
బలవంతుని దెబ్బకు
బలహీనునికి ముప్పు
బతికి బతికించుటకు
బాధతొ చేయు తప్పు
దుర్మార్గుని పలుకు
అబల తోచక వణకే
కామ బలియె అగుటకు
తధ్యమనియు నరికే
అడిగే దిక్కే లేదు
అధికారి వీరంగం
చేసేది ఏమిలేదు
అరికట్ట దుర్మార్గం
..
న్యాయానికి కళ్ళు లేవు
తీర్పుకే అర్ధం లేదు
బతుకులు ఇప్పుడు మారవు
తిరుగుబాటు ప్రశ్న లేదు
దుర్మార్గుని చేతి రాయి
సన్మార్గుల రక్తపోటు
కోపంతో విసిరె రాయి
మనిషికొచ్చు భయంపోటు
...
మధురిమల ......మది
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పచ్చి జ్ఞాపకం మనది
నువ్వెప్పుడును అడగనది
రహస్యము తెలపాలుంది
ఇప్పుడే తీరిక ఉంది
నువ్వెప్పుడూ వద్దనేది .
ఇపుడు అనవసర మనేది
ఓ అస్పష్టత మైనది
తొలి చూపులో చిక్కినది
అర్థమయ్యే దేముంది ..
కానీ తెల్పాలనుంది
అర్ధం పరమార్దమది
ఇపుడు తేలికగా ఉంది
పలికించాలినియు ఉంది
మాటలో మర్మమే అది
ఊగిసలాడు మనసు అది
ఇప్పుడు పరిస్థితియు ఇది
మనో విహాయసమే అది
తెగిన గాలిపట మైనది
ఊహలు లో నలిగి ఉంది
హృదయాకాశమై ఉంది
మధుర జ్ఞాపక మైనది
వెంటాడే చీకటి అది
వెలుగుల ఆటు పోటు అది
మనకు చేదు అనుభవమది
బంధీ తెంచుకుని ఉంది
స్వేచ్ఛగానూ తానుంది
ఒకటి ఒకటై మనసంది
దారంతో బంధం అది
.
ఇంకొక్కటి లేదన్నది
గాలితో అనుబంధ మది
నాలో సైతం ఉన్నది
నీకు చెప్ప వద్దన్నది
ఆ రహస్యం మీరేచెప్పండి
--(())--
*🌸ముముక్షువు*🌸
ఒకానొక మానవుడు, సకల ఆధ్యాత్మిక గ్రంధాలూ చదివి, ఎందరో గురువుల బోధనలు విని,చివరకు మోక్షార్థియై. హిమాలయాలు చేరి, తపస్సు చేశాడు.
అతడి ఆయుర్దాయపు అంత్యస్థితిలో భగవంతుడు ప్రత్యక్షమై.
"ఏమాశించి నువ్వీ తపస్సు చేశావు?" అని ప్రశ్నించాడు.
"మోక్షసాధనలో పైమెట్టుకు నాకు పునర్జన్మ ప్రసాదించు!" అన్నాడు మానవుడు.
"అదేమి?. నా సృష్టిలో పరమోత్తమమైనది మానవజన్మేనని మీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయికదా!"
"అది పూర్ణసత్యం కాదని నీకు తెలియనిదా?" యెదురు ప్రశ్నించాడు మానవుడు.
"అదెలా?" గుంభనగా నవ్వాడు భగవంతుడు.
"తన క్షుధార్తికై తోటి జీవులను భక్షింపక తప్పని జన్మేదైనా, పశుప్రాయమైనదే కదా! నీ సృష్టినుండి
తన ఆకలికే కాక, సౌకర్యాలూ, విలాసాలకు కూడా. అందినంతా దోచుకునే నరజన్మ అధమాధమం కాక,
ఉత్తమమెలా అవుతుంది?"
"అయితే, నీకే వరం కావాలంటావు?" ఆసక్తిని ప్రదర్శించాడు.
"మరుజన్మలో నేను ఫలవృక్షమవ్వాలని అనుగ్రహించు!"
"మనిషివైయుండీ, మానుగా జన్మించాలని కోరుకుంటున్నావు!. మరొక్కసారి ఆలోచించు!"
"నా జీవితకాలమంతా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను! నువ్వు దయతలిస్తే విత్తునై భూమాత
గర్భగుడినుంచి ఉద్భవించి, మొలకనై, పంచభూతాల ఆదరణతో ప్రవర్ధమానుడనౌతాను!...
నా సుమ-సుగంధాలతో నిన్ను ప్రకృతిమాత ఒడినుండే ఆరాధిస్తాను!. నా మధురఫలాలతో
మానవజాతిని సేవిస్తాను! నా శాఖలలో పక్షిజాతులకూ, నా ఛాయలో సకలజంతువులకూ
ఆశ్రయమిస్తాను! పరహింసకు పాల్పడకుండా, కేవలం కిరణజన్యసంయోగక్రియ ద్వారా జీవించడమే కాక,
జీవజాలానికంతకూ అత్యంతావసరమైన ప్రాణవాయువును ఉత్పాదించి..పంచిపెడతాను!చివరకు నా మృత్యువులోకూడా గృహసామాగ్రికి కావలసిన కలపను సమకూరుస్తాను!...మానవుడిఅంతిమయాత్రలో
కూడా, చితినై, తోడౌతాను! ఇది నా నిశ్చయం! ఆపై నీ దయ!" అని మిన్నకున్నాడు, ఆ మానవుడు.
"జ్ఞానివే! తథాస్తు!" ఆశీర్వదించి, అదృశ్యుడయ్యాడు భగవంతుడు.
#నీతి_నిజాయితీ_నమ్మకం
రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.
రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!
'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్ఫారమ్ దాటేసింది.అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.
"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.
ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.
"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే...అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.
"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.
"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.
పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"
అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు."వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది.నేనేం మాట్లాడలేదు.
రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.
మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.
మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం! మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.
"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.
నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు. ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.
రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.
"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.
ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.
"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"నిజాయితీగా అన్నాను.
"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.
"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"
"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.
"నువ్వూ..."
"వాళ్ళబ్బాయినండీ!'
ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..
"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి. అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"
ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.
నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.
"చదువుకుంటున్నావా?" అడిగాను.
"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"
ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.
"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.
నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.
"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.
"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"
ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.
"అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.
"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి, అబ్బాయి బుజం తట్టెను.
ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.
‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!🙏🙏🙏
రచన : జయంతి ప్రకాశ శర్మ గారు
సేకరణ: మనుషులు- మహాత్ములు
రక్తసిక్తముగా మారుతున్నది ఈ కర్మ భూమి
ఎవ్వరూ చేయని పుణ్యమా, ఎవరో చేసిన పాపమా
విధివంచనకు గురై నడక సాగుతుంది ఈ భూమి
తిండి లేక పనిలేక ఆశ చంపుకొని ఎందుకు నడకా
అమ్మ ఆర్తనాదం జీవర్తించలేని ఇదా ధర్మ భూమి
పేగుబంధము కూడా తెంచు కోలేని స్థితి ఖండమా
ధరిత్రిని ముట్టడించి యముఁడాజ్ఞగా మారిన భూమి
జన్మస్థానం కోసం మర్మస్థానం మరిచే యుగమా
జాలి చూపని ఇదేమి పాశం, బతుకెందుకా ఈ భూమి
తీర్పులో ఓర్పు లేదు, కన్నీరుకు లేని హృదయమా
జంతువులకున్న స్వేశ్చ మనుష్యులకు లేని భూమి
ఎంతఉన్నా దైవం సొమ్ము తినాలనే కాంక్ష ప్రేమమా
ఏదో భావమునే మదీయ తలపే తెల్పేందుకే నా వయ
స్సేదో తెల్పకయే వినీల మలుపే మల్లించుటే యీ సమ
స్సేదో కల్పనగా తపస్సు జపమే సత్యాలుగా యీ మన
స్సేదో నీ పరమే ఉషస్సు వెలుగే దైవమ్ము వేదమ్ముగా
కాదో అన్న సరే కధల్ని తెలిపే సత్యాన్ని బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుగా
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
లేదో ఉన్నదియో యశస్సు మలుపే హృద్యమ్ము విశ్వాసమే
అమ్మా నీకు శతకోటి దండాలు మాపై చూపుతున్న కరుణా
రక్తసిక్తముగా మారినా కన్నబిడ్డకోసం హృదయాంతర్మధనమా
ప్రేమకు సత్యమన్నది లేదు, న్యాయమన్నది కానరాని ఈజగనా
ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి
ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి
ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి
--(())--
!!
🍁🍁🍁🍁
మహా ఆత్మ అని మనుషుల్లోని గొప్పవారిని ప్రశంసించడం ఒక సంస్కారం. నిజానికి ఆత్మకు పుట్టుక, మరణం లేవు. అది సాక్షి మాత్రమే అని భగవద్గీత బోధిస్తుంది. పవిత్రాత్మలు, మహోన్నత ఆత్మ స్వరూపం అని కొలిచే రూపం- కనిపించే శరీరమే
. శరీరంతోనే ఎటువంటి సత్కార్యమైనా, దుష్కార్యమైనా సంభవం. మనిషిలోని సంస్కారాన్ని అనుసరించి గొప్పతనాన్ని ఆత్మకు ఆపాదించడం సంస్కృతిలో భాగం.
శరీర తత్వం అనేక ప్రకృతితత్వాల కూర్ఫు అది పంచభూతాత్మకం. ఇంద్రియాలతో అనుభవించే అనుభూతి మానవ శరీరాన్ని పులకింపజేస్తుంది.
మనిషిని నడిపించే అంతరంగ శక్తి మనసు. అది ఆలోచనల సమూహం. ఆలోచనలను తగ్గించుకుని, సత్సంకల్పమైన పరిమిత లక్ష్యాలతో జీవిత ప్రయాణం సాగిస్తే పరిపూర్ణ సార్థకత సాధ్యమే. మనసు, మాట, చేత మూడింటినీ త్రికరణాలుగా చెబుతారు.
మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానాం అని ఉపనిషత్తు వాక్యం.
మనసు, వచనం, క్రియ ఏకత్వంగా సాగితే మనుషులు మహాత్ములు అవుతారు.
భిన్నంగా జరిగితే దురాత్ములుగా మిగులుతారు.
మనసులోని ఆలోచనే మాట్లాడాలి. మాట్లాడిన విధంగానే ఆచరణ జరగాలి. మనిషి తన జీవితాన్ని సరైన విధంగా త్రిగుణాల సంయమనంతోనే మలచుకోగలుగుతాడు.
శ్రీరాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వనవాస నిర్ణయాన్ని బలంగా మనసులో నిశ్చయించుకున్నాడు. తండ్రితో, పరివారంతో, ప్రజలతో తన మనసులోని ఆలోచననే గట్టిగా చెప్పాడు. అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో కార్యాచరణ కొనసాగింది. మాట, క్రియ, ఆలోచనల సమన్వయ విధానం శ్రీరాముణ్ని మహాత్ముడిగా నిలబెట్టింది.
దక్షిణాఫ్రికానుంచి అవమానాలతో భారతదేశానికి తిరిగివచ్చిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ బానిసత్వాన్ని నిరసించాడు. దేశమంతా పర్యటించి ప్రజల కష్టాలు గుర్తించాడు. సరైన తిండి, బట్ట, ఆశ్రయం లేని పేదల కష్టాలకు చలించిపోయాడు. అంగవస్త్రాన్నే ధరించి అహింసనే ఆయుధంగా స్వీకరించి పోరాటం సాగించాడు. నిర్మలమైన ఆలోచనలకు సత్యాన్వేషణగా పేరు పెట్టి, స్వాతంత్య్రోద్యమ లక్ష్యంగా నిర్ణయించి సత్యాగ్రహం చేపట్టాడు.
కొందరి మనసులో ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాటిని పదిమందితో పంచుకునే మాటలు మరోలా ఉంటాయి. ఆచరణలో జరిగే తంతు వాటికి విరుద్ధంగా ఉంటుంది. దానికే లౌక్యం, రాజకీయ చతురత అనే అందమైన పేర్లు తగిలిస్తారు. ఎవరిని వారే మోసం చేసుకొనే సంస్కారం మనిషిని పతనానికి చేరుస్తుంది.
సమాజం వ్యక్తుల సమూహం. సామూహిక ధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. మహర్షులు వేదపూర్వకంగా, ఉపనిషత్ ఉపదేశంగా, పౌరాణిక కథలుగా వాటిని నిర్వచించారు. వాటిని ఆకళింపు చేసుకొని, విచక్షణతో, వివేకంతో మార్గాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనలోనుంచే మహాత్ములు ఆవిర్భవిస్తారు.
భక్తితత్వంతో మనిషి మనీషిగా, మహోన్నతుడిగా ఎలా ఎదగాలో భాగవతం వివరిస్తుంది. ధర్మంతో, సహనంతో కార్యాన్ని కొనసాగిస్తే, కష్టాల్లోనూ ధర్మాన్ని పాటిస్తే విజయం తథ్యమని భారతం ప్రకటించింది. సామాజిక న్యాయంతో సధర్మాన్ని పాటిస్తూ, మానవతా విలువలను ఆచరిస్తే మహాత్ముడిగా మారగలమనే సందేశాన్ని రామాయణం అందించింది.
మనుషులంతా ఒకే విధంగా జన్మించినా ఆచరణ విధానంలో కొందరు మహాత్ములుగా మహనీయులుగా వెలుగొందుతారు. వారి మాట, బాట అందరికీ అనుసరణీయాలు.
[02/02, 11:35 am] Prathyusha: ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు.
ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నారు.
గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు.
" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."
"ఏమిటా కోరిక గురువు గారూ"
"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."
"వచ్చే జన్మలోనా"
"కాదు ఈ జన్మలోనే"
శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "
" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"
" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.
ఆది విని " ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు." అన్నారు గురువుగారు.
ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది.
శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.
" *సరిగ్గా, సంవత్సరం తరువాత..*"
ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత విన్నారా…!
శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" అన్నాడు.
దానికి గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా.." అన్నారు.
అంటే..?? అడిగాడు శిష్యుడు.
అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో
ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది.
శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం,
భరతుల వారు 'పాదుకలకి పట్టాభిషేకం" చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.
ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది."
అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు.
" సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది".,
కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.
ఆ భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు..!.
[02/02, 11:36 am] Prathyusha: *పది మందికి - సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం*
*ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..*
*నేను ఎందుకు పేదవాడను?*
*బుద్ధుడు సమాధానం చెప్పాడు:*
మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు,
*నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..*
అప్పుడు *బుద్ధుడు* ఈ విధంగా చెప్పాడు
మీరు ఇతరులతో పంచుకోగల *ఐదు* నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!...
*మొదట* మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ...ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ...
*రెండవది* మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు ..
ఇది నిజం... మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు ... వాటిని మంచి అనుభూతితో చేయండి...
*మూడవది* మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి ... వాటిని విలువైనదిగా భావించండి ..
దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ...
*నాలుగవది* మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది.... మీ దయగల హృదయంతో , భగవంతున్ని ప్రార్థిస్తూ ... మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు ... ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు... వారి జీవితాలను తాకవచ్చు...
మీరు కలిగి ఉన్న *చివరి ఐదవ* సంపద మీ శరీరం .... ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ... అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు....
*సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..*
ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు... భగవంతుడు మనకిచ్చిన జీవితం.. కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
*ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత.*
🌹🙏🌹
న జ జ భా ర స లగ ప్రభాకలిత -12
III IUI IUI UII UIU IU
నేటి కవిత్వం - ప్రభాకలిత
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిరు నగువే మది పుల్క రిన్చుచు సంతసమ్ముతో
మరు లొలకించి సరాగ కాలము సంబరమ్ముగా
కరుణ సమత్వ మనస్సు చెల్లిక నమ్మి పంచుటే
తరుణము సంతస పర్చి పయ్యద సేవ పెంచుటే
మురిపము చూపి సరాగ మాలిక రంగరించుటే
పరువపు గాళము వేసి కోర్కలు పెంచుటేకదా
విరహపు వంపులు రాగలాలన పాలనే కదా
మరువము మల్లెల జాజి దండలు ముద్దుకే కదా
కురులతొ ముక్కులి గింత మైకపు కల్పనే కదా
పరచును నిత్యము సమ్మతమ్మును సంతసమ్ముగా
పరుపు వలే సుఖమిచ్చి కార్యము చేయునే కదా
నిరుపమ సేవలు పొందు కాలము మాటలే కదా
--(())--
[03/02, 1:01 pm] Prathyusha: *పాపాలు - జాగ్రత్తలు..*
********************
పాపాలలో మానసికం, వాచికం, కాయికం- అని మూడు రకాల పాపాలుంటాయని పెద్దలు చెప్పారు. మనసులో చెడ్డ ఆలోచనలు కలగటం, వేరే వాళ్ళకు చెడు కలగాలని కోరటం, ఇతరుల ప్రవర్తనను గురించి లేనిపోని ఊహలుచెయ్యటం పరాయి ఆడవాళ్ళను గురించి చెడుగా ఆలోచించటం, యివన్నీ మానసిక పాపాలు.
మనసులోకి వచ్చిన ఊహలన్నీ పైకి మట్లాడటం, పెద్దలను ఎదిరించి మాట్లాడటం, మహానీయులను వెక్కిరించటం, ఇతరులను గురించి చెడుగా ప్రచారం చెయ్యటం, నిందలు వెయ్యటం, ఎదుటి వాళ్ళను కఠినంగా తిట్టటం, బూతు మాటలు మాట్లాడటం, దారినపోయే ఆడ వాళ్ళను ఏదో అని వాగటం, అబద్ధాలాడటం, యివన్నీ వాచిక పాపాలు అంటే మాటలతో చేసే పాపాలు.
దోంగతనాలు చెయ్యటం, ఎదుటివారిని హింసించటం, జంతువులను పక్షులను కొట్టటం, పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం - యిలాంటివన్నీ కాయిక- అంటే శరీరంతో చేసే పాపాలు.
మనకు తెలియకుండా చేసే పాపాల్లో మానసిక పాపాలు వాచిక పాపాలు ఎక్కువ, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఫలితం అనుభవింపక తప్పదు, తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మానదు కదా.
కనుక మనము వీటి బారిన పడకుండా త్రికరణ శుద్ధిగా ఉండటం అలవాటుచేసుకోవాలి సాధన తీవ్రంగా సాగితే తప్ప త్రికరణ శుద్ధిగా ఉండటం కుదరదు.
👍మనస నిండా గురువు/భగవంతుని ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా మానసిక పాపాలు చేయకుండా ఉండవచ్చు.
📌సదా గురువు/భగవంతుని నామం స్మరణం చేయడం ద్వారా వాచిక పాపాలు చేయకుండా ఉండవచ్చు. శరీరంతో సదా గురువు/భగవంతుని సేవ చేయడం ద్వారా శారీరక పాపాలు చేయకుండా ఉండవచ్చు.
*"తీవ్రంగా ప్రయత్నిద్దాం-మంచి ఫలితం ఆశిద్దాం"*👍👍👍👍👍
న జ జ భా ర స లగ ప్రభాకలిత -12
III IUI IUI UII III UIU IU
నేటి కవిత్వం - ప్రభాకలిత
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మగువలు చెప్పు చుందురు మగసిరి మాటలే
మనసుని మెప్పు పొందురు సొగసిరి పల్కులే
కళలను చూపి పొందుకు తపనలు చూపులే
నగవులు చూపి అందురు ఒకసరి పిల్పులే
కధల సహాయ మందురు ఇకపని చిందులే
వెతల మనస్సు మార్చుము మనపని ఉందిలే
చురుకు తనంతొ ఉండుము మగసిరి చూపులే
బెరుకు తనంతొ దేనికి నలుపుట కైపులే
ప్రతిభ ను చూపి ఆకలి తెలుపుట ముద్దులే
ప్రగతి ని తెల్పి వాకిలి తెరువుట పొందులే
చిగురులు ఆకు తాకియు తపనలు తిర్చులే
మలుపులు ఎన్ని ఉన్నను మగువకు తుప్తిలే
--(())_-
No comments:
Post a Comment