Thursday, 25 February 2021

25--02--2021

 


సమ్మోహనాలు ... ప్రశ్న 1291 ... 1300   
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రేమలేక రాశా
రాసి నా ఓ ఆశా
ఆశా పాశము కు చిక్కాలే ఈశ్వరా

అమితమైన ప్రేమ
ప్రేమ సుఖము దుఃఖమ
దుఃఖము తప్పదు జీవితములో ఈశ్వరా

ధనము కీర్తి ప్రతిష్ట
ప్రతిష్ఠ మనకు నిష్ట
నిష్ట మనిషిగా సంతృప్తియే ఈశ్వరా

మనసులో భోగమ్ము
భోగమ్ము తరుణమ్ము
తరుణమ్ము ప్రేమ లేఖ తోనె ఈశ్వరా

ఇంద్రియములు మనస్సు
మనస్సు కళ తపస్సు
తపస్సు సౌఖ్యమ్ము కొరకుకళలు ఈశ్వరా

నేడు ప్రేమలేఖలు
లేఖతొ పరిచయాలు
పరిచయం ఇరు మనసులను కలిపె
ఈశ్వరా

లోకము ప్రేమమయము
ప్రేమలొ అనురాగము
అనురాగముతో ఇంద్రియసుఖము ఈశ్వరా
 
లేఖనే రాసితిని
రాసియే ఆగితిని
ఆగియు ప్రేమ పంచుటకు లేఖ ఈశ్వరా

కరుణ చూపు ప్రేమా
ప్రేమ తోనె యుగమా
యుగము అంత జీవిత ప్రేమే ఈశ్వరా

ఉషోదయ వెలుగులే
వెలుగుతొ  ప్రేమలే
ప్రేమ జీవితాన నిత్య లేఖ ఈశ్వరా

--(())--
 తేదీ : 25-02-2021 గురువారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#విప్రుని_పుత్రప్రాప్తి*
గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.  మహర్షీ ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా ? నా సందేహమును తీర్చుమని అడుగగా గృతృనమద మహర్షి యిట్లనెను..
జహ్నమునీ ! వినుము.. మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తి నందును. అట్టి కథనొక దానిని చెప్పెదను.. వినుము అని యిట్లు పలికెను.
పూర్వము గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమ శీలుడు, ఆచార వంతుడు, నీతి దయ జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు... అతని భార్యయు నుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో... "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునని విచారపడెను".. అప్పుడామె... నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో ? అందువలన మనకు సంతానము కలుగలే దనుకొందును అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు.. ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదనని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగా తీరమునకు పోయిరి.
బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరి ని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతుల యందును శంఖము, చక్రము, గద, వరమాలను ధరించి యుండెను. వరమాలను పచ్చని పట్టుబట్టను కట్టెను.. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.
తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు.. "విప్రా ! నేను నీకు వరము నీయవచ్చితిని. నీ తపమును మెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై , బాహ్య జ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.
*#విప్రకృత_విష్ణుస్తుతి*
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిల రూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృత మూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)
జహ్నుమునీ..! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శత నామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను.. శ్రీహరి మాటలను విన్న విప్రుడు.. 'స్వామీ ! నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము , ఇహలోకమున పర లోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానము నిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను... శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడ నగుదునని పలికి  అంతర్థానం నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్య మిక్కి లాభము నందినవానివలె సంతసించి తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.
కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచార మగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. "నాధా నీవు తీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితి.. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా ! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను ?" అని భర్తతో పలికెను.
ఆ విప్రుడును భార్య మాటలను విని బాధ పడుచు నామెనోదార్చి యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది.. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా ? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువత నైన మరణింపక తప్పదు కదా ! మరి యీ ముందు వెనుకలు వయస్సులకు కలదు..కాని మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము.. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల ? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము.
ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మ ననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా ? కావున సోకించకు అని యామనూరడించెను... మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము.. అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను..
ఇతి శ్రీ మాఘ పురాణం చతుర్దశ అధ్యాయం పారాయణం సంపూర్ణo...

*💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑*

💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...

💖 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.

💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!

💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

💖 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.2ES

💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.

💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

💖 నేలకు జారిన తారకలై

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

💖 సప్తపది ఏడు అడుగులు

మొదటి అడుగు - అన్న వృద్ధికి

రెండవ అడుగు - బలవృద్ధికి

మూడవ అడుగు - ధన వృద్ధికి

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐదవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి

💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.

💖 వివాహాన్ని సుఖమయం

 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

💖 కలిమి లేములతో...

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

💖 మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)

ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

💖 భర్తకి భార్య బలం కావాలి

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదుభార్యా భర్తల బంధం 

అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.

మనసులోనిప్రేమని,బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

💐💐💐💐💐💐💐💐💐💐

✍️ 60, 65 సంవత్సరాలు దాటిన ఆడ, మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు 🌴

👉 (1) మీరు బాత్రూంలో వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు. మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.

                                                                                                       👉 (2) తడిగా ఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ, టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు, అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.

                                                                                                          👉 (3) ఫ్యాన్ లు, ఫోటోలు తుడవడానికి గానీ, రిపేరు చేయటానికి గానీ, గుడ్డలు ఆరవేయటానికి గానీ స్టూళ్ళు, కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి.

                                                                                                          👉 (4) కారు గానీ, స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి. 

                                                                                                           👉 (5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటి కంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. 

                                                                                                                              👉 (6) మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ, ఆనంద పరిచే విషయాలలో గానీ, మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు. 

                                                                                                                👉 (7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా, మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను) తీసుకవెళ్ళండి. వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.

                                                                                                                      👉 (8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించేయండి. జాగ్రత్తగా ఉండండి. 

                                                                                                                  👉 (9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర, రెండోది మీ భార్య దగ్గర. 

                                                                                                                              👉 (10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం రావచ్చు. 

                                                                                                                   👉 (11) ఇంట్లో వారితోను, బయటి వారితోను మాట్లాడే టప్పుడు మర్యాదగా, మృదువుగా మాట్లాడండి. కోపంగాను, రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.

                                                                                                                     👉 (12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ, జరిగేదాని గురించి గానీ, జరుగబోయే దాని గురించి గానీ ఆలోచించ వద్దు, జరిగేది జరుగక మానదు.

                                                                                                                👉 (13) ఈ వయసులో మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం. 

                                                                                                        ✍️ Note : మీరు వీలు చేసుకుని + ఓపిక చేసుకుని చదవండి చదవమనండి 

 *శ్రీ మహావిష్ణువుకే వరాలిచ్చిన వాడు గరుడుడు* 

🙏🕉️🛕🏵️🦅🐄🌹🛕🙏

      గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహా బలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. *ఈ గరుడుడు మహావిష్ణువుకు వాహనం ఎలా అయ్యాడు.?* 

      కశ్యప ప్రజాపతి, వినత ల రెండవ పుత్రుడు గరుడుడు. సూర్యుని రథసారథి అనూరుడు ఇతని అన్న. కశ్యప ప్రజాపతి మరో భార్య కద్రువ. ఈమె సర్పములకు తల్లి. అనూరుడు తన తల్లికి ఇచ్చిన శాప ఫలితం వినత, కద్రువకు దాసీగా అయి పోతుంది.

       తల్లికి దాసిత్వం  నుండి విముక్తికి,  కద్రువ అమృతం కోరుతుంది. గరుడుడు అమిత శక్తి శాలి. తారక్ష్యుడు -అనేది గరుత్మంతుడికి మరోపేరు. కశ్యపాత్మజుడైన గరుడుని బలపరాక్రమాలు అనన్య సామాన్యాలు. సువిశాల మైన రెక్కల చేత విసర బడిన గాలులు పర్వత సమూహాలను సైతం చలింప చేస్తుండగా, వేగం మహా సముద్రాలనే అల్లకల్లోలం చేస్తుండగా, తన శరీర కాంతి సూర్యప్రకాశాన్నే అధిగమించగా జన్మించిన వాడు గరుడుడు.

      తల్లికి ప్రీతిని కలిగిoచ అమృతానికై, మహావేగంతో ఒక్కసారిగా ఆకాశవీధిలోకి ఎగిరాడు. కద్రువ పుత్రులు నాగరాజులైతే వినత సుతులు పక్షినాథులు. గరుడుడు స్వర్గంలో నున్న అమృతం ఉంచిన కోశాగారం వెళతాడు. అతని పై యుద్ధానికి వచ్చిన దేవతలు, గరుడుడు రెక్కల గాలి ధాటికి తమ వాహనాల పై నుండి క్రిందికి పడిపోతారు. 

    అమృతానికి రక్షగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి ఉంటారు దేవతలు. దాని పేరు *కర్తరీ యంత్రం* . ఈ యంత్రం మనో వేగంతో తిరుగుతూ, తన వద్దకు ఏది కానీ ,ఎవరు  వచ్చినా కానీ, ఖండ ఖండాలుగా చేస్తుంది. గరుడుడు తనరూపాన్ని వెయ్యివో వంతుకు కుదించి యంత్రo క్రిందకు చేరి, వాయువును శరీరంలో బంధించి, శక్తినంతా కూడగట్టుకొని, అమృతం తీసుకొని ఆకాశమార్గాన బయలు దేరుతాడు. అతనిని ఎదిరించ,  భయపడిన దేవతలు విష్ణువుకు చెబుతారు. విష్ణువు, గరుడుడుని ఎదిరిస్తాడు 

     కొద్ది సేపు పోరాటం జరిగిన పిదప, అతని సాహసానికి, మాతృ భక్తికి మెచ్చి, గరుడుడితో నేను ప్రసన్నుడయ్యాను ఏమి కావాలో కోరుకోమని, విష్ణువు నుడువగా, ప్రతిగా గరుడుడే నవ్వుతూ, *నేనే ప్రసన్నుడయ్యాను "నీవే రెండు కోర్కెలు కోరుకో'-* అని విష్ణువుతో అంటాడు. 

       అందుకు చక్రి *"ఓ పక్షీoద్ర! నీవు నాకు వాహనం కావాలి, రెండవది ఈ అమృతం తో నీతల్లి దాస్యవిముక్తి గావించి, దీన్ని వారు స్వీకరించే ముందే తెచ్చి దేవతలకు ఇవ్వాలి";* అని  రెండు వరాలు పుచ్చుకుంటాడు, శ్రీహరి.

      దాశ్యం నుండి విడుదలయిన తల్లి, 'దాశ్య పాపవిముక్తి"కి, కాశీ వెళ్లగా తాను కాశీ వెళతాడు గరుడుడు. అక్కడ శాoభవి లింగాన్ని తాను ప్రతిష్ఠింప, తల్లి ఖఖోల్కడు అనే అదిత్యుని ప్రతిష్టించి, తపం చేస్తారు. సూర్యుడు ఒక వైపు,  లింగం నుండి హరుడు, ప్రత్యక్షం అవుతారు. భవుడు గరుడుడితో నీవు ప్రతిష్టించిన  ఈ లింగం ' *గరుడేశ్వర'* మను పేరిట ఖ్యాతి పొందుననియు, నీవు విష్ణువుకు వాహనం కమ్ము"- అనిచెబుతూ, విష్ణువు అయినా నేనైనా ఒకటే, మా మధ్య భేదం లేదని, అనేక వరాలిచ్చి, అంతర్ధానమవుతాడు.

    *ఇదే విష్ణువాహన కథ.* 

🔱🔱🔔🔱🔱🔔🔱🔱🔔

సందర్భోచిత పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కవి కలంకదిలేన్యాయ కౌలు కొరకు
ధర్మ దేవత కన్నీరు తుడుపు కొరకు
నిజము నిద్రపో కయు ఉండి నడుపు కొరకు
మనిషి జీవితంలో మాయ మాపు కొరకు

భాగ్యు రాలిని నీరాగ భావ వ్యాప్తి
భవ్య చరితము ప్రేమతో బలము తృప్తి
హృదయ వాసిని ఆశయం కొదమ దీప్తి
కౌగిటను బంది చేయరా కలల ప్రాప్తి

కళ్ళ చూపులు అలలాగ కదులు చుండె
ఆద మరచిచార్చిన చీర కళ్ళు తాకె
ఆకలికి తాళలేక యు కళ్ళ మెరుపు
స్వర మేదోను పిలుపుగా చీర కళ్ళు

రమ్య మైనట్టి రాగమే రసమయమ్ము
అంత రంగాన ఆనంద రమ్య మయ్యె
ప్రకృతి పరవశం  నాలోన ప్రీతి గొలిపె
వెన్నెల తరంగ మాధుర్య వేగుచుక్క

కలలు తీర్చేటి మనసైన కావ్య కొవ్వు
మనసు మైమరి పించేటి మగువ నవ్వు
ఎదలొ కలవర పరిచేటి ఎర్ర పువ్వు
ఎదను పందిరి చేసియు ఏక మవ్వు

అడుగులాగవు కలగతి కవిత కొరకు
కనికరము కాల నిర్ణయం కవిత మల్లె
అలుపెరుగని ది కవిగాంచు భానుమతి యు
చరమ గీతము కళలేలు కవిత లేలు

ఒకరి కొకరిగా కలసియు ఓర్పు చూపి
ప్రేమ విలువను నలుగుర్కి పెంపు చేసి
వయసు కూడాను చూడక విద్య వ్యాప్తి
పరుల సేవపరముగాను పలుకు తెల్పు


దివ్య జ్ఞాన సరస్వతి దేవి పిలుపు
దివ్య హృదయపు జ్యోతి గా  దేవి పిలుపు
దివ్య రూపమే మనసులో దేవి పిలుపు
దివ్య సందర్శనతొ దయ దేవి పిలుపు

అతని నివాసము నిత్య తెలుగు భాష
అతని కవిత్వ ముకలల తెలుగు భాష
అతని అమృతభాండముగాను తెలుగు భాష
అతడు కృష్ణ శాస్త్రి గారు గురువు గారు

మెరుగు పెడితే ను వజ్రాన్కి మెరుపు వచ్చు
కష్టములను ఎదుర్కొన కలలు తీరు
వెల్గు దీపమె వ్యక్తిత్వ వేగుచుక్క
బుధ్ధి వెలుగుల నీడలా మారు చుండు


 *సుబ్రహ్మణ్యుడు..హనుమంతుడు* 

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

*మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!*

*హనుమంతుని వాహనమేది?* 

వాయు వేగంతో ఎక్కడికైనా వెళ్లగలిగిన స్వామికా వాహనం అవసరమా! లేదు. కానీ ఒకానొక సమయంలో ఆ స్వామి ఒంటెను తన వాహనంగా చేసుకొన్నారు. హనుమకు మొట్టమొదటి సారి, శ్రీరామచంద్ర దర్శనం, పంపానదీ తీరంలో జరుగుతుంది. అప్పుడు సుగ్రీవమైత్రి జరిగిన పిమ్మట, ఆ నదీ తీరంలో తిరుగుతూ వుంటారు. వారి దర్శనార్థం ఇసుక తిన్నెలపై నడవడానికి ఒంటెను వాడినట్లుగా, పరాశరసoహితలో పేర్కొన బడినది.

       అదీగాక రామసేతు సముద్రతీరంలో, ఆ సేతువును ఒంటె పై, ఆ ఇసుకలో సంచరించినట్లు, రామాయణంలో వ్రాయ బడినది.

 *సుబ్రహ్మణ్యుడికి ఇద్దరు భార్యలా?*  

ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయము అయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచము లోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్నుగాయ పరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ప్రతి స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడ లేను అనుకుని నెమలి వాహనుడు  బ్రహ్మచారిగా వుండి పోయాడట.

      ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగాసుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో పూజిస్తారు.  సుబ్రహ్మణ్యస్వామి వారికి ఇద్దరు భార్యలుఅంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథ శక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలా ధార చక్రములో ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.

         ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియ శక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీ దేవి, దేవసేనా అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడి కి పత్నులు.

 *అరుణాచల గిరి ప్రదక్షిణం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

అరుణాచలేశ్వరుడు 

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. 

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.  అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. 

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. 

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. 

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

(మూలం : శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారి ప్రవచనం ఆధారంగా)

*నెమలి పించం*

చాలాకలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఈక అయినప్పటికీ... మన రోజు వారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే... నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుంది. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా... వారికి నెమలి పించం ఇస్తే చాలు... మార్పు వస్తుంది. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. మార్పు కనిపిస్తుంది. నెమలి పించంను ఎలా వాడాలో తెలుసుకుందాం.

రాహు దశలో ఉంటే 

 కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ (Pillow) కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుంది.

పనులు ఆలస్యమవుతుంటే : గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే... అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

ఏకాగ్రత పెరగడానికి : పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే... పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే... అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి.

వాస్తు దోష నివారణకు : నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతోపాటూ... ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు... ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తులు)ని కూడా తరిమికొడుతుంది.

 *మంగళవారం కొత్త బట్టలు కొనకూడదట..*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


May be an image of 1 person

  మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదే విధంగా ఇదే సమయంలో ధరించకూడదు.

👉  ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.

👉  శనితో సంబంధమున్నందను మంగళవారం నూతన దుస్తులుతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.

👉  అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది.

👉  ఆర్థికం పురోగతి కోసం మంగళవారం నుదిటిపై కుంకుమ లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

 *గరుడ కవచ స్తోత్రం :*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

👉 కాలసర్పదోష(యోగం) నివారణకు, నాగదోష నివారణకు, బందనముల నుండి విముక్తి కొరకు, శత్రుభాదల కొరకు గరుడ కవచ స్తోత్రం త్రికరణ శుద్దితో పఠించిన సర్వ పాపములు తొలగిపోవును. గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది.

👉 జాతకచక్రంలో గ్రహాలు అన్ని రాహు కేతువుల మద్య ఉండి మిగతా రాశి భావాలు ఖాళీగా ఉండటం వలన ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి.

👉 కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.

👉 మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.

👉 పంచమంలో రాహువు ఉండటం వలన పూర్వజన్మలో శాపం వలన ఈ జన్మలో సంతాన దోషాన్ని అనుభవిస్తున్నారని పరాశర మహర్షి తెలియజేసిన గ్రంధాల ఆదారంగా తెలుస్తుంది. వీటి నివారణకు గరుడ కవచ స్తోత్రాన్ని గురు ముఖంగా పఠించటం వలన సంతాన దోషాన్ని తొలగించుకోవచును.

👉 దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగదేవతను గాని దుర్గాదేవిని గాని పూజించుకుంటూ గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక బాధలు తొలగించుకోవచ్చును.

👉 అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

] Akiraju Sridhar: ఇప్పుడొక గోదావరి జిల్లా కామెడీ సంఘటన.

శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ పెళ్ళికి రెండు రోజులు ముందుగా హైదరాబాద్ నుండి బయల్దేరి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు.

శ్రీనివాస్ తన ఫ్రెండ్ వెంకట్ వాళ్ళ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే శ్రీనివాస్ ని చూసి వెంకట్ తల్లి "రా బాబూ రా. బావున్నావా? ఇంతకీ దేనికొచ్చావ్?" అనడిగింది. శ్రీనివాస్ కి "దేనికొచ్చావ్?" అన్న ప్రశ్న ఎందుకడిగారో అర్ధం కాలేదు. కొంపదీసి పెళ్ళి ఈ నెల కాదా అనుకొని కాళ్ళు కడుక్కోవడానికెళ్ళాడు. అంతలో టవల్ తీసుకొచ్చిన వెంకట్ చెల్లెలు శ్రీనివాస్ ని "అన్నయ్యా బావున్నావా? దేనికొచ్చావ్?" అని అడిగింది. మళ్ళీ "దేనికొచ్చావ్?" అనే ప్రశ్న.  శ్రీనివాస్ కి "పెళ్ళి తేదీ తనేమన్నా తప్పుచూసాడా ఏంటీ, ఎందుకొచ్చావ్ ఎందుకొచ్చావ్" అని అడుగుతున్నారు" అని అనుమానం పెద్దదైంది. పెళ్ళి తేదీ ఎప్పుడు అని అడిగితే ఏమనుకొంటారో అని మొహమాటంతో అడగలేదు. కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వెళ్ళగానే అక్కడ వాలు కుర్చీలో కూర్చున్న వెంకట్ తండ్రి శ్రీనివాస్ ని "బాబూ బాగున్నావా? దేనికొచ్చావ్?" అనడిగాడు. శ్రీనివాస్ "ఏంటీ ఇంట్లో అందరూ దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే ప్రశ్న. కొంపదీసి పెళ్ళిగాని కేన్సిల్ అయ్యిందా ఏంటీ". అదేమాట అడుగుదామా అనుకొని ఫ్రెండ్ వచ్చాక వాడినే అడుగుదాం అని బయటకెళ్ళిన ఫ్రెండ్ వెంకట్ రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన వెంకట్ శ్రీనివాస్ ని చూస్తూనే "ఏరా శ్రీను ఎంతసేపైంది వచ్చి? దేనికొచ్చావ్?" అన్నాడు. శ్రీనివాస్ కి సహనం సన్నగిల్లింది. ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా పెళ్ళికి పిలిచి ఇప్పుడు ఇంట్లో అందరూ "దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. పెళ్ళి కేన్సిల్ అయ్యిందా ఏంటీ?" అని అడిగాడు. వెంకట్ నవ్వాపుకొంటూ అరేయ్ "దేనికొచ్చావ్? అంటే గోదావరోళ్ళ అర్ధం ఏ బండెక్కి వచ్చావ్? బస్సుకా, రైలుకా? తెలుసుకోవడానికి" అని చెప్పగానే శ్రీనివాస్ కి విషయం అర్ధమై నవ్వుకొన్నాడు. 😂😀
సో... గోదావరోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు "దేనికొచ్చావ్?" అనడిగితే కంగారుపడిపోకండి సుమీ! 😀
 

 Akiraju Sridhar: " నవసాహితి " AP chapter వాట్సాప్ గ్రూపులో DR . Rajarao Tripuraneni గారి పోస్ట్ ఇది . నాకు బాగా నచ్చింది .  వారి అనుమతి తీసుకుని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .

                         🙏🙏🙏🙏🙏🙏🙏

'' నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.

ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న  విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ  పట్టలేకపోయేవారు.

ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.

ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే !  

ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego]  నింపాయి.

ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర  వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి.
ఆయన ఇలా అనుకొన్నాడు ...

నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కుతాను .

అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది.

శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.

దేవత వెతుకుతూ వస్తోంది.
ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి .
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు.
అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! ''  అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో
 '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అబద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేక పోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది "  అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.

అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు ,  ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.

మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి  
" అహం " తీసేస్తే మిగిలేది " భావం " అంటే " అర్థం "

అర్థమైతే అనర్థం జరగదు.

--(())--




No comments:

Post a Comment