Monday, 1 February 2021

02-02-2021


 
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  
వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు
III  UUI UUI IIUU UI --16

మదికి బోధించి సద్భుధ్ధి కలిగించే జన్మ
వినయ విశ్వాస సద్భావ మనిపించే జన్మ
కరుణ రసాత్మ కారుణ్య తలపించే జన్మ
సహజ సిధ్ధమ్ము సామాన్య మనిపించే జన్మ

వినతి పత్రాలు విద్వేషి వినిపించే జన్మ
అహము పెర్గాక ఆద్యంత కనువిప్పే జన్మ
మలిన మాధుర్య మాద్యంత మనిపించే జన్మ
వికల విశ్వాస ముపేక్ష కలిగించే జన్మ

అనెడి మిత్రుండు ఒక్కండు అనిపించుజన్మ
అది నొసంగాక ఆరోగ్య మనిపించు జన్మ
దినకరుండేను దివ్యంబు మనిపించు జన్మ
దొరకు పుణ్యంబు సత్యమ్ము అనిపించు జన్మ

కళలు మెప్పించు ఉద్యోగ మనిపించే జన్మ
కలలు తీర్చేటి తత్మాయ మనిపించే జన్మ
గుడికి వెల్లాక శాంతమ్ము అనిపించే జన్మ
బడికి పొయ్యాక కాలమ్ము కనిపించే జన్మ

ప్రకృతి నేర్పేటి పాఠాలు మనసిచ్చే జన్మ
మదన మాధుర్య మాంధవ్యమనిపించే జన్మ
సుఖము సంతోష సామర్థ్య మనిపించే జన్మ
కధలు కవ్వింపు కాఠిన్యమనిపించు జన్

--(())--

 

 

 -------------------

🌻 *మహానీయుని మాట*🍁

        -------------------------

"పోటీ లేని గెలుపు,

 కష్టపడకుండా వచ్చే డబ్బు,

 నమ్మకం లేని బంధం

ఇవి ఏవీ తృప్తినివ్వవు."

       --------------------------

🌹 *నేటీ మంచి మాట* 🌼

      ---------------------------

"నీ దగ్గర ఏమీ లేదు అంటే అది నీ తప్పు కాకపోవచ్చు. కానీ

నీ దగ్గర ఒక స్నేహితుడు కూడా లేడంటే మాత్రం అది నీ తప్పే."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 *💠సీనియర్‌ సిటిజన్లకు బడ్జెట్‌లో ఊరట*

*⏺️దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది.75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.*

*🌀పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం, రూ.10లక్షల లోపు వివాదాలు ఉన్నారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది*


పుడమి తృప్తి తో హర్షం

లోకం నిజాలు హర్షం

జగతి గ్రంథం హర్షం

జ్నాన బంధంతొ హర్షం

*****


 UII III IIUUI IIII IIU .... 17

ఈ చిలక కల వెలుగే రంగుల కథల మలుపే  
హంగుల తెలుపు వగలే పొంగులు కలసి సెగలే  
వేడి వలపు సొగసులే వేకువ పలుకుల వలే  
శోభల తలపు తెలిపే మాటలతొ చిరు నగవే

వేకువ సరయు నదికీపొంగు కడలి ఉరకలే
నంద భవ బగ తలపే స్వర్గ సుఖ కల ఒకటే
ఏకము అగుట కొరకే ప్రేమను తెలుపుటకుయే  
దీప వె లుగుల మమతా నందము శుభము కలిగే

ప్రీతి మనసు కదలికే ప్రీతి గొనుట మధురమే
నిత్యము గొలుపు గళమే ఒక్క నిముషపు సుఖమే  
పిచ్చి మనసు తనువునే కూర్చియు వలపు తలపే
వాంఛ ఫలితము తరుణా నంద సుమధుర కథయే

జీవిత మునకు సమ భావాల మగువకు మగడే
సొంతమగుటకు మదనానంద సుఖముల కొరకే  
ప్రీతి కొరకు నటననే చూపియు నగువులొలికే
హృధ్యము తపన తెలిపే శృతి పలుకులు చిలికే

మౌనపు కిరణ వెలుగే పొద్దు తిరుగు లతలకే
తామర లతల సెలయేరూ పరిమళము కొరకే
కాలము కలయ వరుసే భావము తెలుపు మనసే
ఏకము అగుట ఒకటే ప్రేమను కలుపు తరుణం
--((**))--



విమానం లో భోజనం 

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి . 

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను . 

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను . 


" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను . 

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .


నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు 

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 


ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను. 

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు " 

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !

మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !


ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే. 

                  - జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳


Mallapragada: _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_

_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._

_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._

_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._

_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._

_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._

_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._

_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._

_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._

_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_

--(())---

[01/02, 6:46 am] తెలుగు1: *సంభాషణ ఒక కళ!*

👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01

సంభాషణ ఒక కళ. భావావసరాల బహిరంగ ప్రకటనే దాని లక్ష్యం రఘువంశ రాజుల మితభాషిత లక్షణాన్ని కాళిదాసు మనోహరంగా వర్ణించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి గుణగణాల వర్ణన సందర్భంలో సత్యసంధత, ప్రశాంత చిత్తం, మృదుభాషణ, పరుషపద ప్రత్యుత్తర నిరాకరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తాడు నారద మహర్షి. సీతారాములవారి ఆభరణాలు చౌర్యచర్యకి గురైన వేళ బాధపడే భార్యతో ‘సుగుణ భూషణుడైన నా రాముడికి వేరే విభూషణాలు అవసరమా?' అని అడుగుతారు త్యాగరాజ భాగవతారు. బల, అతిబల, జృంభకాది అస్త్రాధిదేవతల ప్రతినమస్కృతులకు రామచంద్రుడు అర్హుడయిందీ ఆ వినయభూషణ పదసంపదల కారణంగానే. 'ప్రేమాస్పదమైన పలుకులకు నోచని 'వాయి' పాడుబడ్డ నూయ'ని హితవు చెప్పే కథలు పురాణాలు, ఉపనిషత్తుల నిండా కోకొల్లలు. విశ్వశ్రేయస్సు  కావ్యప్రయోజనమని లాక్షణికుల ఆంక్ష. 'కడుపునొప్పికి వాము దివ్యౌషధం' అన్నకావ్యం విశ్వశ్రేయస్సును  ఆకాంక్షించే మంచి వాక్యమే. ఐనా కావ్యమెందుకు కాలేదు? లాక్షణికుల నిర్దేశించిన 'రసాత్మకత' లేదు కనక. 'పూరుషుని భూషితు జేయు' పవిత్ర వాణిలో సదా ప్రస్ఫుటించాల్సింది సాదర రసజ్ఞత.  ఏనుగు లక్ష్మణ కవి తెనిగించిన భర్తృహరి సుభాషితం చెప్పేదీ అదే.  'అరయ సంసార విషభూరుహంబునకును, అమృతఫలములు రెండు.. సరసకావ్యామృతపు రసాస్వాదన మొకటి; జ్ఞానులగు వారితోడి సాంగత్యమొకటి' అని బండారు తమ్మయ్య చాటువు అన్ని కాలాలకూ వర్తించే సుఉక్తి. 'కొండెగాడు ధనము గొల్లగొట్టు కంటె/బాధ పెట్టు మదిం గటు భాష' అన్న గోవర్ధన సుభాషితం అంతరార్థం అర్థమయితే నోరు ఒక పొల్లు మాట జారే ముందు నూరు సార్లు యోచిస్తుంది. నెత్తురు జుర్రే మశకం చెవిలో గీ పెడుతునప్పుడే కదా బాధంటే ఏదో అనుభవానికి వచ్చేది! కటుభాష కోటి దోమల పెట్టు. కాబట్టే గర్భాం అప్పారావు అనే అభ్యుదయ కవి తొంభై ఏళ్ళ కిందట 'ఈశ్వరుని గూడ మూర్చ నొందించితంచు/ గడియలో లోకమును గాల్పగలనటంచు/ కాలకూటవిషమ, యేల గర్వపడెదు?/నిన్ను మించెడు వారు కలరు కలరు/విసము బూసిన కత్తుల విధము దోచు/నాలుకల తోడ స్నేహబంధంబు గోయు/ఖలులు' అని గగ్గోలు పెట్టింది. సూకరా- అంటే తిట్టు. శ్రీకరా- అంటే ఒట్టు. మాటలోని తేడాని తెలుసుకొని మసలాలి. కుండ ఓడు దాని పలుకును బట్టి. మనిషి గట్టి నోటి మాటను బట్టి.

మాటలతో కోటలు సాధించవచ్చు. మంటలూ రగిలించవచ్చు. పుష్పలావికలు మాలలతో పాటు మాటలూ గడుసరితనంతో అమ్మిన వైనం మనం ఆముక్తమాల్యదలో గమనించవచ్చు. పలుకు పట్టుపడడానికయితే  మొదటి రెండేళ్ళు చాలంటారు మనిషికి. మంచి మాటకో? జీవితం చాలదు. 'ఇవతాళించును జందన క్రియను, హాయింగూర్చు మందానిల/మ్మువలెం, గూల్చును గంగపోలిక నఘంబుల్, చెప్పనెవ్వండగున్/ భవదుత్తుంగతరంగముల్ త్రిజగతీ ప్రఖ్యాతముల్ పూతముల్ ' అని వాగ్ధోరణిని గూర్చి కీర్తించారు చల్లా పిచ్చయ్య శాస్త్రి గారు. వాక్కు పదును కత్తివాడికి లేదు. నోరు మంచే ఊరు మంచి. శారికలా పలికితే శభాష్ అంటాం . తీతువులా వాగితే వాచాలత కింద చీదరించుకుంటాం. అలాగని నోరు తెరిస్తే చాలు వరహాలు రాలిపోతాయన్నట్లుగా సంభాషణ సాగుతున్నంతసేపూ నాలుకకు జిగురు రాసుకున్న చందంగా కూర్చోడం కుదరదు కానీ, వేధించే వెకిలి కూతల దారి వదలుకొమ్మనే 'సౌరభ్యమ్ము కొరంత యైన సుమనోజాతమ్ము చందంబు వాచాలత్వంబు' లాంటి సూక్తులు లక్షలు పుట్టుకొచ్చింది. 'వేదంబుల్ తలక్రిందుగా జదివి షడ్వేదాంగముల్ నేర్చియున్/ వేదాంతార్థ ముపన్యసించి కడు గర్వింపంగ బ్రాప్తించునే ప్రాక్కర్మ?' అని ప్రశ్నించాడో కవి. ప్రశ్న వెనకున్న తర్కం అర్థం చేసుకుంటే ఉత్తమం. జ్ఞానపీఠ గ్రహీత సినారె చెప్పినట్లు 'మనసు నంటిన అహంభావము మంచు మాదిరి కరిగితేనే మనిషి లోపలి దేవతాత్వము మణిమకురము వోలె’ భాసిల్లేది. మనుషులంతా సహోదరుల మాదిరి పరస్పర ప్రేమాభిమానాలతో జీవించగల్గితే మర్త్యలోకం దివ్య పదవికి మారుపేరై పరిమళిస్తుంది'. నిజమే కానీ, 'ఆ బంగారు కాలమేనా ప్రస్తుతం నడుస్తున్నద'న్నది కలత పెడుతుతున్న  ప్రశ్న. ఖరమృగాదులే మేలన్న చందంగా సంభాషణా శక్తి దుర్వినియోగమవుతున్నచందం బాధాకరంగా లేదూ! 'ఎదుటి దీపం మలిపితేనే మన దీపానికి వెలుగు’ అనే  వింత తెగులు ఎంత తొందరగా తొలిగితే సంఘానికి, దేశానికి కూడా భవిష్యత్తు అంత మెరుగు!

✍🏻కర్లపాలెం హనుమంతరావు

[01/02, 6:46 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


మన సంప్రదాయంలో అనుకూలమైన పరిస్థతులు సృష్టించాలనుకుంటే మొట్ట మొదట మనం చేసేది దీపం వెలిగించడం. మీలో ఎంతమంది రోజూ దీపం వెలిగిస్తారు? కేవలం దీపం వెలిగించి మీరు అక్కడ కూర్చుంటే - ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు - అది మార్పు తీసుకు వస్తుందా?   మీరు భగవంతుడితో సంభాషించడానికి ముందు తగిన వాతావరణం సృష్టించాలి. అదిలేనప్పుడు మీరు ఒక గోడతో మాట్లాడుతున్నట్లవుతుంది.

అగ్ని వివిధ రకాలు. జీవితమే జ్వాల. సూర్యుని అగ్ని వల్లనే ఈ గ్రహం మీద జీవనం సాధ్యపడుతున్నది. మానవ శరీరంలో అగ్ని, జఠరాగ్నిగా వ్యక్తమౌతున్నది. మీకు ఆకలి వేసేది జఠరాగ్నివల్లనే. జీర్ణకోశంలోని అగ్ని, లైంగిక పరమైన అగ్ని. జీర్ణకోశంలోని అగ్ని సంతృప్తి చెందిన తరువాతనే లైంగిక అగ్ని రాజుకుంటుంది. ఆకలి కడుపుతో ఉన్న వాడికి లైంగిక పరమైన ధ్యాస ఉండదు. జఠరాగ్నిని పరివర్తన చేస్తే అది చిత్తాగ్నిగా మార్పు చెందగలదు. బుద్ధి పరంగా పదును పెరుగుతుంది. మీ బుద్ధి పెరుగుతున్నందు వల్ల, ఆహార, లైంగిక సంబంధమైన ఆసక్తి తగ్గుతుంది.

ఈ చిత్తాగ్నిని భూతాగ్నిగా పరివర్తించవచ్చు. భూతాగ్ని మౌలికమైన అగ్ని. యోగి మౌలికపరమైన అగ్నితోనే ఉంటాడు. యోగులను కొంత కాలం పూడ్చి పెట్టడం, (కొద్దిసేపు ఉపిరి ఆపి వేయడం, గుండె ఆపివేయడం)  వారు విషం లేక పాదరసం త్రాగడం వంటి విషయాలు మీరు వినే ఉంటారు. ఇవన్నీ వారు యోగులని చూపించుకోవడానికే, ఎందుకంటే యోగులు కాకుంటే ఇవి వారికి మరణం తెస్తాయి. మీ భూతాగ్ని పదునుగా, క్రియాశీలంగా లేకపోతే మీరు పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. సర్వాగ్ని అని మరొకటుంది- ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళవద్దు. ఈ మూడింటిలో, ప్రతి ఒక్కరిలోనూ కొంత జఠరాగ్ని ఉండి తీరుతుంది.

చితాగ్ని ప్రజ్వరిల్లితే మీ మేధస్సు అగ్నిలా ఉండగలదు - అది మీ తావుని వెలుగులతో నింపుతుంది. కామిక్ పుస్తకాలలో కూడా ఒక పాత్రకి కొత్త ఆలోచన వచ్చినప్పుడు దానిని లైటు బల్బుతో పోలుస్తారు, ఎందుకంటే మేధస్సు రగులుకుంటే అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. దీనితో మీరు వేడిని కూడా పొందవచ్చు. మౌలికాగ్ని మీలో రగులుతుంటే అది వేరుగా ఉంటుంది- అది సీతలాగ్ని. మీలో మౌలికాగ్ని ఉన్నప్పుడు, జీవిన ప్రక్రియ మీద మీకు పట్టు ఉంటుంది. ఎలా జన్మిస్తారో, ఎలా జీవిస్తారో, ఎలా మరణించాలనుకుంటున్నారో లేక మరణించ కూడదనుకుంటున్నారో, ఇవన్నీ మీ ఎంపిక అవుతాయి.

ఈ కధతో పాటు, ఈ అవకాశం ఉపయోగించుకుని, మీరు మీ జఠరాగ్నిని చితాగ్నిగా, చితాగ్నిని భూతాగ్నిగా మార్చుకోవాలని నా కోరిక.

మహాభారతంలో మీకు మూడు రకాల వ్యక్తులు తటస్థపడతారు. విపరీతమైన జఠరాగ్నితో రగులుతూ ఉండేవారు - తినాలన్న కోరిక, సొంతం చేసుకోవాలన్న కోరిక, లైంగిక పరమైన కోరిక, జయించాలన్న కోరిక. ఇంకొందరు అసాధారణమైన చిత్తాగ్ని కలిగి ఉన్నారు. వారి బుద్ధి ఎటువంటిదంటే మామూలు మనుష్యులు 1000 సంవత్సరాల తరువాత చూడగలిగినది వీరు ఇప్పుడే  చూడగలరు. ఇంకొందరు భూతాగ్ని కలిగి ఉన్నారు. వీరికి తమ జీవితంపై పూర్తి పట్టు ఉంది. ఎప్పుడు, ఎలా పుట్టాలి, ఎలా జీవించాలి, ఎప్పుడు మరణించాలి, జీవన మరణ ఎంపికలు కూడా వీరి చేతుల్లోనే ఉంది. ఈ మూడు రకాల మనుష్యులను కలసినప్పుడు మీరు వారిపై న్యాయాన్యాయ నిర్ణయాలు చేయకండి. వీరందరికీ పోషించవలసిన పాత్రలున్నాయి.

ఈ కధతో పాటు, ఈ అవకాశం ఉపయోగించుకుని, మీరు మీ జఠరాగ్నిని చితాగ్నిగా, చితాగ్నిని భూతాగ్నిగా మార్చుకోవాలని నా కోరిక. మనం ఒక ప్రాధమిక భూతశుద్ధి ప్రక్రియని చేద్దాము, అది మీలో కొంత భూతాగ్నిని చేర్చుతుంది. మీలో భూతాగ్ని ఉండడంవల్ల లాభమేమిటంటే మీరు దీపం వెలిగించనవసరంలేదు, యగ్న హోమాలు చేయనవసరం లేదు గుళ్ళూ, గోపురాలకు వెళ్ళనవసరం లేదు. నేను మీరు చేయనవసరం లేదు అంటున్నాను, చేయకూడదు అని కాదు ఎందుకంటే మీలో మౌలికాగ్ని ఉన్నప్పుడు మీ అంతట మీరే అస్థిత్వం అయిపోతారు.

ఈ కధలో, కృష్ణుడు ఈ మూడు అంశాలకు మధ్యా తిరగటం, సమర్ధించటం మీరు చూస్తారు.

ఈ కధలో, కృష్ణుడు ఈ మూడు అంశాలకు మధ్యా తిరగటం, సమర్ధించటం మీరు చూస్తారు. జఠరాగ్నితో ఉండాలని కోరుకుంటే మొత్తం జఠరాగ్నిగా - తినడం, పోరాడటం, ప్రేమించడం మరెవ్వరూ చేయనట్లుగా చేస్తాడు. చితాగ్నిగా ఉన్నప్పుడు అతనికి మించిన ముందు చూపు ఉన్నవారు లేరు. భూతాగ్నిగా ఉంటే సంపూర్ణంగా అదే. మూడు ఆటలలో దిట్ట. మీరు మూడింటినీ కొద్దిగానన్నా స్పృశించాలని నా కోరిక.

[01/02, 3:44 pm] . Mallapragada: విమానం లో భోజనం 

.

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి . 


సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను . 


ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

.

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను . 


" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను . 


అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .


నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.


నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .


నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు 


నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 

.

ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను. 


ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు " 


ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !


మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !


ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే. 

                  - జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

[01/02, 3:46 pm] . Mallapragada: _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_

[31/01, 10:48 am] Vitthal: *సమ్మోహనాలు*

అంశము: *శ్రీమద్భగవద్గీత*

10వ అధ్యాయమ

*విభూతి యోగము*

*ధారావాహిక*


1621

చెట్లయందు రావిని

రావిని నారదుడిని

నారదుని నే దేవర్షులలో అర్జునా!

1622

సిద్ధులలో కపిలుని

కపిలుని చిత్రరథుని

చిత్రరథుడిని గంధర్వులలో అర్జునా!

1623

ఉచ్చైశ్శ్రవము అనే

అశ్వమునూ నేనే

నే గజములలో ఐరావతము అర్జునా!

1624

నరులయందు రాజును

రాజు అంశయు నేను

నేనుండు విభూతులు తెలుసుకో అర్జునా!

1625

వజ్రాయుధము నేను

నే కామధేనువును

ధేనువు-ఉత్పత్తి కారకూడను అర్జునా!

1626

పాములతో వాసుకి

వాసుకి నేను ఉనికి

ఉనికి సకల భూతాత్మలకు నే నర్జునా!

1627

ఆనంతుడను నాగును

నాగు-వరుణుడ నేను

నేనే వర్షదేవతని ఎరుగు మర్జునా!

1628

నే నర్యమయరాజు

రాజు నే యమరాజు

యమరాజును శిక్షించుట యందు అర్జునా!

1629

ప్రహ్లాదుడను నేను

నే నసురోత్తముడను

ఉత్తముని హిరణ్యాక్ష సుతుడను అర్జునా!

1630

మృగాలలో సింహము

సింహము నే కాలము

కాలమును నే గారుత్మంతుడను అర్జునా!

1631

చేపలలో మొసలిని

మొసలి నే వాయువుని

వాయువులో వేగాన్ని నేనే అర్జునా!

1632

ప్రవహించే జలముని

జలములలో గంగని

గంగని రాముని శస్త్రము నేనె అర్జునా!

1633

సృష్టికి నేనె ఆది

ఆది అంతమనాది

అనాదియు మధ్యముడను నేనే అర్జునా!

1634

ఆధ్యాత్మిక విద్యను

విద్యలో వాదమును

వాదమున రాగ ద్వేష రహితుడ నర్జునా!

1635

అకార అక్షరమును

అక్షరము ద్వంద్వమును

ద్వంద్వమను సమాసమును నేనే అర్జునా!

1636

నాశ రహిత కాలము

కాలము నే బ్రహ్మము

బ్రహ్మము విరాట్ రూపము నేనే అర్జునా!

1637

చంపు మృత్యువు నేను

నేనే ఉద్భవమును

ఉద్భవము ప్రసాదించు వాడను అర్జునా!

1638

స్త్రీల యందు గుణమును

గుణములకు మూలమును

మూలము వారి సహనము నేనే అర్జునా!

1639

కీర్తి సంపద నేను

నేనె స్మృతి జ్ఞానమును

జ్ఞానము ధారణ శక్తి బుద్ధిని అర్జునా!

1640

వాక్ శక్తి ధృతి నేను

నే నోర్పు నేర్పులను

నేర్పును క్షమా శక్తిని నేనే అర్జునా!


కే. పాండురంగ విఠల్

[31/01, 11:53 am] . Mallapragada: *టైం చూసుకుని తప్పకుండా చదవండి..*


స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:


పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. *కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు*  నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.


రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.


 నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*.

అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.

మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.

30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.

మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా..  అందులో తేడా ఏమీ వుండదు.

ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.మనం వుండే ఇల్లు మూడొందల  గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం..               నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.


నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్          క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.

అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.


👉జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:


1. *మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.*

2. *ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.*

3. *వంద కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు* *నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.*

4. *మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.*

5. *వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే కలిసి వెళ్లు.*


చివరగా, వీటిని గుర్తుంచుకో:

వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !


మళ్ళీ చెప్తున్న నీ జీవితంలో ప్రతిమలుపులో..!!

నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !!


✍ Steve Jobs Golden words👏👏

Good Msg

[31/01, 11:59 am] . Mallapragada: *విమానం లో భోజనం* మనసు పెట్టి చదివే కథ, మనసు న్నోళ్ళ కథ,

.

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

.

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 

.

ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !

మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే. 

- జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

1. మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. 

కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి.

వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.

స్కందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. 

బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. 

భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మాపవైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి..!!

ఏ పని చేసిన నేను కాబట్టి చేశాను 

నేేేనే కనుక లేకపోతే 

నేనే కనుక చెయ్యకపోతే 

ఎవరూ చేయలేరు నేనే  గొప్ప

 అనుకుంటాం భ్రమ పడుతూ ఉంటాం 

 అంతా నా సామర్థ్యమే నా తెలివి తేటలే 

నా  గొప్ప అనుకుంటాము 

 ఆలోచించండి తెలుస్తుంది 

 చేసేవాడు ఆ పరమాత్మమే 

 చేయించేవాడు  ఆ పరమాత్మేమే 🙏


రామాయణం లో 

ఒక సంఘటన చెబుతాను వినండి 

పట్టాభిషేకం జరిగింది, 

శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు.

హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు....

ప్రభూ!  లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంతవరకు , నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా..

నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.


ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరతభూమిలోనే ఉంటారనీ..

పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది.

కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయినవేళలో విభీషణుని సలహామేర తల్లి 

దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి.. ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో 

ఆ తల్లి జాడ లంకలో ఒక సాధుపురుషుని ద్వారా తెలియజేయబడిందే..

బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని అనుకున్నాను.... 


అశోకవనం లో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తిదూసిన క్షణంలో

ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి 

వాడిని అంతం చేయాలనే బలమైనకోరిక 

నాలో కలిగింది.

కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడి ని వారించి వాడినుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది.


ప్రభూ! ఎంతచక్కని అనుభవమిచ్చావు, 

అక్కడ కూడా మంచి వారి రూపం లో మండోదరి తల్లి ని చూపించావు.

నేనే  లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే 

భ్రమ కలిగేది.


చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాక్కూడా  కలిగిఉండేేది...

కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , 

ఆ పని స్వయంగా  రావణుని పత్ని మండోదరి చేత చేయించేవు. 

దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించాలనుకుంటావో వారి తో ఆ పని నెరవేర్చుకుంటావు. 

ఇందులో మా మహత్వమేమీలేదు.


దేవా! త్రిజట తన స్వప్నవృత్తాంతం తోటిరాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ..

ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని 

నేను చాలా చింతలో మునిగిపోయాను.

ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి 

ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని.. 

రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించేవని అర్ధమైంది.


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...

రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...

లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు. 

లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....


ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపావు, 

అటువంటిది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!

దీనిని పట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి , 

మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, 

అని అర్థం అయింది.🙏

               


 అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...

మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ..

మన గొప్పతనమో.. 

మన సాధకత్వమో కాదు...

అందుకని నేనే కనక లేకపోతే ఏమీజరగదు 

అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు.


ఆంజనేయ స్వామి అంతటి మహాను భావులే 

అలా అనుకున్నప్పుడు..  మానవ మాత్రులం.. 

ఎగిరి పడుతూ ఉంటాము.. 

నా అంతటి వాడు లేడని.. 

నేను కాకపోతే ఎవరు చేయగలరని..

నిజానికి భగవంతుని అనుగ్రహం లేకుండా 

మన ఆధీనంలోనే ఉంది అనుకుంటున్న 

కనురెప్పలను కూడా మనం కదిల్చలేం 🙏

No comments:

Post a Comment