
మధురిమల - రాధ కృష్ణ భావ తరంగం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సమ్మోహనమ్ము కలుగు
కాలియందియల శబ్దము
స్త్రీ మోము నందు కలుగు
మందహాసచూపుమయము
భంగిమగా వాలు చూపు
జెడకుచ్చులతోన ఊపు
ఇక వక్షజాలా మెఱుపు డబ్బు
చూసువాడి మనసు తడుపు
కంకణమ్ముల శబ్దాలు
రాగములొల్కే పల్కులు
విలాస విరాజ కరములు
చూసిన మనసు కితకితలు
ముక్కున ముక్కెర మెరుపులు
చెవుల దిద్దుల కదలికలు
గులాబీ రేకుల కురులు
మగవాడిని ముంచు తెరలు
లేత బుగ్గలే వాపులు
అధరాలు సిందూరాలు
కంటిచూపుతొ రెపరెపలు
కనుసైగతొ కవ్వింపులు
మూగగ నిల్చు కోకిలలు
మూతిముడిచియు పకపకలు
కవ్వింపు పెదవి విరుపులు
మనసున దోచు మధురిమలు
ఇక పౌర్ణమిన మరిపించు
ఇక వెన్నలను కురిపించు
ఇక వసంతం జరిపించు
ఇక మనసంతా మధించు
ముచ్చట గొల్పే వాకిట
ఎప్పుడూ ఉండు కిటకిట
సందడితో పూటపూట
జాగరణతో ప్రతిపూట
శెలవిస్తే ఆపుతాను
బంగారాన్ని దాచుతాను
వికసించే పువ్వు నేను
సంతోషము కల్గిస్తాను
--(())--
🌻 అన్నింటి కంటే ధర్మం సర్వశ్రేష్టమయినది 🌻
🍃🌺ధర్మం అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు.
🍃🌺ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త ధర్మము. అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మమము, తండ్రితో సంభాషించేటప్పుడు కుమార(పుత్ర) ధర్మం. స్నేహితునితో ఉన్నప్పుడు స్నేహధర్మం, కార్యాలయానికి వెళ్ళి పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మం. ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమధర్మం. వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్తధర్మం. అలా ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది.
🍃🌺భారత యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి ద్రౌపతి ఏమంటుందో చూడండి,
కడుపుకోతలో,పుత్రశోకముతో, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి, గురుపుత్రా,విప్రోత్తమా, మీరు పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో చూచు కొనుచున్నారు.
🍃🌺నాబిడ్డలు ఉపపాండవులు
“ఉద్రేకంబునరారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్ సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా నీచేతులెట్లాడేనో.”
🍃🌺ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమతల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలాఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని, ఆ సాద్వీమతల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి,
“ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు, తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మపధములకెల్లన్.”
🍃🌺ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో,అలాంటి పనులు, ప్రవర్తన, మనము ఇతరులపట్ల, చేయకుండా ఉండడముకంటే గొప్పధర్మము వేరొకటిలేదు. అని ధర్మవిషయము లను వివరించి,అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు .
🍃🌺శ్రీ రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ రామచంద్రుడు.
🍃🌺ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి, శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన, మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి.
🍃🌺అందు కొరకు రామాయణము, మహాభారతము,భాగవతము చదవాలి చదివిచాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము,బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయములు సనాతనధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన ధాకలాలు లేవు.
🍃🌺ఆపద్ధర్మం ఉంది చూశారూ, జీవితం నడవడం కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు.
🍃🌺ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి. మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు చెప్పినారు.
🍃🌺1.బలవంతులతో వైరం తెచ్చుకున్నా,
2.పరుల సంపదను అపహరించినా,
3.పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,
4.పరస్త్రీని పొందుకోరుకున్నా,
ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు.
🍃🌺మూర్ఖుల లక్షణాలు:-
అహంకారం, విద్యాశూన్యత, వివేకహీనత,ఏ పనీ చేయకనే (శ్రమ పడకుండా) ఫలమాసించుట, దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేయుట, ఊహలలో జీవించుట, శత్రువులను స్నేహితులుగా భావించుట, అడుగక పోయినా వచ్చి సలహాలిచ్చుట, ఎల్ల వేళలా ఎదుటివారిలో దోషముల కొరకు వెతుకుట, అకారణ క్రోధము, కలహములు ప్రోత్సహించుట, విషయ పరిజ్ఞానములేక భాషించుట, ధర్మాధర్మ విచక్షణ లేకుండుట, పరస్త్రీ వ్యామోహము, నిర్దయ,పరధనాపేక్ష, నిత్యమూ అనృతములు భాషించుట, …
🌻 మహా భారతం 🌻
🩸 భాగము 36 🩸
💧 ఇంద్రపదవిలో నహుషుడు 💧
🍃🌺స్వర్గలోక ప్రముఖులు మృదువుగా చెప్పిన హితోక్తులను వృత్రాసురుడు శ్రద్ధగా ఆలకించాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. వారు చెప్పింది కూడా బానే వుంది అనుకున్నాడు. అయినా, వీరిని పూర్తిగా నమ్మరాదని నిశ్చయించుకున్నాడు. వెన్నుచూపి, ముఖం చాటేసిన శత్రువు పక్షాన వీరు వచ్చారు. అంటే, అవసరం వారిది కాని నాది కాదు. కనుక విధానాలు నిర్ణయించే అధికారం నాకే వుంటుంది కదా అనుకున్నాడు వృత్రాసురుడు.
🍃🌺‘‘సరే, మా మధ్య సఖ్యానికి మీ వంతు కృషిచేయండి. అందుకు నా షరతులు కూడా వినండి. శస్త్రాస్త్రాలు, రాళ్ళురప్పలు, చెట్టుచేమలు, ఆర్ద్రసాధనాలు, ఇతర వస్తువులు- వీటివల్ల అహోరాత్రాలలో నాకెన్నడూ ఎవరివల్లా ప్రాణాపాయం కలిగించరాదు. మీరీవిధంగా నాకు వరం యివ్వండి. తరువాత మీ అధినేతతో నెయ్యానికి అంగీకరిస్తాను’’ అన్నాడు అసురుడు. తపోధనులు వెంటనే ఆ వరాన్ని అనుగ్రహించారు. సంధి కుదిరినందుకు అందరూ ఆనందించారు.
🍃🌺వెళ్ళి ఇంద్రునికీ శుభవార్త చెప్పారు. తిరిగి ఇంద్రుడు సింహాసనం అధిష్టించాడు కాని వృత్రాసురునిపై అక్కసు మాత్రం పోలేదు. విష్ణుమూర్తి తనకిచ్చిన మాటను గుర్తుచేసుకుంటూ, ఓర్పుతో రోజులు వెళ్ళదీస్తున్నాడు.ఒకనాడు వృత్రాసురుడు సాయం వేళ సముద్రతీరంలో విహరిస్తున్నాడు. అది గమనించిన దేవేంద్రుడు, పగలూ రాత్రీ కాని యీ సమయం అసురవధకు అనువైనదనుకున్నాడు. ఆర్ద్రము శుష్కము కాని సముద్ర కెరటాల నురుగును తన వజ్రాయుధానికి పట్టించాడు.
🍃🌺విష్ణుదేవుని ప్రార్థించాడు. ఆయన దిగి వచ్చి, వజ్రాయుధం కొనభాగాన తన దివ్యశక్తితో సహా అమరాడు. ఇంద్రుడు సర్వశక్తులు సమీకరించుకున్న ఆ దివ్యాయుధాన్ని మునిమాపువేళ వృత్రాసురునిపై ప్రయోగించాడు. వరాలేవీ అతనిని కాపాడలేకపోయాయి.
🍃🌺ఆ భీకర రాక్షసుడు హరీంద్రులు సమస్త శక్తియుక్తులను కలగలిపి కొట్టిన దెబ్బకు కుప్పకూలాడు. ఇంద్రుడు విష్ణుమూర్తికి వినమ్రంగా నమస్కరించి, ధన్యవాదాలు తెల్పుకున్నాడు. వృత్రాసుర సంహార గాథ విని, లోకాలు ఆనందపరవశంలో నర్తించాయి. దేవేంద్రుడు విజేతగా తన లోకానికి తరలి వెళ్లాడు. కాని సురపతికి అంతటితో పీడ విరగడ కాలేదు.
🍃🌺తపస్సులో వున్న విశ్వరూపుని వధించినపుడు తన కంటిన బ్రహ్మత్యా పాతకాన్ని సమస్త జీవకోటికి చుట్టి, ఇంద్రుడు పరిశుద్ధుడయ్యాడు. ఇపుడా పాపభారం మోయలేని ప్రాణికోటి హాహాకారాలతో శాపనార్థాలతో ఇంద్రుని చుట్టుముట్టాయి. దానితో దేవేంద్రుని ప్రాభవం క్షణక్షణం క్షీణించసాగింది. మరోసారి పదవీభ్రష్టుడై, ప్రచ్ఛన్నుడై వసుధాద్రిపై తలదాచుకున్నాడు.
🍃🌺కథ మళ్లీ మొదటికి వచ్చింది. మహోన్నతమైన సింహాసనం ఖాళీగా వుండరాదు. దక్షత గల వాడు ఒక్క నహుష సార్వభౌముడేనని అమరప్రముఖులు నిర్ణయించారు. నహుషుని వద్దకు వెళ్ళి సురలోకాధిపత్యం స్వీకరించమని కోరారు. తనకంతటి శక్తి లేదని నహుషుడు తేల్చిచెప్పాడు. కాని, దిక్పాలకులందరూ తమ తమ తేజోభాగాలు ఆయనకు ధారపోశారు.
🍃🌺నహుషునికి శక్తిసామర్ధ్యాలు ఒనకూడాయి. గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర బృందాలు తమ కాంతిభాగాలను సమర్పించారు. నహుషునికి ఇంద్రపదవికి కావల్సిన వైభవం సమకూరింది. ఇంద్ర సింహాసనంపై సమాసీనుడైనాడు. దివ్య మునిపుంగవులు యథావిధిగా నహుషుని సురాధిపతిగా అభిషేకించి, ఆశీర్వదించారు. ఆ క్షణం నంచి నహుషుడు ఇంద్రుని భోగాలన్నిటినీ అనుభవించి పరవశిస్తున్నాడు.
🍃🌺తుంబుర నారదాదుల సంగీత గోష్ఠులతో వీనులవిందులందుకుంటున్నాడు. అచ్చర కన్నెల నృత్యోత్సవాలను నిత్యం ఆస్వాదిస్తున్నాడు. ఇంద్రభోగాలకు వారుణి మత్తు తోడై, నహుషునికి అహం తలకెక్కింది. నిలువెల్లా పూనింది. ఆ స్థితిలో వున్న కొత్త ఇంద్రునికి ఉద్యానవనంలో సంచరిస్తున్న శచీదేవి మెరుపుతీగెలా కనిపించింది. నహుషునిలో మరుక్షణం ఒక ఆలోచన మెరిసింది.
🍃🌺నేనిపుడు సురలోకాధిపతిని. అంటే, యిక్కడ వున్న అన్నిటిపైన పూర్తి హక్కులు నావే కదా. మరి యీ దివ్యభామిని శచీదేవి నాచెంత చేరి నన్నలరించదేమి? అనుకున్నాడు. అధికారాలను వినియోగించుకోవాలి గాని తమంత తాము సంక్రమించవు కదా- అని తలపోశాడు నహుషుడు. శచీదేవిని తన సన్నిధికి రావల్సిందిగా ఆజ్ఞ జారీచేశాడు.
🍃🌺ఆ కబురు వినగానే శచీదేవి వణికిపోయింది. పరుగున అమరాచార్యుడైన బృహస్పతి సన్నిధికి పోయి శరణు శరణని ఆక్రోశించింది గజగజలాడుతూ. బృహస్పతి ఆమెకు అభయం యిచ్చి, నా కుటీరంలో నువ్వు నిర్భయంగా వుండచ్చు. నీకు ఏ ఆపదా రాదు. అంతేకాదు, నీ భర్త ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకుని నీకా శుభవార్త ఎరుక పరుస్తాను- అంటూ ఓదార్చాడు.
🍃🌺నహుషునికీ విషయం తెలిసింది. ‘‘ఇదేమి న్యాయం’’ అని గర్జించాడు. మునీశ్వరులు అతన్ని శాంతింప చేసి, ఇంద్రసింహాసనంపై మా కోరిక మేరకు అధిష్ఠించిన పుణ్యమూర్తివి. నువ్వు పరస్త్రీని వాంఛించడం ధర్మంకాదు- అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. నహుషుడది విని, మీ ఇంద్రుడు గౌతముని ధర్మపత్ని అహల్యను వంచించి అనుభవించినపడు యీ నీతులేమైనవి. నాడు మీరెందుకు నివారించలేకపోయారు’’ అని పరిహాసంగా నిగ్గదీశాడు.
🍃🌺మునులు మౌనులయారు. తలలు వాల్చి వెనుతిరిగారు. సరాసరి బృహస్పతి వద్దకు వెళ్లారు. ‘‘ఆచార్యా, నహుషుని కోరి తెచ్చింది మనమే. లేని శక్తులు ఆయనకు కల్పించింది మనమే. నేడు మహేంద్ర పదవిని అలంకరించాడు నహుషుడు. మనం నచ్చచెప్పినా భయపెట్టినా వినే స్థితిలో లేడు. సురలోక హితం కోరి మనం శచీదేవిని నహుషునికి సమర్పించడమే మేలు’’ అన్నారు మునిపుంగవులు.
--(())--
కల్పదీక్షతి పుష్పజాలిత భక్తతత్పర మాతృకాం
కాంతి సమ్మతి కల్మిలేములు ధైర్యమిచ్చెటి మాతృకాం
మందభాగ్యని బాగుపర్చెటి భాగ్యదాతయు మాతృ కాం
హృద్య సీమకు నాయకత్వము ధర్మమార్గం మాతృకాం
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 84 🕉
పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నాటవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్
భవదుఃఖంబులఁ బాపుటొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమిచ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణ సమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్టమగుచు తిరుగుచున్నావు.
🌹సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు.
🌹ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా!
🕉️ ఓం నమః శివాయ 🕉️
వాట్సప్ సేకరణ:-
సరదాగా ... నవ్వుకోండి
ఫాక్షన్ సినిమాలు: గ్రా మ సిం హం
హీరో కాశీ లోనో, కేరళ లోనో, కన్యాకుమారి లోనో అంట్లు తోముతూనో, కార్లు కడుగుతూనో, ఉంటాడు..బాగా కడుగుతున్నాడని, యెదురుగా ఉన్న ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది…అడుక్కుతింటున్నా హీరో కాబట్టి అమెరికాలో పాటలు పాడుకుని…పెళ్ళి మంటపం దాకా వస్తారు….అప్పుడు 40 టాటా సూమోలు వచ్చి ఆగుతాయి మంటపం ముందు.. అందులోంచి 80 జతల మగ కాళ్ళూ, ఒక జత ఆడ కాళ్ళూ దిగుతాయి.. ఆ పెళ్ళీ ఆపి అతను హోటల్ లో క్లీనర్ కాదని, కడపలో లీడర్ అని చెప్పి అందరినీ కడప రైలు యెక్కిస్తారు..అక్కడ ఈలోపల ఈ పాప తో ఫ్లాష్ బాక్ లో పాటలు, ప్రేమలు.. అయిపోయి…..క్లైమాక్స్ లో కొత్త రకం ఆయుధం పట్టి విలన్లు అందరి పని పట్టి ….చంపడం పాపం నరకడం ఘోరం అన్న సూక్తి తో సినిమా సమాప్తమౌతుంది…..
ఇందులో హీరో గారికి విలన్ ని చంపడానికి కత్తులక్కర్లేదు..కంటి చూపు చాలు….గొడ్డళ్ళక్కర్లేదు–గోళ్ళు చాలు…ఉరి తాడు అక్కర్లేదు….మొలతాడు చాలు…..
మనకి ఆయన చంపక్కర్లేదు–సినిమా చూస్తే మనమే పోతాం…
--౯౯౦౦----
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 2
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా! 12
ఈ పద్యములు రెండు చాలా ఉపయోగమని తెలుసుకున్నాను .
కొందరు ఉద్యోగములలో చేరగానే ఉన్నతాధికారితో
స్నేహం కోసం ,వారి కరుణ కోసం చాలా సమయం వృధా చేసుకుంటారు.
ఈ నేపథ్యంలో వారి విధి నిర్వాహణను ,వారి విజ్ఞాన అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తారు .అటువంటివారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా వుండి పోతారు .
నిందలను విస్మరించక , పొగడ్తలను విని వదిలేస్తూ ,
విధినిర్వహణే కర్తవ్యంగా భావించాలి .వచ్చిన ఉద్యోగం మంచిగా చేస్తున్నా ఇచ్చిన పనిని ఆరాధిస్తూ చెయ్యాలి.
==౯౯౦)--
🌻 తెలిసుకోవాల్సిన మంచి విషయాలు..... 🌻
🍃🍒36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
🍃🍒37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
🍃🍒38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
🍃🍒39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
🍃🍒40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥ 🌀
🌹 36. ఈశ్వరః 🌹
🌺 ఓం ఈశ్వరాయ నమః 🌺
🍃🌺నిరుపాధికం ఐశ్వర్యం అస్య అస్తి ఉపాధితో పనిలేకయే సిద్ధించిన ఐశ్వర్యము - ఈశ్వరత్వము ఈతనికి కలదు.
:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము::
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 17 ॥
🍃🌺ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, క్షరాక్షరులిద్దఱికంటెను వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీ వేంకటేశ్వర లీలలు 🙏
🍒 భాగము 51 🍒
🌻 తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము 🌻
🍃🌹తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణభగవానుని స్వయముగా చూడాలనే కోరికతో వుండేవాడు. నిద్రాహారములు లేక, అచంచలదీక్షతో కృష్ణభగవానుని గూర్చి ఎన్నోయేండ్లూ, పూండ్లూ తపస్సు చేశాడు.
🍃🌹శ్రీమహావిష్ణువు ఆతనికి దర్శనభాగ్యము కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠా! నీకు వలయునదేమిటో కోరుకొను మిచ్చెదను’’ అన్నాడు. కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్యదర్శనముచేసి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామము లాచరించి ’’స్వామీ! కరుణాసాగరా! నాకు యితరమైన కోరికలేమీ కాని, శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని వున్నది’’ అనెను.
🍃🌹అందులకు శ్రీమహావిష్ణువు ‘‘నాయనా వైఖానసా నీవు యిప్పుడు శ్రీకృష్ణదర్శనము చేయాలని కోరుకుంటే వీలుపడదు. కాని, యిప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాసరూపములో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతనిని పూజించవలసినది’’ అన్నాడు. తరువాత శ్రీమహావిష్ణువు అంతర్థానమయ్యాడు.
🍃🌹వైఖానుసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెడుతున్నాననీ చెప్పగా, రంగదాసు తానున్నూ శ్రీనివాసుని సేవించ వెడుతున్నానని చెప్పెను, వారిరువురు కలసి శేషాచలాన్ని అధిరోహించారు.
🍃🌹వైఖానుసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానునీ పూజించాలనుకొన్నాడు. పూవులు కావలసివచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో ‘‘శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా! అందుచే నీవు ఒక పూలతోటను పెంచవలసినది’’ అని కోరాడు.
🍃🌹రంగదాసు అలాగేనని పూలతోటకు నీరు చాలా ముఖ్యము కనుక, నీటికై ఒక బావిని త్రవ్వించాడు. దాని పేరు పూలబావిగ అయింది, ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పూలను ప్రతిపాదిమూ శ్రీనివాసుని పూజకొరకై వైఖానసునకు యిచ్చుచుండెను.
🍃🌹ఒకనాడు ఒకానొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ లాడడానికై తనసతులతో సహితము వచ్చినాడు. అక్కడికి పూవలకొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్తచాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మరచిపోయాడు.
🍃🌹గంధర్వులు వెళ్ళిన తరువాత, రంగదాసు తన పని గ్రహించినవాడై పూవులు తీసుకొని వైఖాసమునివద్దకు వచ్చాడు. వైఖానసముని ‘‘ఏమిటి యింత ఆలస్యమయిన’’దని గద్దించి అడిగాడు. ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు.
🍃🌹ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయి ‘‘ఓయీ రంగదాసా! చేసిన దానికి విచారింపకుము. నీవు నాయొక్క మాయా మోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు. యీ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడ నయ్యెదవు గాక తొండమానుడు అను నామధేయముతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువు గాక’ అని చెప్పాడు.
🍃🌹ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[05/02, 5:31 pm] +91 92904 61512: who wrote this do not know
ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.
రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.
బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.
ఆ యువతి ఆశ్చర్యంగా పేయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది.
మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది.
ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది.
రవివర్మని కలిసి ఇలా అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.
నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.
రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ...! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.
నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు.
ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.
ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.
తల్లి తండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.
అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....
_ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి🌹
*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.
💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄
పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తకి వాట్సాప్ లో ఏం మెసేజ్
చేసిందో తెలుసా..?
💦👌🏿😄
పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరినుండి వచ్చినదాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.
💦👌🏿😄
10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవైడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ హార్డ్ డిస్క్, కేబుల్ కోసం వెతక్కండి. అది నాతో పాటు హాండ్ బాగ్ లో ఉంది.
💦👌🏿😄
మీరు చాలా హెల్దీ గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్
కి వెళ్లవద్దు.
💦👌🏿😄
మీ కోతి మూకని పోగు చేయకండి.సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి.
💦👌🏿😄
మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విషెస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా గట్టి నమ్మకం.
💦👌🏿😄
పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.
💦👌🏿😄
అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడమ వైపు ఉన్నవి పిల్లాడివి.
ఆఫీసు నుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు
గుర్తుందా?మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు
రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.
💦👌🏿😄
మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి. మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు.
షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది
💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄💦👌🏿😄
[05/02, 5:38 pm] +91 96761 89134: అలాటి వృద్ధాప్యం నాకు
అనుగ్రహించుమో ప్రభూ...
ఆంక్షలు లేని ఆహారంగా
హల్వా పూరీ ఆరగించేలా...
కాలక్షేపం పల్లీ బఠాణీ
కరకరలాడగ నమిలేసేలా....
అలాటి వృద్ధాప్యం నాకు
అనుగ్రహించుమో ప్రభూ....
చక్కెర పెరగని దేహమునందు
రుచి మొగ్గలపై తీపిని పులిమి
ఉక్కు శరీరం తలపించేలా...
మనసు దృఢత్వమ్మనిపించేలా..
వంగిపోవని వెన్నుపూస తో
నిటారుగా నేనడిచొచ్చేలా....
నవ్వుతు, తుళ్ళుతు నలుగురిలోన
సవ్వడి చేస్తూ చరియించేలా..
అలుపూ సొలుపూ లేకుండా నే
పవలూ రేయీ గడిపేసేలా...
అలాటి వృద్ధాప్యం నాకు
అనుగ్రహించుమో ప్రభూ...
నేత్రాలకు సులోచనాలున్నా
పత్రిక, టీవీ పరికించేలా...
సమీపమైనా, సుదూరమైనా
సన్నిహితులతొ సంభాషించేలా...
చాట్, సమోసా.. పానీపూరీ
లొట్టలు వేస్తూ దట్టించేలా...
వ్యాధులు,బాధలు,
బలహీనతలు
దరికి జేరని దారుఢ్యంతో
ఒకే తీరున ఒకే సమంగా
తనువుకు సుఖము..మనసుకు
శాంతి.....
అలాటి వృద్ధాప్యం నాకు
అనుగ్రహించుమో ప్రభూ...
వేరెవరూ నా జీవన శైలిని
వేలెడుతూ నిర్ధారించక,
ప్రతిబంధకాలు సృష్టించక...
అదుపులు,ఆజ్ఞలు లేకుండా...
తానూ, నేనూ...
తోడూ - నీడా
కువకువలాడే గువ్వల్లాగా
స్వీయగౌరవం చెక్కుచెదరక
జీవిత గమనం సాగించేలా...
శేషజీవితం విధి లిఖితంగా
జరిగేదేదో జరుగుతుందని
సగర్వంగా, సలక్షణంగా
కలసి మెలసి గడుపుకునేలా...
అలాటి వృద్ధాప్యం నాకు
అనుగ్రహించుమో ప్రభూ...
No comments:
Post a Comment