సుప్రీంకోర్టు సంచలన తీర్పు 🛑
*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,
భీమా సంస్థలు , రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...*
*****
⭕1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు.
⭕2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
⭕3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.
⭕4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.
⭕5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.
⭕6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.
⭕7. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.
⭕8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.
⭕9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.
⭕10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.
⭕11. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే ఏ విధమైన భీమా వర్తించదు
--(())--
[31/01, 7:05 am] తెలుగు1: శ్రీమద్రామాయణం!.. మన జీవన వేదం!..
అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి " ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా " అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.
అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి " నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా.
పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దెగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దెగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.
మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటె రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటె, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దెగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా " అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.
రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |
కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||
రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు.
ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు.
సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |
భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||
సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |
అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||
వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు " అన్నాడు.
(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)
-సశేషము (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనము నుండి గ్రహీతము ).
తెలుగు1: *కలసి మునుగుదాం .. రండి!*
చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్ చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.
ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.
ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'
'వస్తాదులెందుకయ్యా?'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'
'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. ఐ. పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.
'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'
'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు టకటకలాడిస్తో.
'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.
'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.
తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్ డిజైనింగులో బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.
ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.
తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.
మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని పాపం మా అందరి కోసం పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా! ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.
డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.
గోరు తడవకుండా గోదావరి స్నానమంటూ ఇదేంటో మరి?!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంతకీ కలవదే!
'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు మిత్రుడు .
✍🏻కర్లపాలెం హనుమంతరావు
[Prathyusha: ఎంత అద్భుతమైన పోస్టింగు ఇది.
🍁MUST READ
గొప్ప నీతి కథ..
అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.
దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.
అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
🍃🍃🍃
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.
నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.
ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.
*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓
అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.
అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.
వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.
అనుభవించాలా? ఎలా?
నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను.
ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి.
నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట.
అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు.
నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను?
ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?
నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?
నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం.
నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే.
నాకు రక్షణ లేదు. సుఖం లేదు.
అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?
నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?
ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు.
ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు.
ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో.
రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?
ఇక నేనుండలేను వెళ్తున్నా!'
👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది.
దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు.
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇
[ Prathyusha: _*శ్రీ శివ మహాపురాణం - 74 వ అధ్యాయం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
_*దక్ష యజ్ఞములో సతి*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
దక్షుని యజ్ఞము మహా ప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్లెను. అనేక వింతలతో గూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము నామె అచట చూచెను. అపుడా దేవి ద్వారము వద్ద తన వాహనమగు నందినుండి దిగి వెంటనే ఆమె ఒక్కతెయే లోపలకు యజ్ఞశాలకు వెళ్లెను. యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని, మరియు సోదరీ మణులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి.
దక్షుడు ఆమెను చూచెను. కాని ఎట్టి ఆదరమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు. ఓ మహర్షీ!ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి, తండ్రికి సమస్కరించెను. ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతల కీయబడిన హవిర్భాగముల నామె చూచెను. కాని దక్షుడు శంభునకు భాగము నీయలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను.
ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించువేయునా యన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడ భయమును గొల్పు దృష్టితో చూచెను.
*సతి ఇట్లు పలికెను -*
పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేల ఆహ్వానించలేదు? ఆయన ఈ చరాచర జగత్తునకంతకు పవిత్రత నాపాదించుచున్నాడు. యజ్ఞ స్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు, సోమయాజి స్వరూపుడునగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము?. ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము!ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నియూ అపవిత్రములగును. యజ్ఞద్రవ్యములు, మంత్రములు, దేవతల కిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది?.
ఓరీ తండ్రీ !నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది. ఓరీ! ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరు తమతమ పదవులను పొందినారో, అట్టి హరుని ఎరుగకున్నావు. విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువగు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు వచ్చేసిరి ?.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
శివస్వరూపిణి, పరమేశ్వరి అగు ఆ సతి ఇట్లు పలికి, మరల విష్ణ్వాదులనందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను.
*సతి ఇట్లు పలికెను -*
ఓ విష్ణూ!నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా ? వేదములాయనను సగుణుడనియు, నిర్గుణుడనియు కూడ వర్ణించుచున్నవి గదా !. ఓ హరీ! పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూత నిచ్చి, నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణ నిచ్చియుండెను. ఓరీ! దుష్టబుద్ధీ !అయిననూ నీకు మనస్సులో జ్ఞానము ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి. ఓరీ బ్రహ్మా! పూర్వము నీవు అయిదు ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా, ఆయన నిన్ను నాల్గు ముఖములు గలవానిని చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి.
ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది. ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ? పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి. అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు.
విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి. ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను. విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి. అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను.
*దక్షుడిట్లు పలికెను -*
నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?. నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు. అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు. బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని. ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను. అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను.
*సతి ఇట్లు పలికెను -*
ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు. కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?. శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును. అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను. అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను.
తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు. ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు? దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు. ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును. అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము.
మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు. శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు. శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళవేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు. విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు. ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు.
వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు. ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు. ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు. ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము.
ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు. మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను. భగవాన్ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును. కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను.
ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు. శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను.
*శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.*
Prathyusha: ఓం నమో భగవతే శ్రీ రమణాయ
“నీ సహజ స్థితిలో ఉండు”
భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు-6
🌹ప్రశ్న: మనస్సుకి ఆత్మకి భేదమేమిటి?
మహర్షి: ఏమీలేదు. అంతర్ముఖ మైన మనస్సు ఆత్మ. బహిర్ముఖమైతే అదే అహమవుతుంది. ప్రపంచమవుతుంది. ప్రత్తి రకరకాల బట్టగా తయారైనప్పుడు వేర్వేరు పేర్లు పెడతాము. కానీ బట్టలన్నీ ప్రత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం. నామాలు, రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ, మనస్సు లేకుండా ఉంటుంది. కానీ ఆత్మ లేకుండా మనసెప్పుడూ ఉండలేదు.
🌹ప్రశ్న: బ్రహ్మానందాన్ని సచ్చిదానందం అంటారు కదా, అంటే ఏమిటి?
మహర్షి: సంస్థితమైనది – సత్. దానినే బ్రహ్మమంటారు. సత్ యొక్క కంటి చిత్. దాని స్వరూపం ఆనందం. ఇవి సత్ కి భిన్నం కావు. మూడింటిని కలిపి సచ్చిదానందమంటారు.
🌹ప్రశ్న: మన సహజ స్థితి ఆనందం అంటారు ఏ విధంగా ?
మహర్షి: పరిపూర్ణ ఆనందం – బ్రహ్మం. పరిపూర్ణ శాంతి, ఆత్మ. సంస్థితమైనదంతా అదే. ఆ చైతన్యమే. ఆనందం ఆ ఆత్మ యొక్క స్వరూపం. పరిపూర్ణమైన ఆనందమే కాని ఆత్మ మరేమీ కాదు. ఉండేదల్లా ఆ ఆనందమనబడేదే. ఆ సత్యాన్ని తెలుసుకుని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యమూ ఆస్వాదించు. ఎవరైనా బయటి కారణాల వల్ల గానీ సంపద వల్ల గానీ కలుగుతోందనుకుంటే అతని సంతోషం సంపద ఎక్కువైనా కొద్దీ ఎక్కువవుతూ సంపద తగ్గినకొద్దీ తగ్గుతూ ఉండాలి కదా. కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషం శూన్యమైపోతుంది. కానీ మనిషి అనుభవమేమిటి? ఇలాగే ఉంటుందా?
గాఢనిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు. అతని దేహమే ఉండదు. అయినా అసంతుష్టిగా ఉండడు. పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు. మంచి నిద్ర కావాలని అందరికి ఉంటుంది కదా. అంటే సంతోషమనేది మనిషి లోపల సహజంగా ఉంది. అది బయటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అకళంకమైన ఆనందకోశం తెరుచుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి.
*******
Prathyusha: ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి!? కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.
ఒక ఊరి చివరిగా ఓ గురువుగారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.
మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి, దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన-ధర్మాలు చేసివుండరు.
అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.
నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు. అందులో
🌹మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండి ఉండవచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నవ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.
🌹ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.
🌹ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
🌹ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.
🌹ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా, సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.
[ Prathyusha: హరిఓం ,
అలమటిస్తోన్న వృద్ధులకు అమ్మలా అన్నం పెడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని విద్యార్థులకు ఓ అక్కలా చేయూతనిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతోన్న వారికి ఓ కూతురిలా ఆపన్న హస్తం అందిస్తోంది. అలాగని ఆమె శ్రీమంతురాలు కాదు, ఓ సామాన్యురాలు. తెలుగు రాష్ట్రాల్లోని దీనులకు చేయూతనందిస్తోంది #విశాఖపట్నానికి చెందిన #మజ్జి_శ్రీదేవి.….
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీదేవిని తల్లే పెంచింది. ఇంటర్ వరకూ చదువుకున్న ఆమె... మొదట్లో చిన్నచిన్న పనులు చేసి కొంతకాలం టీవీ యాంకర్గానూ పనిచేసింది. ఆ అనుభవంతో సొంత యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. చిన్నప్పుడే నాన్న ప్రేమకు దూరం కావడంతో.. తండ్రి వయసున్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక తోచిన #సాయం చేసేది.
అలాగే ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడంతోపాటు కొత్త దుస్తులు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్ల కిందట ఓ కుటుంబానికి శ్రీదేవి సాయం చేసినప్పుడు ఆ చుట్టుపక్కలవారూ తమ వంతుగా సహకారం అందించారు. దాంతో చేసే మంచి పని నలుగురికీ తెలిస్తే ఎక్కువమందికి సాయపడొచ్చనే ఆలోచన వచ్చింది శ్రీదేవికి. అప్పట్నుంచీ కష్టంలో ఉన్నవారికెవరికైనా సాయం చేసినప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెడుతోంది. వాటిని చూసిన చాలామంది సాయం చేయడానికి ముందుకు రావడంతో అవసరమైన వారికి పెద్ద మొత్తంలో సాయం అందుతోంది.....
గుంటూరుకు చెందిన వృద్ధ దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. వీళ్లిద్దరూ ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. దానివల్ల పెన్షనూ రాదు. వయోభారంతో వారి ఆరోగ్యమూ క్షీణించింది. వారికి పిల్లలూ లేరు. తినడానికి తిండి లేక గుడి నుంచి #అక్షింతలు తెచ్చుకుని శుభ్రంచేసి వాటితోనే అన్నం వండుకుంటున్నారని తెలుసుకుని చలించిపోయింది శ్రీదేవి. వెంటనే వారికి నిత్యావసర సరకులతోపాటు, ఆర్థిక సాయం అందించి ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ‘#మిస్_శ్రీదేవి’లో అప్లోడ్ చేసింది. దీన్ని ఆ ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి స్పందించడంతో వారికి సాయం సమకూరింది. ఇప్పుడా దంపతులు శేష జీవితాన్ని నిశ్చింతగా గడుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిత్యం పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఆర్థిక సాయం అవసరమైన వారి వివరాలు తెలుసుకుంటుంది శ్రీదేవి. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తన కారులో వెళ్తుంది. ఎత్తం అనే గ్రామంలోని ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో రెండేళ్లుగా ఇంటికే పరిమితమైతే భార్య అతడిని వదిలేసి చిన్నారితో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కథ తెలుసుకున్న శ్రీదేవి వెంటనే రూ.10వేలు అందించింది. ఆ తర్వాత భార్యతో మాట్లాడి, భర్త వద్దకు వచ్చేలా చేసింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైంది. మరోసారి వాళ్లను కలసి రూ.పదివేలు, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలూ అందించింది. అలాగే పెబ్బేరుకు చెందిన లలితా అనే ఎనిమిదేళ్ల అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెతోపాటు తన ఇద్దరి తమ్ముళ్లనూ ఆశ్రమంలో చేర్చించింది. వాళ్లకు తానున్నాననే భరోసాను కల్పిస్తూ తరచూ వెళ్లి వాళ్లను చూసి వస్తుంది శ్రీదేవి. ఇలా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందలకు పైగా కుటుంబాలకు ఈమె ద్వారా సాయం అందింది........... - - 🙏... వి. లక్ష్మి శేఖర్ ... 29.01.2021.
_*శ్రీ శివ మహాపురాణం - 72 వ అధ్యాయం*_
*దక్షయజ్ఞ ప్రారంభము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను. మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు , పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి.
నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి. మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి. జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని. మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను.
వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను. విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను. ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి. అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను. విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని.
సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను. సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి. అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను. పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి.
అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి. ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను. ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను.
దీక్షితుడై, రక్షాబంధనోత్సవమును నిర్వర్తించి, స్వస్తి పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో మిక్కిలి ప్రకాశించెను. శంభుడు కపాలధారి గనుక, ఆయనకు యజ్ఞార్హత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు. దోషదర్శియగు దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు. ఈ విధముగా దక్షయజ్ఞమహోత్సవము కొనసాగుచుండెను. యజ్ఞనియుక్తులైన వారందరు తమ తమ కార్యములయందు నిమగ్నులైరి. ఇంతలో శివభక్తుడగుదధీచుడు అచట శంకర ప్రభువు కానారాక పోవుటచే ఉద్వేగముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను.
*దధీచుడు ఇట్లు పలికెను -*
దేవ ప్రముఖులారా! ఋషి ప్రముఖులారా! మీరందరు నా మాటను ఆనందముతో వినుడు. ఈ యజ్ఞముహోత్సవమునందు శంభుడు ఏల రాలేదు? ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు కూడ వచ్చినారు గదా! కాని మహాత్ముడగు ఆ పినాకి లేనిదే ఈ యజ్ఞము అధికముగా శోభించుటలేదు. మంగళములన్నియు ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చెప్పెదరో, అట్టి ఆ పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంఠుడు అగు పరమేశ్వరుడు ఇచట కానరాలేదు.
ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేత్రములతో చూడగా మహానగరములైననూ వెంటనే మంగళమయములగును. కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలెను. లేదా, బ్రహ్మచే గాని, సర్వ సమర్థుడగు విష్ణువుచే గాని వెంటనే ఆహ్వానింపజేయుము. యజ్ఞసిద్ధికొరకై ఇప్పుడు ఇంద్రుడుగాని, లోకపాలురు గాని, విప్రులుగాని, సిద్ధులుగాని ఆ శంకరుని తప్పని సరిగా తోడ్కోని రావలెను. మహేశ్వర దేవుడు ఉన్న చోటికి మీరందరు వెళ్లుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని రండు.
దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు వచ్చినచో సర్వము పవిత్రమగును. శివుని స్మరించుటచే, నామమును ఉచ్చరించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము అగును. కాన సర్వ ప్రయత్నములను చేసి శివుని ఇచటకు తీసుకుని రండు. శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను సత్యమును పలుకుచున్నాను.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
మూఢబుధ్ది, క్రోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను. విష్ణువు దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు ప్రతిష్ఠితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?. ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము ప్రతిష్ఠితమైయున్నవో, అట్టి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు. లోకములకు పితామహుడగు బ్రహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, వివిధ శాస్త్రములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు.
మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు. యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు. మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని. హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము.
ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు. కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు.
*బ్రహ్మఇట్లు పలికెను -*
వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను.
*దధీచుడు ఇట్లు పలికెను -*
శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు. దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను. తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి. దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను.
*దక్షుడిట్లు పలికెను -*
శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి. ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను. వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు. మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు.
*బ్రహ్మ ఇట్లు పలికెను -*
వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి. ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము.
*శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.*
--(())--
Prathyusha: తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?
తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!!
దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి...
మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.
రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.
మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే..
భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.
దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు...
*అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం!!*
మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి...
తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.
ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!
♥️♥️🌹
No comments:
Post a Comment