ణవస్వాములు, వేదవేత్తలు, భాగవతోత్తములు, భక్తులు, అధికారులు, పరిజనం బయలుదేరుతారు. అర్చకస్వాములు కుంచెకోల (ఇనుపకొక్కెం) ను భుజంపై పెట్టుకుని, తాళం చెవులగుత్తిని తీసుకుని సన్నిధిగొల్ల వెంట బయలుదేరుతారు.
🍃🌺అనంతరం వీరంతా దారిలో శ్రీభూవరాహస్వామివారి ఆలయానికి ఆత్మ ప్రదక్షణం చేసి నమస్కరించుకుని శ్రీవారి ఆలయం పడికావలి (మహాద్వారం) వద్దకు చేరుకుంటారు.
🍃🌺అప్పుడు ఆలయగోపురానికి ఎదురుగానున్న మెట్లకు దక్షిణంవైపు మేడ మీద ఉన్న నగారామంటపంలో (నౌబత్ ఖానా) శ్రీవారి అర్చకుల రాక తెలియజేయడానికి అన్నట్లుగా పెద్ద పలక గంటను మోగిస్తారు.
🍃🌺అప్పుడు గోవిందనామ స్మరణతో మహాద్వారం తెరువబడుతుంది. సన్నిధిగొల్ల ముందు పోతుండగా, ప్రధాన ద్వార దేవతలకు నమస్కరించి, ధ్వజ ప్రదక్షిణ పార్శ్వం నుంచి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి సువణద్వారం దగ్గరున్న ద్వారపాలకుల పురోభాగానికి చేరుకుంటారు.
🍃🌺అర్చకస్వాములు శ్రీవారి బంగారు తలుపులకుగల లోపలి గడియను మంత్రపూర్వకంగా కుంచెకోలతో తీస్తారు. ఆ తలుపులకు బయట సీలు చేసిన చిన్న సంచి (తిత్తి) లోని తాళాలతో బంగారు వాకిలి తలుపులను తీస్తాడు సన్నిధిగొల్ల.
🍃🌺వెంటనే అర్చక స్వాములు, కౌసల్యా సుప్రజా రామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నర శార్దూలా, కర్తవ్యం దైవమాహ్నికం అని సుప్రభాతాన్ని పఠిస్తుండగా, అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు.
🍃🌺అనంతర ద్వారాలను కూడా తెరచి, శ్రీవారి సన్నిధానానికి చేరి, శ్రీవారి ఆజ్ఞ గైకొని, నిద్రిస్తున్న శ్రీభోగ శ్రీనివాసవామీఅరి సన్నిధానానికి వచ్చి, కరతాళ ధ్వానాలు చేసి, ప్రణవపూర్వకంగా, మంత్ర పూర్వకంగా శ్రీవారిని నిదుర లేపి, శ్రీవారి సన్నిధానాన, వారి స్వస్థానంలో వేంచేపు చేస్తారు.
🍃🌺అనంతరం దీపోద్దీపనం, గర్భాలా సమార్జనం చేస్తారు. పరిచారకులు తెరను వేయగా, అర్చకుడు స్వామివారికి వెన్న, పాలు, పంచదార నివేదనం చేస్తారు. కర్పూరైలాలవంగ జాజీక్రముకాది చూర్ణంతో కూడిన సుగంధి తాబూలాన్ని సమర్పించి నీరాజనం చేస్తారు.
🍃🌺అర్చకుడు తాను తీర్థస్వీకారం చేసి శఠారి తీసుకుని, అక్కడున్నవారికి కూడ తీర్థం శాఠారీ చేయిస్తాడు.
🍃🌺సువర్ణద్వారం ముందున్న భక్తులు చేసే మంగళశాసనం పూర్తికాగానే సువర్ణద్వారం తలుపులు తెరువబడతాయి. అప్పుడు శ్రీవారికి కర్పూరహారతి చేయబడుతుంది. ఇక భక్తులకు స్వామి దర్శనం లభిస్తుంది.
🍃🌺అలా స్వామివారి నిత్యారాధన కోసం ఆలయ ద్వారాలు తెరవబడతాయి. అనంతరం స్వామివారికి వివిధ సేవలు చేయబడతాయి. ఇందులో నిత్యసేవలు, ఆర్జితసేవలు అంటూ స్వామివారికి భక్తుల సేవ కొనసాగుతుంది.
🍃🌺ఆయన భక్తులకు తనకు సేవలు చేసుకునే అవకాశాన్నిచ్చి ఆయా భక్తుల జీవితాలలో కొత్త వెలుగులను నింపుతున్నాడు. ఎంతయినా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్త జనవరదుడుకదా!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[11/02, 6:50 am] +91 94414 08564: 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 90* 🕉
*మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం*
*చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి* *చూడంగ నెట్లనినంగీటఫణీంద్రపోతమదవే* *దండోగ్రహింసావిచా*
*రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా....
🌹ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని.
🌹నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాముగానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మముల యందు ధ్యానించి యుండలేదు కాబోలు.
🌹అందుకే అట్టి జన్మము రాక అపవర్గ
మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
సాధారణంగా మనిషి ఎంత వీలైతే అంత తన పనిని తప్పించుకొని, సులువైన మార్గం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. తన సుఖానికి అడ్డు వచ్చిన దాన్ని అణిచివేసి తన ఆధిపత్యం చెలాయిస్తూ బ్రతుకుతాడు. మిగతా జీవరాశులు వాటి పని అవి చేసుకుంటూ వాటి మానాన అవి బ్రతుకుతాయి, లభించినవాటితో సంతృప్తిగా ఉంటాయి. మనిషికి ఉన్న దానితో తృప్తి లేదు, ప్రక్కవాన్ని చూసి సహించలేడు. ఇంకితాన్ని పూర్తిగా వదిలి మానవుడు దుష్ప్రవృత్తికిలోనవుతున్నాడు అనేది మనం గమణిస్తున్నాం. మానవ జన్మ విలక్షణమైనది. మనిషి తనకున్న జ్ఞానం ద్వారా కర్మను సవ్యంగా ఆచరిస్తూ బ్రతక గలడు. మనం ఎట్లా బ్రతకాలో, మన లక్ష్యం ఏమిటో తెలిస్తే జీవితాన్ని సవరించుకొని బ్రతకవచ్చు.
మరి ఆ జ్ఞానం లభించేది ఎలా ? మనకున్న ఇంద్రియాల ద్వారానో, ఊహతోనో నిర్ణయించి చెప్పలేం. మనం ఈనాడు అనుకొనే ఆధునిక విజ్ఞానం కేవలం కనిపించిన దాన్నే నమ్ముతుంది. కానీ ఇంత విశ్వాన్ని గుర్తించడానికి మన ఇంద్రియాలకున్న శక్తి సంకుచితం, మన ఊహ అల్పం. దీన్ని గుర్తించిన మన పూర్వులు కనిపించని లోపటి ప్రపంచం వైపు దృష్టి సాగిస్తూ ఎంతో కాలంగా సాగించిన తపస్సమాధి దశలో వారు ఒక శబ్దాన్ని గుర్తించారు. మన మనుగడకు కారణమైనది ఆ శబ్దం. మనం కోరిన ఫలాన్ని ఇవ్వగలదు కనుక దాన్ని వేదం అని అంటారు. అది మనల్ని శాసించగలదు కనుక శాస్త్రం అని అన్నారు. వేదం అనేది అలౌకికమైనది. సహజమైనది. ఎవరో తయారుచేసినది కాదు. అందుకే దాన్ని అపౌరుషేయము అని అంటారు. ఎదో ఒక ఫలానా భాషలో వ్రాసినవి కావు. బాషలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే, భాషలేవీ లేని నాడు ఉన్నది వేద శబ్దం. అసలు భాషలన్నీ ఏర్పడ్డవి వేద శబ్దంలోంచే అనేది భాషా ప్రావిణ్యం ఉన్న వారు చెప్పే మాట. ఏలాంటి స్వార్థంలేక కేవలం మన బాగు కోసం చెప్పే ఆప్తుల ద్వారా అందినది కనుక దానికి ఆప్తవాక్యం అని పేరు. దాన్ని కేవలం ఒకరి నుండి మరొకరు నేర్చేది ఉచ్చారణ-అనుచ్చారణ ద్వారానే కనుక దానికి శృతి అని పేరు. అట్లా ఎన్నో లక్షల సంవత్సరాల నుండి మన జాతి వేదాన్ని తన సంపదగా కాపాడుకుంటూ వస్తుంది.
వేదం అనేది ఈ జగత్తుకు కారణమైన పరమాత్మ గురించి చెబుతుంది, జీవ పరమాత్మల సంబంధం గురించి, మనం చేరాల్సిన లక్ష్యం గురించి చెబుతుంది, ఇలా మన ఊహకు అందని ఎన్నో విషయాలను తెలుపుతుంది. మొత్తానికి వేదం చెప్పదలుచుకున్నది ధర్మాన్ని, అంటే మన ఆచరణని, మనకున్న నియమాలని, కట్టుబాట్లని. ఒక రైతు తన పంటకు గట్లు వేసి ఒక క్రమ పద్దతిలో నీటిని ప్రసరింపజేస్తాడు. అట్లానే మనిషి యొక్క జ్ఞానం విశృంఖలంగా ప్రవర్తించకూడదు. అట్లా వేసిన గట్లే మన శాస్త్రాలు. మనిషి తన సుఖం కోసం ప్రకృతి నియమాలను విస్మరిస్తాడు కనుకనే మనిషికి శాస్త్రం అవసరమైంది.
అయితే వేదం నుండి నేరుగా విషయాలను గుర్తించడం అంత సులభం కాదు. మన బాగు కోసం భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీత, ఏదో తనకు తోచి చెప్పినది కాదు. వేదంలో అక్కడక్కడా చెదిరి ఉన్న విషయాలను ఒక చోటకు చేర్చి పాటవలె పాడి వినిపించాడు. వేదాన్ని మరింత వివరంగా తెలుపడానికి బయలుదేరినవే స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు , ఆగమాలు మరియూ ప్రబంధాలు. ఇవన్ని జీవ నిర్మితాలు. అందుకే వాటిని స్వీకరించే ముందు వేదానికి అనుగుణంగా ఉన్న వాటిని చూసి స్వీకరించాలి. అట్లా వేద వాంగ్మయాలలోని విలువలను గుర్తించి బ్రతికితేనే అది ప్రామాణికమైన జీవనం అవుతుంది. మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది.
మనం ఏర్పర్చుకున్న కర్మ బంధం అనేది ఒక దీపానికి పట్టిన మసి వలే మన యొక్క అసలు స్థితిని గుర్తించవీలులేనట్టుగా అంటి ఉంది. మనకంటూ ఒక ఆనంద స్థితి ఉందని మరచిపోయాం. దాని వల్లే ఎన్నో క్లేషాలు పొందుతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని తనంత ఆనంద స్థితికి చేర్చాలని అనుకుంటాడు. మనల్ని ఉద్ధరించడానికై భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. మనం ఉన్న ఈ కలియుగానికి భుజం భుజం రాసుకొనేంత చేరువలో ఉన్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. రామావతారంలో మాదిరిగాకాక తను కేవలం మానవుడిని అనే హద్దు అనేది లేకుండా దేవుడిగానే వచ్చాడు శ్రీకృష్ణావతారంలో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు, ఎన్నో ఉపదేశాలు చేసాడు. మనల్ని బాగు చేద్దాం అని కొండంత ఆశతో వచ్చాడు, కానీ మనం మనమే తప్ప మనలో మార్పు అనేది లేదు. ఎండకు ఎండం. వానకు తడవం. గాలికి చెదరం. అట్లాంటి మన ప్రవృత్తికి విసిగి ఉన్న పరమాత్మని మనల్ని ఒక చోటికి చేర్చింది అమ్మ గోదాదేవి. సమస్త వేదాల సారం అని పిలవబడే తిరుప్పావైని భగవంతుణ్ణి చేరే మెట్ల మాదిరిగా అందించింది. ముప్పైపాటల తిరుప్పావైని ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఆమె పాడిన పాటల్లో తను ఉన్నాడు. ఆమె పాటలకు శ్రీరంగనాథుడే చలించి గోదాదేవిని తనవద్దకు రప్పించుకొని వివాహమాడాడు. మనకోసం తనను తానే సమర్పించుకుంది అమ్మ గోదాదేవి. ఆమెను స్వీకరించాడు అంటే, ఆమె మాటలని ఒప్పుకున్నట్లే కదా! ఆమె పాడిన పాటల్ని మనం పాడగలిగితే చాలు.
ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి ? మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడ్డది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాల తక్కువ. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏమైనా సాధించాలి అంటే ఇపుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేలు జీవుడిని సూచిస్తే, ప్రక్కన ఉన్న మూడు వేల్లు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు మరియూ సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేలు సాత్వికాన్ని తెలిపేది, చిన్నది. బ్రొటనవేలు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేలును బ్రొటనవేలు వైపు వంచడమే జ్ఞాన ముద్ర. దాని ఆచరణనే ధనుర్మాస వ్రతం,అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం సాత్విక ప్రవృత్తి పెంచుకోవడానికి సరియైన సమయం, అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవా
ఆత్మశుద్ధి
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది.దీనికి ఉదాహరణగా ఒక కథ.
ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది.ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించ సాగింది.
అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పుసీసా మూత తీయడం జరిగింది.వెంటనే బ్రతికేనురా జీవుడా అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కాని సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది.ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంట బడింది.వెంటనే ఆ చీమ “ఏం మిత్రమా! అలా అయిపోయేవు? క్షేమమేనా?”అని అడిగింది. “ఏం క్షేమం?అంతా క్షామమే” అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం! ఆ మొదటి చీమ అతిమధురమైన పంచదారనే వెగటుగా ఉంది అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది.కారణం అంతుబట్టలేదు.ఎందుకైనా మంచిదని మొదటి చీమను నోటిని తెరవమని అందులో ఉన్న ఉప్పు కణాలను తీసివేసింది.అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు.
అలాగే మనిషిలో అరిషడ్వర్గాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది.ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం.
( ఇది ఆంధ్రప్రభ దినపత్రికలో "చింతన" శీర్షికన తే.10.04.2018 దీని ప్రచురితమైంది. )
*దేహంలో సగం*
డైనమైట్ను కనుగొనడంలోను, దాని ఆవిష్కరణ ద్వారా లభించిన అపారమైన సంపదతో నోబుల్ బహుమతి వ్యవస్థకు రూపకల్పన చేయడంలోను ఆల్ఫ్రెడ్ నోబుల్కు ఆయన ప్రేయసి బెర్త్ అనురాగమే అపురూపమైన ప్రేరణగా చెబుతారు సాహితీవేత్తలు.
లోకంలో భార్యాభర్తల మధ్య ఆ తరహా అనురూప దాంపత్య రసయోగం సిద్ధించాలని వేదం ఆకాంక్షించింది. వేదమంత్రాల్లో అన్యోన్య అద్వైత స్థితిని పునాదిగా నిలిపింది. దంపతులు- అని కాకుండా ‘దంపతి’ అంటూ సంబోధించింది. ఏకత్వాన్ని సంభావించింది. విడివిడిగా ఉన్నప్పుడు విభిన్న స్వభావాలతో గోచరించే వివిధ పరిమళ ద్రవ్యాలు తాంబూలంగా కలగలిసిపోయినట్లు- దంపతులు సైతం అద్భుత అద్వైత స్థితిలో దాంపత్య జీవితాన్ని పండించుకోవాలని వేదం ఆశీర్వదించింది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేరణగా, ఒకరి వెలితికి మరొకరు పూరణగా నిలవాలని సూచించింది.
తమలపాకులు వక్కపలుకులు యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కొత్తసున్నం... అన్నింటి తత్వాలూ విలక్షణమైనవే. అవి విడివిడిగానే ఉన్నప్పుడు వాటికి తాంబూలం అనే పేరుండదు. నోరూ పండదు. ఎందుకంటే తాంబూలానికే తప్ప ఆ విలక్షణత పరిమళ ద్రవ్యాలకు విడిగా లేదు మరి! లేదంటే- లేదనా?... కలిస్తే ఉందని! విశేషమంతా కలయికలో ఉంటుంది. అదే మాదిరి విభిన్న స్వభావాలు, బలమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండే స్త్రీ పురుషులు తాళిబొట్టు సాక్షిగా తాంబూలంగా మారిపోవడమే పెళ్ళంటే! అర్ధాంగి- దేహంలోనే కాక ఆత్మలోనూ సగం కావడమే దాంపత్యరస సిద్ధి. ఆ అద్భుత అద్వైత స్థితిలో ఒకరికొకరు స్ఫూర్తి అవుతారు. తమ రంగాల్లో గెలుస్తారు!
నిజజీవితంలో అలాంటి గొప్ప ఆలంబన దక్కడం ఒక అదృష్ట విశేషం. వెలుపలినుంచి అలా ప్రేరణ లభించకపోయినా లేదా అవకాశం దక్కకున్నా- కవులు కళాకారులు సృజనకోసం తమలోనే ఇమిడి ఉండే ప్రకృతి సిద్ధమైన అర్ధ నారీశ్వర తత్వాన్ని ఆశ్రయిస్తారని అనుభవజ్ఞుల అంచనా.
ప్రతి పురుషుడిలో కొన్నిపాళ్లు స్త్రీ ప్రకృతి కలగలిసిపోయి ఉండటాన్ని ఆంగ్లంలో ‘ఏండ్రొజనీ’ అంటారు. తనలో ఆ ప్రవృత్తే లేకుంటే- మనిషి మేధావి కాలేడన్నది ప్రముఖ ఆంగ్లకవి విలియమ్ కాల్రిడ్జి మాట. మగవారిలో మార్దవానికి అదే ముఖ్యమైన ముడిసరకు అన్నారు మన పెద్దలు. ‘పురుషుడి ప్రతి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుంది’ అంటూ ఆ ఉనికిని లోకోక్తిలో ఇమిడ్చి అందించారు. మగవారిలో వ్యక్తమయ్యే చక్కని సృజనాత్మక వైఖరికి, వారిలో అంతర్గతమైన స్త్రీ తత్వమే మూలధాతువని వివరించారు. ‘ప్రతి విజేతా తనలో తల్లిగుణాలు కలిగి ఉంటాడు’ అన్నారు. పండితుడు- భావుకుడు సైతం కావడం, గణితశాస్త్ర మేధావి- మంచి కవిగానూ రాణించడం... అందుకే సాధ్యమవుతుంది.
మెదడులోని కుడి ఎడమ భాగాల మధ్య కుదురుకొనే ఈ తరహా చక్కని సమన్వయ విభావరినే పురాణాలు ‘అర్ధ నారీశ్వర తత్వం’గా అభివర్ణించాయి. కుమారసంభవంలోని సుప్రసిద్ధ శ్లోకం ‘వాగర్థా...’లో ఇదే తత్వాన్ని మహాకవి కాళిదాసు బలంగా ప్రతిపాదించాడు. ‘పార్వతి శివుడిలో సగం’ అనే భావనకు తాత్పర్యంగా నిలిపాడు. ఈ అర్ధ నారీశ్వర తత్వం బాగా అవగతమైతే- జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరిస్తూ ప్రముఖ రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్- ఆ బహుమతిని ఈ సృష్టిలోని అర్ధ నారీశ్వర (ఆండ్రొజినస్) స్వభావానికి అంకితం అంటూ ప్రకటించడంలోని ఆంతర్యం బోధపడుతుంది. అటు శివతత్వమూ ఎరుక అవుతుంది.ఈనాడు అంతర్యామి
✍🏻ఎర్రాప్రగడ రామకృష్ణ
*పెళ్ళికి వేళాయరా! - సరదా కథ*
'అవతల పెళ్ళివాళ్ళొచ్చే వేళయింది.. అమ్మాయినింకా రడీ చేయలేదేంటే! చింపిరి జుట్టు.. చిరిగిన ఓణీ.. మాసిన పరికిణీ.. నట్టింట్లో ఈ కుక్కిసోఫా.. డొక్కు టీవీనా! ఫర్నిచరింకా మార్చలేదేంటే!'
'మీరేగదండీ! ఇంటికెవరన్నా కొత్తవాళ్లొస్తుంటే.. వరదల్లో సర్వస్వం కొట్టుకుపోయిన వాళ్లకుమల్లే దేభ్యం మొహాలేసుకు తిరగమందీ!'
'ఓసినీ..! ఆ వచ్చేవాళ్ళేమన్నా వరదనష్టం రాసుకుపోయేవాళ్ళా! పిల్లను చూడ్డానికొచ్చేవాళ్లే! ఇల్లంతా ఇట్లా దొంగలుపడి దోచుకుపోయినట్లుంటే అట్నుంచటే తారుకుంటారే తాయారూ! ముందు అమ్మాయిని కందనపు బొమ్మల్లే తయారుచేయ్! నువ్వూ తయారవ్! పనమ్మాయికూడా కంచిపట్టు చీరెలో కళ్ళు జిగేల్మనేటట్లుండాల! ముందీ దరిద్రపు ఫర్నిచరంతా అవతల పారేయించి బెంగుళూర్నించి తెప్పించి చేయించిన ఆ సామాన్లని సర్దించూ! ఉప్మాలో జీడిపప్పు దంచు! జిలేబీ.. లడ్డూలు.. నాలుగురకాలూ డ్రింకులూ రడీగా ఉంచు! ఇంకా..'
'అర్థమయిందండీ! ఇహ చూడండి నా ప్రతాపం! ఆ వచ్చినవాళ్ళు మన డాబుకి డంగై మూర్ఛొచ్చి పడిపోకపోతే నేను ఆగుమయ్య పెళ్లాన్నే కాదు'
'అంతొద్దు! ముందా శపథాలు మానేసి కథ నడిపించు.. ఫో!' అంటూ ఆగుమయ్య ఊడే పంచను పైకెగలాగుకొంటూ కార్లు వచ్చిన అలికిడికి హడావుడిగా బైటికి పరుగెత్తాడు!
అరడజను కార్లలో డజనుకు పైగానే ఆడా మగా డాబుగా దిగి లోపలికొచ్చి కూర్చున్నారు. అందరు కొత్త వెయ్యినోట్లులా ఫెళఫెళలాడిపోతున్నారు. అసలు పేళ్లికోడుకెవరో అంతుబట్టేటట్లు లేదు! పెళ్ళిళ్ల పేరయ్య పెళ్ళికొడుకు తండ్రిని పరిచయం చేసాడు.
పెళ్ళిచూపులు మొదలయ్యాయి.
'ఇదే మా బంగారు కొండ!' అన్నాడు అప్పుడే వచ్చి కూర్చున్న కూతుర్ని మురిపెంగా చూపించి ఆగుమయ్య. పైనుంచి కిందిదాకా బంగారు తొడుగుల్తో ఆ ఏడుకొండలవాడికన్నా వైభోగంగా వెలిగిపోతున్న పిల్లను చూసి 'బంగారు కొండ కాదు. కొండ బంగారం లాగా ఉంది!' అంది పెళ్ళికొడుకు తల్లి పిల్లపక్కన చేరి గాజుల చేతిని తీసుకుని బంగారం గీరి చూస్తూ.
'వదినగారూ! అన్నీ ఒరిజనలే! బంగారం రేటు కొండెక్కి కూర్చున్నా పెళ్లికి పనికొస్తాయని ఈ మధ్యే ప్రొద్దుటూరునుంచి పదికిలోలు తెప్పించి చేయించారు మీ అన్నయ్యగారు' అంది తాయారమ్మ.
'అవును చెల్లమ్మా! ఇంకా ఇన్ని బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయి. లాకర్లు ఖాళీగా లేకపోతే వూరికే పడుండటమెందుకని మా పక్కింటివాళ్లక్కూడా పెట్టుకోమని పడేస్తుంటాం. మా కుక్క మెడగొలుసుకూడా ఉమ్మిడియార్ వారి బంగారంతో చేయించిందే!'
'ఇవన్నీ..?'
'మీ అనుమానం అర్థమైందిలేండి బావగారూ! చేసేది ఇసక తవ్వుకునే వ్యాపారం కదా! ఇవన్నీ వీడికెలా వచ్చాయనేగా డౌటు! మీకు తెలీనిదేవుంది? హ్హిఁ! హ్హిఁ! ఇవే కాదు! ఈ నట్టింట్లో పెట్టించిన హోం థియేటర్నుంచి.. స్నానాలగదిలో కట్టించిన పాలరాయి తొట్లదాకా అన్నింటికీ బిల్లులు కూడా ఉన్నాయి సారూ! చూపిస్తానుండండి!.. ఈ బిల్లు భజగోవిందం పేరుతో ఉంది. భజగోవిందమంటే మా బావమరిది. ఈ ఇంటిపేపర్లు మావూళ్లయ్య పేరుతో ఉన్నయ్! మావూళ్లయ్యంటే మా ఊళ్లో ఓ మామూలు బడిపంతుల్లెండి! పాలేరు పేరుతో మా పల్లెల్లోనే ఓ పాతికెకరాల కొబ్బరితోట కొని పడేసాను. ఈ ప్లాట్లూ.. ఫ్లాట్లూ కాదుగానీ కొని దాచలేక నేను పడే పాట్లు ఆ దేవదేవుడికే తెలియాలి. మీకు తెలీనిదేముంది? ఈ రోజుల్లో ఇసుక వ్యాపారం అనేసరికి గిట్టనివాళ్ళేవేవో కతలు కతలు అల్లుతుంటారు! అల్లరి పెడతుంటారు. రోజూ టీవీల్లో.. పేపర్లల్లో వచ్చే భాగోతాలు చూస్తూనే ఉన్నారు గదా!'
'అన్నయ్యగారికి ఇళ్లూ వాకిళ్లూ అన్నీ వివరంగా చూపించండీ! లేకపోతే ఇదంతా ఏదో పిట్టలదొర కబుర్లు అనుకోగలరు' అంది తాయారమ్మ.
'ఆ మాటా నిజమేనే! బావగారూ! ఏదో మీ సంబంధానికి మేమూ కాస్తో కూస్తో సరితూగగలమని చెప్పుకోడానికే ఈ సోదంతా! ఇవికాక బంజారాహిల్సులో రెండు బంగళాలుకూడా ఉన్నాయి! లోపలికి రండి! ఈ బాత్రూము కిందున్న రాయి ఎత్తితే అమ్మాయి పేరున దాచిన బ్లూషేర్లు ఒకైదుకోట్లదాకానైనా కనిపిస్తాయి. ఎకౌంటు చేయడానికి కుదరని హార్డు క్యాషైతే ఇంకో రెండు రెట్లు అదనంగానే ఉండొచ్చు!
'వచ్చి అరగంట దాటింది. పిల్లగురించి వాళ్ళింకా ఒక్కముక్కయినా అడగ లేదు. గుక్కతిప్పుకోకుండా మీ పాటికి మీరు మీ దండకం చదువుకుపోతున్నారు! ముందు వాళ్లనో గుక్క కాఫీనీళ్లైనా తాగనివ్వండీ!' అంది తాయారమ్మ,
అప్పటిగ్గానీ ‘నిజమేనే! అమ్మాయిచేత ఆ టిఫిన్లేవో పంపించు!' అని వెనక్కి తగ్గారుకాదు ఆగుమయ్యగారు.
వేడి వేడి ఉల్లిగారెలు.. పొగలుకక్కే జీడిపప్పు ఉప్మా.. జాగర్లమూడి నేతిలో ముంచి తేల్చిన జిలేబీలూ లాగించి.. కాఫీ టీలు ముగించి.. వచ్చినవాళ్లు త్రేన్చుకుంటూ లేచేసరికి నడిఝాము నెత్తికెక్కింది.
పెళ్లివారిని కార్లదాకా సాగనంపుతూ చివరి నినిషంలో ఆగలేక పెళ్లికొడుకు తండ్రిని అడిగేశాడు ఆగుమయ్య 'పిల్ల నచ్చినట్లేనా? ఇంకా ఏమన్నా అనుమానలున్నాయా బావగారూ?'
'అన్నీ దగ్గరుండి సాక్ష్యాలతో సహా వివరంగా చూపిస్తిరి. ఇంక అనుమానాలకు తావేముంటుంది ఆగుమయ్యగారూ! ఏ సంగతీ రేపే మన పేరయ్యగారిద్వారా కబురుచేస్తాంగదా! మీరు అందుబాటులో ఉండండి చాలు' అంటూ వాళ్లు చక్కా వెళ్లిపోయారు.
మర్నాడు పేరయ్య గంతులేసుకొంటూ రానే వచ్చాడు. 'కొంపముంచేశారండీ బాబూ! వాళ్లు పిల్లను చూడ్డానికని వచ్చినవాళ్లు కాదట! అవినీతి నిరోధకశాఖ వాళ్లు! మామూలుగా వచ్చి దాడిచేస్తుంటే ఎవరూ పెదవి విప్పటంలేదని .. ఇట్లా కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నార్ట! మీరేమో ఆత్రం ఆపుకోలేక సాక్ష్యాలతో సహా సర్వం విప్పి చూపించేసారు! ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని మీమీద పక్కా కేసొకటి బుక్కయిపోయిందక్కడ!'
'గాడిద గుడ్డులేవయ్యా! పాతికేళ్లబట్టి వ్యాపారాల్లో నలిగేవాడికి ఆ మాత్రం ఫ్లాట్లూ..ప్లాట్లూ, కార్లూ.. షేర్లూ, తోటలూ.. దొడ్లూ, నగా నట్రా అమరవా ఏంటయ్యా! ఈ కుట్ర నిలబడేది కాదులే! తేలిపోయేదే చివరికి! ఎన్ని చూడ్డంలా!’
'ఎట్లా తేలిపోతుంది మహాప్రభో! అల్పారంలోనే మీరు అంత దిట్టంగా కుమ్మేస్తిరి! జీడిపప్పు ఉప్మాలు.. నేతి జిలేబీలు గట్రా గట్రా ఎట్లా ఏడ్చినా.. ఆ ఉల్లిగారెలున్నాయ్ చూసారూ.. అవి మిమ్మల్ని పట్టించేసాయ్ సారూ! ఉల్లి బంగారంకన్నా మిన్నగా మండిపోతోంది. పప్పులు ఏరకమైనవైనా నిప్పుల్లా కాలుతున్నాయి మార్కెట్లో! ఎంత ఇసుక వ్యాపారైనా ధర్మబద్ధంగా నడిస్తే .. కొని తిని భరాయించుకొనే స్థితిలో ఉన్నాయా ధరవరలు! అక్కడ ఇరుక్కుపోయారు సారూ తమరు! ఇహ తప్పించుకోవడం కుదరదు. ఇదిగో ఇంకాసేపట్లో తమరికి తాంబూలాలు రాబోతున్నాయి. తన్నుకు చావడమే ఆలయమిహ!'
ఎగురుకుంటూ వెళ్లిపోయే పెళ్ళిళ్లపేరయ్య వంక నిలువుగుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయాడు ఆగుమయ్యగారు
✍🏻కర్లపాలెం హనుమంతరావు
*🌹. వివేక చూడామణి - 19 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. పంచభూతాలు - 2 🍀*
76. లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాసన, రుచి, కాంతి, స్పర్శ, శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి. అలానే మనిషి కూడా ఈ పంచతన్మాత్రులకు బందీ అయి తదనుసారముగా జన్మలు, కర్మలు, అనుభవించు చుండును.
77. త్రాచు పాము విషము కంటే పంచతన్నాత్రల వలన పొందే చెడు ఫలితములు ఇంకా ప్రమాదకమైనవి. పాము విషము అది తీసుకొన్నప్పుడే ప్రభావము చూపుతుంది. కాని పంచతన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.
78. జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చు నుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టుకల నుండి విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్ శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
*ఘంటసాల గళం ఒక ఘంటానాదం (ఘంటసాల 47వ వర్ధంతి సందర్భంగా ....)*
_ఆచారం షణ్ముఖాచారి_
*“నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో... ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు ఆష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది”..... ఘంటసాల*
ఘంటసాల జీవితం వడ్డించిన విస్తరి కాదు. సంగీతం మీద అనురక్తితో విజయనగర సంగీత కళాశాలలో అభ్యసించేందుకు వెళ్ళిన ఘంటసాలకు అన్నంపెట్టే నాధుడే లేకపోయాడు. ఒళ్ళు తుడుచుకునే తుండుగుడ్డ ను జోలెగా మలచి భుజాన వేసుకొని పాటలు పాడుకుంటూ వారాలు చేసుకొని భోజనం తెచ్చుకునేవారు. కొన్నిసార్లు ఒంటిపూట తింటూ గుడిలో తలదాచుకునేవారు. సాధన చేసి సంగీత విద్వాన్ పట్టా సాధించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బళ్ళారి జైలులో పద్దెనిమిది నెలలపాటు శిక్షను అనుభవించారు.
1944లో సముద్రాల రాఘవాచార్యుల వారి సలహామేరకు మద్రాసు వెళ్ళారు. హెచ్.ఎం.వి కంపెనీలో తెలుగు విభాగం అధిపతి శ్రీలంక కామేశ్వరరావు ఘంటసాల కంఠం పనికిరాదని తేల్చితే, స్నేహితుడు పేకేటి శివరాం హెచ్.ఎం.వి లో చేరి ఆ అధిపతి సెలవులో వున్నప్పుడు చొరవ తీసుకొని ఘంటసాల చేత “నగుమోమునకు నిశానాద బింబము”, “గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి” అనే పద్య/ గేయాలను రికార్డుచేసి మార్కెట్ లో విడుదలచేస్తే, అవి విపరీతంగా అమ్ముడుపోయాయి. అలా 1945 లో స్వర్గసీమ చిత్రంలో “గాజులపిల్ల” పాట పాడే అవకాశాన్ని కల్పించారు బి.ఎన్.రెడ్డి. తరవాత గూడవల్లి రామబ్రహ్మం చిత్రం ‘పల్నాటియుద్ధం’లో పాడారు. భరణీ వారి ‘రత్నమాల’ సినిమాకు సి.ఆర్. సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేశారు. 1948 లో ‘మనదేశం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా ఎదిగి విజయబావుటా ఎగురవేశారు. వరుసగా... ‘షావుకారు’, ‘పాతాళభైరవి’, ‘పెళ్ళిచేసిచూడు’ వంటి విజయావారి చిత్రాలకు పనిచేసి విజయవంతమైన సంగీత దర్శకుడిగా ఎదిగారు.
తన ఇంటిలో లెఖ్ఖలు చూసేందుకు ఒక హరిజన యువకుణ్ణి పనికి పెట్టుకొని 1అతనికి తనతో సహపంక్తి భోజనం పెట్టింఛి, వసతి కల్పించారు. మతసామరస్యానికి ఊపిరులూదారు. తనకు చేయూతనిచ్చిన విజయా సంస్థ ఋణం తీర్చుకునే విధంగా తన ప్రధమ సంతానానికి ‘విజయ’కుమార్ అనే పేరు పెట్టుకున్న సౌమ్యశీలి ఘంటసాల.
బొంబాయిలో నటుడిగా నిర్మాతగా స్థిరపడిన పైడి జయరాజుల నాయుడు(జైరాజ్) ‘సాగర్’ అనే సినిమా నిర్మిస్తూ ఘంటసాలను సంగీతదర్శకత్వం వహించమని కోరారు. కానీ అప్పటికే ఘంటసాల చేతిలో పదిహేను సినిమాలు ఉండడంతో తన సంగీత ప్రస్థానాన్ని తెలుగు సినిమాలకే పరిమితం చేసుకున్నారు ఘంటసాల.
1953లో ‘పరోపకారం’ అనే సినిమాను ద్విభాషాచిత్రంగా నిర్మించి ఆర్ధికంగా నష్టపోయారు. అంత కష్టాల్లో వుంటూనే తన తమ్ముడు సదాశివుణ్ణి, బావమరది సుబ్బారావును విశాఖపట్నంలో హాస్టల్లో వుంచి చదివించారు. మరొక బావమరది కృష్ణమూర్తి ని వెటర్నరీ కోర్సు చదివించారు. సదాశివుడికి పెళ్లి జరిపించారు. అతణ్ణి తన ఇంటిలోనే వుంచుకున్నారు.
పాకిస్తాన్ గాయకుడు బడే గులాం ఆలీఖాన్ మద్రాసులో కచేరీలు చేయాలని వచ్చినప్పుడు అతనికి, అతని పరివారం ఎనమండుగురికి రెండు నెలలపాటు తన ఇంటిలో సకల సౌకర్యాలను ఏర్పాటుచేసి సంగీతాభినాన్ని, పరమత సహనాన్ని చాటుకున్న యోగివర్యుడు ఘంటసాల. ఆయనకు తోడుగా భార్య సావిత్రి రోజూ ఆలీఖాన్ బృందానికి రొట్టెలు చేసి పెట్టేవారు.
ఘంటసాలగారి ఇల్లు ఒక కళానిలయం. తరచూ సాహిత్య సంగీత సమావేశాలు అక్కడ జరుగుతూ ఉండేవి. యామిజాల, మల్లాది, దేవులపల్లి, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ, కొసరాజు వంటి సాహితీమూర్తుల సత్సంగాలు ఘంటసాల ఇంటిలో జరిగేవి.
విజయనగరంలో తన మిత్రుడు ముద్దు పాపారావు హటాత్తుగా చనిపోగా అతని కుమారుడు నరసింగరావు ను చేరదీసి తన ఇంటిలోనే ఉంచుకున్న స్నేహశీలి. అలాగే పాపారావు ముగ్గురు కుమార్తెలకు ఘంటసాలే దగ్గరుండి పెళ్ళిళ్ళు జరిపించి స్నేహితుని ఋణం తీర్చుకున్నారు. నరసింగరావు ఇటీవల మరణించినంత వరకు ఘంటసాల భార్య సావిత్రమ్మకు పుత్రవాత్సల్యంతో మెలగుతూ ఆమె బాగోగులు చూసుకుంటూ వారితోనే వున్నారు. అలాగే మరో కుర్రవాడు కొమరవోలు కృష్ణారావును కూడా చేరదీషి తన ఇంటిలోనే ఉంచుకున్నారు ఘంటసాల.
ఎన్నో ప్రైవేటు పాటలకు సాహిత్యం సమకూర్చిన తోలేటి వెంకటరెడ్డి అకాల మరణం చెందితే, కర్మక్రతువులు దగ్గరుండి జరిపించి, HMV వారినుండి రాయల్టీ ఇప్పించింది ఘంటసాలే. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మద్రాసులో మరణించి నప్పుడు ఆయన దహన సంస్కారాలు పూర్తిచేయించి, శ్రీరాములు గారికి ఇష్టమైన దేశభక్తి గీతాలను ఆలపిస్తూ తన అభిమానం చాటుకున్న స్వాతంత్ర్య సమర యోధుడు ఘంటసాల.
కొన్ని సందర్భాల్లో నిర్మాత “ఇతర గాయకులకు డబ్బు ఇచ్చుకోలేను. సంగీతం చేస్తున్నారు కనుక మీరే పాడండి” అంటే ఉచితంగా పాడిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా శంకరరెడ్డి నిర్మించిన ‘లవకుశ’ చిత్రంలో ఈ విశేషం జరిగింది. ‘దేహించకుమమ్మా’ అంటూ నాగయ్య గారు పాడవలసిన పాటను, ‘ఇదె మన ఆశ్రమంబు’ అనే పద్యాన్ని తను పాడాల్సి రావడంతో నాగయ్య గారి ఇంటికి వెళ్లి, నమస్కరించి, ఆయన అంగీకారం తీసుకొని పాడిన సందర్భం ఘంటసాల గురువుగా నాగయ్య గారికి ఇచ్చిన గౌరవానికి, కష్టాలలో వున్న నిర్మాతకు చేయూత ఇచ్చిన సుగుణాకి ఉదాహరణ మాత్రమే. తాను సంగీతం నిర్వహించిన సినిమాల్లో సహ గాయకులు మాధవపెద్ది, పిఠాపురం, శ్రీనివాస్ లకు అవకాశాలు కల్పించేవారు.
దేశ రక్షణ నిధి, రాయలసీమ కరవు నిధి, పోలీసు సంక్షేమ నిధుల సమీకరణలో తనవంతు పాత్ర పోషించిన దేశభక్తుడు ఘంటసాల. అలాగే వైద్యకళాశాల నిర్మాణానికి కచేరీలు నిర్వహించిన సహృదయుడు ఘంటసాల.
తిరుమల దేవస్థాన ఆస్థాన సంగీతకారునిగా నియమింపబడినప్పుడు బాలాజీ గర్భగుడికి ఎదురుగా వున్న మంటపంలో కూర్చొని స్వామివారి పాటలు పాడిన అవకాశం దొరకబుచ్చుకున్న ఒకేఒక కళాకారుడు ఘంటసాల. వాగ్గేయకారుడు అన్నమాచార్యుని తరవాత అటువంటి అదృష్టానికి నోచుకున్న విద్వన్మణి ఘంటసాల మాత్రమే.
భలేతమ్ముడు చిత్రంలో పాటలు పాడేందుకు మహమ్మద్ రఫీ మద్రాసు ఎయిర్ పోర్టులో దిగి తిన్నగా ఘంటసాల ఇంటికి వెళ్లి “మీలాంటి గాయకులు వుండగా నన్ను పాడమని నిర్మాతలు వెతుక్కుంటూ వచ్చారు. నేను తెలుగులో పాడే సాహసం చెయ్యలేను. ఈ విషయం మీకు చెప్పి వెనక్కు వెళ్ళిపోదామని వచ్చాను” అని అంటే ఆయనను వారించి “తెలుగు గాయకుల కుటుంబంలోకి మీరు రావాలి” అని ఆలింగనం చేసుకొని, రఫీ పాటల రికార్డింగుకు స్వయంగా హాజరైన సంస్కారవంతులు ఘంటసాల. అలాగే సువర్ణసుందరి హిందీ వర్షన్ లో “కుహూ కుహూ బోలె కోయలియా” (హాయి హాయిగా ఆమని సాగే) పాటను రఫీ చేతనే పాడించేలా లతామంగేష్కర్ ను ఒప్పించి, దగ్గర వుండి ఆ పాట మెళకువలు చెప్పి పాటను రికార్డింగు చేయించిన ఘనత కూడా ఘంటసాలది.
ఘంటసాల మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వుండగా, ఒక నాటు వైద్యుడు ఇచ్చిన మందు వికటించి ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చింది. విజయా హాస్పిటల్ లో వైద్యం తీసుకొని కొంత ఆరోగ్యాన్ని మెరుగు పరచుకున్నారు. స్టూడియోకు వెళ్లి రెండు పాటలు పాడి తిరిగి ఆసుపత్రికి వచ్చారు. నర్సు ఇంజెక్షన్ ఇస్తుండగానే తల వంచేశారు. 52 ఏళ్ళ మధ్యవయస్సులోనే ఘంటసాల కాలం చెయ్యడం దురదృష్టం. స్థిర చిత్తంతో, అకుంఠిత దీక్షతో సాధన చేసి ఆలపించిన భగవద్గీత రికార్డు ఘంటసాల కనుమూసిన రెండు నెలలకుగాని విడుదల కాలేదు. అది ఘంటసాలకు తీరని కోరిక.
*జాతస్యహి ధృవో మృతుర్భ్యవం జన్మ మృతస్యచ... తస్మాద పైరిహార్యేర్ధే నత్వం శోచి తుమర్హసి*
(పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి జననము తప్పదు. అనివార్యమగు ఈ విషయము గూర్చిశోకింపతగదు..🙏
[11/02, 11:47 am] . Mallapragada: *ట్రైన్ లో... రేపటి పాట్లు*
*భారతీయ రైల్వే లు ప్రైవేటీకరణ జరిగింది. ఒక ప్రయాణీకుడు టిక్కెట్టు కొనుక్కోవటానికి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు.*
*ప్రయాణీకుడు: ఢిల్లీ నుండి లక్నో కు టిక్కెట్ ఇవ్వండి.*
*బుకింగ్ క్లర్క్: రు. 750లు ఇవ్వండి.*
*ప్ర: అదేంటి రు.400 కదా?*
*బు.క్ల: అవును. సోమవారం రు.400లు. శనివారం రు.700లు. ఆదివారం రు750.మిగతా రోజుల్లో రు.600.*
*ప్ర: సరే, క్రింది బెర్త్ ఇవ్వండి.*
*బు.క్ల.: క్రింది బెర్త్ కు రు50లు అదనం.*
*ప్ర. పోనీ, సైడున ఉండే క్రింద బెర్త్ ఇవ్వండి.*
*బు.క్ల: రు.25లు అదనం.*
*ప్ర: చాలా ఎక్కువ. టాయిలెట్స్ లో నీళ్లు లేవు. పెట్టెలు శుభ్రంగా లేవు. టిక్కెట్ ధర మాత్రం చాలా ఎక్కువ.*
*బు.క్ల.; మీరు టాయిలెట్ వాడుకోవాలంటే రు.50లు అదనంగా చెల్లించాలి. అదీ ప్రయాణం మొత్తంలో 2సార్లు మాత్రమే వాడుకోవచ్చు. అదనంగా వాడుకోవాలంటే ప్రతిసారి రు.10లు రుసుము చెల్లించాలి.*
*ప్ర: ఇంకా దేనికి దేనికి చెల్లించాలో చెప్తారా?*
*బు.క్ల.: సెల్ ఫోన్ ఛార్జింగ్ కు గంటకు రు10లు. హాండ్ బ్యాగ్ మాత్రమే అనుమతిస్తాం. అంతకు మించితే కిలోకు రు20లు లగేజీ చెల్లించాలి. ఇంటినుండి తెచ్చుకునే ఆహారాన్ని అనుమతించం. పాంట్రీ కార్ నుండి మాత్రమే ఆహారం కొనాలి. ఏరోజు కారోజు ధరలు మారతాయి.*
*ప్ర.ఇవన్నీ ఎవరు వసూలు చేస్తారు?*
*బు.క్ల: ప్రతి పెట్టెలో మా మార్షల్స్ ఉంటారు. వారు వసూలు చేస్తారు.*
*ప్ర. థాంక్స్. దీనికంటే విమానంలో వెళ్ళటం నయం.*
*బు.క్ల: అలాగే వెళ్ళండి. మానుండి వివరాలు పొందినందుకు కన్సల్టెషన్ చార్జీలు రు 100లు చెల్లించి వెళ్ళండి. మా మార్షల్ మీవెనుకే ఉన్నారు.*
.[11/02, 11:47 am] . Mallapragada: శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు, సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు, భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు.. అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ గోష నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.. వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది..
గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓడార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నిదగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ గోషిస్తుంది, చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు అప్పుడు కనిపిస్తాడు దేవుడు.
అప్పటివరకు ఆత్మ గోషతో రోదిస్తున్న ఆత్మ ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు అని అడుగుతాది ఆత్మ , శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.. నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక.. ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం ఇంకో కొత్త దేహాన్ని వెతుకుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణ బంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి.
🙏 లోకా సమస్తా సుఖినో భవంతు 🙏
[20:51, 10/02/2021] +91 95058 13235: 10.2.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబదియవ అధ్యాయము
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
40.17 (పదిహేడవ శ్లోకము)
నమః కారణమత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ|
హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే॥9804॥
40.18 (పదునెనిమిదవ శ్లోకము)
అకూపారాయ బృహతే నమో మందరధారిణే|
క్షిత్యుద్ధారవిహారాయ నమః సూకరమూర్తయే॥9805॥
40.19 (పందొమ్మిదవ శ్లోకము)
నమస్తేఽద్భుతసింహాయ సాధులోకభయాపహ|
వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ॥9806॥
40.20 (ఇరువదియవ శ్లోకము)
నమో భృగుణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే|
నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ॥9807॥
40.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ|
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః॥9808॥
40.22 (ఇరువది రెండవ శ్లోకము)
నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే|
మ్లేచ్ఛప్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కిరూపిణే॥9809॥
విరాట్స్వరూపా! ప్రళయ సముద్రమునందు మత్స్యావతారమున చరించుచు లోకవిరోధియైన సోమకాసురుని చంపి, వాడు అపహరించిన వేదములను రక్షించిన నీకు నమస్కారము. హయగ్రీవ రూపుడవై మధుకైటభ రాక్షసులను వధించిన నీకు వందనము. బృహద్రూపముగల కూర్మావతారమున దేవతలపైగల అనురాగముతో మందరపర్వతమును అవలీలగా ఉద్ధరించితివి. ఆదివరాహమూర్తివై నీ కోఱలతో హిరణ్యాక్షుని తునుమూడి భూదేవిని కాపాడితివి. నీకు అనేక నమస్కారములు. అద్భుతరూపమున నృసింహుడవై హిరణ్యకశిపుని సంహరించి, పరమభక్తుడైన ప్రహ్లాదునకు పరమానందమును గూర్చి, సాధులోకభయమును పోగొట్టితివి. వామనావతారమున బలిచక్రవర్తిని మూడడుగుల నేలకై యాచించి, త్రివిక్రముడవై నీ దివ్యరూపముతో బ్రహ్మాండమును నింపితివి. అట్టి నీకు వందనములు. పరశురాముడుగా అవతరించి నీ పరశువుతో (గండ్రగొడ్డలితో) గర్వితులైన క్షత్రియులనెడి వనములను ఛేదించితివి. శ్రీరామచంద్రుడవై సీతాదేవి మిషగా లోకకంటకుడైన రావణుని వధించి సాధుపురుషులను ఆదుకొంటివి. నీకు అనేక నమస్సులు, వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధ రూపములలో ప్రకటితుడవై పరమభక్తులను, యదువంశజులను క్రూరరాక్షసుల బాఱినుండి రక్షించెడి ప్రభూ! నీకు ప్రణామములు. దైత్య, దానవులను మోహింపచేయుటకు అహింసా ప్రవర్తకుడవు అగు బుద్ధరూపుడవైన నీకు నమస్కారము. మున్ముందు కల్కిరూపుడవై మ్లేచ్ఛప్రాయులైన క్షత్రహతకులను హతమార్చి సత్పురుషులను రక్షించెదవు. ఇట్టి పలు దివ్యలీలలను ప్రదర్శించిన విరాట్ పురుషా! నీకు అనంతకోటి నమస్కారములు.
40.23 (ఇరువది మూడవ శ్లోకము)
భగవన్ జీవలోకోఽయం మోహితస్తవ మాయయా|
అహంమమేత్యసద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు॥9810॥
కృష్ణ పరమాత్మా! జీవులు ఎల్లరును నీ మాయచే మోహితులగుచున్నారు. ఆ కారణమున 'నేను', 'నాది' (అహంకార, మమకారములు) అను భావములలో చిక్కుకొని, అనిత్యములైన వాటిని గూర్చి నిత్యములని భ్రమపడుచు విషయసుఖములలో బడి తికమకల పాలగుచున్నారు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[04:38, 11/02/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[04:38, 11/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
812వ నామ మంత్రము 11.02.2021
ఓం పరమంత్ర విభేదిన్యై నమః
తనవద్ద ఉన్న సప్తకోటిమహామంత్రాలు తక్క అన్యమంత్రములేవైనను విభేదించు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరమంత్రవిభేదినీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పరమంత్ర విభేదిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తజనులను కామితార్థములిచ్చును. దుష్టగ్రహపీడలనుండి కాపాడును.
పరమేశ్వరి సప్తకోటి మహా మంత్రములు తనదిగా గలిగిన మహామంత్రస్వరూపిణి. పరమంత్రము అంటే తనను గాని, తన భక్తులను గాని ఇబ్బంది పెట్టు మంత్రములే పరమంత్రములు. పరమంత్రములు, ఆ పరమంత్రముల యొక్క తంత్రయంత్రములను కూడా అమ్మవారు విభేదించుతుంది. గనుక పరమేశ్వరి పరమంత్రవిభేదినీ యని అనబడినది.
భండాసురుడు జయవిఘ్నయంత్రమును ప్రయోగించాడు. యంత్రమనగా తంత్రయుక్తమ…
[04:39, 11/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
238వ నామ మంత్రము 11.02.2021
ఓం మనువిద్యాయై నమః
మనువు మొదలైన పండ్రెండుమంది శ్రీవిద్యోపాసకులు. గనుక శ్రీవిద్యాప్రస్తారము పడ్రెండు విధములుగా నున్నది. మొదటి వాడైన మనువు పేరుతో ప్రశస్తమైన శ్రీవిద్యాస్వరూపిణియైన అమ్మవారికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మనువిద్యా యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మనువిద్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే జన్మజన్మలనుండి సంచితమై వచ్చిన కర్మఫలములనుండి విముక్తులై, కైవల్యపదమునకు మార్గము సుగమము చేసికొందురు.
శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది. కొందరు పన్నెండు అంటారు. కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. దివ్యౌఘ, సిద్ధ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. వాళ్ళు ముందుగా
శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. ఆ తరువాత విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి,
మన్మథుడు - (మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు), ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు.
ఇందులో మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. ప్రస్తుతం మనము పండ్రెండు మందినే శ్రీవిద్యోపాసకులు అని భావిద్దాము. దీనిని బట్టి శ్రీవిద్య ప్రడ్రెండు విధములు.
మనువులు పదునాలుగు మంది. వీరిని చతుర్దశ మనువులు అంటారు. సృష్టిలో మనువు మొదటి వాడు మనువు. మనువు నుండే మానవలోకం ఉద్భవించింది.
ఆ పదునాలుగు మంది మనువులు వీరే.
1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు, 3. ఉత్తముడు, 4. తామసుడు, 5. రైవతుడు, 6. చాక్షసుడు, 7. వైవస్వతుడు, 8.సూర్య సావర్ణి, 9. దక్ష (పాఠాంతరం రౌచ్యక) సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. రుద్ర సావర్ణి, 12. ధర్మ (అగ్ని) సావర్ణి, 13. ఇంద్ర సావర్ణి, 14. భౌచ్యుడు.
వీరిపేరునే మన్వంతరములు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వతుని మన్వంతరంలో ఉన్నాము. అందుకే సంకల్పంలో వైవస్వత మన్వంతరే అని చెపుతూఉంటాము. శ్రీవిద్యా మంత్రమును (పంచదశీ మంత్రమును) ఉపాశించిన వారిలో మనువు ఉపాశించిన శ్రీవిద్యను మనువిద్య అని అందురు. జగన్మాత అటువంటి మనువిద్యాస్వరూపిణీ గనుక మనువిద్యా యని అనబడినది.
అటువంటి మనువు ఉపాసించిన మంత్ర స్వరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మనువిద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[04:39, 11/02/2021] +91 95058 13235: 11.2.2021 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబదియవ అధ్యాయము
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
40.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
అహం చాత్మాఽఽత్మజాగారదారార్థస్వజనాదిషు|
భ్రమామి స్వప్నకల్పేషు మూఢః సత్యధియా విభో॥9811॥
ప్రభూ! నేను గూడ స్వప్న దృశ్యములవలె అనిత్యములైన దేహగేహములు, భార్యాపుత్రులు, బంధుమిత్రులు, సంపదలు మున్నగువాటిని నిత్యములుగా, సత్యములుగా భావించి, వాటి మోహములో చిక్కుకొని అలమటించుచున్నాను.
40.25 (ఇరువది ఐదవ శ్లోకము)
అనిత్యానాత్మదుఃఖేషు విపర్యయమతిర్హ్యహమ్|
ద్వంద్వారామస్తమోవిష్టో న జానే త్వాత్మనః ప్రియమ్॥9812॥
స్వామీ! అజ్ఞానకారణముగా నేను అనిత్యవస్తువులను, నిత్యములుగను, అనాత్మను ఆత్మగను, దుఃఖకారకములైన ఇంద్రియార్థములను సుఖములుగను భావించుచు విపరీతబుద్ధినై సుఖదుఃఖాది ద్వంద్వములలో మునిగి తేలుచున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైనది ఏదియో తెలియలేకున్నాను. 'నాకు నీవే శ్రేయోదాయకుడవు' అను నిజమును విస్మరించియున్నాను.
40.26 (ఇరువది ఆరవ శ్లోకము)
యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవైః|
అభ్యేతి మృగతృష్ణాం వై తద్వత్త్వాహం పరాఙ్ముఖః॥9813॥
మూర్ఖుడు తన దాహబాధను తీర్చుకొనుటకై జలాశయము ఎదురుగా ఉన్నను, అందలి జలములు తృణాదులచే కప్పబడి యున్నందున అజ్ఞానమువలన అందు జలము లేదని భావించి, దానిని వదలివేయును. అంతేగాక, సూర్యకాంతి ప్రభావమువలన జలములు ఉన్నట్లుగా కనబడెడి మృగతృష్ణలో (ఎండమావులలో) నిజముగా జలము ఉన్నట్లు భ్రమపడి దాని వెంటబడును. అట్లే నేను మోహములోబడి నిజముగా శ్రేయోదాయకుడవైన నిన్ను ఆశ్రయింపక, విషయానుభవముల లోనే సరియైన సుఖమున్నదని తలంచి, వాటివెంట పడుచున్నాను.
40.27 (ఇరువది ఏడవ శ్లోకము)
నోత్సహేఽహం కృపణధీః కామకర్మహతం మనః|
రోద్ధుం ప్రమాథిభిశ్చాక్షైర్హ్రియమాణమితస్తతః॥9814॥
ఇంద్రియార్థముల (ఇంద్రియసుఖముల) ఆకర్షణ పడిన నా మనస్సు వాటిని పొందుటకై వివిధ కామ్యకర్మలలోబడి నలిగిపోయినది. ప్రబలములైనవి, అదుపు చేయుటకు అలవికానివి ఐన ఇంద్రియములు మనస్సును మథించి, మదించి బలవంతముగా వాటివైపు (ఇంద్రియ సుఖములవైపు) లాగుచున్నవి. కనుక ఆ మనస్సును నిరోధించుటకు నేను అశక్తుడను.
40.28 (ఇరువది ఎనిమిది శ్లోకము)
సోఽహం తవాంఘ్ర్యుపగతోఽస్మ్యసతాం దురాపం తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే|
పుంసో భవేద్యర్హి సంసరణాపవర్గస్త్వయ్యబ్జనాభ సదుపాసనయా మతిః స్యాత్॥9815॥
స్వామీ! ఈ విధముగా మనస్తాపమునకు లోనైయున్న నేను నీ చరణకమలముల చెంతకు చేరితిని. అది దుష్టులకు దుర్లభము. అట్లు చేరగల్గుట కూడ నీ అనుగ్రహ ప్రభావముననే యని నేను విశ్వసించుచున్నాను. ఏలయన, పద్మనాభా! సాంసారిక తాపముల నుండి బయటపడెడి సమయము ఆసన్నమైనప్పుడే పురుషునియొక్క చిత్తవృత్తి నీ ఉపాసన వైపునకు మఱలును.
40.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే|
పురుషేశప్రధానాయ బ్రహ్మణేఽనంతశక్తయే॥9816॥
40.30 (ముప్పదియవ శ్లోకము)
నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ|
హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో॥9817॥
దేవా! నీవు జ్ఞానస్వరూపుడవు, జ్ఞానప్రదుడవు, జీవులయొక్క ప్రారబ్ధకర్మలను అనుసరించి, వారియొక్క సుఖదుఃఖములను నియంత్రించువాడవును. నీవే వాత్సల్య, సౌశీల్య, సౌలభ్యాది గుణములచే విలసిల్లుచుందువు. ఓ వాసుదేవా! నీవు సకల ప్రాణులయందును అంతర్యామివై విలసిల్లుచు, వారి మనోబుద్ధీంద్రియాదులను నియంత్రించుచుందువు. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను. నీకు పదివేల నమస్కారములు. ఓ ప్రభూ! సంసారతాపత్రయములనుండి ఉద్ధరించి, నన్ను రక్షింపుము.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అక్రూరస్తుతిర్నామ చత్వారింశోఽధ్యాయః (40)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట యను నలుబదియవ అధ్యాయము (40)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:10, 11/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 636 / Bhagavad-Gita - 636 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 53 🌴
53. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమ: శాన్తో బ్రహ్మభూయాయకల్పతే ||
🌷. తాత్పర్యం :
మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తుస్వీకారము అనువాని నుండి విడివడినవాడును, మమత్వదూరుడును, శాంతిమయుడును అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవస్థాయికి ఉద్ధరింపగలడు.
🌷. భాష్యము :
మనుజుడు భౌతికభావన నుండి మక్తుడైనపుడు శాంతిమయుడై కలతకు గురికాకుండును. ఈ విషయము భగద్గీత (2.70 ) యందే వివరింపబడినది.
ఆపూర్వమాణం అచలప్రతిష్టమ్ సముద్ర మాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ ||
“సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండి సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలతనొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొంద సమర్థుడు కాజాలడు.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 636 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 53 🌴
53. ahaṅkāraṁ balaṁ darpaṁ
kāmaṁ krodhaṁ parigraham
vimucya nirmamaḥ śānto
brahma-bhūyāya kalpate
🌷 Translation :
Who is detached, free from false ego, false strength, false pride, lust, anger, and acceptance of material things, free from false proprietorship, and peaceful – such a person is certainly elevated to the position of self-realization.
🌹 Purport :
When one is free from the material conception of life, he becomes peaceful and cannot be agitated. This is described in Bhagavad-gītā (2.70):
āpūryamāṇam acala-pratiṣṭhaṁ
samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve
sa śāntim āpnoti na kāma-kāmī
“A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.”
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:10, 11/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 282, 283 / Vishnu Sahasranama Contemplation - 282, 283 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻282. భాస్కరద్యుతిః, भास्करद्युतिः, Bhāskaradyutiḥ🌻
ఓం భాస్కరద్యుతయే నమః | ॐ भास्करद्युतये नमः | OM Bhāskaradyutaye namaḥ
భాస్కరద్యుతిః, भास्करद्युतिः, Bhāskaradyutiḥ
భాస్కరద్యుతిసాధర్మ్యాద్భాస్కరద్యుతి రచ్యుతః ప్రకాశమును అందించుటలో భాస్కరుని ద్యుతితో అనగా సూర్యుని ప్రకాశముతో సమాన ధర్మము ఉండుటచేత అచ్యుతునకు 'భాస్కరద్యుతిః' అని వ్యవహారము తగును.
:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అర్జున ఉవాచ:
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తా ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్ ॥ 17 ॥
అర్జునుడు పలికెను: మిమ్ము ఎల్లెడలను కిరీటముగలవారినిగను, గదను ధరించినవారినిగను, చక్రమును బూనినవారినిగను, కాంతిపుంజముగను, అంతటను ప్రకాశించువారినిగను, జ్వలించు అగ్ని, సూర్యులవంటి కాంతిగలవారినిగను, అపరిచ్ఛిన్నులుగను (పరిమితిలేని వారినిగను) చూచుచున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹.
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పంచభూతాలు - 2 🍀
76. లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాసన, రుచి, కాంతి, స్పర్శ, శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి. అలానే మనిషి కూడా ఈ పంచతన్మాత్రులకు బందీ అయి తదనుసారముగా జన్మలు, కర్మలు, అనుభవించు చుండును.
77. త్రాచు పాము విషము కంటే పంచతన్నాత్రల వలన పొందే చెడు ఫలితములు ఇంకా ప్రమాదకమైనవి. పాము విషము అది తీసుకొన్నప్పుడే ప్రభావము చూపుతుంది. కాని పంచతన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.
78. జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చు నుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టుకల నుండి విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్ శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:10, 11/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 29 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 20. పృథివి - అంతరిక్షము - దివి 🌻
సూర్యుడు సమస్తమునకు కారణముకాగ శనిదేవత ఫలితమగును. శనిదేవతను అంకుశముగ, జ్యోతిషమున సంకేతించుదురు. యమము, నియమము కలిగిన వారిని శనిదేవుడనుగ్రహించును. అవి లేనివారిని అంకుశమై శిక్షించును, అనగా శిక్షణ నిచ్చును.
శనిదేవత దేవాలయమునకు పునాది కాగా, సూర్యుడు దేవాలయము నకు శిఖర మగును. సూర్యుడు దివ్యలోకమునకు, శని పృథ్వీలోకమునకు, కుజుడు అంతరిక్ష లోకములకు అధి దేవతలు. కుజుడనగా స్కందుడే. అతడు సేన రౌద్రమూర్తి లేక రుద్రత్వము కలవాడు. రుద్రులే అంతరిక్ష దేవతలు.
చీకటులను చెండాడి చీకటి పై నుండు వెలుగును ఆవిష్కరించి వ్యాప్తిచేయు ప్రజ్ఞయే స్కందప్రజ్ఞ. ఇతడు కారణముగ దివినుండి భువి వరకు వెలుగు వ్యాపించి యుండును. ఇది జ్యోతిషపరమైన అవగాహనముపై అవగాహన మేరకు కుజుడు, శని సూర్యుపుత్రులుగ వ్యవహరింప బడుచున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:11, 11/02/2021] +91 98494 71690: 🌹. భయానికి కారణం అహం! 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
అహం ఎప్పుడూ భయం నుంచే బయటపడుతూ ఉంటుంది. నిజంగా, నిర్భయుడైన వ్యక్తికి అహముండదు. అహం ఎప్పుడూ ఒక రక్షణ కవచం లాంటిది. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీచుట్టూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సృష్టించుకుంటారు. అప్పుడు మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు. లేకపోతే, వౌలికంగా అది భయమే. అయినా మంచిదే. ఎందుకంటే, మీరు దాని లోతుల్లోకి సరిగ్గా దృష్టి సారించారు.
ఒకసారి మోలిక కారణాన్ని మీరు తెలుసుకుంటే, అన్ని విషయాలు మీకు సులభమవుతాయి. లేకపోతే, అందరూ అహంతో యుద్ధం చేస్తూనే ఉంటారు. నిజానికి, అహం ఒక సమస్య కాదు. మీరు అసలైన రోగంతో కాకుండా, రోగ లక్షణంతో పోరాడుతున్నారు. భయమే అసలైన రోగం. మీరు అహంతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అయినా మీరు మీ లక్ష్యాన్ని కోల్పోతూనే ఉంటారు.
ఒకవేళ ఆ పోరాటంలో మీరు విజయాన్ని సాధించినా, ఏదీ గెలుచుకోలేరు. ఎందుకంటే, అహం మీకు నిజమైన శత్రువు కాదు. అది కేవలం నకిలీ. దానిని మీరు జయించ లేరు. ఎవరైనా అసలైన శత్రువును జయించగలరు కానీ, ఉనికిలో లేని నకిలీ శత్రువును ఎలా జయించగలరు? దాని ముఖం చాలా వికారంగా ఉంటుంది. మీరు దానిని నగలతో అలంకరిస్తారు.
నేను ఒక సినీ నటుడి ఇంట్లో ఉంటున్నప్పుడు నన్ను చూసేందుకు వచ్చిన వారిలో ఒక సినీ నటి కూడా ఉంది. ఆమె చాలా అందమైన వాచీని ధరించింది. దాని పట్టీ చాలా వెడల్పుగా ఉంది. ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తి ‘‘మీ వాచీ చాలాబాగుంది. ఒకసారి చూసేందుకు ఇస్తారా?’’ అన్నాడు ఆమెతో. ఆ వాచీ తీసి ఇచ్చేందుకు ఆమె సంకోచిస్తోంది.
‘‘ఏమనుకోకండి. ఒకసారి చూసి ఇచ్చేస్తా’’అని అతడు మళ్ళీ అడగడంతో ఆమెకు ఇవ్వక తప్పలేదు. ఆమె వాచీ తీసేటప్పుడు ఆమెనే గమనిస్తున్న నాకు ఆమె చేతిపై ‘‘బొల్లిమచ్చ’’కనిపించింది. ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకే ఆమె ఆ వాచీ ధరిస్తోంది. విషయం నాకు తెలిసిందని ఆమె గ్రహించింది. దానితో ఆమెకు చెమటలు పట్టాయి.
అహం కూడా అలాంటిదే. అందరికీ భయం ఉంటుంది. కానీ, అది ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదని అందరూ అనుకుంటారు. ఎందుకంటే, మీరు భయపడుతున్నట్లు తెలిస్తే, మిమ్మల్ని మరింత భయపెట్టేందుకు బయట ఉన్న చాలామంది మిమ్మల్ని చితకబాదుతారు. అలా అవమానించడం ద్వారా తమకన్నా బలహీనులున్నారనే భావనతో వారు మిమ్మల్ని చక్కగా దోచుకుంటూ ఆనందిస్తారు.
అందువల్ల భయపడుతున్న ప్రతి వ్యక్తి తమ భయం చుట్టూ అహం బుడగను సృష్టించుకుని అందులోకి గాలి ఊదుతూ ఉంటారు. అలా వారిలోని అహం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అడాల్ఫ్ హిట్లర్, ఈద్ అమీన్లు అలాంటివారే. అందుకే వారు అందరినీ హింసిస్తూ భయపెట్టారు.
నిజానికి, లోలోపల భయపడుతున్న వారే- తాము భయపడుతున్నట్లు వారికి తెలుసు కాబట్టి-అందరినీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తాను. లేకపోతే, వారికి ఆ అవసరమేముంది? భయం లేని వ్యక్తి ఎప్పుడూ ఎవరికీ భయపడడు, ఇతరులను భయపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించడు. ఆ అవసరం అతనికి లేదు.
కాబట్టి, భయపడే వ్యక్తులే అందరినీ భయపెడతారు. అప్పుడే ఎవరూ తమని తాకరని, ఎదిరించరని వారు భావిస్తూ ఉంటారు.
మీరు విషయాన్ని చక్కగా గ్రహించారు. కాబట్టి, మీరు ఎప్పుడూ అహంతో పోరాడకండి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:11, 11/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 206 / Sri Lalitha Chaitanya Vijnanam - 206 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 206. 'సర్వతంత్రరూపా' 🌻
సర్వ తంత్రముల స్వరూపము కూడ శ్రీదేవియే అని అర్థము.
తంత్రమనగా శాస్త్రీయ విధానము. శాస్త్రీయ మనగా శాస్త్ర విధాన జ్ఞానము. ఏది ఎట్లు చేయవలెనో, అట్లు చేసిననే అది సిద్ధించును. అట్లు చేయనిచో సిద్ధింపదు. దీనినే శాస్త్ర విధి యందురు. ఏపనికైనను శాస్త్ర విధాన మున్నది. ఇది తెలియుట జ్ఞానము. తెలిసి చేసినచో కృతకృత్యులగుదురు.
తెలియక చేసినచో వైఫల్య ముండును. పై విధమగు శాస్త్ర విధి తంత్రము. తెలిసి చేయుట ఒక పద్ధతి. చేయుచూ తెలుసుకొనుట మరియొక పద్ధతి. మంత్రమును ఎట్లు మననము చేయవలెనో తెలియవలెను. యంత్రమును ఎట్లు పూజింపవలెనో తెలియవలెను.
ఇట్లు తెలిసి ఆరాధించుటను తంత్ర మందురు. యంత్రములను శాస్త్ర విధిగ ఆరాధించినచో మంత్రము సిద్ధించి తద్దేవతా స్వరూపము ప్రత్యక్షమగును. తోచినట్లు చేయుట వలన సిద్ధి కలుగదు.
ఋషులు మంత్రములను, యంత్రములను గ్రహించి అనేకానేక దేవతా శక్తులను సిద్ధింప చేసుకొనినారు. సద్గురువు సాన్నిధ్యమున సకల దేవతలు కొలువై యుందురని తెలుపుటలోని రహస్య మిదియే. వారు విధి విధానముగ ఆరాధనము గావించి వివిధములగు దేవతలను సిద్ధింప జేసిరి.
శ్రీ రామకృష్ణ పరమహంస సర్వమత వ్యవస్థాపకులను కూడ ఆయా మార్గముల ఆరాధించి సిద్ధింప చేసుకొనెను. ఋషులు, సద్గురువులు మంత్ర యంత్ర స్వరూపములను కూలంకషముగ గ్రహించి తంత్రముల నందించి నారు.
నిర్దిష్టమగు ఈ తంత్ర శాస్త్రము తెలిసినవారు వైజ్ఞానికముగ దేవతలను సిద్ధింపజేసికొను శక్తి కలవారైయుందురు. వారే పూర్వము మంత్ర యంత్రముల ద్వారా వర్షములను కురిపించుట, దేవతలను అవతరింపజేయుట గావించిరి.
ఆకాశమున పయనించుట, కొండలను మోయుట, నదీ గమనములను మార్చుట కూడ చేసిరి. తంత్రమునకు నిష్ఠ, నియమము, ఏకాగ్రత, దీక్ష, మనోబలము, మనోనిర్మలము ఇత్యాది గుణములు ముఖ్యము.
సర్వ తంత్ర స్వరూపిణియైన శ్రీదేవి ఈ తంత్ర శాస్త్రముల కధిదేవత. ఆమె అధ్యక్షతనే మంత్రము, యంత్రము, తంత్రము యున్నవి. మంత్రమును యంత్రముపై తంత్ర పూర్వకముగ ప్రయోగించుట సిద్ధి నీయగలదు.
ఈ తంత్ర జ్ఞాన మంతయూ శ్రీదేవి అనుగ్రహము కలవారికి శీఘ్రముగ సిద్ధించును. కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు అట్టివారు. ఇటీవలి కాలమున శ్రీ రామకృష్ణ పరమ హంస అమ్మ అనుగ్రహమున సర్వతంత్రముల నెరిగెను.
రామకృష్ణునికి తంత్రము నేర్పుటకై వచ్చిన తంత్రవేత్తలు అతడప్పటికే ఎరిగిన తంత్రమునకు దిగ్ర్భాంతి చెందిరి. భక్తి పూర్వకముగ శ్రీదేవి నారాధించువారికి సర్వమూ హస్తగత మగును. మంత్రము, తంత్రము, యంత్రము వారి కధీనమై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹
ఓం నమః శివాయ:
శ్రీఆది శంకరాచార్య స్వామి విరచితం శ్రీ దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రము
శంకరులు దక్షిణామూర్తిపై చాలా స్తోత్రములు రచించారు. అందులో దక్షిణామూర్తి చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం ఒకటి. వర్ణమాలా స్తోత్రం అంటే దక్షిణామూర్తి మంత్రం గాయత్రీ మంత్రం వలె 24 అక్షరాలతో కూడుకొన్నది.
శ్రీ దక్షిణామూర్తి నామాన్ని నిత్యం మననం చేసుకుంటే అదే మంత్రం అవుతుంది. ఆ మంత్రశక్తిని అందరికీ అందజేయడానికి శ్రీ శంకరులు ఆ మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకాన్ని రచించారు.
మొత్తం 24అక్షరములతో 24శ్లోకములు అందించారు. ఈ శ్లోకములు శుచిగా స్వామికి నమస్కారం చేసుకొని నిత్యానుష్ఠానంగా చేయవచ్చు. ఇది మంత్ర గర్భితంగా సమకూర్చారు. భక్తికి సంబంధించిన స్తోత్రం ఈ చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రం. అయితే ఈ స్తోత్రం ఆత్మజ్ఞానంతో కూడుకుని ఉంటుంది. చతుర్వింశతి వర్ణమాలా స్తోత్రంలో భక్తిని ప్రధానంగా చూపిస్తూ ఆత్మజ్ఞానాన్ని నిబిడీ కృతం చేశారు.అద్వైతతో కూడిన జ్ఞానభక్తి కలిగినవారు శ్రీ ఆదిశంకరుల వారు.
1) ఓమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం యద్భాసేదం భాతి సమస్తం వియదాది!యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
2) నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్దత్వా క్షిప్రం హంతి చ తత్సర్వవిపత్తీః!పాదాంభోజాధస్తనితాపస్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
౩) మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః సంవిన్ముద్రా పుస్తకవీణాక్ష గుణాన్యమ్!హస్తాంభోజైర్బిభ్రతమారాధితవంతస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
4) భద్రారూఢం భద్రదమారాధయితృణాం భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమంతి!ఆదిత్యా యం వాంఛితసిద్ధ్యై కరుణాబ్ధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
5) గర్భాంతఃస్థాః ప్రాణిన ఏతే భవపాశచ్ఛేదే దక్షం నిశ్చితవంతః శరణం యమ్!ఆరాధ్యాంఘ్రిప్రస్ఫురదంభోరుహయుగ్మం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
6) వక్త్రం ధన్యాః సంసృతివార్ధేరతిమాత్రాద్భీతాః సంతః పూర్ణశశాంకద్యుతి యస్య!సేవంతేజ్ధ్యాసీనమనంతం వటమూలం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
7)తేజఃస్తోమైరంగద సంఘట్టితభాస్వన్మాణిక్యోత్థైర్భాసితవిశ్వో రుచిరైర్యః!తేజోమూర్తిం ఖానిలతేజఃప్రముఖాబ్ధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
8)దధ్యాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఖిలాని త్యక్త్వా కాంక్షాం కర్మఫలేష్వత్ర కరోతి! యజ్జిజ్ఞాసాం రూపఫలార్థీ క్షితిదేవస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
9) క్షిప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః ప్రధ్వస్తాధిః ప్రోజ్ఝిత సంసృత్యఖిలార్తిః!ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సంరమతే యస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
10) ణానేత్యేవం యన్మనుమధ్యస్థితవర్ణాన్భక్తాః కాలే వర్ణగృహీత్యై ప్రజపంతః! మోదంతే సంప్రాప్తసమస్తశ్రుతితంత్రాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
11) మూర్తిశ్ఛాయా నిర్జితమందాకినికుందప్రాలేయాంభోరాశిసుధాభూతిసురేభా!యస్యాభ్రాభా హాసవిధౌ దక్షశిరోధిస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
12) తప్తస్వర్ణచ్ఛాయ జటాజూటకటాహప్రోద్యద్వీచీవల్లివిరాజత్సుర సింధుమ్! నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషంతం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
1౩) యేన జ్ఞాతేనైవ సమస్తం విదితం స్యా ద్యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృంగమ్! యం ప్రాప్తానాం నాస్తి పరం ప్రాప్యమనాదిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
14) మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్నిస్ఫూర్జత్కీలప్రోషితభస్మీకృతదేహః!తద్భస్మాసీద్యస్య సుజాతః పటవాసస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
15) హ్యంభోరాశౌ సంసృతిరూపే లుఠతాం తత్పారం గంతుం యత్పద భక్తిర్దృఢనౌకా! సర్వారాధ్యం సర్వగమానందపయోనిధిం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
16) మేధావీ స్యాదిందువతంసం ధృతవీణం కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్! చిత్తే ధ్యాయన్యస్య వపుర్ద్రాంనిమిషార్ధం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
17) ధామ్నాం ధామ ప్రౌఢరుచీనాం పరమం యత్సూర్యాదీనాం యస్య స హేతుర్జగదాదేః!ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
18) ప్రత్యాహారప్రాణ నిరోధాదిసమర్థైర్భక్తైర్దాంతైః సంయతచిత్తైర్యతమానైః! స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా యస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
19. జ్ఞాంశీభూతాన్ప్రాణిన ఏతాన్ఫలదాతా చిత్తాంతఃస్థః ప్రేరయతి స్వే సకలేజ్పి కృత్యే దేవః! ప్రాక్తనకర్మానుసరః సంస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
20) ప్రజ్ఞామాత్రం ప్రాపితసంబిన్నిజభక్తం ప్రాణాక్షాదేః ప్రేరయితారం ప్రణవార్థమ్! ప్రాహుః ప్రాజ్ఞా విదితానుశ్రవతత్త్వాస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
21) యస్యాంజ్ఞానాదేవ నృణాం సంసృతి బోధో యస్య జ్ఞానాదేవ విమోక్షో భవతీతి! స్పష్టం బ్రూతే వేదశిరో దేశికమాద్యం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
22) ఛన్నేజ్విద్యా రూపపటేనైవ చ విశ్వం యత్రాధ్యస్తం జీవపరేశత్వమపీదమ్! భానోర్భానుష్వంబువదస్తాఖిలభేదం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
23) స్వాపస్వప్నౌ జాగ్రదవస్థాపి న యత్ర ప్రాణశ్వేతః సర్వగతో యః సకలాత్మా! కూటస్థోయః కేవలసచ్చిత్సుఖరూపస్తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
24) హా హేత్యేవం విస్మయమీయుర్మునిముఖ్యా జ్ఞాతే యస్మిన్స్వాత్మతయానాత్మవిమోహః!ప్రత్యగ్భూతే బ్రహ్మణి యాతః కథమిత్థం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి!!
25. యైషా రమ్యైర్మత్తమయూరాభిధవృత్తైరాదౌ క్లృప్తా యన్మనువర్ణైర్మునిభంగీతామేవైతాం! దక్షిణవక్త్రః కృపయాసావూరీకుర్యాద్దేశికసమ్రాట్ పరమాత్మా!!
ఇతి శ్రీమత్పరమ హంసపరివ్రజకాచార్యస్య శ్రీగోవిన్ద భగవత్పూజ్య పాదశిష్యస్య శ్రీమచ్ఛంకర భగవతః కృతౌ శ్రీదక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం సంపూర్ణమ్.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment