నాకునచ్చినవి పాత పాటలు ఒక్కసారి చదువుతూ పడుకోండి
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
https://youtu.be/Ad7tzWRyxBw
పైన తాకండి
నీ మది చల్లగా....
స్వామీ! నిదురపో! దేవుని నీడలొ
వేదన మరచిపో - నీ మది చల్లగా....
వేదన మరచిపో - నీ మది చల్లగా
ఏ సిరు లెందుకు? ఏ నిధు లెందుకు? ఏ సౌఖ్యము లెందుకు?
- ఆత్మ శాంతి లేనిదే ? !! ఏ సిరు!!
మనిషి బ్రతుకు నరక మౌను - మనసు తనది కానిదే
నీ మది చల్లగా
స్వామి నిదురపో - దేవుని నీడలొ
వేదన మరచిపో - నీ మది చల్లగా
చీకటి ముసిరినా - వేకువ ఆగునా? - ఏ విధి మారినా
దైవం మారునా? !!చీకటి!!
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో
నీ మది చల్లగా...
స్వామీ! నిదురపో దేవుని నీడలో
వేదన మరచిపో! - నీ మది చల్లగా....
జానకి సహనము - రాముని సుగుణము - ఏ యుగమైనను
- ఇలకే ఆదర్శము. !!జానకి!!
వారి దారి లోన నడచు - వారి జన్మ ధన్యము
నీ మది చల్లగా...
స్వామీ! నిదురపో దేవుని నీడలో
--: 0 :--
చిత్రం : ధనమా? దైవమా? (1973)
గానం : సుశీల
సంగీతం : టీ. వీ. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
✍.నేటి చిట్టి కథ
*పూర్వ జన్మ కర్మ.....*
నాకునచ్చినవి పాత పాటలు ఒక్కసారి చదువుతూ పాడుకోండి
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (2)
.మంచిమనసుకు మంచి రోజులు (1958)
గాత్రం: బాల సరస్వతి , సంగీతం : ఘంటసాల
రచయా: జ్ర్. సముద్రాల
ధరణికి గిరి భారమా
గిరికి అరువు భారమా
తరువుకు కాయ భారమా
కని "పెంచే తల్లికి పిల్ల భారమా"
మును నే నోచినా నా నోము పండగా
నా ఒడిలో వెలిగే నా చిన్నీ నాయనా
పూయని తీవెననీ అపవాదు రానీక
తల్లివనే దీవెనతో తనియించి నాపయా .... ధరణి
ఆపద వేళలా అమ్మ మానసు చెదురునా
పాపాల రోదనకే ఆ తల్లీ విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధీ
ప్రేమతో పాపలను పెంచనిదొక తల్లియా
ధరణికి గిరి భారమా
గిరికి అరువు భారమా
తరువుకు కాయ భారమా
కని "పెంచే తల్లికి పిల్ల భారమా"
--(())--
నేటి చెందస్సు ... కవిత
UU UIU UU UIU
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధాన్యం ఎక్కడో పుర్గుల్ అక్కడే
శాంతీ ఎక్కడో కోపం అక్కడే
ప్రేమా ఎక్కడో భందం అక్కడే
అప్పూ ఎక్కడో యుద్ధం అక్కడే
తప్పు ఎక్కడో ఒప్పు అక్కడే
రోగం ఎక్కడో మందూ అక్కడే
విద్యా ఎక్కడో వ్యాప్తీ అక్కడే
విత్తూ ఎక్కడో చెట్టూ అక్కడే
మార్గం ఎక్కడో యానాం అక్కడే
మద్యం ఎక్కడో మాంద్యం అక్కడే
మానం ఎక్కడో ధ్యాసా అక్కడే
మౌనం ఎక్కడో మర్మం అక్కడే
మంచీ ఎక్కడో చెడ్డా అక్కడే
శాస్త్రం ఎక్కడో శ్రావ్యం అక్కడే
బంధం ఎక్కడో భావం అక్కడే
ధ్యానం ఎక్కడో జ్ఞానం అక్కడే
రాగం ఎక్కడో తాళం అక్కడే
కాలం ఎక్కడో గమ్యం అక్కడే
ప్రాణం ఎక్కడో ప్రేమా అక్కడే
కోపం ఎక్కడో తాపం అక్కడే
గ్రామం ఎక్కడో పంటా అక్కడే
గ్రాసం ఎక్కడో జీవం అక్కడే
గాత్రం ఎక్కడో గాళం అక్కడే
తృప్తీ ఎక్కడో ఖ్యాతీ అక్కడే
ప్రాప్తీ ఎక్కడో రక్తీ అక్కడే
ధర్మం ఎక్కడో సృష్టీ అక్కడే
న్యాయం ఎక్కడో జాతీ అక్కడే
భార్యా ఎక్కడో భర్తా అక్కడే
మేఘం ఎక్కడో వర్షం అక్కడే
ఆశా ఎక్కడో కష్టం అక్కడే
ఆత్రం ఎక్కడో అర్ధం అక్కడే
జాప్యం ఎక్కడో తొందర్ అక్కడే
వేషం ఎక్కడో మాయా అక్కడే
వ్యాధీ ఎక్కడో వైద్యం అక్కడే
నాట్యం ఎక్కడో చూపూ అక్కడే
రామా ఎక్కడో కృష్ణా అక్కడే
పచ్చళ్ళు - ఏమిటి ? ఎందుకు ? ఎలా ?
పచ్చళ్ళుఅంటే - హిందువులకు బ్రహ్మా విష్ణు మహేశ్వరుల లాగా -ఆంధ్రులకు గోంగూర - చింత కాయి - మామిడి కాయ పచ్చడులు .
మిర్చీ లేదా మిరగాయ - ఆది పరాశక్తి లాంటిది -ఆమె పుత్రికా రూపాలే - పచ్చి మిర్చీ - పండు మిర్చీ - ఎండు మిర్చీ . వీరెంతో స్నేహ శీలులు . అందునా ఆడపిల్లలు . ఎవ్వరికైనా లవ్వోస్తారు .ఆడపిల్లలు స్నేహాన్ని హద్దు మీరానివ్వరు . వీరి తో హద్దు మీరకుండా ప్రవర్తిస్తేఅమృతం లా రుచిస్తారు -
ఆవకాయ అన్నంలో పచ్చి మిర్చీ నంజుకొనే వాళ్ళుంటారు . గోంగూరలో పండుమిర్చీ వేసి భుజిస్తారు . చింతకాయలో ఎండు మిర్చీ వేసి - ఇంగువ తిరగమోత వేస్తారు .ఆలోచిస్తూ ఉంటేనే ఆకలి పగ్గాలు తెగి దౌడు తీస్తుంది . .-
పచ్చడి అంటే ఏమిటంటే ఆకలిని దౌడు తీయించేది .
పచ్చళ్ళు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం సమాప్తం.
పచ్చళ్ళు ఎందుకు ? ప్రతి పచ్చడి ప్రకృతి లోనుండి ప్లేటులోకి వస్తుంది .అందువల్ల వాటిలో ప్రకృతి శక్తీ నిండివుంది . పచ్చళ్ళు ప్రకృతి శక్తులు. పచ్చడులని ఉడక పెట్టం .వేయించం . చివరికి నిప్పు సెగ కూడా తగలనివి . మనం ప్రక్రుతి ఇచ్చిన ఆహారన్న్ని ఇచ్చింది ఇచ్చి నట్లుగా తింటున్నాము . పచ్చళ్ళు తినటం అందుకన్నా మాట .ఆకలి హాయిగా వుంటానికి అన్న మాట.
పచ్చళ్ళు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం సమాప్తం.
పచ్చళ్ళు తినటం ఎలా ??
పొద్దున్నే ఆవిడని పిలిచి " టిఫిన్ ఏమిటి అంటే " ఆమె ఉత్సాహంగా " రాత్రి అన్నాన్ని పులిహోర చేస్తున్నాను " అంటుంది . అది బోలెడంత వుంది . ఆలా అనంగానే ఆమెనిఒక్క తన్ను తన్ని మళ్ళీ తన్ని - ఆ అన్నాన్ని లాక్కుని - విస్తరాకులో బోర్లించుకొని - ఒక పక్క ఆవకాయ ఒక పక్క గోంగూర - ఒక పక్క చింతకాయ వేసుకొని మూట కట్టుకోవాలి . కోపంతో బండెక్కి ఇంట్లోనుండి బయటపడాలి . బాగా ఊరి చివరికి పోయి పొలం గట్ల మీద బండి ఆపి - పొలాలు దాటి , తరువాత వచ్చే - వాగు - వంక - నది దెగ్గరికి చేరి - శుభ్రం గా స్నానం చేసి కూచోండి . ఎవరో ఒక బర్రెలు కాసేవాడు వచ్చి పలకరించి , మీ దగ్గర పచ్చి మిర్చీ లేదని , అదనంగా ఉప్పు లేదని . పచ్చి ఉల్లిపాయ లేదని ,మీగడ పెరుగు లేదని దయతలచి - అవి ఇస్తాడు. సగౌరవంగా , హాయిగా పుచ్చుకోండి . భేషజానికి పోవద్దు .
వంటిగంటకు నా భోజనం అనుకుంటూ
కూచుంటే పదకొండింటికే ఆకలి రంకెలు వేస్తుంది . ఓర్చుకొని ఓర్చుకొని పన్నెండింటికి " దానికన్నా దాని చెల్లెలే మంచిది " అనుకోవాలి . మీరు ఎదో అనుకున్నారు కామోసు .
ఆకలి కన్నా బీపీనే మంచిది , అని అనుకోమంటున్నాను . మూట విప్పి చద్ది వణ్ణం -పచ్చడి మిళాయించి తినాలి . పచ్చడి ఎలా తినాలీ అంటే ఇలా తినాలి.
పచ్చళ్ళు ఎలా తినాలీ అన్న ప్రశ్నకు సమాధానం సమాప్తం.
తిన్నాక " ఎవడొస్తాడో (బామ్మరిది) రమ్మను - యెవతె ( భార్య ) వస్తుందో రమ్మను " అని సవాళ్లు వేసుకుంటూ , గుండెల మీద చేయి వేసుకొని - చెట్టుకింద పడి నిద్ర పోవాలి . పచ్చడి గురించి తత్త్వం తలకెక్కిందనటానికి ఇదే బండ గుర్తు .
Co
తేటగీతి
జీవి మనసును మరిగియు జాడ్య ముంచు
జీవి వయసును బట్టియు జాప్య ముంచు
జీవి నిత్యమూ వ్యసనం జోలపాడు
జీవి మంచులా కరిగియు జపము చేయు
నిత్య జీవితం సత్యమై నడక సాగు
నిత్య మాటల తలుపులు నింగి చేరు
నిత్య పరుగులు జీవితం నిన్ను మార్చు
నిత్య గెలుపుకు ప్రేమను నిచ్చి చూడు
జలమ చేరిన చినుకులు జలము కలియు
జలము నందు పెరుగుచుండు జలచరాలు
జలము మానవ దాహపు జీవనమ్ము
జలము త్రాగిన తరువాత జీవ శక్తి
అర్ధ నారీశ్వరల తత్వవమ్ము కలిగి
అర్ధ భావమ్ము జీవితం అర్ధ మవ్వు
వ్యర్ధ సంఘర్షణమ్ములు వ్యర్ధ మవ్వు
అర్ధ మవ్వునా ఈనాటి ఆర్య సూక్తి
రక్త మాంసాల ముద్దను రాజ్య మేలు
రక్త పంజరం వ్యాపించి రాటు తేలు
రక్త మంతయు దోచేటి రవ్వ వెలుగు
రక్త తర్పణతో తల్లి రామ అనుచు
పుడమి నెప్పులు పట్టని ప్రజ నడుగు
పుడమి తల్లి యు బాధను పట్టు యెవరు
పుడమి శక్తిని తోడియు పల్కు వారు
పుడమి కరుణను చూడక పిచ్చి దనుచు
యువత మాంసాల ముద్దను ఏలు చుండు
యువత పంజరం వ్యాపించి యేమి చేయు
యువత అంతయు దోచేసి యతిగ వెలుగు
యువత తర్పణతో తల్లి యాజ్ణ అనుచు
విత్తు పుడమిన నీటితో విచ్చి ఎగసె
విత్తు ఎరువును పొందియు వ్యర్ధ మవ్వ
కుండ విత్తు లు కలిసి యు కమ్ము కొచ్చు
వెలుగు నీడలు పొందియు వ్యాప్తి చెందు
మోక్క మోక్కయు అంటుయే మోక్క యగును
మొక్క కొమ్మరెమ్మలలోను మోగ్గ పువ్వు
మోక్క గాలినీటినిపీల్చి మేను పెంచు
మోక్క గామారి వృక్ష మ్ము మన్న నిచ్చు
పంట పండిస్తున్న ట్టి రైతులలొ శక్తి
పంట ఉత్పత్తి సామర్థ్య ప్రాంతమంత
పంట దేశసంపదగాను పిలుపు వుంచి
పంట దైవసమ్మతిగా పొందు చుండు
కంటిలోనినలసునినాలుకయు తీయు
ఇంటిలోనిఎలకలబోనుగను పట్టు
ఇంటిలో ఈగ మోతలు ఇంతికెరుక
బయటపల్లకీ మోతలు భర్త తెలుపు
********************
[7:02 am, 09/02/2021] +91 94414 08564: కార్యసాధకుడు కపీశ్వరుడు... 🙏
🍃🌺సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి.
🍃🌺అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు.
🍃🌺సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే.. కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకొంటారని పెద్దల ఉద్దేశం.
🍃🌺ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా?
🍃🌺హనుమంతుడు సముద్రలంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలేర్పడ్డాయి.మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది.ఇది సాత్త్వికాటంకం.
🍃🌺తర్వాత సురస అనే రాక్షసి ఆకాశమార్గానికి అడ్డంగా వచ్చి.. తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజసాటంకం.
🍃🌺ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగెయ్యడం మొదలుపెట్టింది. ఇది తామసాటంకం.
🍃🌺కార్యసాధకుడైన హనుమంతుడు మూడు ఆటంకాలనీ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు.
🍃🌺మైనాకుడు మర్యాదలు చెయ్యడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి.. అతనితో మర్యాదగానే మాట్లాడి, తిరిగివచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు.
🍃🌺సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరుతెరిచింది. స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి.. అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజసాటంకాల నుండి బయటపడే ఉపాయం అది.
🍃🌺ఆ తర్వాత సింహిక.. ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి.. తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకిలాగి ఒక్క గుద్దుతో పైలోకాలకి పంపేశాడు. అంటే తమో గుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట.
🍃🌺అలా మనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి.
🍃🌺కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా.. సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి, ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి.
🍃🌺తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు.
🍃🌺ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
🍃🌺ఈ రకంగా సుందరకాండలో ఘట్టాల్ని అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా?
🍃🌺అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:03 am, 09/02/2021] +91 94414 08564: 🌻 హనుమంతుని వేదాంతం 🌻
🍃🌺ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి ”హనుమా! నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా... దేహ, జీవ, పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు” అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి ”శ్రీ రామా! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరు వేరుగానే భావించాలి.
🍃🌺దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ, సేవించాలి. అన్ని భావాలను త్యజించి, శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ, వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం.
🍃🌺జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పూజలు చేస్తూ, భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు. జీవుడు, పరమాత్మ ఒక్కరే. ఎందులోన…
[7:04 am, 09/02/2021] +91 94414 08564: 🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 88 🕉
పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను.
🌹మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను.
🌹ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు.
🙏 ఓం నమః శివాయ 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
🙏66. గజరాజ రక్షక గోవిందా 🙏
🌹అనగా ఏనుగుల యొక్క రాజును రక్షించిన వాడు అని అర్థం. త్రికూటం అనే అతి విశాలమైన పర్వతం ఉంది.
🌹దానికి శిఖరాలు మూడు. ఒకటి బంగారు కాంతితో రెండవది ఇనుము కాంతితో మూడవది వెండి కాంతితో ప్రకాశిస్తూ వుంటాయి.
🌹ఆ కొండపైన అడవి మృగాలతో పాటు ఎన్నో వేల ఏనుగులు కూడ ఉన్నాయి. ఒక గజరాజు, కొన్ని ఆడ ఏనుగులు గుంపులో నుండి చీలిపోయాయి. అవి ఒక చక్కని సరోవరం చూసి సంతోషంతో సరోవరంలో దిగి హాయిగా జలక్రీడలు సాగించాయి.
🌹గజేంద్రుడు తొండం నిండా నీరు పీల్చి ఆకాశవీధిలోకి చిమ్ముతుంటే ఆ వేగానికి జల చరాలన్నీ పైకి ఎగిరి పోతున్నాయి.
🌹ఒక్కసారిగా సరోవరం మధ్యలో నుండి ఒక పెద్ద మొసలి వచ్చి గజేంద్రుని కాలు పట్టింది. ఒకదాని నొకటి నడిస్తే సరోవరం అంతా కలియదిరుగుతున్నాయి.
🌹నీరు నివాస స్థానమైన మొసలికి బలం పెరిగింది. ఏనుగుకు నీరసం వచ్చింది. మొసలి నుండి తప్పించుకోవడం తన వలన కాదని నిశ్చయించుకొన్నది.
🌹అప్పుడు గజరాజు సర్వశక్తులుడిగి అన్ని ప్రయత్నాలు విరమించి అఖిలలోక రక్షకుడైన నారాయణుని ప్రార్థించే సమయాన, ఆ జగద్రక్షకుడు వైకుంఠంలో కేళీ మందిర సమీపంలో మందార వన మధ్యలోని సరోవర తటాన చంద్రకాంత శిలా వేదికపై హంసతూలికా తల్పంమీద లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతున్న వాడు, ఆడుతున్నట్లే బయలుదేరాడు. ఎలా బయలు దేరింది...
🌹 మ. సిరికిం జెప్పఁడు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁ డే పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో పరి చేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
🌹లక్ష్మీదేవికి జెప్పలేదు, శంఖచక్రాలు ధరించలేదు. పరి వారాన్ని పిలువలేదు. తన వాహనమైన గరుత్మంతుని రమ్మనలేదు. చెవుల మీద చిందర వందరగా పడుతున్న ముంగురులను సవరించలేదు.
🌹సరస సల్లాపాలాడే వేళ పట్టుకున్న లక్ష్మీదేవి పైట చెంగు కూడ వదలకుండా బయలుదేరాడు.
🌹ఇంకేముంది.. ఆయన వెను వెంట లక్ష్మీదేవి, ఆవిడతో అంతః పుర పరివారం, వెనుకనే గరుత్మంతుడు, శంఖ చక్ర గదా శార్థాలు, నారదుడు, విశ్వక్సేనుడు, వారితో పాటు నగరంలోని ఆబాల గోపాలం బయలుదేరారు.
🌹శ్రీహరి సరస్సు వద్దకు వెళ్ళి సుదర్శన చక్రం ప్రయోగించిన వెంటనే అది మొసలి తలను ఖండించింది.
🌹వెంటనే దేవలుని శాపంవల్ల మకరి జన్మ ఎత్తిన హూ, హూ అనే గంధర్వుడు, శ్రీమన్నారాయణుని వలన శాపవిముక్తుడై గంధర్వరూపంలో వెళ్ళిపోయాడు.
🌹నారాయణుడు గజేంద్రుని తన కరస్పర్శతో అనుగ్రహించాడు.
🌹ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యమహర్షి ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మనెత్తి ఈ విధంగా శాపవిముక్తుడై, వైకుంఠం చేరాడు.
🌹 ప. గజరాజ మోక్షణమును నిజముగ పఠియించునట్టి నియతాత్ములకున్, గజరాజ వరదుడిచ్చును.
గజ, తురగ, స్యందనములు, కైవల్యంబున్.
🌹కనుక గజరాజ రక్షకుడైన శ్రీమన్నారాయణుడు మనలను సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
4. అంతులేని కన్ను
ఏ రూపమూ లేని భగవంతుణ్ణి తలవడం, కొలవడం ఎలాగో తెలియక
తన రూపం లాగే రూపొందించి తలుస్తున్నాడు, కొలుస్తున్నాడు మానవుడు.
తప్పదు మొదట్లో.
నామరూప రహితమైన స్థితికి తాను ఎదిగినప్పుడు
అనగా తాను నిరాకారుడైనప్పుడు, భగవంతుణ్ణి ఎలా చూడగలడు?
తనకు తనువే లేదు....కన్నే లేదు....
ఎలా చూడగలడు?
తాను అనంతమైన కన్నుగా మారుకున్నాడు.
చూచేవాడు-చూడబడేది-చూపు మూడి తానే అయిన కన్ను అది.
ఆ కన్నుతో ఏంచూడగలడు?
అంధుడికి, దేవుడికి దృశ్యం కనబడదు.
దృశ్యముండి కన్నులేక కనలేనివాడు అంథుడు.
దృశ్యం కూడా కన్నులో భాగమై ఉన్నందు వలన
కన్ను ఉండి కనలేనివాడు దేవుడు.
--(())--
ప్రతి ఏకాదశికి ఉపవాసం మనందరికీ తప్పని సరి ఇది ఋషుల వాక్కు చదవండి
జీవికి 5 శరీరాలున్నాయి.మనకు పైకి కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఒకటేయైనా మిగతా4 శరీరాలు ప్రత్యక్షంగా కనపడకపోయినా, అవి ఒకదాన్ని మించి మరొకటి సామర్థ్యం కలిగి ఉంటాయి.
ఆత్మ ను ఆవరించిన 5 శరీరాలను పంచకోశాలు అంటారు అవి మనకు తెలిసిన
1) అన్నమయకోశం
2) ప్రాణమయకోశం
3) మనోమయకోశం
4) విజ్ఞానమయకోశం
5) ఆనందమయకోశం
ఈ పై 5 శరీరాలను వికసింపచేసుకోవాలి.అప్పుడు ఈ మానవుడు సైతం మహానుభావుడు గాను, పరమాత్ముడు గాను అవగలడు.
పృథ్వి యొక్క రసాన్ని అన్నము అంటారు.ఈ భూమి నుండి నీళ్లు, పండ్లు, కూరగాయలు, గడ్డి.. వంటి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి.ఇలా అన్నం వల్ల ఉత్పన్నమైన శరీరాన్ని అన్నమయకోశము అంటారు.
రక్తమాంసాలతో మనకు కనిపిస్తున్న ఈశరీరము అన్నమయకోశం కాదు.ఇది అన్నమయకోశం ఆధీనంలో ఉంది.
మనం తినే అన్నంలో సూక్ష్మ జీవనత్వం ఉంటుంది. దీనితోనే ఈ అన్నమయకోశ శరీరం తయారవుతుంది
ఈ జీవుడుకి (ఆత్మకు) ఎలా అయితే 5కోశాలు(పంచకోశాలు)ఉన్నయో అలాగే ఈ అన్నమయకోశానికి*మరలా 3 కోశాలు ఉన్నాయి.వాటిని
1) స్థూల శరీరం
2) సూక్ష్మ శరీరం
3) కారణ శరీరం అంటారు.
స్థూల శరీరంలో బరువు,రుచి ఉంటాయి
సూక్ష్మ శరీరంలో గుణము, ప్రభావాలు ఉంటాయి
కారణ శరీరంలో సంస్కారాలుంటాయి
సంస్కారాలంటే మన అలవాట్లే.నాలుకకు రుచిగా ఉంటాయని...మాంసము మొదలుగునవి తింటానికి రుచిగా ఉన్నప్పటికీ, వాటిలో సూక్ష్మంగా ఉన్న సంస్కారాల వల్ల అన్నమయకోశం వికృతమౌతుంది
ఆహారం తీసుకోవడంలో తెలియక మనం చేసే పొరపాట్లు తప్పులు అన్నమయకోశము వికృతికి కారణమవుతుంది దానితో శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది.
అన్నమయకోశమునకు సంబంధించిన వికృతిని,దుర్దశను పోగొట్టి శుద్ధి చేసి పుష్టి కలిగించేందుకు ఋషులు తెలిపిన 4 రకాల విదానాలు
1) ఉపవాసం
2) ఆసనము
3) తత్వశుద్ది
4) తపశ్చర్య.
ఉపవాసం
చతురుడైన వైద్యుడు రోగికి ముందుగా విరేచనానికి మందు వేస్తాడు.
చికిత్సాశాస్త్రం లో రోగులకు ఓ దైవీ ఉపదేశం ఉన్నది.. లంఖణం (ఉపవాసం)పరమోషదం అని.దీనివల్ల అన్నాశయంలో చేరిన అపక్వాన్నము*వల్ల
ఉత్పన్నమయ్యే ఎన్నో విషపదార్దాలు ఉత్పన్నం కావు.
భగవద్గీత లో *విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః* అన్నారు. జగద్గురువు. "ఉపవాసంతో ఎన్నో వికారాదులు నివృత్తి అవుతాయి." అని చెప్పారు.
మన ఋషులు మనకు ప్రతి ఏకాదశి కి ఉపవాసం తప్పనిసరి అన్నారు.
ప్రతి మాసంలో రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరం లో 24 వస్తాయి.
ఇలా ప్రతి ఏకాదశి కి రకరకాల ఫలితాలున్నాయని ఋషులు తెలిపారు.
ఆషాడంలో వచ్చే శుద్ధఏకాదశి దీనిని తొలి ఏకాదశి (శయన ఏకాదశి) అంటారు. దీనిని చక్కగా ఉపయోగించుకొని ఈ రోజున ఉపవాసం చేయడం ఎంతో శ్రేయోదాయకం.
--(())--
--(())--
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 10.
Imitation, cowardly imitation, never makes for progress.
పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానీయదు. అది పతనానికే దారితీస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
మనలో ఇంద్ర గ్రంధి భ్రూమధ్యమునకు పైన, ఆజ్ఞకు క్రింద ఉంటుంది. ఆ కేంద్రము కనుక మనకు ప్రచోదనము అయితే మనకు ఓజస్సు కలుగుతుంది. ఓజస్సు అనగా ఏడు ధాతువుల సారముగా మూలముగా ఉన్నటువంటి తత్త్వము. ఓజస్సు ప్రచోదనము అయితే మనకి *ఓం కారము లోపల వినగలిగే శక్తి వస్తుంది. ఓం కారమును జనింప చేస్తుంది. ఓం కారమును జనింపచేసేది ఇంద్రుని యొక్క ఆధీనంలో ఉన్నది. అది సప్త ధాతువులకు బలమునిస్తుంది.*
ఓం కారమును ఎవరు సిద్ధింపచేసుకుంటారో వారికి అమృతత్వ స్థితి కలుగుతుంది. ఇది సత్యము.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
జీవన సామరస్యాన్ని కనుగొనడం ద్వారా శక్తి లభిస్తుంది. మన దృష్టి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే సత్య దృష్టి అనేది నిశ్చలం, అది పోగొట్టుకునేది కాదు. ఒక్కోసారి దృష్టి మసకబారినట్లు అనిపించినా, తిరిగి మార్గాన్ని దృఢతరంగా చూపగలదు. మన జీవనంలో సామరస్యం నెలకొని ఉన్నప్పుడు మన మాటలు, చేతలు అన్నీ సవ్యంగా ఉంటాయి. మనం అన్ని లెక్కలనూ విస్మరిస్తాం. మనకు లభించేది అంతా భగవదనుగ్రహ ఫలమే అనే భావన మనలో సదా నెలకొని ఉన్నప్పుడు మన వలన ఎటువంటి తప్పిదాలు జరుగవు. పరమాత్మునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దాని వలన కలిగే ఫలితాల కొరకు ప్రత్యేకంగా ఎదురు చూడనవసరం లేదు, వాటంతటవే వస్తాయి.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
: 😊జీవనయానం💖
నలభై ఏళ్ల వయసులో ఉన్నత విద్యావంతులు, సాధారణ విద్యావంతులు ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.
యాభై ఏళ్ల వయస్సులో అందమైన దేహం అందవిహీనం మధ్య తేడాచాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు, ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.
అరవై ఏళ్ల వయసులో ఉన్నత శ్రేణి జీవితం సాధారణ జీవనం రెండూ ఒకటే. పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.
డెబ్బై ఏళ్లవయస్సులో విశాలమైన భవంతి సాధారణ నివాసం రెండూ సమానమే... కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఇంట్లో ఓ మూలన చిన్నస్థలం చాలు.
ఎనభైఏళ్ల వయస్సులో ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.
తొంభైఏళ్ల వయస్సులో నిద్ర మెలుకువ రెండూ ఒకటే. సూర్యోదయం, సూర్యాస్తమయం రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.
అందంతో వచ్చే మిడిసిపాటు ఆస్తులతోవచ్చే అహంకారం పదవులతో గౌరవాన్ని ఆశించటం కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.
సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే, అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ, అనుబంధాలను పదిలపరుచుకుంటూ, జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!
జీవిత పరమార్ధం ఏమిటో అన్వేషిద్దాం !!
శ్రీరమణీయం -(798)
"సాధకుడు తన మనోభావాలను ఏవిధంగా అవగాహన చేసుకోవాలి !?"
మన మనోభావన ఎలాంటిదంటే అద్దంలో మనంచూసే ప్రతిబింబం లాంటిది. మనం అద్దంలో చూసేటప్పుడు కనిపించేవన్నీ అపసవ్యమైన ప్రతిబింబాలు. అంటే కుడి ఎడమగా, ఎడమ కుడిగా కనిపించేవి. కానీ కేవలం అద్దంలో మాత్రమే చూస్తే ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అంతా సవ్యంగానే ఉన్నట్లు ఉంటుంది. ఒకసారి అద్దంనుండి తల ప్రక్కకు తిప్పి వాస్తవాన్ని చూస్తే అద్దంలో కనిపించేదంతా వాస్తవంలా కనిపించే, అనిపించే అసత్యమని అర్థమవుతుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇక అలాంటి అసత్యభావన కలగదు. ఎంతో కఠినమైన సాధనచేసి అందరూ సమాధిస్థితిని పొందలేకపోవచ్చు. కానీ కళ్ళెదురుగా కనిపించే వాస్తవాలను గమనించే అవకాశం అందరికీ ఉంటుంది. ఒకసారి వాస్తవాన్ని తెలుసుకుని అర్థం చేసుకుంటే మనసు సమాధానపడి స్థిమితాన్ని పొందుతుంది. నిజానికి మాయ అద్దంలోలేదు. మన చూపులోనే ఉందని తెలిసిన తర్వాత అద్దాన్ని ఉపయోగించినా మన భావనలో మార్పువస్తుంది. అద్దంలో ఉన్నది అపసవ్యం, అసత్యం అన్న సత్యభావనతో దాన్ని ఉపయోగించుకుంటాం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'కనపడే గుణం మారితే కనపడని మనసు మారుతుంది'- (అధ్యాయం -98)
"ఋభుగీత " (265)
సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము
ఫలాన్ని ఆశించని వ్యక్తి చేసే కార్యాలన్నీ కరములకు సంబంధించినవే గానీ మనసుకు సంబంధించినవి కావు !
కరములు ఉంటే కార్యం ఉండి తీరుతుంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి నిర్దిష్ట కార్యం, ప్రయోజనం ఉన్నాయి. కాబట్టి ఫలాన్ని ఆశించని వ్యక్తి చేసే కార్యాలన్నీ ఆయన కరములకు సంబంధించినవే గానీ మనసుకు సంబంధించినవి కావు. అతనికి కారణ కార్యరూపాలు కూడా ఉండవు. కర్త, క్రియ, భోక్త, భోజ్యం, భోగం ఏదీ అతనికి వర్తించదు. అవన్నీ ఫలాలను ఆశించేవారికి మాత్రమే అంటుకునే సృష్టి ధర్మాలు. సృష్టి ధర్మంలో బాహ్యంగా జరిగేవన్నీ అవి క్రమానుగతంగా జరుగుతూనే ఉంటాయి. ఆత్మే బ్రహ్మగా మారి అన్నిటినీ సృష్టిస్తుంది. ఎక్కడ రక్షించాల్సిన అవసరం ఏర్పడుతుందో అక్కడ ఆత్మ విష్ణువుగా ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఎక్కడ భోక్తగా తనలో లయం చేసుకోవాల్సి వస్తుందో అక్కడ ఆత్మ శివుడిగా లయకారకం అవుతుంది !
🌷149 - మంద్రగీత🌷
దేవతలు - అసురులు
1)అసుర సంపదలో జన్మించిన వానికి ఈ దిగువ లక్షణములు ఉండును.
1) దంభము
2) దర్పము
3) తగని అభిమానము
4) పగతీర్చుకొను కోపము
5) మనోవాక్కాయములలో మోటుతనం
6) అజ్ఞానము
2) (దంభమనగా లేని సామర్థ్యం ఆపాదించుకొనుట. దర్పమనగా లేని సామర్థ్యం ఉన్నట్లు కనిపింపచేయుట.తగని అభిమానమనగా తాను మిగిలినవారికన్నా గొప్పవాడని నమ్ముట. అజ్ఞానమనగా యథాస్థితిని గ్రహింప లేకుండుట. సర్వాంతర్యామి స్మరణ మూటుపడునట్లు తదితరములపై విశ్వాసము బలపడుట.)
3. ఈ రెండు విధములలో దైవీసంపద మోక్షమునకును, అసుర సంపద బంధమునకును కారణములగుచున్నవి. అర్జునా! నీవు దైవీసంపదతో జన్మించితివి కనుక దిగులక్కరలేదు.
4. జీవుల సృష్టి అంతయు ఈ విధముగా దివ్యము, అసురము అని రెండు విధములు. అందు దైవీ సంపదను విస్తారముగా చెప్పితిని. అసురమును గూర్చి మరికొంత వివరింతును.
5. వారికి దేనియందు ప్రవర్తింపవలెనో, దేనియందు ప్రవర్తింపరాదో తెలియదు. అనగా ధర్మాధర్మముల యందు విశ్వాసము లేదు. శౌచము, ఆచారము, సత్యము కూడా వారు విశ్వసింపరు.
6) (ప్రవృత్తి కర్మలయందు ఉండవలెను. నివృత్తి ఫలములయందు ఉండవలెను. అట్లు ప్రవర్తించినప్పుడు నియత కర్మలు తనకేవియో తెలియును. ఇట్లు ధర్మ ప్రవర్తనము విపత్తుల నుండి రక్షించును. శౌచము దేహేంద్రియ మనస్సులకు సంబంధించినది. ఆచారమనగా ఆచరింపదగిన విధానము. దీనిని పెద్దల వలన అనుకరించి తెలియవలెను. సత్యమనగా యథార్థ తత్త్వమును అంగీకరించుట.)
7) దీని వలన సృష్టిలోని సత్యములు తన స్వభావములగును. బ్రహ్మ సత్యము అను జ్ఞానము కలుగును. అసుర సంపత్తి కలవానికి అశక్తత కాక వీని యందు అప్రమాణ బుద్ధి నిలుచును. అందుచే అసురత్వము వాసనారూపమై అనేక జన్మలు వెంటాడును.)
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మాయాధీన శ్చిదాభాసః శ్రుతౌమాయీ మహేశ్వరః ౹ అన్తర్యామీచ సర్వజ్ఞో జగద్యోనిః స ఏవ హి ౹౹157౹౹
157. మాయయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడనీ,అతడు మాయకు ప్రభువనీ,ఆ మహేశ్వరుడు అంతర్యామీ సర్వజ్ఞుడూ జగత్కారణమూ అనీ శ్రుతి చెప్పును.
శ్వేతాశ్వర ఉప.4.9-10;
మాండూక్య ఉప.6.
సౌషుప్త మానందమయం ప్రక్రమైవం శ్రుతిర్జగౌ ౹ ఏష సర్వేశ్వర ఇతి సోఽ యం వేదోక్త ఈశ్వరః ౹౹158౹౹
158. "సౌషుప్త మానందమయ" మని మొదలై "ఏష సర్వేష్వర" యని అంతమగు శ్రుతి వాక్యము ఆనందమయ కోశమునే ఈశ్వరుడని వర్ణించినది.
వ్యాఖ్య:-
మాండూక్య ఉప.5-6;
బృహదారణ్యక ఉప.4-4-22.
ఆనందమయ కోశముల సమిష్టియే ఈశ్వరుడని ఉద్దేశము.
పైన వాసనలయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని చెప్పబడినది గదా!
ఆ సూక్ష్మవిషయమును అర్థము చే…
: ఆరా రంగులు - ఎరుపు - Aura Colours - Red
📚✍️ భట్టాచార్య
మూలాధార చక్రం రంగు ఎరుపు. మూలాధార చక్రం మన భౌతిక శరీరాన్ని, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపు రంగు బలమైన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భయ, భీతులు లేని వ్యక్తులలో ఈ ఎరుపు రంగు తేజోవలయం గోచరిస్తుంది. ఆ వ్యక్తి యొక్క కోరికలను, అభిలాషలను...ఈ ఎరుపు రంగు తేజోవలయం...వ్యక్తీకరిస్తుంది. జీవితంలో సాహస కృత్యాలు చేయడానికి ఇష్ట పడేవారిలో...ఈ ఎరుపురంగు aura ద్యోతకమౌతుంది. ఆరాలో....పసుపు అంచులతో కలిగిన ఎరుపు రంగు, ఇతరుల యోగ క్షేమాల కోసం పాటుపడే తత్వాన్ని తెలియజేస్తుంది. అదే ఎరుపు రంగులో బురద రంగు కలిసి ఉండే ఆరా కలిగిన వ్యక్తులు....దుర్మార్గులు, కఠినాత్ములు. భయంకరమైన స్వార్ధాన్ని నింపుకునేవాడు. తీక్షణమైన ఎరుపు రంగు తేజోవలయం గల వ్యక్తి శారీరకంగా బలిష్టుడై ఉంటాడు. హంతకులు, పరమ దుర్మ…
: అన్నమయ్య సంకీర్తన
రేకు: 237-3
సంపుటము: 3-212
రాగము: భూపాళం.
॥పల్లవి॥ పరమయోగీశ్వరుల పద్ధతి యిది
ధరణిలో వివేకులు దలపోసుకొనుట!!
॥చ1॥
మొదల నాత్మజ్ఞానము దెలిసి పిమ్మట
హృదయములోని హరి నెరుఁగుట!
వుదుటైన యింద్రియాల నొడిసి పంచుకొనుట
గుదిగొన్నతనలో కోరికె లుడుగుట!!
॥పర॥
॥చ2॥
తన పుణ్యఫలములు దైవము కొసగుట
పనివడి యతనిపై భక్తిచేసుట!
తనివితో నిరంతర ధ్యానయోగపరుఁడౌట
మనసులోఁ బ్రకృతిసమ్మంధము మరచుట!!
॥పర॥
॥చ3॥
నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట
చిడుముడి నాచార్యసేవసేయుట!
యెడయక శ్రీవేంకటేశుపై భారమువేసి
కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట!!
||శ్రీమన్నారాయణీయము||అష్టమ స్కంధము 27వ దశకము - కూర్మావతారము వర్ణనము 27-8-శ్లోకము
ఉన్మగ్నే ఝటితి తదా ధరాధరేంద్రే నిర్మేథుర్దృఢమిహా సమ్మదేవ సర్వే।
ఆ విశ్య ద్వితయగణే౾పి సర్పరాజే వైవశ్యం పరిశమయన్నవీవృధస్తాన్॥
భావము:-
మందరపర్వతమును నీవట్లు లేవనెత్తగానే, సురాసురులిరువురు ఉత్సాహముగా ఆ క్షీరసముద్రమును తిరిగి మథించసాగిరి. వారు అట్లు మథించుచుండగా, దేవదానవగణములును మరియు సర్పరాజగు వాసుకియు మిక్కిలి అలసట చెందిరి. వారి అలసటను ఉపశమింపజేయుటకై నీవు వారిలో ఆవహించి, వారిని బలోన్నతులను జేసితివి.
వ్యాఖ్య:-
దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించి, అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు.
రాక్షసులకూ అమరత్వం సిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది? అయితే అలా కాకుండా చేసే బాధ్యత విష్ణుమూర్తిదే కాబట్టి అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు.
పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి, క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారందరూ.
అంతవరకూ బాగానే ఉంది కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది మామూలు వారికి శక్యం కాని పని కదా... శ్రీ మహావిష్ణువు తానే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు.
రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. సాగర మథనం ప్రారంభమైంది.
: 1-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
1. వైదిక మతమునకు ప్రామాణిక గ్రంథము
((((((((((🕉))))))))))
ఈ రోజులలో ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలున్నాయి. ప్రతి మతం గురించీ ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రతి మతానికీ ప్రధానమైన గ్రంథమంటూ ఒకటి ఉంటుంది. ప్రతి ధర్మానికీ ఒక స్థాపకుడున్నాడు - ఆయన రచనలకీ, ప్రవచనాలకీ ఆ మతంలో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మతస్థులు తమ మతస్థాపకుని గ్రంథమే ప్రామాణికమైనదనీ, అనుసరణీయమైనదనీ విశ్వసిస్తారు. కొందరు అటువంటి గ్రంథాన్ని ఆరాధిస్తారు, దేవాలయాలలో పెట్టుకొని పూజిస్తారు. ఉదాహరణకి - సిక్కులు. ఈ విధంగా తమ పవిత్రగ్రంథాన్ని ఎంతో ఆదరంతో ''గ్రంథ్ సాహెబ్'' అని చెప్పుకుంటారు. అట్లాగే ప్రతి మతమూ ఒక గ్రంథాన్ని ఎంచుకొని ఆ గ్రంథమే ముక్తి మార్గాన్ని చూపిస్తుందనీ,ఆత్మోన్నతిని కలిగిస్తుందనీ నమ్ముతుంది. ఆ గ్రంథం ఆ మతస్థాపకుని పేర వెలసినా అందులోని మాటలు భగవద్వాణి అనీ, భగవదాదేశమనీ అవి ఆ మతస్థాపకుని ద్వారాగాని, ప్రవక్తద్వారాగాని, బహిర్గతమైనవనీ ఆ మతస్థులు నమ్ముతారు. అందువల్ల వాటిని ''బహిర్గతమైన వాక్కులు'' అంటారు. హిందువులమైన మనం మన పవిత్ర గ్రంథాలైన వేదాలను ''అపౌరుషేయము'' లంటాం. ఇవి మానవునిచే రచింపబడినవి కావనీ, భగవంతుని వాక్కును ప్రచారంలోకి తీసుకురావటానికి మానవుడు సాధనం మాత్రమే అయాడనీ దీని భావం.
ఏ మతానికైనా ప్రాతిపదిక అనదగ్గ సాధికారకమైన గ్రంథమేది అని ప్రశ్నిస్తే అన్యమతస్థులు నిస్సంకోచంగా సమాధానాలు చెప్తారు. క్రైస్తవులు ''బైబిల్'' అంటారు, మహమ్మదీయులు ''కొరాన్'' అంటారు, బౌద్ధులు ''ధమ్మపద'' మంటారు, పార్శీలు ''జెండ్ అవెస్టా'' అంటారు. కాని హైందవులమైన మనమిటువంటి సమాధానమీయలేం.మనకి అటువంటి గ్రంథమంటూ ఒకటి లేదు, అటువంటి గ్రంథ రచయిత అంటూ ఒకడు లేడు. కొందరు రామాయణాన్ని మన పవిత్ర గ్రంథంగా చెప్పుకొంటే, మరికొందరు భగవద్గీతని చెప్పుకొంటారు. ఇంకా కొందరు "వేదాలను" మనకు శిరోధార్యాలైన గ్రంథాలుగా చెప్పుకొంటారు. అన్ని కాలాలలోనూ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు.
ఈ విభిన్నాభిప్రాయాలకీ, ఈ అస్తవ్యస్తతకీ కారణమొకటి ఉంది: అన్యమతస్థులకి తప్పనిసరిగా మతపరమైన విద్యాబోధన చేసే ప్రాథమికమైన గ్రంథమొకటి ఉంది. కాని హైందవులకు ప్రాథమికమైన ధార్మిక విద్యాబోధన అంటూ లేమీ లేదు. ఈ కారణం వల్లనే మనం మన మత గ్రంథాలని విమర్శిస్తూంటారు , కించపరుస్తూనూ ఉంటారు. ఇతర మతస్థులు తమ మతగ్రంథాలను కాపాడుకొంటారు, గౌరవంగా చూసుకుంటారు; అంతేకాక, తమకి భిన్నమైన మతాల సూత్రాలని ఆక్షేపిస్తూంటారు. ఇతర మతస్థుల వలె మనకి కూడ చిన్న వయస్సులో మన ముఖ్యమైన మత గ్రంథాల గురించి బోధన ఉండి ఉంటే మనం మన పవిత్రగ్రంథాలను శంకించం. వాటి గురించి ఇంత అజ్ఞానంతోనూ ఉండం. మనకి మన మతమంటే ఏమిటో తెలియాలి. దీనికి మన పవిత్రగ్రంథాలే కదా సాధనం? కాని అంతకంటె ముఖ్యం, మతం యొక్క ఆవశ్యకతని తెలుసుకోవటం. మతమంటే కేవలం కర్మకాండకాదు. మతమంటే ధర్మం. ధర్మమంటే ఏమిటి? దేని ఆచరణ వల్ల మనకి సంతృప్తీ, సంతోషమూ కలుగుతాయో అదే ధర్మమంటే. ధర్మమంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, ధార్మిక సూత్రాలని తెలుసుకోవాలన్నా మనం కొన్ని గ్రంథాలని అధ్యయనం చెయ్యాలి. అటువంటి గ్రంథాలని ''ధర్మ ప్రమాణాలు'' అంటారు. ''ప్రమాణ'' మంటే సత్యాన్ని నెలకొల్పేది అని అర్థం. అంటే, ''ధర్మప్రమాణ''మన్న పదానికి అర్థం, ధర్మం గురించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించేది అన్నమాట. నిజమైన ధర్మం గురించి చెప్పే పవిత్ర గ్రంథాలేమిటి?
''అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః!! పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతా శ్చతుర్దశ''!! ఇవి పధ్నాలుగు - నాలుగు వేదాలు, (అంటే ఋక్, యజుః, సామ, అధర్వ) ఆరు వేదాంగాలు అంటే వేదాలకు అనుషంగాలు (ఇవి శిక్ష - శబ్ద శాస్త్రము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము. భాషా శాస్త్రము, జ్యోతిషము, కల్పము) నాలుగు ఉపాంగములు. మీమాంస అంటే వేదాలకి వ్యాఖ్య, న్యాయం అంటే తర్కం. పురాణం, ధర్మశాస్త్రం - అంటే వర్తనకి సంబంధించిన నియమాలు. వీటిలో విజ్ఞానం, వివేకం నిక్షిప్తమై యున్నాయి. అందువల్లనే ఈ పధ్నాల్గింటినీ విద్యాస్థానాలంటారు.వీటికి ఉపాంగాలంటూ ఇంకో నాల్గింటిని చేర్చవచ్చు. ఇవి వేదాంగాలకి అనుబంధాలు. ఇవి-
(1) ఆయుర్వేదం - జీవితానికి సంబంధించిన శాస్త్రం,
(2) అర్థశాస్త్రం - సంపదకీ, అర్థానికి సంబంధించిన శాస్త్రం,
(3) ధనుర్వేదం - అస్త్రాలకీ, యుద్ధానికీ సంబంధించిన శాస్త్రం,
(4) గాంధర్వవేదం - సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు.
మన మతానికి గుండెకాయ అని చెప్పదగ్గవి చతుర్వేదాలు. అవే అతి ప్రమాణాలు. ఆరు వేదాంగాలు, నాల్గు ఉపాంగాలు కూడా వేదాలమీదే ఆధారపడ్డాయి. ఇవి వేదాలని అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండే అనుబంధాలు. వేదాలను ఈ ఆరు అంగములతో,నాలుగు ఉపాంగములతో కలిపి అధ్యయనం చెయ్యాలి. ఆది లేదు - కర్తలేడు.
వేదాలు ''అనాది'' - అంటే కాలపరిమితిలో ప్రారంభమంటూ లేనివి. వాటికి పూర్వంగాని, వాటికంటె ముందు వచ్చినవి గాని ఏమీ లేవని అర్థం. అంటే, ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయన్నమాట. కాని దీనిని ఒప్పుకోవటమెట్లా? ఏ గ్రంథానికైనా కనీసం ఒక్కడైనా రచయిత అంటూ ఉండాలికదా? ఓల్డ్ టెస్ట్మెంట్ (Old Testament) ఎందరో ప్రవక్తల ప్రవచనాల సంకలనం.
ఈ విధంగా చూస్తే వేదాలకి కూడా ఎప్పుడో ఒకప్పుడు సజీవులైన రచయితలుండి ఉండాలి కదా. వారికి పూర్వం ఈ బోధనలు అలభ్యములే కదా.ఇది ఎంత ప్రాచీనమైనదైనా అయి ఉండవచ్చు. కాబట్టి వేదాలను 'అనాది' అనటం సమంజసం కాదని కొందరి వాదం. వేదాలను మానవులే రచించారనుకుంటే, ఇటువంటి వాదనలు సహేతుకంగానే కనబడతాయి. ఎవ్వరూ వ్రాయక పోతే, గ్రంథమంటూ ఒకటి ఎట్లా వస్తుంది? రచయిత అన్నవాడు లేకపోతే, గ్రంథమంటూ ఉండదు. ఆ రచయిత ఎప్పుడో ఒకప్పుడు సజీవుడై యుండి ఉండాలి.
మామూలుగా చూస్తే ''గ్రంథానికి రచయిత లేడు'' అన్న వాదానికి ఏమీ బలంలేనట్టు కన్పిస్తుంది. అందువల్ల, ఎంతో ప్రగతిని సాధించిన ఋషులనబడే వ్యక్తులు వేదాలను రచించారన్న వాదాన్ని లేవనెత్తారు. వేదాలలో ఎన్నో సూక్తులున్నాయనీ, ఇవి కొందరి ఋషుల వాక్కులనీ అన్నారు. వేదాలలోని మంత్రాలని జపించేప్పుడు, ఆ వేద పాఠానికి సంబంధించిన ఋషిపేరుగాని, ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరుగాని, ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత పేరుగాని చెప్పటం పరిపాటి. వేదమంత్రాలు ఎందరో ఋషులను పేర్కొంటాయి. అందువల్ల వారందరూ కర్తలేనన్న భావం నెలకొన్నది. ఒకోసారి ఋషి యొక్క వంశానుక్రమం కూడా చెప్పటం కద్దు. దీని వల్ల ఒకే పేరుగల యిద్దరు ఋషులను విడివిడిగా గుర్తించటం తేలిక. ఉదాహరణకి ''అగస్త్యోమైత్రావరుణి'' అంటే, మిత్ర, వరుణుల కుమారుడైన అగస్త్యుడని తెలుస్తుంది. అయితే, మంత్రం ఒకరిపేరున ఉంటే ఆయనే కర్త అనుకోవాలి కదా? అంటే, ఆయనకి పూర్వం ఆ వేదమంత్రం లేదని ఋజువు కాదా? అటువంటప్పుడు, వేదం ''అనాది'' అని ఎట్లా అనగలం?
అసలు రహస్యమేమిటంటే - ఈ ఋషిగాని, ఆ ఋషిగాని, ఏ ఋషీగాని వేదమంత్రాలని కూర్చలేదు. అందువల్లనే ఏ ఋషులూ వాటి కర్తలు కారు.వేదాలు అపౌరుషేయాలు - అంటే పురుషప్రమేయం లేనివని అర్థం. ''పౌరుషేయ'' మంటే మానవ కల్పితం. వేదాలు మానవకల్పితాలు కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించియుండడు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్ర కర్తలనవచ్చు. కానీ వారిని మంత్ర ద్రష్టలంటాము. అంటే, మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని అర్థమిది ఋషులు మంత్రాలను కనుగొన్నారు, లేక చూచారన్నమాట. వాటిని రచించలేదు, సృష్టించలేదు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకి అర్థం ఏమిటి? అతడు అమెరికాను సృష్టించాడనా?కానేకాదు. ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకువచ్చాడు.న్యూటన్, ఐన్స్టైన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకాని వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్కి పూర్వం కూడ వస్తువులు క్రింద పడేవి; ఆయన దానిని కనుగొన్నాడు. అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారిగా చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన మంత్రాలను ఋషులు గ్రహించి, లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనటం వల్ల, ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అప్పటికే ఉండి, అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలని మానవలోకానికి ఎరుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువల్లనే వారి పేర్లను చెప్పేప్పుడు మనం వారి స్మృతికి గౌరవసూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి యిది.
మంత్రాన్ని ఉచ్చరించటానికి పూర్వంకూడ ఈ భావంతోనే వారి పేర్లను పేర్కొంటాం. ''ఋషులు మంత్రాలను కనుగొన్నార''న్నప్పుడు వారు కనుగొనక పూర్వమెక్కడ ఉండేవి? ''అనాది'' అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా?ఉంటే, ఎక్కడ ఉండేవి? అంతరిక్షంలోనా?సృష్టితో బాటే వేదమంత్రాలు కూడా ఆవిర్భవించాయి అనుకొంటే, సృష్టికర్త వాటిని కూడా జగత్తుతో బాటే సృష్టించాడని అర్థం కాదా? అంటే, భగవంతుడు వేదాలను రచించి, ఋషులు క్రమంగా కనుగొనటానికి వీలుగా ఎక్కడైనా దాచిపెట్టాడా?అయినా, సృష్టితో బాటే వేదాలు కూడా ఉద్భవించాయంటే అవి ''అనాది'' ఎట్లా అవుతాయి? ఇప్పటి బ్రహ్మసృష్టిని కొలవటం సాధ్యమే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ యుగాలకు నిర్ణీతమైన కాల పరిమితు లున్నాయి. ఇటువంటి యుగక్రమాలు వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక పగలు క్రింద లెక్క. అట్లాగే ఇంకొక వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి.
ఈ విధంగా చూస్తే బ్రహ్మవయస్సిప్పుడు ఏభై సంవత్సరాలే. బ్రహ్మ ఆయుర్దాయం నూరు సంవత్సరాలు. ఈ బ్రహ్మకి పూర్వము మరొక బ్రహ్మ ఉండేవాడు. అందువల్ల ఇప్పటి బ్రహ్మా, అతని సృష్టీ 'అనాది' కాదు. అయితే ఏది ''అనాది''? పరమాత్మ అందరి బ్రహ్మలకంటే ముందే ఉండి ఉండాలి. బ్రహ్మం - అంటే నిరాకారుడైన భగవంతుడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఆయన నిత్యుడు. విశ్మమూ, పదార్థమూ సృష్టింపబడటమూ, లయ మొందటమూ ఆయన వల్లనే. పరమాత్మ తన సృష్టికార్యాన్ని బ్రహ్మతోనూ, సృష్టి సంస్థితిని విష్ణువుతోనూ, సృష్టిలయాన్ని శివునితోనూ చేయిస్తాడు. బ్రహ్మ, విష్ణు, శివులుకూడా లేకుండా పోతారు. అందువల్లనే బ్రహ్మ వయస్సుని లెక్కకట్టవచ్చు. తన నూరు బ్రహ్మవర్షాలూ ముగిసిన తరువాత బ్రహ్మ పరమాత్మలో లీనమవుతాడు. అప్పుడు మరొక బ్రహ్మ అందుకుంటాడు.
మళ్లీ వేదాల సంగతి చూద్దాం. పరమాత్మ వేదాలను, బ్రహ్మలకు పూర్వం, అంటే సృష్టికే పూర్వం, సృజించాడా? సృష్టికి పూర్వమే వేదాలుండేవనీ, బ్రహ్మ తన సృష్టిని శబ్దరూపంలో సంస్థితమై యున్న వేదమంత్రాలతోనే కొనసాగించాడనీ - శాస్త్రాలవల్ల మనకి తెలుస్తుంది. శ్రీ మద్భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు.
అంటే పరమాత్మా, వేదాలూ అనాది అనుకోవచ్చా? కొంచెమాలోచిస్తే ఇదీ తప్పేనని తోస్తుంది. జగత్సృష్టికి పూర్వమే పరమాత్మ వేదాలను సృష్టించాడనుకొంటే,అవేవీ సృష్టింపబడక పూర్వం కొంత కాలం గడచినట్టే కదా - అంటే జగత్సృష్టికి పూర్వం భగవంతుడు కాలాన్ని సృష్టించాడన్నమాట, ఆ తరువాతే వేదాలను సృష్టించి నట్టు అర్థం వస్తుంది, అటువంటప్పుడు వేదాలు ''అనాది'' అని ఎట్లా అనగలం?తానూ, వేదాలూ 'అనాది' అయితే భగవంతుడు వేదాలను సృష్టించి యుండలేడు. ఆయనే సృష్టించి ఉంటే వాటికి మొదలు అంటూ ఒకటి ఉంటుంది. అన్నీ ఈశ్వరసంభూతాలే.
ఈశ్వరునికి వెలుపల ఏమీ లేనందువల్ల - ఈశ్వరుడూ, వేదమూ ఒకరితో బాటు ఒకరు ఆరంభమంటూ ఏమీ లేకుండా ఉండి ఉండాలి. కాని ఇది సరియైనదిగా తోచదు. ఈశ్వరసృష్టి కాకుండా, ఈశ్వరుని పై ఆధారపడని ఉనికి లేకుండా, ''అనాది'' ఎట్లా సాధ్యం? ఈ గందరగోళానికి సమాధానము వేదములోనే యున్నది.
బృహదారణ్యక ఉపనిషత్తులో (2.4.10) ఇట్లా ఉంది. వేదం - ఋక్, యజుః, సామరూపాలలో - ఈశ్వరుని ''నిశ్వాసితం'' మాత్రమే. ''నిశ్వాసిత'' మన్న మాటకి అర్థం ఊపిరి విడవటమని. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్ముని ఊపిరేనన్నమాట.
ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడే అయితే, ఆయన యొక్క ఊపిరేఅయిన, వేదాలు కూడా అనాదే - ఆయనతో బాటే అవి సంస్థితమై ఉంటాయి. ఇక్కడ గమనించవలసిన విషయమిది : భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని. మన ఊపిరిని మనమే కల్పించుకొన్నామనలేం కదా. మనం పుట్టినప్పటి నుండీ ఊపిరి ఉంటూనే ఉంది. ఆ విధంగానే ఈశ్వరుడూ, వేదాలూను. ఆయన కూడా వేదాలను సృష్టించాడనలేము. రెండూ ఎప్పుడూ కలిసే ఉన్నాయి. వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తూ ఈశ్వరుడే నంటూ, ఆయన యొక్క ''నిశ్వాసమే వేదాల''ని స్తుతించాడు.
విద్యారణ్యులవారు భాష్యంలో తన గురువు వేదాలలో ఎట్లా లీనమై పోయారో వర్ణించటమే కాక వేదాలు ఈశ్వర సృష్టి కావని కూడ నొక్కి చెప్తారు.
గీతలో కృష్ణ భగవానుడు ''వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః'' అంటాడు - అంటే వేదాల వల్ల తెలియనగు వానిని నేనే అని అర్థం. అంతేకాదు, వేదాలను తాను సృష్టించిన వానిగా చెప్పుకొనక, వేదాంతానికి విషయమే తానంటాడు ''వేదాంతకృత్'' అంటాడు, ''వేదకృత్'' అనడు. వేదాలన్నీ తనకి తెలుసునంటాడు - వేదవిద్. వేదాంతంలో ఊహింపబడిన కేవలస్థితిలో సృష్టికి పూర్వమే ఈశ్వరుడూ, వేదాలూ కలిసి ఉండేవి.
గీతలో వలె భాగవత పురాణంలో కూడా వేదాలను భగవంతుడు కల్పించినట్లుగా ఎక్కడా లేదు. ఆయన హృదయంనుండి విస్ఫుట మయ్యాయని ఉంది. స్ఫుటమవటమంటే ఉన్నదేదో హఠాత్తుగా బయటపడటమని అర్థం. అంతకు పూర్వం లేనిది క్రొత్తగా వచ్చిందని అర్థం కాదు. మొట్టమొదటగా జనించిన బ్రహ్మే ఆది ఋషి. ఆయనకే అన్ని వేదమంత్రాలూ ఎరుక. ఈ ఎరుక కల్పించిందీ ఈశ్వరుడే. ఎట్లా? బ్రహ్మ నేర్చుకోవాలని ఉచ్ఛరించాడా? కాదు. తన హృదయం ద్వారా ఇచ్చాడు.
భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో ''తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే.'' అంటే ఈశ్వరునిలో వేదాలు ఎప్పుడూ, ఆయన శ్వాసగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈశ్వరుని సంకల్పం వల్ల బ్రహ్మకి వాటి గురించి ఎరుక కలిగింది. ఈశ్వరుని హృదయకంపనల మార్గ దర్శకత్వంలో తన సృష్టిని కొనసాగించాడు బ్రహ్మ. ఇది సాధ్యమా? కంపనలు అంత పని చెయ్యగలవా?
--(())--
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 10.
Imitation, cowardly imitation, never makes for progress.
పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానీయదు. అది పతనానికే దారితీస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
మనలో ఇంద్ర గ్రంధి భ్రూమధ్యమునకు పైన, ఆజ్ఞకు క్రింద ఉంటుంది. ఆ కేంద్రము కనుక మనకు ప్రచోదనము అయితే మనకు ఓజస్సు కలుగుతుంది. ఓజస్సు అనగా ఏడు ధాతువుల సారముగా మూలముగా ఉన్నటువంటి తత్త్వము. ఓజస్సు ప్రచోదనము అయితే మనకి *ఓం కారము లోపల వినగలిగే శక్తి వస్తుంది. ఓం కారమును జనింప చేస్తుంది. ఓం కారమును జనింపచేసేది ఇంద్రుని యొక్క ఆధీనంలో ఉన్నది. అది సప్త ధాతువులకు బలమునిస్తుంది.*
ఓం కారమును ఎవరు సిద్ధింపచేసుకుంటారో వారికి అమృతత్వ స్థితి కలుగుతుంది. ఇది సత్యము.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
జీవన సామరస్యాన్ని కనుగొనడం ద్వారా శక్తి లభిస్తుంది. మన దృష్టి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే సత్య దృష్టి అనేది నిశ్చలం, అది పోగొట్టుకునేది కాదు. ఒక్కోసారి దృష్టి మసకబారినట్లు అనిపించినా, తిరిగి మార్గాన్ని దృఢతరంగా చూపగలదు. మన జీవనంలో సామరస్యం నెలకొని ఉన్నప్పుడు మన మాటలు, చేతలు అన్నీ సవ్యంగా ఉంటాయి. మనం అన్ని లెక్కలనూ విస్మరిస్తాం. మనకు లభించేది అంతా భగవదనుగ్రహ ఫలమే అనే భావన మనలో సదా నెలకొని ఉన్నప్పుడు మన వలన ఎటువంటి తప్పిదాలు జరుగవు. పరమాత్మునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దాని వలన కలిగే ఫలితాల కొరకు ప్రత్యేకంగా ఎదురు చూడనవసరం లేదు, వాటంతటవే వస్తాయి.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
: 😊జీవనయానం💖
నలభై ఏళ్ల వయసులో ఉన్నత విద్యావంతులు, సాధారణ విద్యావంతులు ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.
యాభై ఏళ్ల వయస్సులో అందమైన దేహం అందవిహీనం మధ్య తేడాచాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు, ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.
అరవై ఏళ్ల వయసులో ఉన్నత శ్రేణి జీవితం సాధారణ జీవనం రెండూ ఒకటే. పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.
డెబ్బై ఏళ్లవయస్సులో విశాలమైన భవంతి సాధారణ నివాసం రెండూ సమానమే... కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఇంట్లో ఓ మూలన చిన్నస్థలం చాలు.
ఎనభైఏళ్ల వయస్సులో ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.
తొంభైఏళ్ల వయస్సులో నిద్ర మెలుకువ రెండూ ఒకటే. సూర్యోదయం, సూర్యాస్తమయం రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.
అందంతో వచ్చే మిడిసిపాటు ఆస్తులతోవచ్చే అహంకారం పదవులతో గౌరవాన్ని ఆశించటం కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.
సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే, అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ, అనుబంధాలను పదిలపరుచుకుంటూ, జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!
జీవిత పరమార్ధం ఏమిటో అన్వేషిద్దాం !!
శ్రీరమణీయం -(798)
"సాధకుడు తన మనోభావాలను ఏవిధంగా అవగాహన చేసుకోవాలి !?"
మన మనోభావన ఎలాంటిదంటే అద్దంలో మనంచూసే ప్రతిబింబం లాంటిది. మనం అద్దంలో చూసేటప్పుడు కనిపించేవన్నీ అపసవ్యమైన ప్రతిబింబాలు. అంటే కుడి ఎడమగా, ఎడమ కుడిగా కనిపించేవి. కానీ కేవలం అద్దంలో మాత్రమే చూస్తే ఈ విషయం ఎప్పటికీ తెలియదు. అంతా సవ్యంగానే ఉన్నట్లు ఉంటుంది. ఒకసారి అద్దంనుండి తల ప్రక్కకు తిప్పి వాస్తవాన్ని చూస్తే అద్దంలో కనిపించేదంతా వాస్తవంలా కనిపించే, అనిపించే అసత్యమని అర్థమవుతుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇక అలాంటి అసత్యభావన కలగదు. ఎంతో కఠినమైన సాధనచేసి అందరూ సమాధిస్థితిని పొందలేకపోవచ్చు. కానీ కళ్ళెదురుగా కనిపించే వాస్తవాలను గమనించే అవకాశం అందరికీ ఉంటుంది. ఒకసారి వాస్తవాన్ని తెలుసుకుని అర్థం చేసుకుంటే మనసు సమాధానపడి స్థిమితాన్ని పొందుతుంది. నిజానికి మాయ అద్దంలోలేదు. మన చూపులోనే ఉందని తెలిసిన తర్వాత అద్దాన్ని ఉపయోగించినా మన భావనలో మార్పువస్తుంది. అద్దంలో ఉన్నది అపసవ్యం, అసత్యం అన్న సత్యభావనతో దాన్ని ఉపయోగించుకుంటాం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'కనపడే గుణం మారితే కనపడని మనసు మారుతుంది'- (అధ్యాయం -98)
"ఋభుగీత " (265)
సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము
ఫలాన్ని ఆశించని వ్యక్తి చేసే కార్యాలన్నీ కరములకు సంబంధించినవే గానీ మనసుకు సంబంధించినవి కావు !
కరములు ఉంటే కార్యం ఉండి తీరుతుంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి నిర్దిష్ట కార్యం, ప్రయోజనం ఉన్నాయి. కాబట్టి ఫలాన్ని ఆశించని వ్యక్తి చేసే కార్యాలన్నీ ఆయన కరములకు సంబంధించినవే గానీ మనసుకు సంబంధించినవి కావు. అతనికి కారణ కార్యరూపాలు కూడా ఉండవు. కర్త, క్రియ, భోక్త, భోజ్యం, భోగం ఏదీ అతనికి వర్తించదు. అవన్నీ ఫలాలను ఆశించేవారికి మాత్రమే అంటుకునే సృష్టి ధర్మాలు. సృష్టి ధర్మంలో బాహ్యంగా జరిగేవన్నీ అవి క్రమానుగతంగా జరుగుతూనే ఉంటాయి. ఆత్మే బ్రహ్మగా మారి అన్నిటినీ సృష్టిస్తుంది. ఎక్కడ రక్షించాల్సిన అవసరం ఏర్పడుతుందో అక్కడ ఆత్మ విష్ణువుగా ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఎక్కడ భోక్తగా తనలో లయం చేసుకోవాల్సి వస్తుందో అక్కడ ఆత్మ శివుడిగా లయకారకం అవుతుంది !
🌷149 - మంద్రగీత🌷
దేవతలు - అసురులు
1)అసుర సంపదలో జన్మించిన వానికి ఈ దిగువ లక్షణములు ఉండును.
1) దంభము
2) దర్పము
3) తగని అభిమానము
4) పగతీర్చుకొను కోపము
5) మనోవాక్కాయములలో మోటుతనం
6) అజ్ఞానము
2) (దంభమనగా లేని సామర్థ్యం ఆపాదించుకొనుట. దర్పమనగా లేని సామర్థ్యం ఉన్నట్లు కనిపింపచేయుట.తగని అభిమానమనగా తాను మిగిలినవారికన్నా గొప్పవాడని నమ్ముట. అజ్ఞానమనగా యథాస్థితిని గ్రహింప లేకుండుట. సర్వాంతర్యామి స్మరణ మూటుపడునట్లు తదితరములపై విశ్వాసము బలపడుట.)
3. ఈ రెండు విధములలో దైవీసంపద మోక్షమునకును, అసుర సంపద బంధమునకును కారణములగుచున్నవి. అర్జునా! నీవు దైవీసంపదతో జన్మించితివి కనుక దిగులక్కరలేదు.
4. జీవుల సృష్టి అంతయు ఈ విధముగా దివ్యము, అసురము అని రెండు విధములు. అందు దైవీ సంపదను విస్తారముగా చెప్పితిని. అసురమును గూర్చి మరికొంత వివరింతును.
5. వారికి దేనియందు ప్రవర్తింపవలెనో, దేనియందు ప్రవర్తింపరాదో తెలియదు. అనగా ధర్మాధర్మముల యందు విశ్వాసము లేదు. శౌచము, ఆచారము, సత్యము కూడా వారు విశ్వసింపరు.
6) (ప్రవృత్తి కర్మలయందు ఉండవలెను. నివృత్తి ఫలములయందు ఉండవలెను. అట్లు ప్రవర్తించినప్పుడు నియత కర్మలు తనకేవియో తెలియును. ఇట్లు ధర్మ ప్రవర్తనము విపత్తుల నుండి రక్షించును. శౌచము దేహేంద్రియ మనస్సులకు సంబంధించినది. ఆచారమనగా ఆచరింపదగిన విధానము. దీనిని పెద్దల వలన అనుకరించి తెలియవలెను. సత్యమనగా యథార్థ తత్త్వమును అంగీకరించుట.)
7) దీని వలన సృష్టిలోని సత్యములు తన స్వభావములగును. బ్రహ్మ సత్యము అను జ్ఞానము కలుగును. అసుర సంపత్తి కలవానికి అశక్తత కాక వీని యందు అప్రమాణ బుద్ధి నిలుచును. అందుచే అసురత్వము వాసనారూపమై అనేక జన్మలు వెంటాడును.)
శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మాయాధీన శ్చిదాభాసః శ్రుతౌమాయీ మహేశ్వరః ౹ అన్తర్యామీచ సర్వజ్ఞో జగద్యోనిః స ఏవ హి ౹౹157౹౹
157. మాయయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడనీ,అతడు మాయకు ప్రభువనీ,ఆ మహేశ్వరుడు అంతర్యామీ సర్వజ్ఞుడూ జగత్కారణమూ అనీ శ్రుతి చెప్పును.
శ్వేతాశ్వర ఉప.4.9-10;
మాండూక్య ఉప.6.
సౌషుప్త మానందమయం ప్రక్రమైవం శ్రుతిర్జగౌ ౹ ఏష సర్వేశ్వర ఇతి సోఽ యం వేదోక్త ఈశ్వరః ౹౹158౹౹
158. "సౌషుప్త మానందమయ" మని మొదలై "ఏష సర్వేష్వర" యని అంతమగు శ్రుతి వాక్యము ఆనందమయ కోశమునే ఈశ్వరుడని వర్ణించినది.
వ్యాఖ్య:-
మాండూక్య ఉప.5-6;
బృహదారణ్యక ఉప.4-4-22.
ఆనందమయ కోశముల సమిష్టియే ఈశ్వరుడని ఉద్దేశము.
పైన వాసనలయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని చెప్పబడినది గదా!
ఆ సూక్ష్మవిషయమును అర్థము చే…
: ఆరా రంగులు - ఎరుపు - Aura Colours - Red
📚✍️ భట్టాచార్య
మూలాధార చక్రం రంగు ఎరుపు. మూలాధార చక్రం మన భౌతిక శరీరాన్ని, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపు రంగు బలమైన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భయ, భీతులు లేని వ్యక్తులలో ఈ ఎరుపు రంగు తేజోవలయం గోచరిస్తుంది. ఆ వ్యక్తి యొక్క కోరికలను, అభిలాషలను...ఈ ఎరుపు రంగు తేజోవలయం...వ్యక్తీకరిస్తుంది. జీవితంలో సాహస కృత్యాలు చేయడానికి ఇష్ట పడేవారిలో...ఈ ఎరుపురంగు aura ద్యోతకమౌతుంది. ఆరాలో....పసుపు అంచులతో కలిగిన ఎరుపు రంగు, ఇతరుల యోగ క్షేమాల కోసం పాటుపడే తత్వాన్ని తెలియజేస్తుంది. అదే ఎరుపు రంగులో బురద రంగు కలిసి ఉండే ఆరా కలిగిన వ్యక్తులు....దుర్మార్గులు, కఠినాత్ములు. భయంకరమైన స్వార్ధాన్ని నింపుకునేవాడు. తీక్షణమైన ఎరుపు రంగు తేజోవలయం గల వ్యక్తి శారీరకంగా బలిష్టుడై ఉంటాడు. హంతకులు, పరమ దుర్మ…
: అన్నమయ్య సంకీర్తన
రేకు: 237-3
సంపుటము: 3-212
రాగము: భూపాళం.
॥పల్లవి॥ పరమయోగీశ్వరుల పద్ధతి యిది
ధరణిలో వివేకులు దలపోసుకొనుట!!
॥చ1॥
మొదల నాత్మజ్ఞానము దెలిసి పిమ్మట
హృదయములోని హరి నెరుఁగుట!
వుదుటైన యింద్రియాల నొడిసి పంచుకొనుట
గుదిగొన్నతనలో కోరికె లుడుగుట!!
॥పర॥
॥చ2॥
తన పుణ్యఫలములు దైవము కొసగుట
పనివడి యతనిపై భక్తిచేసుట!
తనివితో నిరంతర ధ్యానయోగపరుఁడౌట
మనసులోఁ బ్రకృతిసమ్మంధము మరచుట!!
॥పర॥
॥చ3॥
నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట
చిడుముడి నాచార్యసేవసేయుట!
యెడయక శ్రీవేంకటేశుపై భారమువేసి
కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట!!
||శ్రీమన్నారాయణీయము||అష్టమ స్కంధము 27వ దశకము - కూర్మావతారము వర్ణనము 27-8-శ్లోకము
ఉన్మగ్నే ఝటితి తదా ధరాధరేంద్రే నిర్మేథుర్దృఢమిహా సమ్మదేవ సర్వే।
ఆ విశ్య ద్వితయగణే౾పి సర్పరాజే వైవశ్యం పరిశమయన్నవీవృధస్తాన్॥
భావము:-
మందరపర్వతమును నీవట్లు లేవనెత్తగానే, సురాసురులిరువురు ఉత్సాహముగా ఆ క్షీరసముద్రమును తిరిగి మథించసాగిరి. వారు అట్లు మథించుచుండగా, దేవదానవగణములును మరియు సర్పరాజగు వాసుకియు మిక్కిలి అలసట చెందిరి. వారి అలసటను ఉపశమింపజేయుటకై నీవు వారిలో ఆవహించి, వారిని బలోన్నతులను జేసితివి.
వ్యాఖ్య:-
దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించి, అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు.
రాక్షసులకూ అమరత్వం సిద్ధిస్తే, మనకు ఒరిగేది ఏముంది? అయితే అలా కాకుండా చేసే బాధ్యత విష్ణుమూర్తిదే కాబట్టి అంతా ఆ విష్ణువుదే భారం! అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు.
పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా నిలబెట్టి, వాసుకి మహాసర్పాన్ని తాడుగా చుట్టి, క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారందరూ.
అంతవరకూ బాగానే ఉంది కాని, మందరపర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వేయుడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది మామూలు వారికి శక్యం కాని పని కదా... శ్రీ మహావిష్ణువు తానే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆ పని నెరవేర్చి, గిరిధారి అనిపించుకున్నాడు.
రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్టచివర వాసుకి తోక పట్టుకున్నాడు. సాగర మథనం ప్రారంభమైంది.
: 1-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
1. వైదిక మతమునకు ప్రామాణిక గ్రంథము
((((((((((🕉))))))))))
ఈ రోజులలో ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలున్నాయి. ప్రతి మతం గురించీ ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రతి మతానికీ ప్రధానమైన గ్రంథమంటూ ఒకటి ఉంటుంది. ప్రతి ధర్మానికీ ఒక స్థాపకుడున్నాడు - ఆయన రచనలకీ, ప్రవచనాలకీ ఆ మతంలో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మతస్థులు తమ మతస్థాపకుని గ్రంథమే ప్రామాణికమైనదనీ, అనుసరణీయమైనదనీ విశ్వసిస్తారు. కొందరు అటువంటి గ్రంథాన్ని ఆరాధిస్తారు, దేవాలయాలలో పెట్టుకొని పూజిస్తారు. ఉదాహరణకి - సిక్కులు. ఈ విధంగా తమ పవిత్రగ్రంథాన్ని ఎంతో ఆదరంతో ''గ్రంథ్ సాహెబ్'' అని చెప్పుకుంటారు. అట్లాగే ప్రతి మతమూ ఒక గ్రంథాన్ని ఎంచుకొని ఆ గ్రంథమే ముక్తి మార్గాన్ని చూపిస్తుందనీ,ఆత్మోన్నతిని కలిగిస్తుందనీ నమ్ముతుంది. ఆ గ్రంథం ఆ మతస్థాపకుని పేర వెలసినా అందులోని మాటలు భగవద్వాణి అనీ, భగవదాదేశమనీ అవి ఆ మతస్థాపకుని ద్వారాగాని, ప్రవక్తద్వారాగాని, బహిర్గతమైనవనీ ఆ మతస్థులు నమ్ముతారు. అందువల్ల వాటిని ''బహిర్గతమైన వాక్కులు'' అంటారు. హిందువులమైన మనం మన పవిత్ర గ్రంథాలైన వేదాలను ''అపౌరుషేయము'' లంటాం. ఇవి మానవునిచే రచింపబడినవి కావనీ, భగవంతుని వాక్కును ప్రచారంలోకి తీసుకురావటానికి మానవుడు సాధనం మాత్రమే అయాడనీ దీని భావం.
ఏ మతానికైనా ప్రాతిపదిక అనదగ్గ సాధికారకమైన గ్రంథమేది అని ప్రశ్నిస్తే అన్యమతస్థులు నిస్సంకోచంగా సమాధానాలు చెప్తారు. క్రైస్తవులు ''బైబిల్'' అంటారు, మహమ్మదీయులు ''కొరాన్'' అంటారు, బౌద్ధులు ''ధమ్మపద'' మంటారు, పార్శీలు ''జెండ్ అవెస్టా'' అంటారు. కాని హైందవులమైన మనమిటువంటి సమాధానమీయలేం.మనకి అటువంటి గ్రంథమంటూ ఒకటి లేదు, అటువంటి గ్రంథ రచయిత అంటూ ఒకడు లేడు. కొందరు రామాయణాన్ని మన పవిత్ర గ్రంథంగా చెప్పుకొంటే, మరికొందరు భగవద్గీతని చెప్పుకొంటారు. ఇంకా కొందరు "వేదాలను" మనకు శిరోధార్యాలైన గ్రంథాలుగా చెప్పుకొంటారు. అన్ని కాలాలలోనూ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు.
ఈ విభిన్నాభిప్రాయాలకీ, ఈ అస్తవ్యస్తతకీ కారణమొకటి ఉంది: అన్యమతస్థులకి తప్పనిసరిగా మతపరమైన విద్యాబోధన చేసే ప్రాథమికమైన గ్రంథమొకటి ఉంది. కాని హైందవులకు ప్రాథమికమైన ధార్మిక విద్యాబోధన అంటూ లేమీ లేదు. ఈ కారణం వల్లనే మనం మన మత గ్రంథాలని విమర్శిస్తూంటారు , కించపరుస్తూనూ ఉంటారు. ఇతర మతస్థులు తమ మతగ్రంథాలను కాపాడుకొంటారు, గౌరవంగా చూసుకుంటారు; అంతేకాక, తమకి భిన్నమైన మతాల సూత్రాలని ఆక్షేపిస్తూంటారు. ఇతర మతస్థుల వలె మనకి కూడ చిన్న వయస్సులో మన ముఖ్యమైన మత గ్రంథాల గురించి బోధన ఉండి ఉంటే మనం మన పవిత్రగ్రంథాలను శంకించం. వాటి గురించి ఇంత అజ్ఞానంతోనూ ఉండం. మనకి మన మతమంటే ఏమిటో తెలియాలి. దీనికి మన పవిత్రగ్రంథాలే కదా సాధనం? కాని అంతకంటె ముఖ్యం, మతం యొక్క ఆవశ్యకతని తెలుసుకోవటం. మతమంటే కేవలం కర్మకాండకాదు. మతమంటే ధర్మం. ధర్మమంటే ఏమిటి? దేని ఆచరణ వల్ల మనకి సంతృప్తీ, సంతోషమూ కలుగుతాయో అదే ధర్మమంటే. ధర్మమంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, ధార్మిక సూత్రాలని తెలుసుకోవాలన్నా మనం కొన్ని గ్రంథాలని అధ్యయనం చెయ్యాలి. అటువంటి గ్రంథాలని ''ధర్మ ప్రమాణాలు'' అంటారు. ''ప్రమాణ'' మంటే సత్యాన్ని నెలకొల్పేది అని అర్థం. అంటే, ''ధర్మప్రమాణ''మన్న పదానికి అర్థం, ధర్మం గురించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించేది అన్నమాట. నిజమైన ధర్మం గురించి చెప్పే పవిత్ర గ్రంథాలేమిటి?
''అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః!! పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతా శ్చతుర్దశ''!! ఇవి పధ్నాలుగు - నాలుగు వేదాలు, (అంటే ఋక్, యజుః, సామ, అధర్వ) ఆరు వేదాంగాలు అంటే వేదాలకు అనుషంగాలు (ఇవి శిక్ష - శబ్ద శాస్త్రము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము. భాషా శాస్త్రము, జ్యోతిషము, కల్పము) నాలుగు ఉపాంగములు. మీమాంస అంటే వేదాలకి వ్యాఖ్య, న్యాయం అంటే తర్కం. పురాణం, ధర్మశాస్త్రం - అంటే వర్తనకి సంబంధించిన నియమాలు. వీటిలో విజ్ఞానం, వివేకం నిక్షిప్తమై యున్నాయి. అందువల్లనే ఈ పధ్నాల్గింటినీ విద్యాస్థానాలంటారు.వీటికి ఉపాంగాలంటూ ఇంకో నాల్గింటిని చేర్చవచ్చు. ఇవి వేదాంగాలకి అనుబంధాలు. ఇవి-
(1) ఆయుర్వేదం - జీవితానికి సంబంధించిన శాస్త్రం,
(2) అర్థశాస్త్రం - సంపదకీ, అర్థానికి సంబంధించిన శాస్త్రం,
(3) ధనుర్వేదం - అస్త్రాలకీ, యుద్ధానికీ సంబంధించిన శాస్త్రం,
(4) గాంధర్వవేదం - సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు.
మన మతానికి గుండెకాయ అని చెప్పదగ్గవి చతుర్వేదాలు. అవే అతి ప్రమాణాలు. ఆరు వేదాంగాలు, నాల్గు ఉపాంగాలు కూడా వేదాలమీదే ఆధారపడ్డాయి. ఇవి వేదాలని అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండే అనుబంధాలు. వేదాలను ఈ ఆరు అంగములతో,నాలుగు ఉపాంగములతో కలిపి అధ్యయనం చెయ్యాలి. ఆది లేదు - కర్తలేడు.
వేదాలు ''అనాది'' - అంటే కాలపరిమితిలో ప్రారంభమంటూ లేనివి. వాటికి పూర్వంగాని, వాటికంటె ముందు వచ్చినవి గాని ఏమీ లేవని అర్థం. అంటే, ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయన్నమాట. కాని దీనిని ఒప్పుకోవటమెట్లా? ఏ గ్రంథానికైనా కనీసం ఒక్కడైనా రచయిత అంటూ ఉండాలికదా? ఓల్డ్ టెస్ట్మెంట్ (Old Testament) ఎందరో ప్రవక్తల ప్రవచనాల సంకలనం.
ఈ విధంగా చూస్తే వేదాలకి కూడా ఎప్పుడో ఒకప్పుడు సజీవులైన రచయితలుండి ఉండాలి కదా. వారికి పూర్వం ఈ బోధనలు అలభ్యములే కదా.ఇది ఎంత ప్రాచీనమైనదైనా అయి ఉండవచ్చు. కాబట్టి వేదాలను 'అనాది' అనటం సమంజసం కాదని కొందరి వాదం. వేదాలను మానవులే రచించారనుకుంటే, ఇటువంటి వాదనలు సహేతుకంగానే కనబడతాయి. ఎవ్వరూ వ్రాయక పోతే, గ్రంథమంటూ ఒకటి ఎట్లా వస్తుంది? రచయిత అన్నవాడు లేకపోతే, గ్రంథమంటూ ఉండదు. ఆ రచయిత ఎప్పుడో ఒకప్పుడు సజీవుడై యుండి ఉండాలి.
మామూలుగా చూస్తే ''గ్రంథానికి రచయిత లేడు'' అన్న వాదానికి ఏమీ బలంలేనట్టు కన్పిస్తుంది. అందువల్ల, ఎంతో ప్రగతిని సాధించిన ఋషులనబడే వ్యక్తులు వేదాలను రచించారన్న వాదాన్ని లేవనెత్తారు. వేదాలలో ఎన్నో సూక్తులున్నాయనీ, ఇవి కొందరి ఋషుల వాక్కులనీ అన్నారు. వేదాలలోని మంత్రాలని జపించేప్పుడు, ఆ వేద పాఠానికి సంబంధించిన ఋషిపేరుగాని, ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరుగాని, ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత పేరుగాని చెప్పటం పరిపాటి. వేదమంత్రాలు ఎందరో ఋషులను పేర్కొంటాయి. అందువల్ల వారందరూ కర్తలేనన్న భావం నెలకొన్నది. ఒకోసారి ఋషి యొక్క వంశానుక్రమం కూడా చెప్పటం కద్దు. దీని వల్ల ఒకే పేరుగల యిద్దరు ఋషులను విడివిడిగా గుర్తించటం తేలిక. ఉదాహరణకి ''అగస్త్యోమైత్రావరుణి'' అంటే, మిత్ర, వరుణుల కుమారుడైన అగస్త్యుడని తెలుస్తుంది. అయితే, మంత్రం ఒకరిపేరున ఉంటే ఆయనే కర్త అనుకోవాలి కదా? అంటే, ఆయనకి పూర్వం ఆ వేదమంత్రం లేదని ఋజువు కాదా? అటువంటప్పుడు, వేదం ''అనాది'' అని ఎట్లా అనగలం?
అసలు రహస్యమేమిటంటే - ఈ ఋషిగాని, ఆ ఋషిగాని, ఏ ఋషీగాని వేదమంత్రాలని కూర్చలేదు. అందువల్లనే ఏ ఋషులూ వాటి కర్తలు కారు.వేదాలు అపౌరుషేయాలు - అంటే పురుషప్రమేయం లేనివని అర్థం. ''పౌరుషేయ'' మంటే మానవ కల్పితం. వేదాలు మానవకల్పితాలు కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించియుండడు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్ర కర్తలనవచ్చు. కానీ వారిని మంత్ర ద్రష్టలంటాము. అంటే, మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని అర్థమిది ఋషులు మంత్రాలను కనుగొన్నారు, లేక చూచారన్నమాట. వాటిని రచించలేదు, సృష్టించలేదు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకి అర్థం ఏమిటి? అతడు అమెరికాను సృష్టించాడనా?కానేకాదు. ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకువచ్చాడు.న్యూటన్, ఐన్స్టైన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకాని వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్కి పూర్వం కూడ వస్తువులు క్రింద పడేవి; ఆయన దానిని కనుగొన్నాడు. అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారిగా చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన మంత్రాలను ఋషులు గ్రహించి, లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనటం వల్ల, ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అప్పటికే ఉండి, అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలని మానవలోకానికి ఎరుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువల్లనే వారి పేర్లను చెప్పేప్పుడు మనం వారి స్మృతికి గౌరవసూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి యిది.
మంత్రాన్ని ఉచ్చరించటానికి పూర్వంకూడ ఈ భావంతోనే వారి పేర్లను పేర్కొంటాం. ''ఋషులు మంత్రాలను కనుగొన్నార''న్నప్పుడు వారు కనుగొనక పూర్వమెక్కడ ఉండేవి? ''అనాది'' అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా?ఉంటే, ఎక్కడ ఉండేవి? అంతరిక్షంలోనా?సృష్టితో బాటే వేదమంత్రాలు కూడా ఆవిర్భవించాయి అనుకొంటే, సృష్టికర్త వాటిని కూడా జగత్తుతో బాటే సృష్టించాడని అర్థం కాదా? అంటే, భగవంతుడు వేదాలను రచించి, ఋషులు క్రమంగా కనుగొనటానికి వీలుగా ఎక్కడైనా దాచిపెట్టాడా?అయినా, సృష్టితో బాటే వేదాలు కూడా ఉద్భవించాయంటే అవి ''అనాది'' ఎట్లా అవుతాయి? ఇప్పటి బ్రహ్మసృష్టిని కొలవటం సాధ్యమే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ యుగాలకు నిర్ణీతమైన కాల పరిమితు లున్నాయి. ఇటువంటి యుగక్రమాలు వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక పగలు క్రింద లెక్క. అట్లాగే ఇంకొక వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి.
ఈ విధంగా చూస్తే బ్రహ్మవయస్సిప్పుడు ఏభై సంవత్సరాలే. బ్రహ్మ ఆయుర్దాయం నూరు సంవత్సరాలు. ఈ బ్రహ్మకి పూర్వము మరొక బ్రహ్మ ఉండేవాడు. అందువల్ల ఇప్పటి బ్రహ్మా, అతని సృష్టీ 'అనాది' కాదు. అయితే ఏది ''అనాది''? పరమాత్మ అందరి బ్రహ్మలకంటే ముందే ఉండి ఉండాలి. బ్రహ్మం - అంటే నిరాకారుడైన భగవంతుడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఆయన నిత్యుడు. విశ్మమూ, పదార్థమూ సృష్టింపబడటమూ, లయ మొందటమూ ఆయన వల్లనే. పరమాత్మ తన సృష్టికార్యాన్ని బ్రహ్మతోనూ, సృష్టి సంస్థితిని విష్ణువుతోనూ, సృష్టిలయాన్ని శివునితోనూ చేయిస్తాడు. బ్రహ్మ, విష్ణు, శివులుకూడా లేకుండా పోతారు. అందువల్లనే బ్రహ్మ వయస్సుని లెక్కకట్టవచ్చు. తన నూరు బ్రహ్మవర్షాలూ ముగిసిన తరువాత బ్రహ్మ పరమాత్మలో లీనమవుతాడు. అప్పుడు మరొక బ్రహ్మ అందుకుంటాడు.
మళ్లీ వేదాల సంగతి చూద్దాం. పరమాత్మ వేదాలను, బ్రహ్మలకు పూర్వం, అంటే సృష్టికే పూర్వం, సృజించాడా? సృష్టికి పూర్వమే వేదాలుండేవనీ, బ్రహ్మ తన సృష్టిని శబ్దరూపంలో సంస్థితమై యున్న వేదమంత్రాలతోనే కొనసాగించాడనీ - శాస్త్రాలవల్ల మనకి తెలుస్తుంది. శ్రీ మద్భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు.
అంటే పరమాత్మా, వేదాలూ అనాది అనుకోవచ్చా? కొంచెమాలోచిస్తే ఇదీ తప్పేనని తోస్తుంది. జగత్సృష్టికి పూర్వమే పరమాత్మ వేదాలను సృష్టించాడనుకొంటే,అవేవీ సృష్టింపబడక పూర్వం కొంత కాలం గడచినట్టే కదా - అంటే జగత్సృష్టికి పూర్వం భగవంతుడు కాలాన్ని సృష్టించాడన్నమాట, ఆ తరువాతే వేదాలను సృష్టించి నట్టు అర్థం వస్తుంది, అటువంటప్పుడు వేదాలు ''అనాది'' అని ఎట్లా అనగలం?తానూ, వేదాలూ 'అనాది' అయితే భగవంతుడు వేదాలను సృష్టించి యుండలేడు. ఆయనే సృష్టించి ఉంటే వాటికి మొదలు అంటూ ఒకటి ఉంటుంది. అన్నీ ఈశ్వరసంభూతాలే.
ఈశ్వరునికి వెలుపల ఏమీ లేనందువల్ల - ఈశ్వరుడూ, వేదమూ ఒకరితో బాటు ఒకరు ఆరంభమంటూ ఏమీ లేకుండా ఉండి ఉండాలి. కాని ఇది సరియైనదిగా తోచదు. ఈశ్వరసృష్టి కాకుండా, ఈశ్వరుని పై ఆధారపడని ఉనికి లేకుండా, ''అనాది'' ఎట్లా సాధ్యం? ఈ గందరగోళానికి సమాధానము వేదములోనే యున్నది.
బృహదారణ్యక ఉపనిషత్తులో (2.4.10) ఇట్లా ఉంది. వేదం - ఋక్, యజుః, సామరూపాలలో - ఈశ్వరుని ''నిశ్వాసితం'' మాత్రమే. ''నిశ్వాసిత'' మన్న మాటకి అర్థం ఊపిరి విడవటమని. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్ముని ఊపిరేనన్నమాట.
ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడే అయితే, ఆయన యొక్క ఊపిరేఅయిన, వేదాలు కూడా అనాదే - ఆయనతో బాటే అవి సంస్థితమై ఉంటాయి. ఇక్కడ గమనించవలసిన విషయమిది : భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని. మన ఊపిరిని మనమే కల్పించుకొన్నామనలేం కదా. మనం పుట్టినప్పటి నుండీ ఊపిరి ఉంటూనే ఉంది. ఆ విధంగానే ఈశ్వరుడూ, వేదాలూను. ఆయన కూడా వేదాలను సృష్టించాడనలేము. రెండూ ఎప్పుడూ కలిసే ఉన్నాయి. వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తూ ఈశ్వరుడే నంటూ, ఆయన యొక్క ''నిశ్వాసమే వేదాల''ని స్తుతించాడు.
విద్యారణ్యులవారు భాష్యంలో తన గురువు వేదాలలో ఎట్లా లీనమై పోయారో వర్ణించటమే కాక వేదాలు ఈశ్వర సృష్టి కావని కూడ నొక్కి చెప్తారు.
గీతలో కృష్ణ భగవానుడు ''వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః'' అంటాడు - అంటే వేదాల వల్ల తెలియనగు వానిని నేనే అని అర్థం. అంతేకాదు, వేదాలను తాను సృష్టించిన వానిగా చెప్పుకొనక, వేదాంతానికి విషయమే తానంటాడు ''వేదాంతకృత్'' అంటాడు, ''వేదకృత్'' అనడు. వేదాలన్నీ తనకి తెలుసునంటాడు - వేదవిద్. వేదాంతంలో ఊహింపబడిన కేవలస్థితిలో సృష్టికి పూర్వమే ఈశ్వరుడూ, వేదాలూ కలిసి ఉండేవి.
గీతలో వలె భాగవత పురాణంలో కూడా వేదాలను భగవంతుడు కల్పించినట్లుగా ఎక్కడా లేదు. ఆయన హృదయంనుండి విస్ఫుట మయ్యాయని ఉంది. స్ఫుటమవటమంటే ఉన్నదేదో హఠాత్తుగా బయటపడటమని అర్థం. అంతకు పూర్వం లేనిది క్రొత్తగా వచ్చిందని అర్థం కాదు. మొట్టమొదటగా జనించిన బ్రహ్మే ఆది ఋషి. ఆయనకే అన్ని వేదమంత్రాలూ ఎరుక. ఈ ఎరుక కల్పించిందీ ఈశ్వరుడే. ఎట్లా? బ్రహ్మ నేర్చుకోవాలని ఉచ్ఛరించాడా? కాదు. తన హృదయం ద్వారా ఇచ్చాడు.
భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో ''తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే.'' అంటే ఈశ్వరునిలో వేదాలు ఎప్పుడూ, ఆయన శ్వాసగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈశ్వరుని సంకల్పం వల్ల బ్రహ్మకి వాటి గురించి ఎరుక కలిగింది. ఈశ్వరుని హృదయకంపనల మార్గ దర్శకత్వంలో తన సృష్టిని కొనసాగించాడు బ్రహ్మ. ఇది సాధ్యమా? కంపనలు అంత పని చెయ్యగలవా?
--(())--
please co-operativi and share
om
ReplyDelete