*తేదీ : 15-02-2021 సోమవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#సుమిత్రుని_కథ
పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగ గోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను.
పార్వతీ..! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురు పుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురు పుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లు పలికెను. గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని.. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ! నీవు నామాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించు కొనుము.. రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.
సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగా తీరము నకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచె ప్పిన యుపదేశము ను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట నొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించ దలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి.
సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకము కల్గును. మీరు పూజించునది యే దైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో నోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము.
సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘ మాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘ మాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘ మాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను దేషించువాడు, వీరందరును పాపాత్ములే సుమా.. మేము చేయుచున్న యీ మాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవునర్చించిన వాని పుణ్యo అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫల ప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగ వివరించెను.
సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడు దినములు మిగిలియున్నది. ఈ మూడు దినములును మాఘస్నాన మాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.
సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘ మాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము నారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణి యగు, శ్రీ హరి కృపా విశేషము నంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే గాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘ స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృ దేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠము నందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను..
ఇతి శ్రీ మాఘ పురాణే చతుర్థోధ్యాయః పారాయణం సంపూర్ణం...
--(())--
*బంధుపురాణం*
భార్యా పుత్రులు గత జన్మ తాలూకు రుణదాతలు. మనం ఎగేసిన బాకీలను వసూలు చేసుకునెందుకు వదలకుండా వెంటాడి సంసార చక్రబంధంలో ఇరికించి చక్రవడ్డీతో సహా బకాయిలు సుప్తా రాబట్టుకుంటే తప్ప వదిలిపెట్టని నక్షత్రక వంశ సంజాతలు- అన్నాడు వెనకటికి ఓ అప్పులు ఎంతకీ తీరని ఓ అప్పుకవి. ఆలుబిడ్డలనే అప్పులోళ్ల కింద చూపెట్టిన ఆ మహానుభావుడు మరి చుట్టపక్కాలను ఏ జాతిలో చేరుస్తారో .. తెలీదు!
లేనప్పుడు ఉండాలనిపించేది, ఉన్నప్పుడు తరిమికొట్టాలనిపించే జాతిలో ముందు వరసలో ఉండేది బంధువర్గాలే. బాబాయ్.. మామయ్యా, అత్తమ్మా, పిన్నమ్మా అంటూ ముత్తాతల దగ్గర్నుంచి మునిమనవళ్ల వరకు అందరూ దగ్గర ఉన్నప్పుడు అదో ధీమాగా ఉంటుంది.. కానీ బీమా పట్టానే తొందరగా పండే ప్రమాదం ముంచుకొస్తుంది. వచ్చినోళ్లందరికి భోజన, వసతి, వినోదాది సౌకర్యాలు సమకూర్చే బాధ్యత నిర్వహించే కొద్దీఆరంభంలో దేవుళ్లుగా సంతోషం కలిగించిన అతిధులు కాలం గడిచే కొద్దీ కాలయముడి దూతలు అనిపిస్తారు! పూర్వకాలంలో ఎవరూ ఇహ వద్దన్న విరక్తి స్థిరపడ్డ తరువాత ఏ కాశీకో వంటరిగా ప్రయాణం కట్టే సంప్రదాయం ఉండేది. 'కాశీకి పోయాను రామా హరీ! గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ!' అని వెనకటి పాత సినిమాలో రేలంగోడు కాషాయం ధరించి నటించినట్లు కాదు. అచ్చమైన సన్యాసం స్వీకరించి బంధు మిత్రులందరి మీదుండే అవ్యాజ ప్రేమసర్వాన్ని త్యజించి సన్యాసిగా రూపాంతరం చెందిన తరువాతనే శ్రీ శంకరులు హిందూమతాన్ని ఓ గాడిన పెట్టగిలిగింది.
కార్య సాధనకు బంధుమిత్రుల సహకారం అవసరం. కార్యవిఘాతానికీ బంధుమిత్రులే చాలా సందర్భాలలో కారణభూతం. ముఖ్యంగా రాజకీయాలలో. కష్టపడి పైకొచ్చిన జీవి కష్టపడుతూనే ఉంటాడా! ఆ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకొనే పరంపర ఒకటి పుట్టుకొస్తుంది. జాతీయ రాజకీయాలలో అత్యంత ప్రముఖ పాత్ర వహించి స్వాతంత్ర్య సముపార్జన అనంతరం ఆశేతు హిమాచల పర్యంతం బంధువర్గాన్ని సాధించుకున్న మహాత్మా గాంధీకి తన పెద్ద కుమరుడు రూపంలో ఒక బంధుత్వంలోని చేదుఅనుభవం జీవితాంతం వెంటాడింది.
భారతంలో శ్రీకృష్ణుణ్ని పాండవులు బంధువుగా భావించి గౌరవించారు. ఆ యదువంశజుడు కష్టమొచ్చినప్పుడు తనను తలచుకున్న వాళ్లందరిని ఏదో ఓ రూపంలో ఆదుకున్న ఆ పద్బాంధవుడే . ఆఖరుకు చిన్ననాటి గురుకుల చేల కుచేలుడుని కూడా బీదరికంతో తన దగ్గరకు వచ్చినప్పుదు నోరు విప్పి అడగక ముందే ఆదుకున్న ఔదార్యమూర్తి.
కొందరు బంధువులుగా ఉంటూనే వినాశనం నెత్తికి తెచ్చిపెడతారు. శకుని అందుకు చక్కని ఉదాహరణ. రామాయణంలో ఏ సంబంధం లేక పోయినా ఉడుత దగ్గర నుంచి, జటాయువు వరకు శ్రీరామ చంద్రుడిని కష్టకాలంలో ఆదుకున్నాయి. కానీ సుఖాలు అనుభవించవలసిన సుముహూర్తాన్ని సుదూర తీరాల దాకా తరిమి కొట్టింది తల్లి తరువాత తల్లంతటి పినతల్లి.. కైకేయి!
బంధువర్గాలు విస్తరిస్తే రాజ్యాలకు స్థిరత్వం ఉంటుందన్న దృష్టి కోణంలో గతంలో రాజులు తోటి రాజులతో పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధువర్గాలను పెంచుకునేవారు. యుద్ధంలో విజేతలైనా పరాజితుల వంశంలోని కన్యలను కళ్యాణమాడే పద్ధతి వెనక ఉన్న రహస్యం ,, తదనంతరం పరాజితులు ప్రతీకారేచ్ఛతో ఎదురుదాడికి దిగకుండా ఉండటమే. చరిత్రలో ఈ వ్యూహం అద్భుతంగా ప్రయోగించిన ఆచార్యుడు చాణక్యుడు.
బంధుత్వాలు మతం, కులం, జాతి ఒకేలా ఉండటం చూసుకునే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. ఉపాధుల కోసమై వలసలు పెరిగిన పంథొమ్మిదో శతాబ్దం నుంచే ఖండాతర బంధుత్వాలకు పునాది పడింది.
నవనాగరీక ప్రపంచంలో అంతార్జాల సమాచార విప్లవం పుణ్యమా అని జాత్యంతర వివాహాల మూలకంగా కొత్త రకం బంధుత్వాలకు రూప కల్పన జరగడం ఇప్పుడిప్పుడే ఆరంభమయింది.
ముందు ముందు గ్రహాంతర బంధుత్వాలకూ బీజాలు పడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా .. 'ప్రపంచమంతా నా వాళ్లు.. ప్రజలంతా నా బంధువులే' అంటూ విశ్వమానవత వెల్లివిరిసే మంచిరోజులు వస్తాయని ఆశిద్ధాం
*
✍కర్లపాలెం హనుమంతరావు
మహాభారతం 15 వ భాగం కురుపాండవుల జననం
----------------------____________---------------------------
ఒక నటుడు ఎంత ఉత్తముడు అయినప్పటికీ వ్యక్తిగతంగా అతను చాలా మంచివాడు అయినప్పటికీ కూడా నాటకంలో లో గల దుష్ట పాత్రను కూడా సమర్థవంతంగా చేస్తాడు.... చెయ్యాలి కూడా.... అప్పుడు అతడు తాను నటిస్తున్నాను అటువంటి జ్ఞానం అతనికి ఉంటుంది.
ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఒక్కడే అయిన పరమాత్మ తానే సృష్టి గా అందులోని పాత్రలు గా వెలుగుతున్నాడు.
ఈ జ్ఞానం ఆయనకు పరిపూర్ణంగా ఉంది అట్టి పరమాత్ముని నమస్కరిస్తూ కథ లోకి వెళ్తున్నాను
🌻🙏🙏🙏🙏🙏🙏🙏🌻
వైశంపాయనుడు చెప్పినది విని సంతోషించి తదుపరి వృత్తాంతమును తెలుపమని జనమేజయుడు కోరాడు వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు చెప్పసాగాడు
పిన తల్లి అయినా సత్యవతి ద్వారా సర్వ విషయాలు తెలుసుకున్న భీష్ముడు ధృతరాష్ట్రుడు పాండురాజు తో పాటు విధురుని కూడా చాల ఆధారంగా చూడసాగాడు
-ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు. ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరిన వారయ్యారు .క్రమంగా భీష్ముడు ధర్మ వేత్త అయిన విధురుని తో సంప్రదించకుండా ఏ పని చేసేవాడు కాదు .
భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గాంధారదేశ రాజకుమారి గాంధారి దృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు . గాంధారికి నూరుగురు పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని దృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపక పోయినా సుబలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు.
సుబలుడు
గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్నా రాజ్యము. ఇందు పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామా చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము.మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను.గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు.
భీష్ముని ఊహల్లో ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అది ఏమిటంటే కురువంశం బాగుగా అభివృద్ధి చెందాలని. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ప్రమాదం నుండి బయట పడింది.. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో ఉంది. , గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.
ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాన్దారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును.
( Note :- ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైదవ్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాన్దారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే,వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు.పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది. )
గాంధారి ధృతరాష్ట్రుల కళ్యాణం నిశ్చయమైంది ఈ సందర్భంగా సుబలుడు తనకు ఇంకొక పది మంది కుమార్తెలు ఉన్నారని వారిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను అని కోరాడు భీష్ముడు అంగీకరించాడు ఒకే ముహూర్తంలో 11 గురు అక్కాచెల్లెళ్లను పెండ్లాడాడు అనంతరం మరో వందమంది రాజకుమార్తెలను కూడా తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్ళి చేశాడు .111 మంది భార్యలే కాకుండా దృతరాష్ట్రుడు ఒక వైశ్య కన్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు ...దృతరాష్ట్రుడి సంసారం అలా వర్ధిల్లింది.
ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరి తేరాడు. వేదాలూ, శాస్త్రాలూ, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. భీష్ముడు పాండురాజుకు వివాహంచేయ నిశ్చయించుకున్నాడు.
కుంతీదేవి
యాదవ రాజైన శూరుడు తన కుమార్తె పృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు సంతానం లేని కారణంగా పెంచు కునేందుకు ఇచ్చాడు. ఒక రోజు కుంతి భోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంత కాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు. కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు. ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది. దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు. ఒక రోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు రాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా నీవంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది. కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించినా వినక తన దర్శనం మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు. ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది. లోకోపవాదుకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆకుమారుని ఆ పేటికకలో పెట్టి గంగా నదిలో ఒదలి వేసింది. సహజ కవచకుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది. నదిలో తేలుతూ పోతున్న ఆపేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆబాలుని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. బంగారము మణులతో దొరికినందు వలన అతనికి వశుషేణుడు అని పేరు పెట్టి పెంచు కుంటున్నారు.
కుంతీ మాద్రి పాండురాజుల వివాహం
----------------------------------------------------
కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయం వరం ప్రకటించాడు. స్వయంవరంలో పృధ పాండురాజుని వరించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆతరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పాండురాజు ద్విగిజయ యాత్ర చేసి నాలుగు దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేసాడు. పాండురాజు నూరు అశ్వమేధ యాగాలు చేసాడు.
పాండురాజుకు శాపం
------------------------------
ఒక రోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు.ఆయనతో కుంతి మాద్రి కూడా వెళ్ళారు.ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసిగి చివరకు ప్రణయకలాపంలో ఉన్న జింకలపై బాణం వేసాడు. అందులో ఆడుజింక చనిపోగా మగజింక పాండురాజుని చూసి " రాజా వేటాడుట రాజుల ధర్మం అయినా పరుగెత్త లేనివి, రోగంతో బాధపడేవి, ప్రణయకలాపంలో ఉన్నవి అయిన జంతువులను వేటగాడు కూడా కొట్టడు. అన్ని ధర్మాలు తెలిసిన రాజువు ఇలా కొట్టావు కనుక నీవు భార్యలను చేరిన మరుక్షణం మరణిస్తావు " అని శపించి మరణించింది. ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తనదగ్గర ఉన్నవి అన్నీ దానం చేసి భార్యలను చూసి మీరు కూడా హస్థినాపురం వెళ్ళండి అన్నాడు. వారు వెళ్ళటానికి నిరాకరించి భర్తతోనే ఉండి పోయారు. పాండు రాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకుని ముని వృత్తిని అవలంబించి తపసు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఒక రోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు. ఋషులు వారిని చూసి ఇవి దేవ మార్గాలు వీటి వెంట మీరు రాలేరు అన్నారు. పుత్రులు లేరు కనుక తను వెళ్ళడానికి తగనివాడని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు. వారు దివ్యదృష్టితో చూసి " పాండురాజా నీకు సంతాన యోగం ఉన్నది సంతానం కోసం ప్రయత్నించు " అని చెప్పారు.
పాండురాజు కోరిక
--------------------------
స్త్రీ సంగమం జరిగితేనే చాలు ప్రాణం పోతుందని మునిశాపం ఉండగా తను తండ్రి ఎలా కాగలడు ?! ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు పాండు రాజుకి... ఆలోచించగా ఆలోచించగా చివరకు తన జన్మ యే తనకు జవాబు గా నిలిచింది. వెంటనే కుంతిని ఏకాంతానికి పిలిచి " పృధా ! తనవల్ల పుత్రుడు కలిగే అవకాశం లేనప్పుడు భార్య కు ఉత్తమ పురుషుని ద్వార కూడా సంతానం పొందవచ్చని ధర్మం చెప్పాడు. అపుత్రస్య గతిర్నాస్తి అన్న సూక్తి నీకు తెలిసినదే కదా.. అందువల్ల ఉత్తమ పుత్ర ప్రాప్తి కోసం ఎవరైనా మహాపురుషుని వల్ల నాకు వారసులను ఇవ్వగలరని చెప్పాడు.
పాండవ కౌరవ జననం
--------------------------------
పాండురాజు ఆవేదనకు విచలిత అయిన కుంతీ దేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్పింది. కాని కర్ణుని జననం తప్ప అంతా వివరించింది. కుంతి ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏదేవత సాయంతో సంతానం పొందాలో ఆనతివ్వమని పాండురాజుని అడిగింది. పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుని పొందుము . అలా భర్తచేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుని కన్నది. అతనికి యుధిష్టురుడు అని నామకరణం చేసాడు. ఋషులు అతను కురు వంశానికి రాజై ధర్మ బద్దంగా రాజ్యం చేస్తాడు అని పలికారు. హస్థినలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు. పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సాయంతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతి వాయుదేవుని సాయంతో కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది. హస్థినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. ఒక్కోరోజుకు ఒక్కో కుమారుడు కలిగారు. నూరుగురు కుమారులు జన్మించిన తరువాత దుస్సల అనే కుమార్తె జన్మించింది. దుర్యోధనుని జనం తరువాత గోచరించిన దుశ్శకునాలను చూసిన భీష్మ, విదుర, పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయ కారకుడని అతనిని వదిలి వేసి అందర్ని రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు. కానీ పుత్రుని మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి అనుమతించలేదు.
భీముని బలం
----------------------
కుంతీ దేవి ఒకసారి భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతున్న తరుణంలో ఒక పులి ఆమె మీదకు ఉరికింది.పాండురాజు దానిని చంపేలోగాకుంతీ భీముని ఒక బండరాతిపై జారవిడిచింది కేవలం పది రోజుల శిశువు పడగానే ఆ రాళ్ళు పొడి పొడి అయ్యాయి. భీముని బలానికి పాండురాజు ఆశ్చర్య పడ్డాడు. దృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు కలిగారని విని పాండురాజుకు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అతడు దేవేంద్రుని గురించి తపసు చేసాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించ కలిగిన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీ దేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతీ దేవికి ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతను కార్తవవీరార్జ్యునికంటే వీరుడౌతాడు. కనుక అర్జునుడని పిలువబడుతాడు " అని పలికింది. కుంతీదేవి గాంధారి సంతాన వతులైన తరువాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్ర మహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు. కుంతీ మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకులసహదేవులను పొందింది.
పాండురాజు మరణం మాద్రి సహగమనం
---------------------------------------------------------
పాండురాజు భార్యలతో పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒక వసంత కాలం సమయంలో ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై బలవంతంగా ఆమెను చేరాడు. ఆ పై శాపకారణంగా మరణించాడు. ఇది చూసిన మాద్రి భయంతో ఒణికి పోతూ భర్త శవాన్ని చూసి రోదించ సాగింది. అక్కడకు వచ్చిన కుంతీ దేవి జరిగిన విషయం గ్రహించి సహగమనానికి సిద్దపడింది. కానీ మాద్రి అందుకు అంగీకరించలేదు. భర్త తన వలన మరణించినందున తాను సహగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్ధురాలైన కుంతికి ఐదుగురు పుత్రులను కాపాడే బాధ్యతను అప్పగించి తాను భర్తతో సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడి మునులు సహకరించి వారిని తీసుకుని హస్థినాపురానికి వెళ్ళారు. పాండురాజు కుమారులను చూడటానికి హస్థినాపురం ప్రజలు తరలి వచ్చారు. దుర్యోధనుడు తన తమ్ములతో పురోహిత సమేతంగా ఎదురువచ్చి వారిని సాదరంగా తీసుకు వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, అంబిక, అంబాలిక వారికెదురు వచ్చి మునులకు నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి పాండు కుమారులను ఎత్తుకుని ముద్దాడారు. మునులు కుంతీ సహితంగా పాండు కుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త మాద్రి సహగమన వార్తను చెప్పారు. ఆ తరువాత భీష్ముడు పాండుసుతులతో పాండురాజుకు ఉత్తర సంస్కారం చేయించాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో "అమ్మా దృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి "అని చెప్పాడు. సత్యవతి అంబిక, అంబాలికలను తీసుకుని తపోవనానికి వెళ్ళింది. కాక్రమేణా ఆ ముగ్గురు స్వర్గస్థు లైయ్యారు. ధృతరాష్ట్రుడు తన కుమారులను తమ్ముని కుమారులను భేదభావం లేకుండా పెంచుతున్నాడు. భీముడు తన బలంతో దుర్యోధనుని తమ్ములను ఆటలలో ఓడిస్తూ ఉండటం దుర్యోధనునికి సహింపరానిది అయింది. అతని బలసంపన్నతకు ఈసు భయంకలిగిన దుర్యోధనుడు మేనమామ తమ్ముడు దుశ్శాననుడు, శకునితో చేరి కుటిలోపాయాలు ఆలోచించ సాగారు. భీముని చంపి ధర్మరాజుని చెరలో పెట్టితే కానీ తనకు రాజ్యం దక్కదని అనుకున్నాడు. దీనికి శకుని వంత పాడాడు. ఒకరోజు పిల్లలంతా జలక్రీడలలో మునిగి తేలి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో దుర్యోధనుడు తమ్ములతో చేరి భీముని తీగలతో కట్టించి గంగానదిలో త్రోయించాడు. భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలన్నీ పటాపంచలైనాయి. మరొక రోజు దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముని నల్ల త్రాచులతో కరిపించాడు. భీముని వజ్రశరీరాన్ని ఆ పాముకోరలు ఛేదించ లేకపోయాయి. ఒకరోజు దుర్యోధనుడు భీమునికి కాలకూట విషం ఆహారంలో కలిపి తినిపించాడు. భీ ముడు ఆ ఆహారాన్ని జీర్ణించుకున్నాడు. భీష్ముడు కుమారులందరికి విద్యను మొదట క్రుపాచార్యుడు వద్ద ఆ తరువాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించ సాగాడు. అప్పుడు జనమేజయుడు మహర్షీ క్రుపాచార్యుడు, ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం తెలుపగలరా అని వైశంపాయనుని అడిగాడు.
కౌరవుల నామధేయాలు
---------------------------------
|1. దుర్యోధనుడు, 2. దుశ్శాసనుడు, 3.దుస్సహుడు 4.దుశ్శలుడు, 5.జలసంధుడు, 6. సముడు, 7.సహుడు, 8. విందుడు, 9. అనువిందుడు, 10.దుర్దర్షుడు, |11.సుబాహుడు, 12.దుష్పప్రదర్శనుడు, 13.దుర్మర్షణుడు, 1 4.దుర్ముఖుడు, 15.దుష్కర్ణుడు,16. కర్ణుడు,17. వివింశతుడు,18. వికర్ణుడు,19. శలుడు 20.సత్వుడు, |21.సులోచనుడు, 22.చిత్రుడు, 23.ఉపచిత్రుడు, 24.చిత్రాక్షుడు, 25.చారుచిత్రుడు, 26.శరాసనుడు, 27.దుర్మధుడు, 28.దుర్విగాహుడు, 2 9.వివిత్సుడు, 30.వికటాననుడు, |31.నోర్ణనాభుడు, 32.సునాభుడు, 33.నందుడు, 34.ఉపనందుడు, 35.చిత్రాణుడు, 36.చిత్రవర్మ, 37.సువర్మ, 38.దుర్విమోచనుడు, 39.అయోబాహుడు, 40.మహాబాహుడు, |41.చిత్రాంగుడు, 42.చిత్రకుండలుడు, 43.భీమవేగుడు, 44.భీమలుడు, 45.బలాకుడు, 46.బలవర్ధనుడు, 47.నోగ్రాయుధుడు, 48.సుషేణుడు, 4 9.కుండధారుడు, 50.మహోదరుడు, |51.చిత్రాయుధుడు, 52.నిషింగుడు, 53.పాశుడు, 54.బృందారకుడు, 55.దృఢవర్మ, 56.దృఢక్షత్రుడు, 57.సోమకీర్తి, 58.అనూదరుడు, 59.దృఢసంధుడు, 60.జరాసంధుడు, |61.సదుడు, 62.సువాగుడు, 63.ఉగ్రశ్రవుడు, 64.ఉగ్రసేనుడు, 65.సేనాని, 66.దుష్పరాజుడు, 67.అపరాజితుడు, 68.కుండశాయి, 69.విశాలాక్షుడు, 70.దురాధరుడు, |71.దుర్జయుడు, 72.దృఢహస్థుడు, 73.సుహస్తుడు, 74.వాయువేగుడు, 75.సువర్చుడు, 76.ఆదిత్యకేతుడు, 77.బహ్వాశి, 78.నాగదత్తుడు, 79.అగ్రయాయుడు, 80.కవచుడు, |81.క్రధనుడు, 82.కుండినుడు, 83.ధనుర్ధరోగుడు, 84.భీమరధుడు, 85.వీరబాహుడు, 86.వలోలుడు, 87.రుద్రకర్ముడు,88.దృఢరదాశ్రుడు, 89.అదృష్యుడు, 90.కుండభేది, |91.విరావి, 92.ప్రమధుడు, 93.ప్రమాధి, 94.దీర్ఘరోముడు, 95.దీర్ఘబాహువు, 96.ఊడోరుడు, 97.కనకద్వజుడు, 98.ఉపాభయుడు, 99.కుండాశి, 100.విరజనుడు. నూట ఒకటవ కుండనుండి దుస్సల అనే ఆడపిల్ల జన్మించింది.
మిత్రులందరికీ శుభ శుభోదయం
--(())--
*జాజిలి*
పూర్వము జాజిలి అనే తపస్వి వుండేవాడు.అతను చాలాకాలం ఘోరమైన తపస్సు చేశాడు.
ఎండనక వాననక కదలక మెదలక కూచుని,నిల్చుకొని తపస్సు చేశాడు.అతను చెట్టు
అనుకొని పక్షులు ఆయన జడలలో గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టడం కూడా ప్రారంభించాయి.గుడ్లు పిల్లలై యెగిరి పొతుం డేవి.పిచ్చుకలు తన తలపై గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నా తాను నిశ్చలంగా తపస్సు చేసుకో గలుగుతున్నానని,తనది గొప్ప తపస్సు అనే అహంకారం
అతనిలో కలగసాగింది.ఒకనాడు అతనికి యిలా ఆకాశవాణి వినిపించింది.
నీవేమో గొప్ప తపస్వినని గర్వపడుతున్నావు. కాశీ పట్నం లో తులాధారుడు అనే సామాన్య వ్యాపారి నీ కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు జ్ఞాన వృద్ధుడు.అతన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు.అని
జాజిలికి చాలా ఆశ్చర్యం కలిగింది.తన తపశ్శక్తి తో ఆకాశమార్గాన కాశీ పట్నం చేరి
తులాధారుడింటికి బయల్దేరాడు.జాజిలి అంత దూరం లో ఉండగానే తులాధారుడు ఎదురుగా వచ్చి అతనికి స్వాగతం చెప్పి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు.పిచ్చుకలు మీ జడలలో నివాసం ఏర్పరుచు కున్నంత మాత్రాన మీరు ఎంతో గొప్పవాడినని గర్వించి చిత్త వికారాన్ని పొందారు. యింత చిన్న సంఘటనకే మీకు చిత్తచాంచల్యం కలిగితే
మీరు ఏమి తపస్సు చేసినట్లు?అన్నాడు.
అతని పలుకులతో గర్వము మటుమాయం కాగా జాజిలి నమ్రభావం తో తులాధారునికి నమస్కరించి మహాత్మా సామాన్య సంసారి అయిన మీకు యింతటి తపశ్శక్తి ఎలా కలిగింది?తెలియజేయండి.అని ప్రార్థించాడు.తులాధారుడు జాజిలికి యిలా జ్ఞానబోధ చేశాడు.
నేను చేసే వృత్తిలో కేవలం నా కుటుంబ పోషణకు చాలినంత మాత్రమే సంపాదిస్తాను.
నేను అమ్మినా కొన్నా తూనికల్లో గానీ,ధరల్లో గానీ మోసం చెయ్యను న్యాయంగా సంపాదిస్తాను.ఎక్కువ లాభాలు తీసుకొను.అహంకార మమకారాలకు అతీతంగా వుంటూ
తామరాకు పైన నీటి బిందువు వలె అసంగుడనై తృప్తి తో ధర్మయుక్తంగానా మనస్సును స్వాధీనం లో వుంచుకొని జీవిస్తున్నాను.యిదే నా తపస్సు.నేనే చేసే సాధనలో మీకు ఏమైనా సందేహముంటే నీ జడల్లో కాపురముంటున్న పిచ్చుకలను అడుగు.అన్నాడు.
పిచ్చుకలు తులాధారుడు చెప్పింది నిజము.గర్వము,మాత్సర్యము వున్న మనసులో
హింస వుంటుంది.హింస అంటేనే అధర్మం.అంటూ యెగిరి పోయాయి.
తులాదారుని ఉపదేశం తో గర్వాన్ని త్యజించి సవినయుడై అతనికి నమస్కరించి
నిజమైన తపస్సు ఏదో.నిజమైన యోగి అంటే ఎవరో తెలుసుకొని వెళ్ళిపోయాడు.
'జ్నేయస్సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి'అని గీత బోధిస్తున్నది.ఎవరిలో ద్వేషము,కాంక్ష వుండదో,ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తాడో అతనే నిజమైన సన్యాసి యోగి అని భగవద్గీత వుద్ఘాటిస్తుంది.
కాషాయవస్త్రాలు ధరించి,జడలు పెంచి అడవుల్లో తపస్సు చేసినంతమాత్రాన యోగి కాలేడు.ఎవరిలో ద్వేషభావము వుండదో,ఎవరు కరుణా పూరిత హృదయులో,ఎవరు మమకార,అహంకారములు లేకుండా వుంటారో సుఖ దుఃఖముల యెడ సమభావంతో
మెలుగుదురో,ఎవరు క్షమాగుణ సంపన్నులో వారే నిజమైన యోగులు,సన్యాసులు.
ఇది మా నాన్నగారు పాణ్యం రామనాథ శాస్త్రి గారు సంకలనం చేసి ముద్రించిన"
ఆధ్యాత్మిక కథలు' అనే పుస్తకము లోనిది.
*
*కవులకు సత్కారం* !
పూర్వం ఒక గ్రామంలో ముగ్గురు కవి పండితులు ఉండే వారు. వారు ముగ్గురూ చక్కని కవిత్వం చెబుతూ చుట్టు ప్రక్కల గ్రామాలలో మంచి పేరు సంపాదించు కున్నారు. కానీ , వారిని పేదరికం వెంటాడుతూ ఉండేది. తమ రాజ్యాన్ని పాలించే రాజుని దర్శించుకుని, ప్రభువుల ఆశ్రయం పొందితే తప్ప , వారి దారిద్ర్యం తీరదని ఎవరో సలహా చెప్పారు.
‘‘ మనబోటి వారికి రాజాశ్రయం దొరకడం దుర్లభం ! వెళ్ళడం వృధా ప్రయాస ! ’’ అని, ఒక కవి నిరాశగా అన్నాడు.
మరొక కవి, ‘‘ మన కవిత్వం గొప్పతనం విని, ప్రభువుల వారే మనల్ని ఆహ్వానించి సత్కరించాలి. అంతే తప్ప, మనంతట మనం వెళ్ళడం ఏమిటి !’’ అని వాదించాడు.
మూడో కవి వారిని బ్రతిమలాడి, ఎలాగో వారికి నచ్చ చెప్పి, రాచ నగరుకి బయలుదేర దీసాడు. కవులు ముగ్గురూ రాచ నగరుకి వెళ్ళి, అక్కడ వో సత్రంలో బస చేసారు. రాజ దర్శనం అనుకున్నంత తేలికగా లభించదని వారికి అర్ధం కావడానికి అట్టే రోజులు పట్ట లేదు !
మొదటి కవి , ‘‘ ఇక రాజు గారి దర్శనం దొరకడం వట్టి మాట ! నేను ముందే చెప్పాను కదా ... నేను మన గ్రామానికి తిరిగి వెళ్ళి పోతున్నాను. ’’ అన్నాడు. రెండో కవి ‘‘ నేనూ ముందే చెప్పాను కదా ! మనంతగా మనం రాజ దర్శనానికి రావడంసరికాదని. అలా చేస్తే లోకువ అయి పోమూ ! మనం ఇక్కడకి రావడమే తెలివి తక్కువ. నేను తిరిగి మన గ్రామం వెళ్ళి పోతున్నాను. ’’ అన్నాడు. ఆ ఇద్దరు కవులూ గ్రామానికి వెళ్ళి పోయాక, మూడో కవి మాత్రం అక్కడే ఉండి, రాజ దర్శనం కోసం ఓపికగా నిరీక్షించ సాగేడు.
వేగుల వలన రాజు ఈ ముగ్గురు కవుల గురించి విన్నాడు. ముదుంగా గ్రామం నుండి మొదటి కవిని సభకి పిలిపించాడు. అతని కవిత్వం సాంతం వినకుండానే అతనికి కొద్దిపాటి ధనం యిచ్చి, పంపించివేసాడు. తర్వాత, గ్రామం నుండి రెండో కవిని పిలిపించి, అతని కవిత్వం పూర్తిగా విని ఆస్వాదించి, అతనికి గొప్ప బహుమానాలు ఇచ్చి. సత్కరించి పంపించాడు. ఆ తర్వాత, మూడో కవిని
అతను బస చేసిన సత్రానికి భటులను పంపి. సభకు రప్పించాడు.అతని కవిత్వం కొంచెం విని, తొలి కవికి ఇచ్చిన దానికన్నా కొంత ధనం ఎక్కువ ఇచ్చి పంపించాడు.
ఇదంతా గమనిస్తున్న మహా మంత్రి రాజుతో ‘‘ ప్రభూ ! ఈ ముగ్గురు కవులలో ఏ ఒక్కరూ తక్కువ ప్రతిభావంతులు కారు. ముగ్గురి కవిత్వమూ ఒక్కలాగే రసవంతంగా ఉందికదా ! వారికి కానుకలు ఇవ్వడంలో ప్రభువులు వివక్ష చూపించడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. అదేదో చెబితే వినాలని ఉంది. అనుగ్రహించండి ! ’’ అన్నాడు వినయంగా.
రాజు నవ్వుతూ మంత్రితో ఇలా చెప్పాడు : ‘‘ మీరన్నట్టు ముగ్గురు కవులూ సమాన ప్రతిభావంతులే ! సందేహం లేదు. కానీ, మొదటి కవి ఒట్టి నిరాశా వాది. తన మీద తనకే నమ్మకం లేదు. అందు చేత, ఎప్పటికయినా అతని కవిత్వంలో పస తగ్గి పోయే వీలుంది. మూడో కవి చాలా ఓర్పు కల వాడు. అతనికి ఏ కొంచెం ఇచ్చినా, పొంగి పోయే రకం. మరిన్ని కానుకల కోసం, మెప్పు కోసం కవిత్వం వ్రాస్తూనే ఉంటాడు. కానీ మానెయ్యడు. ఇక, రెండో కవి గొప్ప ఆత్మాభిమానం ఉన్న కవి. కవులు నిరంకుశులు. అచంచల మయిన ఆత్మాభిమానం ఉంటుంది. రెండో కవి అలాంటి వాడే. అతనికి సత్కారం చేయడంలో లోటు జరిగితే, ఆ కోపంతో ఇక మీదట కవిత్వ రచనకే స్వస్తి చెప్పే ప్రమాదం ఉంది ! అందుకే ముగ్గురు కవులనూ సత్కరించడంలోనూ, కానుకలు ఇవ్వడంలోనూ కావాలనే అలాంటి వివక్ష చూపించాను. వారు తమ ధోరణి మార్చు కున్నాక, ఈ తడవ ముగ్గురికీ సమాన సత్కారాలు చేస్తాను. ’’ అని వివరించాడు.
రాజు గారి మాటలతో సభ సంతోషంతో కరతాళధ్వనులతో మారు మ్రోగి పోయింది !
**
: *మానవత్వం
మానవుడిగా పుట్టినందుకు కలిగి ఉండాల్సింది మానవత్వం. తోటివారి కష్టాలను, తన కష్టాలుగా ఎంచేది, తోటివారి ఆనందమే తన ఆనందంగా భావించేదే ఈ సుగుణం. మానవత్వం అస్సలు లేనివాడే దానవుడు. అతడే చరిత్ర హీనుడు. చరిత్రలో రెండు రకాల వారిని చూస్తూంటాం. పదిమందికీ అన్నం పెట్టేవారిని, పదిమంది ప్రాణాలు నిలిపేవారిని. అలాగే పరులకు హాని తలపెట్టేవారిని, పరుల ప్రాణాలు తీసేవారిని. మానవత్వ సుగుణమున్నవారు పరసమృద్ధి కోరుకుంటాడు. సహజ పరిమళాలు వెదజల్లే గంధపు చెక్క ఎక్కడ ఉన్నా సువాసనలు వెదజల్లుతుంది. మానవత్వం కలిగినవాడు పరిమళిస్తూనే స్నేహ సౌహార్ద్రత కలిగి ఉంటాడు. ఎలాంటి సమయంలోనూ మానవతను కోల్పోడు. ఈ శరీరం పరోపకారార్ధమే అనే భావనతో ఉంటాడు. దధీచి తన వెన్నెముకను ఇంద్రుడికి వజ్రాయుధం కోసం ఇచ్చాడు. శిబి చక్రవర్తి పక్షి కోసం తన మాంసం కోసి ఇచ్చి ప్రాణం
రక్షించాడు రోడ్డున వెళ్తుంటే ఎవరైనా ఎండ వేడిమి తాళలేక పడిపోతే గుమిగూడి చూసేవారే ఎక్కువ కానీ- తక్షణం సపర్యలు చేసేవారు, ప్రాణాపాయ స్థితినుంచి కాపాడేవారు మనలో ఎంతమంది ఉంటారు? అనుకోని దుర్ఘటన జరిగితే ఆదుకొనే వారెంతమంది ఉంటారు? ఆపన్నులకు ఆ క్షణంలో అండగా నిలవాలి. రక్తం దొరక్క ప్రాణంపోయే స్థితిలో ఉన్న రోగికి ప్రాణదానం చేయాలి. నీ దేహంలోని రక్తం మరొకరి ప్రాణాన్ని నిలుపగలిగినందుకు సంతోషించాలి
నీరుకు నీవేమిచ్చావని నీ దాహం తీరుస్తుంది. చెట్లకు నీవేమిచ్చావని ఫలాలనందిస్తున్నాయి. సూర్యచంద్రులకు
నీవేమిస్తున్నావని వెలుగులనిస్తున్నారు. నీవేమిస్తున్నావని గాలి నీ ప్రాణం నిలుపుతోంది.. ప్రకృతిని పరిశీలిస్తే మానవత్వమే దైవత్వంలా బోధపడుతుంది.
దేవుడెక్కడో లేడు. ఎదుటివారి ఎదలోనే,నీ సాయంతో "వారిలో కలిగే ఆనందంలోనే దైవం దర్శనమిస్తాడు. నీ స్తోత్రాలకు సైతం సంతోషించని దేవుడు ఎదుటివారి కష్టసుఖాల్లో నువ్వు పాలుపంచుకొన్నప్పుడే సంతోషిస్తాడు
తోటివారి కష్టాలను తన కష్టాలుగా చూసినవాడు తోటివారి సంతోషమే తనదిగా ఎంచినవాడే మానవుడు. ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు చూసినా ఎన్ని గుండాలు మునిగినా... పరోపకార పరిమళత్వం లేనివాళ్ల మానవ జన్మ నిస్సారమే అవుతుంది.
ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణమిది. సంపాదించినదేదీ మనతో తీసుకుపోలేం. అందుకే ఉన్నదానిలోనే నలుగురికి సహాయం చేసే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు కలిగే ఆనందంలో నీకు దైవమే దర్శనమిస్తాడు. ఎదుటివారితో మనసారా మాట్లాడు! లోపల ఒకటి, బయట మరొకటి కాకుండా నిర్మలత్వంగా ఉండు! ప్రపంచమంతా ఆనందంగా ఉండాలనే కాంక్షతోనే చూడు. శక్తివంచన లేకుండా ఎదుటివారికి సహకరించు
మదర్ థెరెసా తన బాల్యంలో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లిందొకసారి. మాస్టారు కారణం అడిగారు. 'ఒక గుడ్డివాడు రోడ్డు దాటుతుంటే, అతని కష్టాన్ని చూడలేక అతనికి తోడుగా నిలిచి, రోడ్డు దాటించి వచ్చాను' అంది. పువ్వు పుట్టగానే పరిమళించడమంటే అదే మానవతామూర్తులందరూ వారు తమ సుఖాలను కోరుకోరు. ఎదుటివారి కష్టాల్లో అండగా నిలిచి, వారికి ఆనందం కలిగిస్తారు. ఎదుటివారి సుఖదుఃఖాల్లోపాలుపంచుకొనేవాడే అసలైన మానవుడు. అతడే మానవత్వం పరిమళించే మానవతామూర్తి.
*
*జిజ్ఞాసువు*
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుంటూ జ్ఞానమార్గంలో నిరంతరం పయనించడమే జిజ్ఞాసువు లక్షణం. అనుక్షణం జ్ఞాన సముపార్జన దిశగా అడుగులేసేవారు మేథావులుగా రూపుదాల్చుతారు. అనేక జిజ్ఞాసువుల అన్వేషణా శ్రమ ఫలితమే మానవాళి పొందిన సదుపాయాలు, సౌకర్యాలు.
జిజ్ఞాస పెంచుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో కారణం దోహద పడుతుంది. ముసలితనం,రోగం, మరణం అరికట్టడానికి మార్గాలు అన్వేషిస్తూ సన్యాసిగా మారి ధ్యానించిన ఫలితమే సిద్ధార్థుడికి కలిగిన జ్ఞానోదయం. గౌతమ బుద్ధునిగా జగతికి జ్ఞాన వెలుగులు పంచి పూజలు అందుకుంది.
ఇష్ట దేవత కోసం తయారు చేయించిన స్వర్ణ కిరీటంలోని బంగారంలో కల్తీ జరిగినట్టు అనుమానించిన సిసిలీ రాజు హీరాన్ , కిరీటాన్ని చెడగొట్టకుండా కల్తీని తేల్చమని ఆర్కిమెడిస్ ను ఆదేశించాడు. అదే విషయమై నిరంతర ఆలోచనలతో గడుపుతున్న ఆర్కిమెడిస్ పరధ్యానంలో నడుస్తూ స్నానాల తొట్టెలో జారిపడడం, తొట్టెలో మునిగినప్పుడు కొంత నీరు బయటికి పోతున్నట్లు గ్రహించడం, వెనువెంటనే ‘యురేకా’ అని అరుస్తూ వీధుల్లో పరుగెత్తడం జరిగాయి. ఆర్కిమెడిస్ లోని జిజ్ఞాస రాజుకు సమాధానమిచ్చి ‘ ఆర్కిమెడిస్ సూత్రం’గా ప్రఖ్యాతి గాంచింది.
‘వేయి ప్రశ్నలుండు విజ్ఞానవేత్తకు, ప్రశ్నలుండబోవు పామరునకు, విజ్ఞుడౌను నరుడు జిజ్ఞాస చేతనే’ అన్నట్టు ప్రశ్నించే తత్వం అలవరచుకుని అద్భుతాలు సాధించిన వారున్నారు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాబీకి నోబెల్ బహుమతి లభించినప్పుడు విలేకరి విజయ రహస్యం అడిగాడు. ‘తన తల్లి’ అని చెప్పాడు రాబీ.
‘అదెట్లా’ అన్నాడా విలేకరి.
‘పాఠశాల నుండి తిరిగి వెళ్లేసరికి ‘ఉపాధ్యాయుని ఏమైనా ప్రశ్నించావా’ అని అడిగేది అమ్మ. ప్రశ్నించాలంటే నేను ఆలోచించాలి కాబట్టి ఆలోచనలకు పదును పెట్టేవాడిని. నా తల్లి నేర్పిన ప్రశ్నలడిగే తత్వమే నోబెల్ బహుమతికి కారణమన్నాడు’ రాబీ.
‘బంగారం సంపాదించే కంటే జ్ఞానాన్ని సంపాదించడం మేలని’ గ్రహించిన జిజ్ఞాసువులెందరో చరిత్ర పుటల్లో స్థానాన్ని దక్కించుకున్నారు. వైఫల్యాలు ఎదురైనా చలించక 1300 వస్తువులు కనిపెట్టిన ఎడిసన్ , పది కళల్లో నిష్ణాతుడైన లియా నార్డోడావిన్సీ, సదుపాయాలు లేని రోజుల్లో గణిత సిద్ధాంతా లందించిన పైథాగరస్, నత్తిని అధిగమించి అద్భుత ఉపన్యాసకుడైన చర్చిల్, వారాలబ్బాయి నుండి ఐసిఐఎల్ స్థాపన వరకెదిగిన ఏ.ఎస్. రావులు ఉత్తమ జిజ్ఞాసువులు.
‘కఠినంగా ఉన్నదాన్ని సరళంగానూ, సరళంగా ఉన్నదాన్ని అలవాటుగానూ, అలవాటుగా ఉన్నదాన్ని ఆహ్లాదంగానూ తయారు చేసుకున్నప్పుడే విజయం సులభమని’ గ్రంథాలు చెప్పినట్టు జిజ్ఞాసువులైన మానవులు నూతన విషయాలు ఆకళింపు చేసుకుని జగత్ప్రయోజన కార్యాలు చేపట్టినప్పుడే మానవాళికి సంతోషం.
*[14:16, 15/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 15.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 15.
*My child, what I want is muscles of iron and nerves of steel, inside which dwells a mind of the same material as that of which the thunderbolt is made. Strength, manhood,
Kshatra-virya + Brahma-teja...this I want.*
నాయనా! నాకు కావలసింది ఇనుప కండలు, ఉక్కు నరాలు. వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు, బలం, పౌరుషం, క్షాత్రవీర్యం, బ్రహ్మతేజం - ఇవి నాకు కావల్సింది.
🕉🌞🌎🌙🌟🚩
[14:16, 15/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
ఒక మనిషికి సత్కీర్తి ఎంతకాలముంటుందో అంతకాలము అతను స్వర్గము నందు ఉంటాడు. స్వర్గము అంటే అనుభూతి పరముగా భోగములు అనుభవించే స్థితి కలిగి ఉంటారు. స్వర్గము చేరిన వారికి సూక్ష్మ, కారణ శరీరములుగా, బంగారు కాంతి శరీరము లేక వజ్రకాంతి శరీరము కలిగి ఉంటారు. సిద్ధులు, బ్రహ్మర్షులు, మహర్షులు వాటిని వదిలేసి ఉంటారు.
మనము చేసిన పుణ్యము జనము ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో అంతకాలము పుణ్యలోకాలలో ఉంటారు. ఉత్తమ లోకాలలో చక్కని అనుభూతి ఉంటుంది. జనము మనలని మర్చిపోతే పుణ్యలోకాలలో ఉండరు.
పుణ్యలోకాలకు వెళ్లి వస్తూ, క్రిందకు, పైకి తిరగకుండా ఉండేటటువంటి విధానమే నిష్కామ కర్మయోగము అని శ్రీకృష్ణుడు అష్టమ అధ్యాయము లో చెపుతాడు.
🕉🌞🌎🌙🌟🚩
[14:16, 15/02/2021] +91 92915 82862: 🧘♂️దైవచింతన🧘♀️
🕉️🌞🌍🌙🌟🚩
సత్యము ఎప్పుడూ మారదు. ధర్మం కాలానుగుణంగా మారుతుంది.శరీరధర్మం పుట్టడం వృద్ధి పొందడం, అంతరించడం. ఇవన్నీ ఆయా కాలాలలో మార్పు చెంది నశిస్తాయి.
మనకు కనిపించే దృశ్యమాన ప్రపంచం, నక్షత్రాలు, గ్రహాలు, కూడా పుట్టడం, వృద్ధిపొందడం, లయం అవ్వడం.
ఇలా నశించేవాటి మీద దృష్టి పెట్టకుండా, నిత్యసత్యమైన పరబ్రహ్మం పై దృష్టి పెట్టినచో సమస్తం కోరకుండానే పాదాల చెంతకు చేరుతుంది.
జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం.
ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసము. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అందుచేత కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.
హృదయమే శక్తి కేంద్రం. హృదయం నుండి సహస్రారానికి "అమృతనాడి" ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది. ఇది తెరుచుకోవడమే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం.
🕉️🌞🌍🌙🌟🚩
[15:06, 15/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(803)
🕉🌞🌎🌙🌟🚩
"భగవంతుడిని మరి ఏమి కోరుకోవాలి !?"
భగవంతుని ప్రార్థనలో మన క్షేమాన్ని కోరుకోవాలని శ్రీశివానంద గురుదేవులు సూచించారు. భగవంతుని ఆరాధించడమే భారతీయ హృదయం. ఏదో ఒక కోరికతో కేవలం ప్రార్థనల్లో కురుకుపోవటంకాదు. ఆయన ఔన్నత్యం, సమర్ధత, విలువ తెలిసి ఇష్టపడటం. ఇక క్షేమం అంటే శారీరక, మానసిక సౌఖ్యం మాత్రమేకాదు. మానవజన్మ పరమావధి అయిన జీవోన్నతే మనకు నిజమైన క్షేమం. అదే గీతలో శ్రీకృష్ణుడు తన భక్తుల విషయంలో బాధ్యత వహిస్తానన్న "యోగక్షేమం వాహామ్యహం" అన్న హామీ. భగవంతున్ని మన మనసుకు మార్గదర్శనం చేయమని ప్రార్థించాలి. మన కర్తవ్యాన్ని గుర్తుచేసి అది నెరవేర్చేలా చూడమని, నిత్యజీవితంలో ఉచితానుచితాలు తెలుసుకునే వివేకం ద్వారా దుఃఖాన్ని ఇచ్చే కర్మ మనచేత జరగకుండా చూడమని ప్రార్థించాలి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ప్రార్థన ఆరాధనగా పరిణమించాలి'- (అధ్యాయం -99)
🕉🌞🌎🌙🌟🚩
[15:06, 15/02/2021] +91 92915 82862: "ఋభుగీత "(270)
🕉🌞🌎🌙🌟🚩
"నామరూపాలు"
19వ అధ్యాయము
జీవితంలో భ్రమలుపోతే మిగిలింది బ్రహ్మమే !
శాంతే తన మనసు స్వభావంగా మారినవాడు సదా బ్రహ్మీస్థితిలోనే ఉంటాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సద్గురువులు అలాగే ఉన్నారు. అలాంటి వారి సమక్షంలో ఉన్నవారికి కూడా శాంతిగానే ఉంటుంది. మనసు స్వభావం బలీయమైనది. 'నేను' 'నేను' అనుకునే అహంకారాన్ని, దేహాత్మభావనను సంపూర్ణంగా విడనాడటానికి అది సుముఖంగా ఉండదు. అందుకే సత్యం గురించి సద్గురువులు ఇంత విస్తారంగా, వివరంగా చెప్పాల్సి వచ్చింది. అందుకే పరమాత్మే మనకోసం అనేక అవతారాలెత్తి జీవితంలో మనం ఎలా ఉండాలో చూపించాల్సి వచ్చింది. సత్యం అర్ధమైతే అన్నిభ్రమలు తొలగుతాయి. జీవితంలో భ్రమలుపోతే మిగిలింది బ్రహ్మమే. అశాంతికి కారణం ఆ భ్రమలే !
🕉🌞🌎🌙🌟🚩
[15:13, 15/02/2021] +91 92915 82862: 🌷155 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
శ్రద్ధలో పోకడలు
5. తమోగుణ ప్రకృతి వలన శాస్త్రమును అనుసరింపని ఘోర తపస్సులు ఆచరించుట, దానియందు దంభాహంకారములు కలిగియుండుట, కామ రాగములు బలీయమగుట జరుగును.
(శాస్త్రమును వ్యతిరేకించు బుద్ధి తమః ప్రకోపము లేనిదే కలుగదు. అట్టివారి ఉపాసన నిషిద్ధ మార్గముననే యుండును)
6. కొందరు రజస్తమస్సుల ప్రకోపమున అసురమైన నిశ్చయములను పొంది ఘోర వ్రతాదులాచరింతురు. శరీరమునందున్న పంచభూతములను కృశింపజేయు వ్రతములు ఆచరింతురు. బుద్ధి లేని వారై శరీరమునందున్న నన్నును కృశమునకు లక్ష్యం చేయుచున్నారు.
(శుష్కోపవాసాది వ్రతములు, దేహ తాడనాదులు, జాగరణము, దేహము క్షతము గావించుకొనుట మున్నగు వ్రతముల వలన శరీర ధాతువులు హాని చెందును. అందు 'నే'నను ప్రజ్ఞ కూడా వాని చేతస్సు నుండి సన్నగిల్లును. కనుక 'నన్ను'ను కృశింపజేయుట యగును.)
7. ఆహారము నందు అభిరుచి, యజ్ఞ దాన తపస్సుల విధానములు కూడా త్రిగుణములను అనుసరించి వేర్వేరుగా నేర్పబడును. వానిని వివరింతును.
🕉🌞🌎🌙🌟🚩
[15:13, 15/02/2021] +91 92915 82862: 170) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ద్విత్ర్యాన్తరత్వకక్షాణాం దర్శనేఽ ప్యయమాన్తరః ౹ న వీక్ష్యతే తతో యుక్తి శ్రుతిభామేవ నిర్ణయః ౹౹167౹౹
167. సూక్ష్మాతిసూక్ష్మ మగుటచేెత ఈ ఆంతరతత్త్వము గోచరము కాదు.అనుమానము చేతను శ్రుతివాక్యముల చేతను మాత్రమే దానిని గూర్చి నియమింప దగును.
పటారూపేణ సంస్థానాత్పటస్తన్తోర్వపుర్యథా ౹ సర్వరూపేణ సంస్థానాత్సర్వమస్య వపుస్తథా ౹౹168౹౹
168. వస్త్రముగా ఏర్పడిన నూలుపోగులకు ఆ వస్త్రమే శరీరముగా చెప్పబడినట్లు సర్వముగా ఏర్పడిన ఈశ్వరునకు సర్వమే శరీరమగుచున్నది.
తన్తోః సంకోచవిస్తారచలనాదౌ పట స్తథా ౹ అవశ్యమేవ భవతి న స్వాతంన్త్ర్యం పటే మనాక్ ౹౹169౹౹
169. నూలుపోగులు సంకోచించి వ్యాకోచము చెంది ఇతర విధముగ చలించినపుడు ఆ వికారములే వస్త్రమునకును సంక్రమించును. దానికి స్వాతంత్ర్యమే లేదు.
తథాఽ న్తర్యామ్యయం యత్రయయా వాసనాయా యథా ౹ విక్రియేత తథాఽ వశ్యం భవత్యేవ న సంశయః ౹౹170౹౹
170. అట్లే ఆ అంతర్యామి ఎచ్చట, ఏ వాసనచే ఎట్లు వికారము నొందించునో ఆయా విషయములు అట్లే ఆవశ్యముగ వికారము నొందును.ఇందు సంశయము లేదు.
వ్యాఖ్య:- నారగుడ్డ మీద చిత్రింపబడిన యుద్ధదృశ్యము యుద్ధము చేయు సైన్యముల గర్జనను కల్పింపగలదా?
శవము లేచి పరుగిడగలదా?రాతిమీద చెక్కబడిన సూర్యరూపము చీకటిని పోగొట్టునా?
అదే విధముగా జడమనస్సు ఏమి చేయగలదు?
అంతశ్చైతన్యజ్యోతివలన మాత్రమే తెలివి కలదిగాను, క్రియాశీలముగాను ఉన్నట్లు అగుపించును.
ఒక వస్త్రమును నీటియందు వుంచినప్పుడు అది సంకోచము లేక వ్యాకోచము కలుగుతుంది.
ఈ క్రియ వస్త్రమునకు దానియందు వున్న నూలుపోగులు చలనము వలన మాత్రమే జరుగును. వస్త్రమునకు ప్రత్యేక ఏమివున్నది?
అలాగే శరీరమునకు కూడా ప్రత్యేక ఉనికి అంటూ వున్నదన్నా లేక ఏ వాసనలతో వికారములు కలిగినదన్నా, అందున్న ఆ అంతర్యామి ఎచ్చట, ఏ వాసనలచే వికారము నొందించునో ఆయా విషయములు అట్లే అవస్యముగ వికారము నొందును.
సూక్ష్మాతిసూక్ష్మ మగుటచేత ఈ ఆంతరతత్త్వము గోచరము కాదు.
సూక్ష్మమగు ఆత్మ సమస్తమును వ్యాపించియుండునని శ్రుతి,గురు వాక్యముల చేత తెలిసికొన్నవాడు తత్త్వమును తెలిసికొనును.
వ్యాధికి,భయమునకు,
ఆందోళనకు,వార్ధక్యమునకు,
మరణమునకు వశమగు దేహము తానను భావనతో భ్రాంతి జెందని వాడు తత్త్వమును తెలిసికొనును.
సర్వజీవులలోనుండు అద్వితీయ చైతన్యము సర్వశక్తిమంతమనియు, సర్వవ్యాపి అనియు అవగతము చేసికొన్నవ్యక్తి తత్త్వమును తెలిసికొనును.
🕉🌞🌏🌙🌟🚩
[15:24, 15/02/2021] +91 92915 82862: 52)-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
కల్యాణి - రూపక (కాంభోజి - ఝంప)
పల్లవి:-
ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన
నీ మాయ దెలియవశమా శ్రీరామ!! ఏ!!
అను పల్లవి:-
కామారివినుత గుణధామ కువలయదళ
శ్యామ ననుగన్నతండ్రి శ్రీరామ!! ఏ!!
చరణము(లు):-
సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు
డతిబలుడనుచు కపులు శ్రీరామ క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు మదితెలియలేరైరి!! ఏ!!
చెలికాడనుచు పాండవులు విరోధివటంచు
నలజరాసంధాదులు శ్రీరామ కలవాడవని కు
చేలుడు నెరిగిరిగాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరైరి!! ఏ!!
నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
వరుడవనుచు గోపసతులు శ్రీరామ కరివరద భద్రగిరి
శ్రీరామదాసనుత పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి!! ఏ!!
🕉🌞🌏🌙🌟🚩
[15:31, 15/02/2021] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనము
28-2-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
విమథత్సు సురాసురేషు జాతా సురభిస్తామృపిషు న్యధాస్త్రిధామన్।
హయరత్నమభూదథేభరత్నం ద్యుతరుశ్చాప్సరసః సురేషుతాని॥
భావము:-
త్రిధామా! భగవాన్! దేవదానవులట్లు క్షీరసాగరము మధించుచుండగా 'సురభి' అను కామధేనువు పుట్టెను. ఆ గోరత్నమును నీవు ఋషులకు అనుగ్రహించితివి. ఆ తరువాత వచ్చిన 'ఉచ్చైఃశ్రవము' అను అశ్వమును, కల్పవృక్షమును మరియు అప్సరసలను - నీవు దేవతలకు ఇచ్చితివి.
వ్యాఖ్య:-
హాలాహలభక్షణం పిమ్మట మరల, దేవతలూ రాక్షసులూ సముద్రాన్ని చిలక సాగారు.
ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలోనుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగూ, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది.
కామధేనువు హోమకార్యక్రమాలకు తగినది అని దేవమునులు ముందుగానే గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు.
అలా చిలుకుంతుంటే క్షీరసాగరమునుండి. . .
చంద్రుడంత తెల్లగా ఉండే “ఉచ్ఛైశ్రవము” అనే గుఱ్ఱం పాలసముద్రం నుండి లెస్సగా పుట్టింది. విష్ణుమూర్తి సూచన మేరకు, దానిని ఇంద్రుడు తీసుకోలేదు. దానిని రాక్షసరాజు బలి కావాలని తీసుకున్నాడు.
ఆ ఉచ్ఛైశ్రవము అనే ఆ హరి (గుఱ్ఱం) దృఢమైన రొమ్మూ, చిక్కని పిరుదునూ, చక్కటి తోకా, కాంతివంతంగా తళతళలాడే ముఖమూ, స్వచ్ఛమైన గిట్టలూ, పొట్టి చెవులు, శుభ్రమైన కన్నులూ, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది.
ఉచ్ఛైశ్రవం పుట్టిన తరువాత క్షీరసాగర మథనంలో . . . .
పాలసముద్రంలో “ఐరావతం” అనే ఏనుగు పుట్టింది, దానికి నాలుగు (4) దంతాలు ఉన్నాయి. వాటితో కొండల శిఖరాలను సైతం కూల్చివేయగలదు. ఆ గజరాజం వెండి కొండ వలె మనోహరంగా విలసిల్లుతూ ఉంటుంది.
ఆ ఐరావతము తడబాటు లేన నడకలు వేగం కలిగనది. పెద్ద శరీరం, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలమూ కలదీ, ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీల కులుకు నడకలకు ఒజ్జబంతి అనే విధంగా ఉంటుంది.
ఇంకా సముద్రాలకే రాజు వంటి ఆ పాలవెల్లిని దేవతలూ, రాక్షసులూ చిలుకుతుంటే...
ఆలా కడలిని చిలకడం కొనసాగుతుండగా, అందులోనుండి కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూసి, ఇంద్రుని వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది.
ఆ క్షీరసాగరాన్ని అలా మందరపర్వతం అనే కవ్వంతో చిలకుతూ ఉండగా, దానిలోనుండి అప్సరసలు పుట్టారు.
అలా పాలకడలిలో పుట్టిన అప్సరసలు, వానాకాలంలోని మెరుపుతీగల వంటి తళుకైన శరీరాలూ, అందమైన చూపులూ చక్కగా అమరి ఉన్నారు.
అటుపిమ్మట, రత్నాలకు నిలయమైన ఆ పాలసముద్రంలో చంద్రుడు జన్మించాడు. అతడు బ్రహ్మదేవుని అనుమతితో తన మొదటి స్థానాన్నే అధిష్టించాడు.
రాజా పరీక్షిత్తూ! పాలకడలిలో ఆ తరువాత, అందచందాలకు ఆది రూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది.
🕉🌞🌎🌙🌟🚩
[15:35, 15/02/2021] +91 92915 82862: ఓం నమః శివాయ:
6-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
5-2- వేదములు అనంతములు
((((((((((🕉))))))))))
శబ్దమూ, పదార్థమూ - వాటి ప్రయోజనం:- సంస్కృతంలో ఒక పదానికి ''తరం'' అని చేరిస్తే మరొకదాని కన్నా శ్రేష్ఠమని అర్థం వస్తుంది. ''వీర్యవత్'' అంటే శక్తి మంతమని అర్థం. 'వీర్యవత్తరం' అంటే అసాధారణమైన శక్తిమంతుడని అర్థం.
చాందోగ్యోపనిషత్తులో (1.1.10) ఓం కారాన్ని అర్థం తెలుసుకొని జపిస్తే ఉత్కృష్ట ఫలితాలు పొందవచ్చని ఉంది. ''వీర్యవత్తరం'' అన్న పదం ఇక్కడ వాడబడింది. ఈ పదం వాడటం వల్ల స్ఫురించేది ఇదిః ''అర్థం తెలుసుకోకుండా జపిస్తే తక్కువ ఫలితాలు వస్తాయ''ని : తన భాష్యంలో ఆది శంకరులవారు అర్థం తెలుసుకొని జపం చేసేవారికి లభించిన ఫలితాలు లభించకపోయినా ఇతరులకి కూడ కొంతైనా సత్ఫలితం వస్తుందని అన్నారు. అర్థం…
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -150 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 3
🍀 3. శాంతి - శమము - శాంతి లభించ వలెనన్నచో మానవుడు నిష్కామ కర్మమును జ్ఞానముతో జోడించి నిర్వర్తింపవలెను. యోగమార్గమున ఆరోహణము గావించిన యోగికి శమము కారణమని చెప్పబడుచున్నది. యజ్ఞార్థ కర్మయే దైవము నిర్దేశించిన కర్మ. దైవయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని, యింద్రియ సంయమ యజ్ఞమని, శబ్దయజ్ఞమని, మనోయజ్ఞమని, ద్రవ్యయజ్ఞమని, తపో యజ్ఞమని, యోగయజ్ఞమని, స్వాధ్యాయ యజ్ఞమని, జ్ఞానయజ్ఞమని, ప్రాణాయామ యజ్ఞమని, అన్న యజ్ఞమని పండ్రెండు యజ్ఞములు నిర్వర్తించుట ద్వారా జీవుడు ప్రజ్ఞయందు ఆరోహణము చెందగలడని తెలిపినాడు. 🍀
ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మకారణ ముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే || 3
ప్రజారోహణము చేయదలచిన మననశీలురకు నిష్కామ కర్మ సాధనమని చెప్పబడుచు…
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 349 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
89. అధ్యాయము - 01
🌻. హిమవంతుని వివాహము -1 🌻
నారదుడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా! దక్షపుత్ర యగు సతీదేవి తండ్రి చేసిన యజ్ఞములో దేహమును వీడి పర్వత పుత్రికయై జగన్మాతయైన విధంబెట్టిది?(1) ఆమె మిక్కిలి ఉగ్రమైన తపస్సును చేసి శివుని భర్తగా పొందిన విధంబెట్టిది? నా ఈ ప్రశ్నకు సమాధానమును విస్తారముగా చక్కగా చెప్పుడు(2)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ ఋషిశ్రేష్ఠా| ఉత్తమమైన జగన్మాతృచితదతమును నీవు వినుము. వఅది పరమసావనము,. దివ్యము, పాపములన్నిటినీ పొగొట్టునది, శుభకరము(3) దాక్షాయణీ దేవి శివునితో గూడా ఆనంమదమతో హివతసర్వమునందు క్రీడించుచుండెను. ఆపరమేశ్రవిరకి అది ఒక లీల(4)
ఆ సమయములో హిమవంతుని ప్రియురాలు, సమస్త పంపదలతో నలరాదరునది యగు మేనాదేవి మాతృప్రేమతో 'ఈమె నాకుమార్తె' అని భావించి సేవించెను(5) పరమేశ్వరియగు దాక్షాయణి తండ్రియగు దక్షుని యజ్ఞమునకు వెళ్ళి అచట తండ్రిచే అవమానించబడి, కోపించనదై తన దేహమును త్యాగముచేసెను(6)
ఓ మహర్షీ! హిమవంతునకు ప్రియురాలగు మేనక ఆనాడే శివలోకమునందున్న ఉమాదేవినివ ఆరదించగోరేను(7) అపుడు సతీదేవి దేహమునరు వీడిన తరువాత హిమవంతును కుమార్తేగా ఆమె గర్భమునందు జన్మించవలెనని మనస్సులో నిశ్చయముగ చేసుకొనెను (8)
దేవతలందరిచే స్తుతించబడిన ఆ సతీదేవి దేహమును వీడిన తరువాత సరియగు సమయము రాగానే ప్రేమపూర్వకముగా మేనకకు కుమార్తేయై అవతరించెను(9) పార్వతి యను నపూరుగల ఆ దేవి నారదుని ఉపదేశముచే మిక్కిలి దుష్కరమగు తపస్సును చేసపి మరల శివుని భర్తగా పొందెను(10)
ఓ బ్రహ్మా! విధీ! మహాప్రాజ్ఞా ! నీవు వక్తలలో శ్రేష్ఠుడవు. మేనక యొక్క పుట్టుకను, వివాహమును మరియు చరితమునునాకు చెప్పుము(11) సతీదేవిని కుమార్తెగా పొందిన మేనకాదేవి ధన్యురాలు, పూజ్యురాలు, ఆమె అందరిలో గొప్పపతివ్రత(12)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ నారదమహర్షీ! పార్వతీ తల్లి యొక్క పరట్లుక, వివాహమునను గూచ్చి వినుమ అమె చిరతము పావనము, భక్తిని వృద్ది చేయునది(13) ఓ మహర్షీ! ఉత్తర దిక్కునందు గొప్ప తేజస్సు, సమృద్ధులతో హిమవాన్ అని ప్రసిద్దిగాంచిన పెద్ద పర్కవతము ఎకలదు గదా!(14)
దానికి జంగమము (నడయాడునది) స్థావరము(స్థిరము) అను రెఒడు రూపములు గలవని ప్రసిద్ధి. ఈ విషయములోని సూక్షమ్స్కవరూపమును సంగ్రమముగా వివరించెఏఉదును(15) ఆ పర్వతము పశ్చిమ సముద్రము, తూర్పు సముద్రమ9ఉల వరకు వ్యాపించి భూమిన కొలిచే కొలబద్దయా యున్నట్లు ఉన్నది. ఆ సుందరమగు పర్వతము అనుక శ్రేష్ఠవసుతులకు నియమై ఉన్నది (16)
ఆ పర్వతము అనేక రకముల వృఓంఉలతో నిండి అనేక శిఖరములతో అతి సుందరముగా నున్నది. సింహము, వ్యాఘ్రము మొదలగు జంతువులు దానయందదు సర్వదా సుఖముగా సంచరించుచుండెను(17) మిక్కిలి దట్టమై మంచుతో నిండి అనేక అద్భుతములతో ఆశ్చర్యమును గొల్పు ఆ పరద్దతమును దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు సేవించుచుందురు. అది శివునకు మిక్కిలిప్రియమగు పర్వతము(18)
మమాత్ములు అచట తపస్సును చేయుదురు. మిక్కిలి పవిత్రమగు ఆ పర్దతము వారిని పవిత్రులను చేయును. ఆపర్వతము నందు తపసస్సు చేయువారికి సిద్ధికలుగల నిశ్చితము, శుభకరమగు ఆ పర్వతము అనెక ధాతువులకు (లోహఖనిజము) నిలయమై ఉన్నది(19) దివ్యమగు రూపము గలది, అన్ని భాగములో సనుందరమైనది, రమణీయమైనది, వికారములు లేనిది, సత్పురుషులకు ప్రియమైనది అగు ఆ శ్రేషణ్ఠపర్వత రాజము విష్ణువు యొక్క అంశచే ఉద్భవించినది (20)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 233 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 4 🌻
19. శమరతుడి (శమమనే గుణం కలిగినవాడు) స్వభావం అలా ఉంటుంది. గౌరవం లభించినప్పుడు మిక్కిలి దుఃఖంపొందినట్లువలె దానిని చూస్తాడు. తనను ద్వేషించేవాడు ఒకడుంటాడు. తనను మైత్రితో ఆరాధించేవాడు మరొకడుంటాడు. వాళ్ళిద్దరి విషయంలోనూ తనకుమాత్రం ఒకే భావన ఉండాలి.
20. వాడు నన్ను మైత్రితో చూస్తున్నాడు కాబట్టి వాడిని గౌరవించటము, నన్ను అగౌరవపరుస్తున్నాడు కాబట్టి ఒకడిని ద్వేషించటం సామాన్యమైన లక్షణమే! అయితే అది తపస్సుకు యోగ్యమైనదికాదు.
21. దానివలన మనిషికి ఎలాంటి ఫలమూ లభించకపోగా తపస్సు క్షీణిస్తుంది. కాబట్టి శత్రువు యందు, మిత్రుడియందు – అందరియందు – తన దృష్టి మాత్రం మారకూడదు. అలా ఉండగలిగితే, ఎట్టివాడినైనా మార్చగలిగిన శక్తివంతుడవుతాడు.
22. ఒకడు మనని క్షణంలో క్రోధంలో దింపగలిగితే, మరోకడు క్షణంలో మనలో ద్వేషాన్ని పుట్టించగలిగితే, వేరొకడు క్షణంలో మన ప్రసన్నులను చేయగలిగితే-ఇంక మనం ఏం స్వతంత్రులం?! ఎవరు ఎలాగపడితే అలాగ మార్చడానికి సాధ్యమైన మనిషి అస్వతంత్రుడేకదా! అతడిక ఏం తపస్సు చేస్తాడు? ఏం సంపాదిస్తాడు? ఇంతడు, ఇతడి యొక్క సుఖదుఃకములన్నీ లోకంచేతిలో ఉన్నాయన్నమాట!
23. అతడి తపస్సు పతనం చేయాలంటే ఇతరుల చేతిలో ఉంది. దేవుడి దయ కాదు, మనుష్యుల దయవల్ల బ్రతుకుతాడు వాడు! ఇంతాచేస్తే, ఇతడి యోగక్షేమాలన్నీ సామాన్య మానవుల చేతుల్లో ఉన్నాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 172 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 10 🌻
పరమముక్తి:
660. పరామముక్తిని సద్గురువనియు, కుతుబ్ అనియు పూర్ణగురువనియు అందురు.
సద్గురువు, తాను ముక్తుడైన పిమ్మట సాధారణ చైతన్యస్థితికి వెనుకకు మరలి వచ్చును. ఏకకాలమందే "అహం బ్రహ్మాస్మి" (నేను భగవంతుడను) స్థితియందును ముల్లోకములందును ఎఱుక కలిగియుండును అతడు సఛ్చిదానంద స్థితిని అనుభవించుటయే గాక, వాటిని తన మహాకారణ శరీరముద్వారా వినియోగించును.
661. పరముక్తుడు, వ్యక్త అవ్యక్త (సాకార నిరాకార) స్థితుల రెంటియందును తాను భగవంతుడనని ఎరిగి యుండును. తాను నిర్యికారమైన దివ్య స్వరూపుడనియు అనంతమైన వ్యక్త స్థితులన్నియు తానేననియు తనకు తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 27 / Bhagavad-Gita - 27 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 27 🌴
27. తాన్ సమీక్ష స కౌన్తేయ: సర్వాన్ ననవస్తితాన్ | కృపయా పరయావిష్టో విషిదన్నిదమబ్రవీత్ ||
🌷. తాత్పర్యం :
నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.
🌻. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 27 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 27 🌴
27. tān samīkṣya sa kaunteyaḥ
sarvān bandhūn avasthitān
kṛpayā parayāviṣṭo
viṣīdann idam abravīt
🌷. Translation :
When the son of Kuntī, Arjuna, saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus.
🌻. Purport :
🌹 🌹 🌹 🌹 🌹
[15:56, 15/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 28 / Sri Lalita Sahasranamavali - Meaning - 28 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 28. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖ 🍀
🍀 72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా -
భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
🍀 73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా -
నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 28 🌹
📚. Prasad Bharadwaj
🌻 28. bhaṇḍasainya-vadhodyukta-śakti-vikrama-harṣitā |
nityā-parākramāṭopa-nirīkṣaṇa-samutsukā || 28 || 🌻
🌻 72 ) Bhanda sainya vadodyuktha shakthi vikrama harshitha -
She who was pleased by the various Shakthis(literally strength but a goddess) who helped in killing the army of Bhandasura
🌻 73 ) Nithya parakamatopa nireekshana samutsuka -
She who is interested and happy in observing the valour of Nithya devathas (literally goddess of every day)
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
[15:57, 15/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 28 / Sri Vishnu Sahasra Namavali - 28 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
కర్కాటక రాశి- పునర్వసు నక్షత్ర 4వ పాద శ్లోకం
🌻. 28. వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ‖ 28 ‖ 🌻
🍀 256) వృషాహీ -
అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.
🍀 257) వృషభ: -
భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.
🍀 258) విష్ణు: -
సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.
🍀 259) వృషపర్వా: -
ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.
🍀 260) వృషోదర: -
ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)
🍀 261) వర్ధన: -
ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.
🍀 262) వర్ధమాన: -
ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.
🍀 263) వివిక్త: - మాయాస్వరూపమగువాడు.
🍀 264) శృతిసాగర: -
శృతులకు నిధియైనవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 28 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻
Sloka for Karkataka Rasi, Punarvasu 4th Padam
🌻 28. vṛṣāhī vṛṣabhō viṣṇurvṛṣaparvā vṛṣōdaraḥ |
vardhanō vardhamānaśca viviktaḥ śrutisāgaraḥ || 28 || 🌻
🌻 256. Vṛṣāhī:
Vrusha means dharma or merit.
🌻 257. Vṛṣābhaḥ:
One who showers on the devotees all that they pray for.
🌻 258. Viṣṇuḥ:
One who pervades everything.
🌻 259. Vṛṣaparva:
One who has given as steps (Parvas), observances of the nature of Dharma, to those who want to attain the supreme state.
🌻 260. Vṛṣodaraḥ:
One whose abdomen showers offspring.
🌻 261. Vardhanaḥ:
One who increases the ecstasy of His devotees
🌻 262. Vardhamānaḥ:
One who multiplies in the form of the universe.
🌻 263. Viviktaḥ:
One who is untouched and unaffected.
🌻 264. Śrutisāgaraḥ:
One to whom all the shruti or Vedic words and sentences flow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
[16:48, 15/02/2021] +91 7013 527 083: నాగా సాధువులు
--- 1 ---
📚✍️ భట్టాచార్య
నాగా సాధువులను, "నగ్న యోగులు" అని కూడా అంటారు. వీరి సాంప్రదాయం త్రేతాయుగ కాలం నుండి కలదు. దత్తాత్రేయుడు....నాగా సాంప్రదాయికుల మూల పురుషుడు. ఆధునిక కాలంలో, ఆది శంకరాచార్యుల వారు ఆనాటి పరిస్థితులను బట్టి "నాగా సాధు సాంప్రదాయాలను" పునరుద్ధరిస్తూ, వీరిని హిందూ ధర్మ పరిరక్షకులుగా, శక్తి వంతమైన సాధు సైన్యంగా రూపొందించారు.
"నాగా సన్యాసుల" చరిత్ర చాలా ప్రాచీనమైనది. పరమశివుని, పశుపతినాధుని పేరుతో వీరు అర్చించిన ముద్రలు,గుర్తులు ....త్రవ్వకాలలో లభించాయి. అలెగ్జాండర్ మరియూ అతని అనుయాయులు కూడా నాగా సాంప్రదాయ సన్యాసులను కలిసారు.
గౌతమ బుద్ధుడు, మహావీరుడు...నాగా సాధువుల తపస్సుకు ఆశ్చర్యం వ్యక్తం చేసారు కూడా! నాగా సాధువుల దేశభక్తి, తమ ధర్మం పట్ల తమకు గల అనురక్తి, ఆ ధర్మావలంబన పట్ల తమ జీవితాలను సైతం త్యాగం చేయడం....ఇవన్నీ కూడా గౌతమబుద్ధుని ప్రభావితం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
జైనులలో ఒక శాఖ అయిన "దిగంబరులు", నాగా సాధువుల నుండే కొన్ని ఆచారాలు స్వీకరించినట్లు కూడా చరిత్ర చెబుతోంది.
నాగా సాధువులు, మనలా దుస్తులు ధరించరు. వారు కాషాయ రంగు గల ఏకవస్త్రము మాత్రమే ధరిస్తారు....ఆ వస్త్రము కూడా శరీరానికి పూర్తిగా సరిపోదు. ఒక నాగా సాధువు , తన శరీరాన్ని కప్పుకొనేందుకు, ప్రాపంచికమైన విషయాలను ధరించడు. అతను విభూది ధారణ మాత్రమే చేస్తాడు.
నాగా సాధు సాంప్రదాయంలో హోదాలు :
1. నాగా సాధువు
2. మహంతు
3. శ్రీ మహంతు
4. ఠానాపతి మహంతు
5. పీర్ మహంతు
6.దిగంబరేశ్వర్
7. మహామండలేశ్వర్
8. ఆచార్య మహామండలేశ్వర్
నాగా సాధువులు, తమ మెడలో, చేతులలో రుద్రాక్షలు ధారణ చేస్తారు.రుద్రాక్షమాల చాలా శక్తివంతమైనది. వారు రుద్రాక్ష మాలలను,తాము ధరించే ముందు మంత్రాలతో , అనేక సంవత్సరాలపాటు సిద్ధి చేసి వాటిని ధరిస్తారు. ఆ రుద్రాక్ష మాలలు సిద్ధి అయిన తరువాత , ఏ నాగా సాధువైతే రుద్రాక్షమాల వేసుకుంటాడో...వాడిని రక్షిస్తుంది.
సిద్ధి చేయబడిన ఆ రుద్రాక్షమాల, ఆ నాగా సాధువు యొక్క "ఆరా"(aura)/శరీర కాంతి వలయాన్ని ప్రభావితం చేసి ఆ కాంతివలయపు శక్తి పెరిగేటట్లు చేస్తుంది.
ఒక నాగా సాధువు కావడానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
ఒక వ్యక్తి తాను ఒక నాగా సాధువుగా మారాలంటే, అతను తన కామశక్తిపై సంపూర్ణ అదుపు కలిగి ఉండాలి. కామ పరమైన భావాలపై అదుపు...., కామేచ్ఛ(libido) పై అదుపు కూడా కలిగి యుండాలి.
బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది, కేవలం శరీరానికే పరిమితం కాకుండా, నైతికరీత్యా కూడా పాటించాలి. ప్రాపంచిక విషయాల పట్ల అతను వైరాగ్యంతో ఉండాలి. ఒక వ్యక్తి తాను ఇంద్రియాతీత సుఖాలకు అతీతుడైనా, భగవంతునిపైన,తన దేశ ప్రజల పైన, తన మాతృదేశం పైన ప్రేమ లేకపోతే అతను వృధాభరితుడే. రాష్ట్ర ధర్మాన్ని ప్రతిబింబించలేడు. గురువు అనేవాడు, ఒక సాధువుకు ఎలా సహాయం చేస్తాడు? తనకు గల అహంకారం తొలగించుకోవడంలో, సహాయం చేస్తాడు. నిస్వార్ధమైన భక్తి గల ఒక నాగా సాధువు , సాటి మనుజుల పట్ల, దేశం పట్ల సద్భావం కలిగి యుండి, వారి రక్షణ బాధ్యతను తీసుకుంటాడు.
ఒక వ్యక్తి నాగా సాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది......
వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆఖాడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.
ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆఖాడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి.
వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే నిరాకరిస్తారు.
ఒక సారి వద్దు అనుకుంటే, మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు.
వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది
ఆ సమయం లో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుoది.
ఇంకా యోగాభ్యాసం,తంత్ర సాధన మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.
కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరీ సాధువులు వేరు, నాగా సాధువులు వేరు. నాగా సాధువులు శాకాహారులు.
వీరు నేల పైనే నిద్రించాలి .రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్నివారే సంపాదించుకోవాలి.
అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి.
వారు ఏమీ ఇవ్వనిచో శివాజ్ఞ, అని ఉపవాసం ఉండాల్సిందే.
వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది.
శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం (కౌపీనము)మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.
వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి.
మొదటిగా శివుని , శక్తిని వినాయకుని , విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.
ఆఖాడాలకు వచ్చిన వారికి అంచెలు అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది.
సన్యాసిగా మారక ముందు వీరు
గుండు చేయించుకొని, వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి. విరజా హోమం ఉంటుంది.
స్వపిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి అధికారికంగా నాగా సాధువుగా గుర్తింపు లభిస్తుంది.
వీరి పదవీ స్థాయిలలో చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు. వీరు హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా, తీయటానికైనా సిద్ధంగా ఉంటారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.... ఆచార్య మండలేశ్వరుడిగా మారినా, వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. అంతటి సిద్ధ పురుషులన్నమాట!
వీరు ఎంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు.
వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు.
శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా..... ఇతర దేశాలకు చెందిన మూర్ఖులైన ఆటవిక తెగలు, మత సహిష్ణుత లేని దురాక్రమణదారులు హిందూ దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను కూల్చుతూ సాధువులను, ప్రజలను చంపుతుండే వారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరముందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు......సాధువుల సైన్యాన్ని తయారు చేశారు. ఆ సైన్యమే నేటి నాగ సాధువులు. శాపాలు, ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగ సాధువులకు అప్పగించారు.
హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా వీరు జీవిస్తుండగా..... ఎప్పుడూ శివ నామస్మరణ చేస్తుంటారు. మంత్ర శాస్త్ర ప్రయోగాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయ మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారు. అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో, నాగ సాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాలురైన అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోయడం చూసి నాటి పండితులు ‘ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది’ అని అన్నారంటే వారి పరాక్రమాలు అర్థమవుతాయి.
నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం తపోధ్యానాలలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు.. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలో ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు..... రోజులో సాయంత్రం పూట కేవలం ఏడు ఇళ్లలో భిక్ష అడుగుతారు. ఏడు ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు.
నాగ సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయని చాలా మంది నమ్మకం.
నాగా సాధువులను, "నగ్న యోగులు" అని కూడా అంటారు. వీరి సాంప్రదాయం త్రేతాయుగ కాలం నుండి కలదు. దత్తాత్రేయుడు....నాగా సాంప్రదాయికుల మూల పురుషుడు. ఆధునిక కాలంలో, ఆది శంకరాచార్యుల వారు ఆనాటి పరిస్థితులను బట్టి "నాగా సాధు సాంప్రదాయాలను" పునరుద్ధరిస్తూ, వీరిని హిందూ ధర్మ పరిరక్షకులుగా, శక్తి వంతమైన సాధు సైన్యంగా రూపొందించారు.(సశేషం)
No comments:
Post a Comment