Tuesday, 23 February 2021

24--02--2021

 

 

 Bestフォト|フォトウェディング|バリ島撮影会社 BLESS(ブレス)


2ముద్దమందార మధురస్మృతి (2) (రోజువారీ కధ)
ఆ నిశ్శబ్ద నీరవంలో ఆ ఘంటానాదం నాడీమండలం మీద పని చేయడంతో ఒక రకమైన ఉత్తేజంతో మంచం మీద గబుక్కున లేచి కూర్చుంది లిఖిత.
సరిగ్గా అప్పుడే హారతి పళ్ళెంతో ఆ గదిలోకి ప్రవేశించింది మందార వల్లి.
లిఖిత లేచి నిలబడి హారతి కళ్లకద్దుకుంటూ తల్లి మొహంలోకి చూసింది. హారతి జ్వాలలో ఆవహించిన దుర్గలా వుందామె ఆకృతి.
మల్లెతీగయు ఏకమల్లెను మచ్చికే సుమ అందమే 
తల్లిభాధయు అంతయూ తమ భావమే మరి అందమే 
వల్లి ఆకృతి సంధ్య వెల్గుగ వెన్నెలద్దియు అందమే 
తల్లిమల్లిగ  సద్దుచేయగ తల్లిమాటలొ అందమే
లిఖిత కిటికి తలుపు తెరచి బయటకి చూసింది.
చీకటింకా చెక్కు చెదరలేదు. భూమిని స్పర్శించడానికి వెలుగుకింకా ధైర్యం చిక్కలేదు. చలిగాలి మాత్రం తీసిన తలుపు రెక్క సందులోంచి దొంగలా జొరబడి లిఖిత మొహం మీద తీవ్రంగా దాడి చేసింది.
చీకటింకయు మార్పుతేకయు చిద్విలాసము విస్తరే 
చీకుచింతయు లేకయే మరి చల్లగాలితొ విస్తరే
ఆకుమారక వెల్గుకంతకు ఆర్యమొప్పఁకు విస్తరే  
రేఖమోహము తీవ్రమెత్తగ రంగులా జొర  విస్తరే
లిఖిత తలుపు గబుక్కున మూసి “నీకెన్ని సార్లు చెప్పాలి. ఇంత తొందరగా లేవడమెందుకు చెప్పు?” అంది కోపంగా.
“నాకలవాటైపోయింది. ఈ వేళప్పుడు పూజ చేయకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. అది సరే. నువ్వు లేచి మొహం కడుక్కో. నేను కాఫీ తెస్తాను” అంటూ లోనికెళ్లిపోయింది మందార వల్లి.
నీడమాటకు జంకకుండగ  నిప్పుకోడిల వుండెనే 
అడ్డమొచ్చిన మాటమార్చక పూజచేయుట కుండనే 
నడ్డిపెర్గియు అందచందము నప్పుకారము అయ్యెనే 
దొడ్దిఅంతయు గుప్పుగుప్పున దుళ్ళేవాసన ఉండనే
లిఖిత లేచి దుప్పటి మడిచి బాత్రూంలోకి నడిచింది. గీజర్ ఆన్ చేసి బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చిందామెకు. ఆరోజు కాన్వకేషన్ అని. మనసులోకి ఉత్సాహం పంప్ చేసినట్టు తన్నింది.
ఉత్సవం మది  గుర్తుకొచ్చియు  ఊహ అంతయు  తొందరే 
మత్యమల్లెయు  పాఠమంతయు మల్లి చెప్పుట తొందరే
సత్యపల్కుయు బిడ్డలేఖకు శాంతిమార్గము  తొందరే 
నిత్యసత్యము బత్కునీడలో నమ్మ బుద్ధిగ తొందరే
  
ఈరోజు తాను బి.ఎ. పట్టా తీసుకోబోతోంది మామూలుగా కాదు.. గోల్డ్‌మెడల్‌తో. తను యూనివర్సిటీ ఫస్టు వచ్చింది అదీ లిటరేచర్‌తో. ఈరోజు ఎన్నో కళ్ళు తనని ఆరాధనగా చూస్తాయి. గవర్నర్ ప్రశంసిస్తూ మెడల్‌ని తన మెడలో వేస్తాడు. వేలాది పట్టభద్రుల్లో తనకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం.
--(())--  


తేదీ : 24-02-2021 బుధవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
 *#సుశీలుని_కథ*
రాజా ! మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తి యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము.
పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడి యుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటునిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలె నున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి యుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసికొను అవకాశము లేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేద మంత్రములను చదువ నారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.
కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితి యేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసిన వన్నియు పాపకర్మలే.. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగ నుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యే పనియు చేసెడి వాడను కాను. అసత్యములు పలికెడి వాడను.. పరుల సొమ్ము నపహరించు చుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమో యెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని. తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలో నుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహు విధములుగ ప్రార్థించెను.
సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదా యని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా యని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు... అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే, వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములో నున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచు పోయెను.
సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలెనన్న యేమి చేయవలయునో చెప్పుమనీ అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘ మాసమున నదీస్నానo చేయుము. శివుని గాని, కేశవుని కాని, నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు.
స్నానము యేడు విధములు... అవి ,
*మంత్రములను చదువుచు చేయు స్నానము -- మంత్ర స్నానము.*
*మట్టిని రాచుకొని చేయు స్నానము -- మృత్తికా స్నానము.*
*భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము - ఆగ్నేయ స్నానము.*
*గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము -  వాయవ్య స్నానము.*
*నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము - వరుణ స్నానము.*
*ఎండగ నున్నప్పుడు వానలో చేయు స్నానము - దివ్య స్నానము.
*మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము - మానస స్నానము.*
*ప్రాతఃకాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు, మున్నగు వారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును.. జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*
*స్నానము చేయునప్పుడు కౌపీనము (గోచి) ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత, మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పని సరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్య కిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో నుంచవలయును. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను., ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను., నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింప వలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును.. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*
స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రము రాని వారు యిష్ట దైవమును స్మరించుచు నీటిలో మరల మునగ వలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను..
భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘ స్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షస రూపమున ఉన్న పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాస మంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను...
ఇతి శ్రీ మాఘ పురాణం త్రయోదశ అధ్యాయం పారాయణం సంపూర్ణం...
 

జోతిష్యంలో నక్షత్రాలు రోగాలు :

1. అశ్విని నక్షత్రంలో జన్మించినవారు.
తరుచుగా జ్వరం వస్తుంది
2. భరణి - విరేచనాలు వస్తుంటాయి
3. కృత్తిక నక్షత్రం - మలబద్దకం, జీర్ణ సంబంధ వ్యాధులు,  డైయేరియా
4. రోహిణి - పైల్స్
5. మృగశిర - జీర్ణ సంబంధ వ్యాధులు
6. ఆరుద్ర - వైరస్, అంటు వ్యాదులు
7. పునర్వసు - కలరా, దగ్గు
8. పుష్యమి - పంటి సమస్యలు
9. ఆశ్లేష - రక్త సంబంద వ్యాధులు
10. మఖ = ఆస్తమా, దగ్గు
11. పుబ్బ - దగ్గు
12. ఉత్తర - చర్మ సంబంద వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధులు
13. హస్త - షుగర్
14. చిత్త - మత్తు పదార్థాలను తీసుకోవడం
15. స్వాతి - కంటి సమస్యలు, వైరస్
16. విశాఖ - చెవి సంబంధ వ్యాధులు
17. అనురాధ - ముక్కు సంబంధ వ్యాధులు
18. జేష్ఠ - పంటి సమస్యలు, జననేంద్రియ సమస్యలు
19. మూల - అల్సర్, ఆకలి లేకపోవడం
20. పూర్వాషాఢ - కిడ్నీ లలో రాళ్లు ఉండడం, మూత్రశాయ సమస్యలు
21. ఉత్తరాషాఢ - విరేచనాల…
🙏🏻🍀🌺☘️🍀🌻☘️🍀🌸☘️🙏🏻
భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

ఆధునికయుగం, హడావుడి జీవితం, యాంత్రికంగా మారిన ప్రజలు.. సడలిపోతున్న కుటుంబ విలువలు. ప్రస్తుతం ఇదే.. మానవ జీవితంగా మారిపోయింది. ఎప్పుడూ ఉద్యోగాలు, హడావుడిగా గడిపేయడం ప్రస్తుతం ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. వీటికి తోడు ఆధునిక పరికరాలు వచ్చేశాక వాటితో గడిపే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.

ఇలా పురాతన అంశాలు, యోగా, ఆధ్యాత్మికం వంటి సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియా ప్రస్తుతం కథనాల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వాటిలో
 ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అనుబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి.

భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడాన్ని చాలామటుకు విస్మరిస్తున్నారు.

యాంత్రిక జీవితానికి అలవాటుపడి ప్రేమను దూరం చేసుకుంటున్నారు. అయితే స్థితికర్త విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మీదేవి అంటే …
🪴 తిరుమల శ్రీవేంకటేశుని పాదాల నుంచి వచ్చే తీర్థం... 🪴

పూర్వం తుంగభద్రనదీ తీర్థంలో పద్మనాభునిపుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యాలంపటుడయ్యాడు. ధనం మీద దురాశతో ఒక విప్రుని చంపాడు. ఆ మరుక్షణమే బ్రహ్మహత్యాపాపం భయంకర రూపంతో అతని వెంట పడింది. కేశవుడు భయంతో దేశాలన్నీ తిరుగుతూ, తన తండ్రి కాళ్లపై పడి రక్షించమని ప్రార్థించాడు.
అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటహ తీర్థమహిమను తెలియజేసి, ఆ తీర్థాన్ని సేవింపజేయమని ఆనతిచ్చాడు. కేశవ వర్మ తండ్రితో కూడా కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకుని శ్రీస్వామివారి కోనేట్లో స్నానమాచరించాడు. తరువాత వరాహస్వామినిదర్శించుకున్నాడు
అటు తర్వాత శ్రీవేంకటేశ్వరుని దర్శించి, పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహతీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించుకున్నాడు. అలాగే కర్మరోగాలను కూడా పోగొట్టుకున్నాడు. ఈ క…
🌹వైజయంతి మాల🌹

"వైజయంతిమాలను పూజించిన,ధరించిన కలుగు ప్రయోజనాలు"..

వైజయంతిమాల శ్రీ కృష్ణుడి జన్మ స్థలమైన ఉత్తరప్రదేశ్ లోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ ఆరన్యప్రాంతంలో వైజయంతి పూసలు దొరకుతాయి.వైజయంతి పూసలు రాధా కృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు..

వైజయంతిమాలను దీపావళి నాడు కానీ శుక్రవారము నాడు కానీ లక్ష్మీ దేవి పటానికి గాని లేక శ్రి చక్రానికి కానీ అలంకరించి లక్ష్మి అష్టోత్తరం లేదా సహస్రనామం చదివి కుంకుమార్చన  పూజ చేసి బీరువాలో కానీ డబ్బులు డబ్బాలో గాని మెడలో కానీ ధరించవచ్చు. ఈ మాల మెడ లో ధరిస్తే లక్ష్మి దేవి అనుగ్రహం లబిస్తుంది.

"వైజయంతి మాల వలన కలుగు ప్రయోజనాలు'' :

1) వైజయంతి మాల పూసలను చిన్న పిల్లలకు చెవి పోగులకు,లాకెట్ లాగా చేయించి వేసిన బాలారిష్టదోషాలు,నరదృష్టి, చొంగకార్చుట అనే అలవాటు తగ్గుతుంది.

2 )వైజయంతిమాలను వివాహం కానీ వారు న…
దక్షిణ..సంభావన..అంటే ఏమిటి?

🌺దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత.

ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.
ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.

ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.

ధార్మిక కా…
నవగ్రహ దోష నివారణకు తీసుకోవాలసిన ఆహారం-దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును.
రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి స…
భోజన నియమాలు
            
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.  
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవా…


భాష -ఉచ్చారణ
మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట.నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి?సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే.
సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి
వారిని గురించి ఆరా తీస్తాడు.ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని ఆంజనేయుడిని గురించి అనుకున్నాడు.ఎదుటి వ్యక్తికి
మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.
ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతె ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు
పడుతున్నారు కదా!స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకుతున్నాము.కదా!. ఉదాహరణకి సైకాలేజీ స్పెల్లింగ్ ఏమిటి?మనం ఎలా పలుకుతున్నాము? ఆలోచించండి.మరి.వూరికే భాషాదినోత్సవాలు జరుపుకుంటే సరిపోదు కదా!  
తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా!వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం' అని పలుకుతున్నారు.మరి ఎలా ఒప్పుకుంటున్నారు?యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు.హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు.వినడానికి సొంపుగా
వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.
పాఠశాలలో చదివే టప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి.ఇప్పుడు ఆంగ్లము లో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇది చాలా బాధాకరమైన విషయం.
ఎదుటి వ్యక్తికి  మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి.దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠా లను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి.అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా వుండాలో  ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)
వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో
పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్
గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక  చిత్తుడై
యనుపమ భక్తి  తో చదువునాతని వాచకుండండ్రు సద్బుధుల
చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు,ఆ,ఈ వూ అని అనకూడదు.విసుగు చెందకూడదు.ఒక ప్రవాహం లాగా ఆవిరళం గా సాగాలి.అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందే మిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా.ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తీ శ్రద్ధ లతో చదివేవాడిని,మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు
ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది..ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా
తెలియదు.చెప్పేవారు కూడా లేరు.ఉపాధ్యాయులు అలాగే వున్నారు,విద్యార్థులూ అలాగే వున్నారు.
. '
పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు,యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.అన్ని భాషలకూ వర్తిస్తుంది
(

భోజన నియమాలు
            
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.  
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)
 
14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.
    
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
 
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
   
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
   
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ  వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.
 
21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు)
 
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  
 
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
 
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.  
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
                          
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

[26/02, 6:43 am] +91 94404 88271: *వంటగది వాస్తు.* 



           మనం భుజించే ఆహారం కూడా మనలను, మన గుణ గుణాలను మార్చివేస్తుంది అని పూర్వీకులు ఎపుడో చెప్పి వున్నారు. ఒక దొంగ ఇంటి ఆహారం తిన్న ముని కూడా ఆ ఇంట్లోనే దొంగతనం చేసి, మరుసటి దినం వెనక్కు తిరిగి వచ్చి, ఆ దొంగకు తాను దొంగిలించి నది తిరిగి, వెనక్కు ఇచ్చిన కథలు చదివియున్నాము.

       ఇంకొక విషయం మనకు తెలుసు సాత్విక అహారం, మనకు సాత్విక బుద్ధులను కలిగిస్తుందని తెలుసు. మరొక్క విషయం కూడా మనకు విదితమే, వoడే  వారి బుద్ధులు కూడా మన మీద పని చేస్తాయని తెలుసు.

    *ఇప్పుడు వండు ప్రదేశమునకు కూడా అభోజనం తిను వారికి, వారి కి మార్పులు ఎలా కల్గించునో చూద్దాం.*

       ఇప్పుడు కొందరు వంట గది వాస్తు గురించి ఎక్కువగా వివరించు తున్నారు. వారి అభిప్రాయము ఏమనగా ఇంటికి వంట గదే అతి ప్రధానమైనది అని, ఆగది అన్ని విధాలా బాగున్నచో ఇంటిలోని వారి ఆరోగ్యమే కాకుండా వారిలో ఐకమత్యం కూడా పెరుగు తుందని అంటున్నారు. విశ్వకర్మ దేవతలకు  గృహములు,ఆలయాలు ఆయుధములు మొ|| తయారుచేసి ఇచ్చువాడు. (ఒకవిధంగా "ఇంజినీర్") వారి వాస్తు శాస్త్ర నిబంధనలు:

 *వంటగది అగ్ని ప్రదేశం అయిన ఆగ్నేయం ఉత్తమం.* 

      ఈ ఆగ్నేయం దిక్కున కాకుండా, ఇక ఎక్కడైనా ఉన్నచో, ఆ  ఇంటిలో వండిన పదార్థములు పై ఇంట్లో వారు, అతిధులు  ఫిర్యాదులు కూడ ఎక్కువట. వండే వారి కి నెగిటివ్  శక్తి వలన  ఆరోగ్యము క్షీణించి, చేయు పదార్థములు సరిగ్గా చేయలేరట.

1. వంట గది ఇంటి ఈశాన్యమున నున్నచో ఇంటిల్లిపాధికి అనారోగ్యములు కలుగును. అదీగాక ఇంటిలో అందరికి దురదృష్టము కూడా కలుగును.

2. వంటగది దక్షిణం, లేక నైఋతిలో ఉన్నచో, ముఖ్యముగా  ఇంటిలోని స్త్రీలకు  అనారోగ్య సమస్యలెక్కువ.

3. ఇంటి మధ్య లో వంట గది ఉన్నచో ఆ ఇంటిలో అనేక విభిన్నమైన  సమస్యలుండును.

4. వాయువ్యంలో వంటగది ఉండినచో ఆ ఇంట సదా పొయ్యి వెలుగుతూనే వుండవలసి వస్తుంది అంటే ఎప్పుడూ వండుతూనే ఉండాలి. ఈ దిక్కువల్ల మంచి, చెడు రెండు జరుగదు. 

 *కొన్ని వాస్తు నియమాలు:--* 

1. వంట గది పైన పడక గది ఉండరాదు.

2. వంటగది పై మరుగుదొడ్డి ఉండరాదు.

3.ఈశాన్య భాగమున బరువులు పెట్టకండి. ఉత్తర, తూర్పు గోడలపై కూడా బరువులు ఉండకూడదు.

4.ఇంటిలో కారి పోవు కుళాయిలు, పైపులు  ఉండరాదు. 

5. వంటగది వాకిలి మరుగుదొడ్డి వాకిలి ఎదురెదురుగా ఉండరాదు.

మార్చేయండి లేదoటే, వాకిళ్లకు స్ప్రింగ్ లు పెట్టిన, తీరుస్తూనే, అవoతకవే మూసుకొంటాయి.

6. మీ ఇంటి స్టవ్ బర్నర్లు సరిగ్గా మండనవి ఉంటే మీ ఇంటికి ధనం వచ్చి చేరుటలో ఆటంకం కలుగును.

7.వంట గదికి ఈశాన్యంలో చెత్త బుట్ట పెట్టరాదు. మీ ఇంటి సానుకూల శక్తికి (పాజిటివ్) అవరోధం కలిగించును. 

8. మీ స్టవ్ కు అమర్చు గాస్ సిలిండర్ ఉత్తర, దక్షిణ గోడకు ఆనించి పెట్టరాదు.

9.వంటగది కి నైరుతి దిశగా మీఇంటి నీరు ప్రవహించ రాదు.

10.వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచవలెను. కొందరు వంట పూర్తి అయ్యే వరకు అన్నీ అక్కడక్కడే  వేసుకుంటూంటారు.      

11. వంటగదికి ఎప్పుడు గ్రీన్, లెమన్, ఎల్లో, ఆరెంజ్ రంగులు వేయండి. *నలుపు, గ్రే, బ్లూ కలరు వేయరాదు.* వెలిసి పోయిన రంగుల వంటగది వండు వారికి విసుగు, బేజారు కలిగించడమే కాకుండా హుషారును తగ్గిస్తుంది. వంటలు రుచికరంగా తయారు కావు.

 *వాస్తు సూచనలు:--* 

1. ఆగ్నేయంలో వంటగది లేకున్న అగ్నిమాపక పరికారములు పెట్టండి. 

2. కంటికి ఇంపైన రాంగులు వేసుకోనండి.

3.తులసి కానీ  పుదీనా చెట్లు కానీ వంటగది కిటికీ వద్ద కానీ, బాల్కనీలో కానీ పెట్టండి. 

4. వంటగదిలో సింక్ ఎప్పుడు నీటితోకాని, కడుగవలసిన సామాన్లతో కానీ నిండి ఉండరాదు. కడుగుకొనేటప్పుడు మాత్రమే వాడాలి. ఆ పిమ్మట శుభ్రంగా నీరు లేకుండా ఎండిన విధంగా ఉండాలి.

5.వంట గది కిటికీలలో ఆకు పచ్చటి మొక్కలు పెట్టి పెంచండి.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

[26/02, 6:43 am] +91 94404 88271: *ఆలూమగల అన్యోన్యత కొరకు* 


ప్రస్తుత కాలంలో ఎవరికి వారికి స్వతంత్ర 

భావప్రకటన వలన, భార్యా భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అవి అనేక  సమస్యలు వరకు దారి తీస్తున్నాయి. 

కలహాలను దూరం చేసుకోటానికి మంత్ర శాస్త్రంలో 

కొన్ని మంత్రాలు ఉన్నాయి. 

మంత్రాలను జపం చేసుకుంటూ చిన్న చిన్న 

సూచనలను పాటించటం వలన భార్యా భర్తల మధ్య కలహాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు. 

వివాహానికి జాతక చక్రంలో సప్తమ స్థానం 

వివాహ స్థానాన్ని తెలియ చేస్తుంది. 

ఈ సప్తమ స్థానంలో పాప గ్రహం ఉన్నా లేక 

సప్తమ స్థాన అధిపతి 6,8,12 స్థానాలలో ఉన్నా 

దాంపత్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే 

అవకాశం ఉన్నది. 

అదే సప్తమ స్థాన అధిపతి స్వరాశి లో ఉన్నా, 

మిత్ర రాశిలో ఉన్నా, ఉచ్చ స్తితిలో దాంపత్య జీవితం బాగుంటుంది. 

సప్తమ స్థానం బాగుగా లేని పురుషులు అయితే 

శుక్రుని కి సంబంధించిన మంత్రాన్ని, 

స్త్రీలు అయితే బుధుని కి సంబంధించిన 

మంత్రాన్ని జపించాలి.

పురుషులు అయితే *‘ఓం వస్త్రం దేహి శుక్రాయ నమః*  ‘ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి,

అదే స్త్రీలు అయితే ‘ ఓం లోహితాక్ష్యానమహ ‘ అనే మంత్రాన్ని పఠించాలి.

దీనితో పాటు పురుషులు అయితే బియ్యాన్ని కాని, పరమాన్నాన్ని కాని ఆవుకు తినిపించాలి. 

అదే స్త్రీలు అయితే మంగళవారం నాడు 

ఆవుకి బెల్లం తినిపించాలి. 

ఇంకా భార్యా భర్తలు కలిసి ఉన్న ఫోటోను పడక గదిలో నైరుతి కోణంలో అమర్చాలి.

దాని వలన కూడ అనుకూలతరంగాలు ఏర్పడి 

వైవాహిక జీవితం బాగుంటుంది.

ముఖ్యంగా భార్యా భర్తల మధ్య ఆర్ధిక విషయాల వలన వచ్చే కలహాలను నివారించడానికి సోమవారం నాడు అశొక వృక్షం యొక్క ఆకులను తీసుకుని ఒక గుత్తి లాగా కట్టి ఇలా 21 గుత్తులను తోరణంగా కట్టి 

గుమ్మం ముఖద్వారానికి కట్టాలి. 

మంగళవారంనాడు ఆ తోరణం తీసి వేసి ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టాలి. 

ఇలా 4 సోమవారాలు చేయాలి. 

ఇలా చేస్తే ఆర్ధిక ఆటుపోట్లవలన గొడవలు పడే దంపతుల మధ్య విబేధాలు తొలిగిపోతాయి.

[26/02, 6:43 am] +91 94404 88271: 🙏🕉️🛕🏵️🌞🌙🐚🔱🙏

 *మనకు కష్టాలెందుకు? సుఖం ఎప్పుడు సంప్రాదిస్తుంది* 

🙏🕉️🛕🏵️🌞🌙🐚🔱🙏

         పుట్టకతతో ప్రతివ్యక్తి ఉత్తముడే. ఎందుకంటే పుట్టినప్పుడు ఈ అరిషడ్వర్గాల వ్యర్థకోరికలతో ఎవరు పుట్టరు. కానీ పుట్టుకతోనే  ముఖ్యమైనది, గత జన్మ దోషం వల్ల రెండు దోషాలు సంప్రాప్తమవుతావు.

         ఒకటి 1. ఉపాధి దోషం. 2. సంఘదోషం. *మొదటిది* మనం పొందే ఈ  శరీరం. ఈ దోషంరీత్యా అకస్మాత్తుగా , మనకు తెలియకనే పెద్దలను, గురువును ఎదిరించి, తిరస్కరించడం.

 *రెండవది:--* మన చుట్టూ వుండే వారు. సంఘం మంచిదయితే, మనము తప్పు చేస్తూ ఉంటే, సత్సంగం వలన సరిదిద్దబడతాయి.లేకున్న మనలను మురికి పాప కూపంలోనికి  లాగుతాయి

       ఇందులకు చక్కటి ఉదాహరణ *బలిచక్రవర్తి.* 

     ఆయన పుట్టుకతో రాక్షస శరీరం పొందారు. తన చుట్టూ రాక్షసులు. కానీ శుక్రాచార్యుల అనుగ్రహముతో మొత్తం దేవలోకాలే ఆయన వశం అయిపోయాయి. స్వర్గలోకానికి కూడా పోయాడు. ఇంద్రుడికి ఆశ్చర్యం. బలికి ఇంతటి శక్తి ఎలా వచ్చింది? 

        ఈశ్వర కృప దేవతలపై ఉంటుంది కదా ఒక దానవుడికి ఇంతటి శక్తి ఎలా లభ్యమైంది? అని దేవేంద్రుడికి కలిగింది, అనుమానం.అప్పుడు దేవేంద్రుడికి తట్టిన సమాధానం. బలి శుక్రాచార్యులకు వినయ విధేయతలతో శుశ్రూష  చేసిన ఫలితమే, బలికి అపాధిచించ బడిన బలం అని ఊహిస్తాడు. వెంటనే దేవ గురువు అయిన బృహస్పతి వద్దకు వెళ్లి అడుగుతాడు. ఆయన కూడా నేను నీతో యజ్ఞం చేయించి, నీకు కూడా అటువంటి శక్తినిప్పిస్తాను అని అన లేక పోయాడు.

     కాలం అనేది ఒకటి ఈ కాల చక్రాన్ని తిప్పుతూ,  ఉంటుంది. ప్రతికూలత ఎదురైనప్పుడు ఓర్పు అవసరం. అది ఒక్కటే పరిష్కారం. అంటే ఓర్పు అనే మాటకు కష్టాలను, ఇష్టంగా స్వీకరించడమే. 

       భగవంతుడు ఎవ్వారి కైనా వారి వారి గత జన్మ పాపాలను ఆధారం చేసుకుని వ్యతిరేక ఫలితాలనిస్తున్నాడు. ఒక్కొసారి, ఇతరులను అనుగ్రహించవలసి వచ్చి నపుడు కూడా మనకు కొన్ని అవరోధాలు కల్పించ బడవచ్చు. 

         మానవుడు పరిస్థితులను అర్థం చేసుకొని, మనస్సును వాటికి అనుకూలంగా మలచుకోవాలి.  కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనిషి తన స్థైర్యాన్ని కోల్పోవకుండా ధైర్యం తో ఎదుర్కోవాలి.

           కష్టాలు పడ్డా, అనుకూలత సిద్ధించి నపుడు అమితానందం పొందగలరు.

[26/02, 6:43 am] +91 94404 88271: *పంచ పాత్ర :*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైఃః*



👉  పంచపాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.


*మొదటిది అర్ఘ్య పాత్ర:*


👉 భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర


*రెండవది పాద్య పాత్ర:*


👉  ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర


*మూడవ పాత్ర:*


మూడవది ఆచమనీయ పాత్ర: 

👉  ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 


*నాలుగవది స్నాన పాత్ర:*


👉 ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర


*ఐదవ పాత్ర :*

👉 ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర


👉 ఇవి *పంచ పాత్రలు*..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. 


👉  ఇంకా *సర్వార్థ జల పాత్ర*- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.


॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

[26/02, 6:43 am] +91 94404 88271: *శవం తల దగ్గర దీపం అందుకు వెలిగిస్తారు ... ?*


పుట్టిన వాడు గిట్టక మానడు . ఈ భూమిపై జన్మించిన ప్రతీ జీవి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు . అయితే మనిషి చనిపోయిన తర్వాత తల దగ్గర దీపం వెలిగించడం సహజం . 


కానీ ఈ ప్రక్రియకు ముందు మనిషి చనిపోగానే ... మృతదేహాన్ని పడుకోబెట్టి ... ముక్కులో దూది పెట్టి ... ఆ తర్వాత తల దగ్గర దీపం వెలిగిస్తారు . మిగిలిన అన్ని విషయాలపై చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కానీ మనిషి తల దగ్గరే దీపం ఎందుకు వెలిగిస్తారనే విషయం ఎంతో మందికి తెలియదు . 


దీనికి కారణం ఉంది . హిందూ సంప్రదాయాల ప్రకారం దీపం అనేది ఎంతో పవిత్రమైనది . అందుకే దేవాలయాల్లో ప్రతి నిత్యం దీపారాధన కుంది వెలుగుతూ ఉంటుంది . ఏదైనా కార్యాన్ని ప్రారంభించినా జ్యోతి ప్రజ్వలన చేయడం కూడా మనం చూస్తుంటాం .


అన్ని సందర్భాల్లో లాగానే చనిపోయిన తర్వాత శవం ముందు దీపం వెలిగించడానికి కూడా బలమైన కారణముంది. మనిషి బ్రతికున్నప్పుడు దీపం వెలిగిస్తే మనకు అది దారి చూపిస్తుంది . అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా మోక్షానికి దారి చూపించేందుకు దీపం దారి చూపిస్తుందని హిందువుల నమ్మకం . 


మరణించిన మనిషి శరీరం నుంచి బయటికొచ్చే ఆత్మ బ్రహ్మ కపాలం ( తలలో పైభాగం ) గుండా వెళ్తుంది.


ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
👉🌱11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో  శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !
👉🌱16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం
అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.


[24/02, 5:46 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


*నమస్కారం - సంస్కారం*


భారతదేశ సంస్కృతి అతి ప్రాచీనమైనది. ఎన్నో యుగాలుగా మంచి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, సమయానికి తగినట్లుగా, తన ఒరవడిని మార్చుకుంటూ సాగుతున్నది. రకరకాల సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, పాత కొత్తల మేలు కలయికతో పుటం పెట్టిన 

మేలిమి బంగారం వలె, నిత్యనూతనమై, కాంతులీను చున్నది.


మన సంస్కృతిలో నమస్కారం అనే చర్యకు చాలా విలువ ఉన్నది. సాధారణంగా దేవునికి, గురువులకు, వయసులో కానీ, వరుసలో కానీ పెద్దైన వారికి, అతిథులకు, పదవిలో ఉన్నవారికి చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కృతి, సంప్రదాయం. మన పురాణేతిహాసాల ప్రకారం ఎదుటివారిలో దైవత్వానికి, మనం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, అంటే ఆ నమస్కారం మన ఎదురుగా నిలబడిన వ్యక్తికి కాదు. అతనిలో అంతర్గతంగా ఉన్న దైవానికి, ఆత్మారామునికి. ఈవిధంగా మనం ప్రతి ఒక్కరినీ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నామని చెప్పవచ్చు.


అంతేకాదు మనం రెండుచేతులు జోడించినపుడు, రెండు చేతుల వేళ్ళు, అరిచేతులు కలిసి ఒక దానిపై ఒకటి ఒక రకమైన ఒత్తిడిని తెస్తాయి. దాని వలన మన శరీరంలోని అన్ని రక్త నాళాలలో ప్రసరణ వృద్ధి చెంది, మనలో ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది. మన శరీరంలో రక్తప్రసరణ చురుకుగా సాగుతుంది. ఒకవిధంగా ఎదుటివారికి నమస్కరించడం కూడా మన మేలుకే నన్నమాట.


మన ముందు తరం వారు పెద్దవారి కాళ్ళను తాకి నమస్కరించేవారు. అప్పుడు శరీరంలో కదలికలు ఏర్పడి శరీరం మొత్తం ఉత్తేజితమౌతుంది. ఈ రకంగా పరిశీలిస్తే ప్రాచీనులు ప్రవేశపెట్టిన సాంప్రదాయాలు మన మేలుకోసమే అని అర్థమౌతోంది. నమస్కారం మన సంస్కారాన్ని తెలియ పరచడమే కాక, ధైవానికి నమస్కరించడం, మన శరీరానికి మేలు జరగడం అన్నీ జరుగుతాయి. అందుకే యోగాభ్యాసంలో సూర్య నమస్కారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.


మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షింప బడిన ఎందరో విదేశీయులు మన భారత దేశానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఇచ్చటి వేద విద్య నభ్యసించి

మన సంస్కృతి పై గౌరవంతో సంప్రదాయాలను పాటించు చున్నారు. ఇది మనకు గర్వకారణం.


ఇంటి చెట్టు మందుకు పనికి రాదు అన్నట్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు మన వారు విదేశీ మోజుతో అంధానుకరణ చేస్తూ తిలోదకాలు ఇస్తున్నారు. కానీ మన కన్నా అధికంగా విదేశీయులు వాటిని గౌరవిస్తున్నారు. మనము కూడా ప్రాచీన మైనవేవీ నేటి తరానికి పనికి రావన్న భావన నుండి బైటపడి అందులో ఉన్న మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. 


మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిలిపే భారం మన పచనే ఉంది. నేటి ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ

చేతులు కలపడం మాని, సామాజికదూరాన్ని పాటించడానికి చేతులు జోడించే సంప్రదాయాన్ని అలవర్చు కుంటోంది. 


అప్పటిలో మన వారు పాటించిన ఎన్నో విషయాలను నేడు వైద్యులు మనను పాటించ మంటున్నారు. నాటి నుండే మనము పెద్దలమాటకు గౌరవమిచ్చి ఆ సంప్రదాయాలను కొనసాగించి ఉంటే ఈ రోజు ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడేవారు కాదేమో.


ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడానికి ప్రయత్నిద్దాం. మన భావితరాలకు నేర్పుదాం. చేయి కలిపే ప్రాచ్య సంస్కృతిని వదలి, చేతులు జోడించే మన ప్రాచీన సంస్కృతిని స్వాగతిద్దాం. 

✍🏻శ్రీమతి నందగిరి రామశేషు

[24/02, 5:46 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- చెప్పే వాడికి వినే వాడు లోకువ!

 

‘పార్వతి’కి అరవైయేళ్ళు. 25 సంవత్సరాలు ఉద్యోగంచేసింది. ఆ తరువాత, భర్త చేసే వ్యాపారంలో ఆఫీస్ పనంతా నిర్వహించేది.

స్వతహాగా గట్టి ‘ఆరోగ్యవంతురాలు’ కాకపోయినా, ‘క్రమశిక్షణ’ కలిగిన మనిషి కనుక చెప్పుకోదగ్గ అనారోగ్యాలేమీ లేకుండా ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది.

పిల్లలకి ‘చదువులు’, ‘పెళ్ళిళ్ళు’ విజయవంతంగా నిర్వహించి మనవల్ని కూడా ఎత్తుకుని వారితో బాగా ఆనందిస్తున్నది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నది.

ఈ మధ్యనే కొంత ‘అనారోగ్యం’ వచ్చి ఒకటికి- రెండు సార్లు డాక్టర్లని సంప్రదించవలసి వచ్చింది. అక్కడ మొదలయ్యింది, ప్రహసనం.

గుండెకి సంబంధించిన డాక్టర్ ఏవో పరీక్షలు చేయించమని, ఆ ‘రిపోర్ట్’ ల ని బట్టి, ‘ప్రశ్నల చిట్టా’ విప్పారు.

--‘మీకు బీపీ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు

--‘డయాబెటిస్ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు

--‘మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఆహారపు అలవాట్ల గురించి వివరం చెప్పండి’ అని అడిగారు.

--‘మీరువైట్ రైస్ తినకండి’ – ‘నేను వైట్ రైస్, బ్రౌన్ రైస్ చెరి సగం కలిపి వండి తింటానండీ, అదీ

ఒక కప్పున్నర (చిన్న కప్పు)’ - పార్వతి జవాబు

--‘వేపుడు కూరలు తినకండీ’ – ‘నాకు వేపుళ్ళు తింటే పొట్ట బరువెక్కినట్లు ఉంటుందండి, అదీ కాక వేపుళ్ళు చేస్తుంటేనే, ఆ నూనె వాసనకి నాకు దగ్గు వచ్చేస్తుంది. అది అరగటానికి లివ్ 52 టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిలవలేను’ - పార్వతి జవాబు

--‘గోధుమ తినాలండీ’- ‘నాకు గోధుమ అలర్జీ అండీ’ పార్వతి జవాబు

--‘స్వీట్స్ అస్సలు తినకూడదండీ’ – ‘నాకు స్వీట్స్ అసలు సహించవండీ’ పార్వతి జవాబు

(పార్వతి ‘భర్త’ కి పదిహేనేళ్ళుగా ‘డయాబెటిస్’! కానీ స్వీట్స్ మీద ‘వ్యామోహం’, బజార్ నించి స్వీట్స్ తెచ్చి, తను తిని భార్య ని తినమని బలవంత పెడుతూ ఉంటాడు. (ఇది కొసమెరుపు ఇక్కడ).

ఆ మాటే డాక్టర్ గారి ముందు అనలేక, అనకుండ ఉండలేక తికమక ప డ్డాడు. భార్య స్వీట్స్ తినకపోవటం  మంచో కాదో తెలియని స్థితిలో పడ్డాడు, పార్వతి భర్త.

--‘రోజు గంట వాకింగ్ చెయ్యాలండీ’ – ‘నేను రోజూ వాకింగ్ కి మా పక్కింటి పార్క్ కి వెళ్ళి గంట నడుస్తానండీ’. పార్వతి జవాబు

--‘అన్నీ చేస్తూ ఉన్నా కూడా మీ బరువు తగ్గట్లేదంటే, సర్జరీ కి రికమెండ్ చెయ్యవలసి వస్తుంది’ – ‘డాక్టర్’ గారి చివరి నిర్ణయం (సర్జరీ అంటే ‘బేరియాట్రిక్’ అన్న మాట)

--‘మీరేం చేస్తారో తెలియదు , 4-5 కిలోలు బరువు తగ్గాలండీ. ప్రకృతి చికిత్సాలయంలో చేరండీ’.

ఇక “యోగాఅడ్వైజర్” వంతు -

--‘ఉదయమే ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తాగాలండీ’- టీచర్ సలహా. ‘అది తాగితే నాకు విపరీతంగా అసిడిటీ వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. రోజంతా ఏమీ చెయ్యలేక,

తినలేక మంచానికి కరుచుకుని పడుకుంటున్నానండీ’ - పార్వతి జవాబు.

(ఈ విషయం విని ఇంకో శ్రేయోభిలాషి అయిన డాక్టర్ గారు, ‘అయ్యో ‘యాపిల్ సైడర్ వెనిగర్’ ‘డయాబెటిస్’ ఉన్న వాళ్ళకి మంచిది, మీ లాంటి శరీర తత్వం ఉన్న వాళ్ళకి కాదు’ అన్నారు)

పార్వతి ‘గుండె’ కి సంబంధించిన ‘డాక్టర్’ కి చెప్పినట్లే ‘యోగా టీచర్’ కి ‘రోజూ పొద్దున గంట వాకింగ్ చేస్తానని’ చెబితే, యోగా టీచర్ ‘అయ్యో గంట వాక్ చెయ్యకూడదండీ, మొకాలి చిప్పలు అరిగిపోతాయి. ఆ గంటలోఒక ‘ఇరవై నిముషాలు’ ‘వాకింగ్’, ‘ఇరవై నిముషాలు’ ‘శ్వాస’కి సంబంధించిన ‘ఎక్షర్సైజ్’ లు చెయ్యండి’ అని ‘పార్వతి ఆరోగ్యం పట్ల తన ఆదుర్దా తో కూడిన సలహా ఇచ్చింది’.

--‘ఉదయం రోజూ ఒక అరగంట యోగాసనాలు వెయ్యాలండీ’. ‘నేను యోగా గురు ముఖతహ నేర్చుకుని ఎప్పటి నించో చెస్తున్నానండీ’. ‘శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు - రోజూ ఒక టైం కి కాకపోయినా తరుచు చేస్తూ ఉంటానండీ’- పార్వతి జవాబు

--‘నేను ఉదయం 5 గంటలకే లేస్తాను, అందుకని వాకింగ్ అయ్యాక ఏమీ తినకుండా యోగాసనాలు, శ్వాస కి సంబంధించిన ఎక్సర్ సైజ్ లు చెయ్యలేను. నాకు సాధారణం గా షుగర్ స్థాయిలు తక్కువ గా ఉంటాయి, కళ్ళు తిరుగుతాయి’ అని పార్వతి సందేహం!

--‘ఎబ్బే ఫరవాలేదండీ, మీరు ఏదైనా తాగి, పండు తిని యోగాసనాలు వెయ్యచ్చు’- టీచర్ జవాబు.

--‘ఆసనాలు వేసే ముందు గంట ముందు మాత్రమే ఏమైనా తిన్నా, తాగినా’ అని అనుభవఙ్ఞుల సలహా!

​ఇంతకీ ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఈ ‘హృద్రోగ నిపుణుడు’, ‘యోగా’ గురువు గారు, ‘ప్రకృతి చికిత్స’ కి సంబంధించిన సలహా ఇచ్చే గురువు గారు - అందరు ఒకే ఆసుపత్రి లో ఒకే చూరు కింద ఒకరి సమన్వయం తో ఇంకొకరు పని చెయ్యాలన్నమాట.

కానీ రోగికి మాత్రం కావలసినంత తికమక.

పార్వతి యోగ క్షేమాలు కోరుకునే బంధువులు, స్నేహితులు ఈ ప్రహసనం అంతా విని, వారి అనుభవాలని వారు పంచటం మొదలు పెట్టారు-

‘మా వాళ్ళెవరో ప్రకృతి చికిత్స కి వెళితే కిడ్నీ సమస్య వచ్చిందని’ ఒకరు, ‘హార్ట్ సమస్య వచ్చిందని’ ఒకరు చెప్పేసరికి అసలే మతి పోయి ఉన్న పార్వతికి ‘జీవితం’ మీద ‘విరక్తి’ వచ్చింది.

“హతవిధీ నేను ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పనేల? చెప్పితినిపో నా భర్త నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకుపోనేల ? తీసుకెళ్ళెనుపో, అతగాడు నన్ను ఇన్ని పరీక్షలు చెయ్యనేల ? చేసెనుపో, ఇంతమందిని సంప్రదించమని కోరనేల ? కోరితినిపో, వారు నాకు ఇన్ని విరుద్ధమైన సలహాలు ఇవ్వనేల ? ఇచ్చెనుపో నేను విననేల ? వింటిని పో ఆచరించటానికి ప్రయత్నించనేలా” అని పార్వతి అన్ని మందులు, సలహాలు కట్టకట్టి అటక మీద పడేసి హాయిగా నోటికి నచ్చి, శరీరం ఆమోదించిన తిండి తిని, తనకి నచ్చిన సంగీతం విని మనవలతో ఆడుకోవాలని నిర్ణయించుకుని హాయిగా నిద్ర పోయింది.

నిద్రలో ఒక అశరీర వాణి "చెప్పే వాడికి వినే వాడు లోకువ" అనే సామెత వినలేదా అని అడిగినట్లనిపించి దిగ్గున లేచి కూర్చుంది. ‘ఈ కల ముందే వచ్చి ఉంటే ఇన్ని తిప్పలు తప్పేవి కదా’ అనుకుంది.

✍🏻ఎం బిందుమాధవి

[25/02, 5:56 am] తెలుగు1: https://t.me/teluguvelugu01


“నమ్మకం నడిపిస్తుంది, విశ్వాసం కాపాడి నిలబెడుతుంది”


మనం ఎవరిని ఎంత వరకు నమ్ముతున్నామో మనకే సరియైన అవగాహణ లేకుండా వ్యవహరిస్తుంటాము. అనవసరమైన అనుమానాలతో మంచి బంధాలను పాడు చేసుకుంటాము. అతిగా ఆలోచించే మనతత్వం కలిగినవారు రేపటి గురించి ఆలోచించి ఈ రోజును పాడు చేసుకుంటారు. ప్రతి వ్యక్తి ప్రస్తుత కాలన్ని సద్వినియోగ పరచుకోవాలి. ఈ భావంతో వ్యవహరించుకోగలిగితే ప్రతి రోజు ఒక ఆనందమైన రోజుగా గడుస్తుంది. అందుకు ఉదహరణగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్తత్వాన్ని ఎలా పరీక్షించాడో చూడండి.


ఒకనాడు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశంవైపు చూపి...


'ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా ' అని అడిగాడు.

అర్జునుడు " అవును కృష్ణా! అది పావురమే " అన్నాడు.


మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.

" అబ్బే! అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు.

"అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణా" అన్నాడు అర్జునుడు.


కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు.."అర్జునా! అది గ్రద్ధ కానే కాదు. అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి"

"నిజమే కృష్ణా! అది చిలుకనే" అన్నాడు అర్జునుడు.


చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు

కృష్ణుడు... "అయ్యో! అది చిలుక కూడా కానేకాదు. అది కాకి అర్జునా! ఒక్కసారి పరీక్షించి చూడు"


అరే! నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణా!" అన్నాడు అర్జునుడు.

కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

" అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా?


సొంతంగా ఆలోచించలేవా? 

నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు " అన్నాడు.

దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

 " ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను.

నువ్వు ఏదంటే నేనూ అదే! మీరు పావురమే కదా అన్నారునేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది.


నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణా!"

నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.

దేవుడిపైన మనకు అనుమానం అక్కరలేదు. భగవంతునిపైన నిజమైన నమ్మకాన్ని

ఉంచాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికి ఉంది. 


మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఏది ఇవ్వాలో మన నుండి ఎప్పుడు ఏది తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించిన వారికి అన్ని తానై నడిపిస్తాడు.


శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు. అర్థరాత్రి అయింది రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు ఒక్కొక్క రాయి తీసికొని సముద్రం నీటిలో వేస్తున్నాడు ప్రతి రాయి మునిగిపోతుంది.

రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను రాముని వెంట వెళ్ళాడు, రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించారు రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు..


"హనుమా..! నువ్వు నాకు అబద్ధం చెప్పావు" అన్నాడు.

"రాముడు అదేమిటి స్వామి నేను మీకు అబద్ధం చెప్పానా?

ఏమిటి స్వామి అది?"  ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు.


"వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా?" అన్నాడు రాముడు


"అవును స్వామీ!" అన్నాడు హనుమా.


"నా పేరు జపింవి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు?"

మునగడానికి కారణమేమిటి?

నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా!!" అడిగాడు రాముడు 


హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకుని ఇలా అన్నాడు..


"రామచంద్ర ప్రభూ! మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము మీ మీద నమ్మకంతో వేశాము మా నమ్మకం వలన అవి తేలాయి మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు అందుకే అవి మునిగిపోయాయి" అన్నాడు.


“నమ్మకం విలువ అది. దేన్నైనా పూర్తి విశ్వాసం, నమ్మకంతో చేయాలి.”

మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంగా నమ్మలి. కొంత అనుమానం, సందేహాలు అనేవి ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. ఒకసారి నమ్మకం కుదిరాక తిరిగి పరిపరి విధాలుగా ఆలోచనలు రాకూడదు. అది ఏ బంధమైన సరే విశ్వాసం, నమ్మకం ఉంటే ఆ మైత్రితో మంచి మేలును కలుగజేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంలో నారాయణుడు ఉంటాడు.

[25/02, 5:56 am] తెలుగు1: https://t.me/teluguvelugu01


*మహాత్ముల మనసు*


నిజమైన మహాత్ములు నిరాడంబరులు, నిర్వికల్పులై ఉంటారు. సిరిసంపదలతో, భౌతిక సుఖాలతో వారికి పనిలేదు. ఏ లోభమూ వారిని లొంగదీయలేదు. తమ నగర సమీప ప్రాంతంలో ఒక గొప్ప తపస్సంపన్నుడున్నాడని, ఆయన మహామహిమాన్వితుడనీ రాజుగారు విన్నారు. అనుచరుల్ని, అమాత్యులను వెంటబెట్టుకొని, అశ్వారూఢుడై ఆ మహాత్ముడి సమీపానికి వెళ్లాడు రాజు ఆ యోగిపుంగవుడి దివ్యతేజస్సు చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన నిశ్చలంగా, కన్నులు మూసుకొని ధ్యాననిష్ఠలో ఉన్నాడు. తన రాకను ఆయన గమనించలేదేమోనని రాజు చిన్నగా దగ్గాడు. ముని చలించలేదు. 'మహాత్మా.. తమరి దర్శనార్థం వచ్చాను. మీ కరుణాలేశం నాపై ప్రసరిస్తే, కోరికలన్నీ ఈడేరతాయి అనే ఆశతో ఇక్కడికి వచ్చాను' అన్నాడు రాజు. ముని కనుగుడ్తెనా కదల్లేదు. ఆ ముని నిష్ఠాగరిష్ఠత చూసి రాజుకు ఆయనపై మరింత భక్తి విశ్వాసాలు కలిగాయి. వెంటనే భటులను పిలిచి, ఆ మునీశ్వరుడికి ఎండవలనగానీ, వానవలనగానీ ఎట్టి బాధా కలగకుండా పెద్ద మందిరం నిర్మింపజేయమని ఆజ్ఞాపించాడు  అనతికాలంలోనే దివ్యసౌందర్య మందిరం


మహామునిచుట్టూ నిర్మితమైంది కొంతకాలం తరవాత ఆ మహాత్ముడు ఇహలోకంలోకి వచ్చి కన్నులు తెరిచాడు. ఈ సంగతి తెలిసి మహారాజు పరుగు పరుగున వచ్చి ఆయన పాదాలమీద పడ్డాడు. 'స్వామీ మీవంటి మహాత్ములకు ఎండా వానా తగలకూడదని ఈ మహామందిరాన్ని నిర్మించాను. నా వాంఛితం

ఈడేరుస్తారని ఆశతో ఉన్నాను. నాకు అపారసిరిసంపదలు ప్రసాదించమని వేడుకుంటున్నాను' అని

రాజు ప్రార్థించాడు

ఆ మునీశ్వరుడు తన చుట్టూ నిర్మించిన సుందరమందిరాన్ని నిర్లిప్తంగా పరికించాడు.


మంద్రస్వరంతో ఇలా పలికాడు. 'నాయనా! ఈ మందిరం లేనప్పుడు నేను పొందిన బాధ ఏదీలేదు. దీన్ని నిర్మించిన తరవాత నేను పొందిన సౌఖ్యమూ లేదు. దీన్ని నిర్మించిన సంగతీ నాకు పట్టలేదు. ఈశ్వర ధ్యానమే నాకు పరమానందకరం. సర్వ సంపదలనూ అసహ్యించుకొని ఇక్కడకు వచ్చి తపస్సు చేస్తున్న నేను నీకు మరలా వాటినే ఎలా ప్రసాదిస్తాను? ఇక నేను ఇక్కడ ఉండటం తగదు!' అని వెంటనే ఆ మహాత్ముడు అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నిర్ణిప్తతకు, నిర్మోహత్వానికి ధ్యాననిష్ఠకు రాజు ఆశ్చర్యపోయాడు


మహాత్ములకు దివ్యశక్తులుంటాయనీ, వారి దర్శనంచేత, స్పర్శనంచేత వ్యాధులు తగ్గుతాయని, కష్టాలు తొలగిపోతాయని, సిరిసంపదలు అబ్బుతాయని అనాదిగా అన్ని దేశాల్లో ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటూనే ఉన్నారు. నిజానికి మహాత్ములు మాత్రం తమ గురించి ప్రజలు గొప్పగా భావించాలనీ, వారికి తమ శక్తులు ప్రదర్శించి చూపాలనీ అనుకోరు. పరమేశ్వర ధ్యానంతో అలలు లేని కొలనువలె వారి మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. భౌతిక విషయాల వైపు వారి మనసు పోనే పోదు


ఒకరోజు అక్బర్ తాన్సెన్ సంగీతం విని 'నీ గానం అసమానం' అని ప్రశంసించాడు. 'నా గురుదేవుల భిక్ష అన్నాడు తాన్ సేన్. 'నీ గురువెవరు?' అని ప్రశ్నించాడు అక్బర్ 'సంత్ హరిదాస్ నా గురుదేవుడు' అని తాన్సేన్ చెప్పగా, 'అయితే ఆయన్ని మన ఆస్థానానికి పిలువు' అన్నాడు అక్బర్. 'మా గురువులు బృందావనాన్ని వీడిరారు, మనమే అక్కడకు వెళ్ళాలి! అని తాన్సేన్ చెప్పగా సరే' అని తాన్ సేన్ ని వెంటబెట్టుకొని అక్బర్ బృందావనం చేరాడు


అక్కడ తోటలో కూర్చుని రాళ్ళు కూడా కరిగే విధంగా హరిదాస్ పాడుతూ ఉండగా, విని అక్బర్ పరవశించిపోయాడు. 'నిజమే.. తాన్ సేన్! నీ సంగీతాన్ని మించి ఉంది మీ గురువులది... ఈ తేడా ఎందువల్ల వచ్చింది? అని అడిగాడు అక్బర్


నేను పాడేది ఢిల్లీశ్వరుని గురించి.. మా గురువుగారు పాడేది జగదీశ్వరుని గురించి...' అని జవాబిచ్చాడు తాన్ సేన్. మాటలోను, పాటలోను, మనసులోను పరమేశ్వరుడుండటమే సంత్ హరిదాస్ గానమాధుర్యానికి కారణమని అక్బర్ గ్రహించాడు


No comments:

Post a Comment