మహా భరతం .. 2 .. భాగము
కాలము గడుచుచుండగా ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనన్ని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడాడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. అప్పుడు చ్యవనుడు తన తపశ్శక్తిని దార పోసి వారికి సోమరసాన్ని ఇప్పించాడు
ఈయన కుమారుడే రురు మహర్షి
రురుడు లేదా రురు మహర్షి భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి. చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పుత్రుడు (రురు )ప్రమతి. ప్రమతి మహాతపస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస ఆతనిని వలచి ఆశ్రమమునకు వచ్చి సేవ చేయుచుండగా కొంతకాలమునకు వారి మధ్య అనురాగము జనించి ఆతడు ఘృతాచి యందు ప్రమతి యొక సుపుత్రుని గాంచెను. అతడు రరుడు అనే పేరున పెరుగుచు ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.
మహాతపస్వి అయిన స్థూలకేశుడను మహర్షి ఆశ్రమము పరమ పవిత్రమై ప్రశాంత నిలయమై వుండెను. విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక ఈ ముని ఆశ్రమ ప్రాంతమున విహరించి, మిథునకృత్య మొనరించి తమ కోరికలను తీర్చుకొనిరి. కొంతకాలమునకు మేనక గర్భవతి అయి చక్కని కూతుర్ని కని ఆమెను ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను. స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.
రురుడు ఒకసారి స్థూలకేశ మహర్షి ఆశ్రమమునకు విచ్చేసి మనోహరముగ దేవకన్య వంటి సౌందర్యము మూర్తీభవించిన ప్రమద్వరను చూచి ఆమెపై అనురాగము కలిగెను. తండ్రి ప్రమతికి విషయము విన్నవించగా ఆ కన్యామణి వృత్తాంతము విని అంగీరించగా, కన్య దానం చేయడానికి స్థూలకేశుడానందించెను. వివాహము కొలది దినములుండగా ప్రమద్వర వనములో పూలుకోయడానికి వెళ్లగా పాముకాటు వలన మరణించెను. అందరూ దుఃఖిస్తుండగా రురుడు మిక్కిలి రోదిస్తూ, ఏకాంతమున తీవ్రముగా వాపోవుచుండెను. అదిచూచిన దేవదూత జాలిపడి నీ ఆయువులో సగము ఆమెకు ఇచ్చిన ఈమె మరల జీవింపగలదు అని పలికెను. వెంటనే రురుడు తన జీవితకాలంలో సగము ఆమెకు ధారపోసెను. అనంతరము రురువునకు ప్రమద్వరకు కళ్యాణము చేసిరి.
నిజ తపశ్శక్తి వలన, త్యాగము వలన, వలచిన కాంత మరణింపగా పునర్జీవింపజేసికొని ఆమెను ధర్మపత్నిగా పరిగ్రహించిన రురుడు, తనకొరకై చూపిన నిష్కల్మష ప్రేమ, నిరుపమాన త్యాగము నెంతయే మెచ్చుకొని పునర్జీవితయై అపూర్వ సౌందర్యము నందిన ప్రమద్వర ఉత్తమోత్తమ దాంపత్య ధర్మమును పాటించుచు గృహస్థాశ్రమమును నిర్వర్తించుచు చిరకాలము జీవించిరి. కాలక్రమమున ఆతని దయవలన ప్రమద్వర గర్భము ధరించి నవమాసములు నిండిన పిదప పుత్రుని పొందెను. అతడే శునక మహర్షి. శునకుడు పెరిగి పెద్దవాడై భృగు వంశీయుల కందరికి ఆనందదాయకుడై, సత్త్వగుణసంపన్నుడై తీవ్రతపస్సు సలిపి శాశ్వత యశస్సును సంపాదించెను. ఆతని కుమారుడే శునక మహర్షి. ఇతని కుమారుడు శౌనకుడు.
ఇక మనం తెలుసుకోవలసిన అటువంటి రెండో వ్యక్తి ఈ మహానుభావుని పేరు సూతమహర్షి. ఇతడు రోమహర్షణు కుమారుడు
(ఉగ్రశ్రవసుడు ) మహాభారతం, భాగవత పురాణము, హరివంశం, పద్మ పురాణం వంటి అనేక పురాణాలను ప్రవచించిన కథకుడుగా కనిపిస్తాడు. ఇతనికి సూతుడు, శౌతి అనే పేర్లు కూడా ఉన్నాయి. నైమిశారణ్యంలో ఋషులు గుమిగూడి వింటూండే కథలను ఉగ్రశ్రవసుడే చెబుతూంటాడు. అతను రోమహర్షణుడి కుమారుడు. మహాభారత కర్త వ్యాసునికి శిష్యుడు.
సూతుని వృత్తాంతం
ఏల్చూరి మురళీధరరావు “భారతీయ సంస్కృతిలో నైమిశారణ్యం” అనే వ్యాసం నుంచి) దీనిని నేను స్వీకరించాను
నైమిశారణ్యంలో పురాణేతిహా సాల కథకుడుగా కీర్తిగన్న సూత పౌరాణికునికి భారతీయ సంస్కృతిలో అవిస్మరణీయమైన స్థానం ఉన్నప్పటికీ, ఆయనను గురించి ఆస్తికులలో చాలా మందికి ఇప్పటికీ అంతగా ఏమీ తెలియదంటే ఆశ్చర్యం గా ఉంటుంది. ఆయన తండ్రి పేరు రోమహర్షణుడు. సంస్కృతంలో రేఫ – లకారాల కు ఉన్న అభేదవ్యవహారం వల్ల లోమహర్షణుడని కూడా అంటారు. రోమహర్షణుడన్న ఆ పేరే (వెంట్రుకలు నిక్కబొడు చుకొనేంత ఉత్కంఠను కలిగిస్తూ శ్రోతలను ఆనందింప జేసేవాడు) ఆయన కథాకథన కౌశలాన్ని సూచిస్తున్నది.
“లోమాని హర్షయాంచక్రే శ్రోతౄణాం యత్ సుభాషితైః
కర్మణా ప్రథిత స్తేన లోకేస్మిం ల్లోమహర్షణః.”
అని వాయు పురాణ వచనం.
ద్వైపాయన మహర్షి పురాణా లను నేర్పుతుంటే తనువు పులకరించినందువల్ల కూడా ఆయనకు రోమహర్షణుడని పేరు కలిగిందట.
“తస్య తే సర్వరోమాణి వచసా హర్షితాని యత్
ద్వైపాయన స్యానుభావా త్తతోఽభూద్రోమహర్షణః.”
అని స్కాంద పురాణం ఈ విషయాన్ని చెప్పింది.
నైమిశారణ్యంలో శౌనకాది మునులకు అగ్ని, కూర్మ, గరుడ, బ్రాహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ,వామన, స్కాంద పురాణాలను, శ్రీమద్భాగవతా న్ని, శ్రీ దేవీ భాగవతాన్ని బోధించినది ఈయనే. ఈయన కొడుకు ఉగ్రశ్రవుడు కూడా ప్రసిద్ధ పౌరాణికుడే. నైమిశారణ్యంలోనే ఈయన శౌనకాదులకు శ్రీ మహాభారతా న్ని వినిపించాడు. రోమహర్ష ణుని కొడుకయినందువల్ల ఈయనకు రౌమహర్షణి అని, సూత సుతుడైనందువల్ల సౌతి అని పేర్లున్నాయి. భారత కథానంతరం దాని పర్యంత భాగమైన హరివంశం కూడా ఈయన చెప్పినదే.
‘సూత శబ్దానికి రథచోదకుడని ఒక అర్థం. కర్ణుని పెంపుడు తండ్రి సూతుడే. వర్ణసాంకర్యం వల్ల జన్మించిన సూతులు పదకొండు విధాలట:
కరణుడు (వైశ్యునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), అంబష్ఠుడు (బ్రాహ్మణునికి వైశ్యస్త్రీ యందు జన్మించిన వాడు), ఉగ్రుడు (క్షత్రియునికి శూద్రస్త్రీ యందు జన్మించిన వాడు), మాగధుడు (వైశ్యునికి క్షత్రియస్త్రీ యందు జన్మించిన వాడు), మాహిష్యుడు (క్షత్రియునికి వైశ్యస్త్రీ యందు జన్మించినవాడు), క్షత్త (శూద్రునికి క్షత్రియస్త్రీ యందు జన్మించినవాడు), సూతుడు (క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించినవాడు), వైదేహకుడు (వైశ్యునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించి నవాడు), రథకారుడు (మాహిష్యునికి కరణ స్త్రీ యందు జన్మించినవాడు), పారశవుడు (బ్రాహ్మణునికి శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడు), చండాలుడు (శూద్రునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు) అని.
మత్స్యదేశపు రాజు విరాటుని బావ కీచకుడు కూడాసూతుడే. వేదాధ్యయనం అన్నది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన రోజులలో వేద విజ్ఞానానికి అనర్హులుగా భావింపబడిన బ్రాహ్మణేతర వర్గాల వారిలో ధర్మప్రచారం చేయటానికి క్షత్రియ-బ్రాహ్మణ ప్రతిలోమ వివాహ సంజాతులై న సూత పౌరాణికులు బయలుదేరి, తమ విద్వత్తు మూలాన పురాణ వక్తలుగా గుర్తింపును పొందారని పెద్దలంటారు. జన్మతః బ్రాహ్మణులైన శౌనకాది మహా మునులు పవిత్రమైన యాగ దీక్షామధ్యంలో ఈ సూత పౌరాణికుని నుండి విజ్ఞాన వివేకాలను అభ్యసించటానికి వెనుకాడలేదు. ఆ ప్రకారం ఆలోచించి చూస్తే శౌనకుడు తన కాలానికంటె ఎంతో ముందుచూపు కల సమచిత్తు డని, కులాల పట్టింపులు అంతగా లేనివాడని తోచక మానదు. అంతే కాదు. శూద్రులకు విద్యాధికారం లేదని,కులబాహ్యులైనందు వల్ల వారికి సంతానం లేనప్పుడు దత్తస్వీకారానికి సైతం అధికారం లేదని, ఎందుకంటే దత్తస్వీకారం సమయంలో పఠించే స్మార్త మంత్రాలను వారు వినకూడ దని, ఆ స్వీకార మంత్రాలను వారి యెదుట ఉచ్చరింపకూడ దని ఆ రోజుల్లో ఉండిన విశ్వాసాన్ని త్రోసిరాజని శౌనకుడు తన శౌనక స్మృతిలో వారికి ఆ అధికారాన్ని అంగీక రించాడు. శూద్రుడు కూడా బ్రాహ్మణుని పౌరోహిత్యానికి కుదుర్చుకొని దత్తస్వీకారం చేసుకోవచ్చునని అనుమతిం చాడు. నైమిశారణ్యంలో భగవత్కథలను వింటూ సమచిత్తాన్ని, స్థితప్రజ్ఞతను అలవరచుకొన్న శౌనకుడు ఆ విధంగా భారతీయ సంస్కృతి లో పెక్కు మార్పులకు ఆద్యు డయ్యాడని భావించటంలో తప్పుండకూడదు. ఆ విశాల కథితకథంతకు పీఠభూమి నైమిశారణ్యమే అన్న విషయాన్ని మనము విస్మరింపకూడదు.
నైమిశారణ్యంలో ఋషులు తనను పెద్దల ముందు పెద్దను చేసి గౌరవించినప్పటికీ, ఆనాటి జనారణ్యం ప్రభావం వల్ల కాబోలును, సూత పౌరాణికునికి ఆ పెద్దల ముందు కొంత జంకు ఉన్నట్లే కనబడుతుంది. ఋషులు తనను భగవన్మహిమను వర్ణించి చెప్పమని అడిగినప్పు డు బృహన్నారదీయంలో స్వయంగా సూతుడే –
“విలోమజోఽపి ధన్యోఽస్మి య న్మాం పృచ్చథ సత్తమాః”
అన్నాడు. “
నాబోటి విలోమజాతుడిని చెప్పమని అడిగారే, ఓ మహాత్ములారా! నా జన్మ ధన్యమయింది” అని. తర్వాత తర్వాత ఆయన పాండిత్యాని కి ముగ్ధులైన పురాణశ్రోతలు ఆయన గోస్వామితను అంగీక రించి, ఆయనను ద్విజునిగానే పరిగణించినట్లు కనబడు తుంది. అందుకే గర్గసంహితా కారుడు “సూతాః పౌరాణికాః ప్రోక్తాః” అని మెచ్చుకొన్నాడు. అగ్నిపురాణమైతే ఆయన విద్యావివేకాతిశయాన్ని మరీ మరీ ప్రశంసించింది:
“పృషదాజ్యసముత్పన్నః సూతః పౌరాణికో ద్విజః
వక్తా వేదశాస్త్రాణాం త్రికాలానలధర్మవిత్”
– అని ఆయన వైదుష్యాన్ని తలకెత్తింది. ....
ఇంకా ఉన్నది 3-- విభాగములో చుడండి
మిత్రులందరికీ శుభరాత్రి
🌼🙏🙏🙏🌼
ఇది యదార్ధ ప్రాంజలి ప్రభ గాధ )
తల్లీ కూతురికి హిందవుగా ముచ్చట్లు కాఫీ చిన్న కధ (10)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓ హిందువు నిన్ను నీవు, నీ కుటుంబము అంటూ రక్షణ చేయటం కాదు, చుట్టూ ప్రక్కల వారితో ఏకమై సహాయ సహకారము అందించు కుందాం, కలసి బతుకుదాం.అన్నది తల్లి.
హిందువుకే క్లారిటీ ఎక్కువగా ఉంది నేను హిందువుణ్ణి అని, నా ఆరాధ్య దేవుడు శివుడు లేదా వెంకటేశ్వరుడు ఇలా అనేకమంది దేవుళ్లను ఆరాధించే మతం హిందూ మతం ఒక్కటే. మనశాంతి తో పూజలను చేసి మోక్షాన్ని పొందేవాళ్లు తెలుసుకొవాలి తల్లి .
నేను హిందువుని, మేము హిందువలం .అని మనం అంటూ మన పండగలకు ఒకరికొక్కరం కలుసుకుంటాం ప్రతి పండగను మనం చేసుకుంటున్నాము ఇందులో ఉన్నగొప్పతనం ఏ మతం లో ఉందో చెప్పఁడి .అని తెల్పింది తల్లి
నేను ఫలానా కులపోణ్ణి, నేను పలా నా ఉపకులపోణ్ణి, నేను ఫలానా పార్టీ వాణ్ణి, నేను సెక్యలర్ గాణ్ణి, నేను ఫలానాసిధ్ధాంతం వాణ్ణి, నేనే ఫలానా నాయకుడి అనుచరుణ్ణి, నేను ఫలానా దేవుని భక్తణ్ణి .చెప్పాలి అదే నిజాయితి అని తెలుసుకో తల్లి.
నేను పలానా సంఘంలో సభ్యుణ్ణి, మిగిలిన వాళ్ళంతా నేను చెప్పనట్లు చేయాలి చేయకపోతే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. అని నిందిస్తాడు.నేనే కరెక్టు,మేమే కరెక్టు.. మేము చెప్పిందే అమలు జరగాలి.అని విడిపోతాడు. పోట్లాడుతాడు.వాళ్ళు అనుకున వాళ్ళకి వంత పాడతాడు. వితండవాదం చేస్తాడు. సమాజంలో తిరగడు. సమాజం ఏమి ఆలోచిస్తుందో తెలుసుకోడు. నేను అనేవారందరు రాజకీయమతం వారు ఇందులో అన్ని మతాల వారు ఉన్నారు. ఒక మతం అని చెప్పఁ నవసరము లేదు తల్లి
ఉచిత విద్యను నేర్పిన గురువులు, ఉచిత వైద్యం చేసే వైద్యులు, ఉచిత వాదం సహజ న్యాయవాదులు, ఇదేవిధముగా అనేకమంది ప్రజలకు సహకారం అందిస్తూ హృదయంలో స్థిరస్థావరం ఏర్పరుచుకున్న హిందువు లెందరో తెలుసుకో తల్లి
దేశ సేవకు, ధర్మానికి కట్టు బడే వాడే హిందువు, పుట్టిన వాడి నుండి పొయ్యే వాడివరకు పూ ర్తి సహాయ సహకారమ్ . ఎక్కడైన ద్రోహం జరిగిన అందరూ ఒకరి కొకరు సహకరిస్తారు. ఇది నిజమైన హిందూతత్వం అదే జీవన ప్రయాణం తల్లి.
మనం చేసే ప్రతి పనికి తర్క వితర్కాలు , లాజిక్కలు మాట్లాడము,.మన అహంకారం. మన ఆశ ,మన ఆలోచన.మేము చేసేదే రైటు.మేము నిర్ణయించిందే. నిర్ణయం అని ఎప్పుడు వాదించం జరుగుతున్నా సంఘటనలను గమనించు బతికే వాల్ళము నిజమైన హిందువులం. . ఇతరులు మేము చెప్పనట్లు చేయాలి. ఈర్ష్య ,ద్వేషం,అసూయ ,పగ ,కక్ష.కార్పణ్యం. డాబు, దర్పం,దర్జా,హోదా.కుళ్ళు కుతంత్రాలతో లేని వాళ్ళం అసలైన హిందువులు తల్లి . అసలే ఆలయాలను, విగ్రహాలను, ద్వంసం చేసే మూకలు వీర విహారం చేస్తున్నారు వారిని కనిపెట్టి శిక్షకు గురిచేయండి లేదా ఇప్పుడు గుడి లేదా రేపు మీ ఇల్లే అవ్వచ్చు రక్షక భటుల భద్రత పెరగాలి ప్రతిఒక్కడు ఒక హనుమంతునిగా తయారవ్వాలి దుష్టల నరికట్టుటకు.
ఇలా చెప్పు కు పోతూఉంటే మనం తెల్సుకోవలసినవి, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. చెడు వేగంగా ప్రయాణిస్తుంది ఎక్కడో ఇరుక్కుంటుంది కదలలేదు కానీ మంచి నిదానంగా మనసును చేరి శాంతి చే కూరుస్తుంది తెలుసుకో తల్లి ,
--(())--
[6:16 am, 02/01/2021] . Mallapragada: సమ్మోహనాలు (1001 -1010 )
కొత్తసంవత్సరం .. ఇక హాయి
రచయత: మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జరిగినది వెతుకుటయు
వెతుకుట మరవవలయు
మరచి జరిగేదియే మంచిదే ఈశ్వరా
నీతి నిజాయతిగా
నిజాయితి బతుకుగా
బతుకు సంతృప్తి కే ఆయుధం ఈశ్వరా
కాల మాయ ఉన్నా
ఉన్నబతుకు మిన్నా
మిన్నా విశ్వాస జీవితమే ఈశ్వరా
కొత్త ఆశయాలకు
ఆశయ సాధనలకు
సాధన నిత్యమూ ఉంటె సుఖము ఈశ్వరా
ఆశా నిరాశలే
నిరాశ పాశాలే
పాశాలలో నిజాలు బతికించు ఈశ్వరా
విశ్వాసముతొ కదులు
కదులితే విజయాలు
విజయాలతొ మనసు తేలిక పడు ఈశ్వరా
సమయమె నీకు రక్ష
రక్షతొ ఉండు దీక్ష
దీక్ష తో లోకానికే రక్ష ఈశ్వరా
ఎదిగిన కొద్ది ఒదిగి
ఒదిగి కాలము మరిగి
మరిగి మనిషిగాను గుర్తింపే ఈశ్వరా
దివ్య వెలుగుగ నువ్వు
నువ్వు హృదయపు నవ్వు
నవ్వు చూపి బతుకే జీవితం ఈశ్వరా
జీవిత సత్యాన్నీ
సత్యాన్ని ధర్మాన్ని
ధర్మమే నూతన హవిషత్తుగ ఈశ్వరా
--(())--
[6:17 am, 02/01/2021] . Mallapragada: ఉపన్యాసం
ఎదగటం తేలిక, ఒదిగివుండటం కష్టం
బతకటం తేలిక, బతికించటం కష్టం
మాట్లాడటం తేలిక, ఆచరించటం కష్టం
ప్రేమించటం తేలిక, ప్రేమపొందటం కష్టం
ఆక్రోశించటం తేలిక, సాధించటం కష్టం
వాదించటం తేలిక, తీర్పు చెప్పటం కష్టం
ఏడిపించటం తేలిక, నవ్వించటం కష్టం
పోట్లాడటం తేలిక, శాంత పర్చటం కష్టం
మచ్చ బడటం తేలిక, మచ్చపోవటం కష్టం
మూర్ఖుణ్ణి నమ్మటం తేలిక, నమ్మి బతకటం కష్టం
పరీక్ష వ్రాయటం తేలిక, ఉద్యోగం సంపాయించటం కష్టం
పిల్లల్ని ప్రేమిచటం తేలిక, వారి ప్రేమను ఆపటం కష్టం
పెదాలమాట అర్ధం తేలిక, మనసులోని మాటకర్ధం కష్టం
పాట పాడటం తేలిక, పాటతో పరవశింప చేయటం కష్టం
ధనం సంపాయించటం తేలిక, దానం చేయుట కష్టం
పిల్లల పుటించటం తేలిక, విద్యనేర్పించి పెళ్ళిచేయటం కష్టం
--((**))--
🌻 మహా భారతం 🌻
💧 ఉద్యోగ విరాట పర్వాలు 💧
🩸 భాగము 1 🩸
మానవ సమాజంలో స్థూలంగా రెండురకాల వారుంటారు. లోకం కోసం తను వున్నానని విశ్వసించి నడచుకునేవారు, తనకోసమే లోకం వుందని ప్రవర్తించేవారు. అలాగే తాను అనుసరించిందే ‘‘ధర్మం’’ అని భావించేవారు, అసలుసిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించే వారు మనలోనే వున్నారు.
మహాభారతంలో ‘‘ధర్మం’’ అనే ఏకసూత్రం అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారిని, పాటించని వారిని గమనించే ‘‘విధాత’’ పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పని చేస్తుంది. ‘‘కాలం’’ మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వుంటుంది. సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ వుంటాయి.
మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం.త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతార మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి, దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు.
ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిర ధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది.ద్వాపర యుగంలో జరిగిన యీ మహాసంగ్రామంలో పద్ధెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు.
అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’. మూడు సేనాముఖాలు ఒక గుల్మం. మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’. మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’. మూడు వాహినులొక ‘‘పృతన’’. మూడు పృతనలొక ‘‘చము’’. మూడు చములొక ‘‘అనీకిని’’. పది అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు.
దీనిని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు. కేవలం పద్ధెనిమిది రోజులు జరిగిన యుద్ధం యిది.అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే.
రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి ఏడుకోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు.
యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి. మహాభారత గాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ.
--(())--
2020 చెడ్డ సంవత్సరం ఎంతమాత్రం కాదు.. చక్కటి గురువు.
నాకైతే రిటైర్మెంట్ నేర్పింది, ధైర్యం నేర్పింది, ఒక్కణ్ణే బతకడం ఎలా? ఒక్కడై చావాల్సొస్తే ఎలా? నిజమైన హీరోయిజం ఏమిటి? ధ్యాన్నం ఎలా? దైవం ఎలా...??
కాలచక్రంలో ఓ ఏడాది గిర్రున తిరిగింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. మనం కొత్త ఏడాదిలోనే కాదు, కొత్త దశాబ్దంలో అడుగుపెట్టాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. గడిచిన ఏడాది పేరు చెబితే ఎక్కువ మంది ఏం గుర్తు చేసుకుంటారు? కరోనా వైరస్, లాక్డౌన్, మాస్క్, ఫిజికల్ డిస్టాన్స్.. ఇంతే అంటారు. వరెస్ట్ ఇయర్ అని తిట్టుకుంటారు కూడా. కానీ, ఇంతే జరిగిందా? 2020 మనకు ఏం నేర్పలేదా..? ఎన్నో నేర్పింది.. ఎన్నడూ లేనంత సంతోషాన్ని ఇచ్చింది.
★ మనిషికి క్రమశిక్షణ నేర్పింది. పరిశుభ్రత నేర్పింది. సమాజంతో సంబంధాలు కొనసాగిస్తూనే భౌతిక దూరం పాటించాలని చెప్పింది. అంటువ్యాధుల గురించి, రోగనిరోధక శక్తి గురించి, మనం తినే తిండి గురించి కొత్త పాఠాలు నేర్పింది.
★ కుటుంబసభ్యులతో ఆనందంగా గడపటానికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. పుట్టి పెరిగిన ఊరులో జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం ఉండే అవకాశం ఇచ్చింది.
★ పర్యావరణాన్ని కాపాడితేనే మనిషి మనుగడ సాధ్యమని చెప్పింది. మనుషులందరూ క్రమశిక్షణతో ఉంటే.. ఈ ప్రకృతి ఎంత సుందరంగా, రమణీయంగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పింది. కాలుష్య కాసారమైన గంగానది సైతం స్వచ్ఛమైన నీటితో పరవశిస్తుందని తెలిపింది.
★ మనిషికి పోరాడే శక్తిని నేర్పింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులకు చెమటోడ్చి కష్టపడితేనే ఆనందం దక్కుతుందని చెప్పింది. విధి ఉన్నపలంగా రోడ్డున పడేస్తే.. బతకడానికి కొత్త దారులు చూపింది. అన్నింటికంటే మించి నీకు నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో చెప్పింది.
★ భారత్ ఒక దేశం మాత్రమే కాదని.. అదొక జీవన విధానమని ప్రపంచానికి చాటిచెప్పింది. మన జీవనవిధానం, మన ఆచారాలు, మన యోగా, ధ్యానం గొప్పదనాన్ని తెలిపింది. భారతీయుల శక్తి .. మనం పడే కష్టంలో, తీసుకునే ఆహారంలోనే ఉందని ప్రపంచ దేశాలకు చెప్పింది.
★ ప్రపంచానికంతటికీ ఒకేసారి జబ్బు చేసినా.. భారత్ ఔషధాలను అందించి ఆదుకోగలదని చాటిచెప్పింది. మన ఆయుర్వేద శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది.
★ శత్రువులు మారణాయుధాలతో దాడికి తెగబడినా.. మన సైనికులు వట్టి పిడికిళ్లతోనే మట్టి కరిపించగలరని ప్రపంచానికి చాటిచెప్పింది. దేశం కోసం మన జవాన్ ఎంతటి త్యాగానికైనా తెగిస్తాడని గల్వాన్ ఘటన నిరూపించింది. ఇండియన్ జవాన్ శక్తి ఏమిటో, రక్షణ పరంగా భారత్ ఎంత బలమైందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. కుట్రలతో భారత్ను దెబ్బ తీయాలని చూస్తే.. రెట్టించిన శక్తితో పైకి లేస్తుందని శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది.
★ ఇంటి నుంచి పని చేస్తూ కూడా అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది. కొన్ని రంగాలకు కొత్త దారులను చూపింది.
★ మారుమూల గ్రామాలకు కూడా సాంకేతిక పాఠాలు నేర్పింది. శానిటైజర్, క్వారంటైన్ పదాలను పరిచయం చేసింది.
కాలం నేర్పిన పాఠాలతో ముందుకు సాగాలి. ఆలస్యమైనా, మంచే జరుగుతుందనే ఆశతో అడుగేయాలి. ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవాలి. అదే జీవితం. చేసే ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుంటే విజయం అదే వరిస్తుంది. కొత్త సంవత్సరం మరింత ఆనందాన్నిస్తుంది..
దీనని అందరికీ తెలియజేసి వారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపండి!!
ఓం నమో భగవతే వాసుదేవాయ
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
శ్రీ భాగవతం - 98 వ భాగం
చదువుకుందాం భాగవతం
బాగుపడదాం మనం అందరం
దశమ స్కందము
శ్రీకృష్ణ లీలలు - 28
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
రుక్మిణీ కళ్యాణం
కృష్ణపరమాత్మ, రుక్మణీదేవి పంపిన లేఖను చదివి, దానిని పక్కనపెట్టి, అగ్నిద్యోతనునితో, ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు.
ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు.
అపుడు అగ్నిద్యోతనుడు అన్నాడు, “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు గురువు. ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు.
శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా! నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు.
ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వారికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు. ‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు.
‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాల బలరాముడు వెళ్ళాడు.
కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?
విని, కృష్ణుం ఇది తప్పుగాఁదలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
‘అగ్నిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురం లోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’! అని ఆవిడ వ్యాకులత చెందుతోంది.
కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
"తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై
మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది. అమ్మవారు అన్న మాటలో, ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.
బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ
త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.
ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు.
ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది.
భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ హరిం బతిఁ జేయు మమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ ఈశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అంది.
తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావలగ్ను, నవాంభోజదళాక్షుఁ, *జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు,* నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్!!
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది.
కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు.
శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు.
బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన
బ్రతుకు కలిగెనేని భార్య కలదు బ్రతికితీవు;
భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు!!
శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు.
ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి
మా సరివాడవా మా పాప గొనిపోవ?
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి?
వెయ్యది నడవడి? యెవ్వడెరుగు?
మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు;
మాయ గైకొని కానీ మలయ రావు;
నిజరూపమున శత్రు నివహంబుపై బోవు;
వసుధీశుడవు గావు వావి లేదు;
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు,
విడువు; విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వమెల్ల గొందు గలహమందు!!
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు,నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.
కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నింద చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది.
నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలాపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్టుకొని సంకల్పం చేస్తున్నారు.
అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ
గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ
క్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకుంది. అపుడు కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు.
తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.
ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.
అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడఁ
గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి
పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి,
ప్రీతు లగుచు ముక్త భీతు లగుచు!!
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారు అని,.....
శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.
🙏 శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో....... 🙏
🙏 కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య🙏
నాగ సుబ్బయ్య పైడి (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 49 🕉
ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వానకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రోసి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఓర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును.
🌹చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లిల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును.
🌹శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము.
🙏 ఓం నమః శివాయ 🙏
శివగంగ- కర్ణాటక
అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం
శివాలయంలో '1600' సంవత్సరాల నుండి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం.
నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారుతుంది...శివానుగ్రహం... తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం
కర్ణాటక రాష్ట్రం తుముకూరు
గంగాధరేశ్వర స్వామి ఆలయం లో జరిగే మర్మమైన విషయం అంతుపట్టని శివవైభవం.
శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.
వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.
ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే.
ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు,
శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల ఎత్తులో ఉంది.
పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.
శివయ్య కొలువైఉన్న పర్వతం శివలింగాకృతిని పోలి ఉంటుంది.
పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలిపిస్తుంది
పర్వతం పై కొలువైఉన్న దేవాలయాలు, ప్రమధగణాలు సాక్షాత్ కైలాస శిఖరం పై ఉన్న భావనకు వేదికలవుతాయి.
పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని,సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం
ఇలా అనేక విశిష్ఠతల సమాహారం శివగంగ దివ్య క్షేత్రం
ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ' గా పిలుస్తారు.
పర్వతశిఖరం పైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమదేవి ఆలయం,పాతాళగంగా ఆలయం,నందీశ్వరుడు కొలువై ఉన్నారు
ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం చూస్తూ అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ గంగ సరస్సులు ఉన్నాయి.
మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది మరియు గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక నైపుణ్యం యొక్క రుజువు
ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.
ప్రజలు ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని చూస్తారు. చెక్కిన అనేక మంటపాలు కూడా ఉన్నాయి. 🙏💐🙏💐🙏💐🙏💐🙏
--(())--
- అనాథుడను కాను రామ - జింగ్లా
●●●●●●●●●●●●●●●●●●●●●●●
ఉపోద్ఘాతము:
త్యాగరాజస్వామి
రచనలను పరిశీలిస్తే, వాటిలో మనకు వీర అద్భుత కరుణరసములే ఎక్కువగా
కనిపిస్తాయి. శృంగారరసమును కొద్ది కీర్తనలో మనము చూడగలము. మరి హాస్యరసమో?
అతికొద్ది కృతులలో మనకు దర్శనమిస్తుంది. అటువంటి త్యాగరాజకృతులలో
హాస్యరసానికి చమత్కారం జోడై అద్భుతంగా పండిన ఒక విశిష్టమైన కృతి ’అనాథుడను
గాను’.
ఈ కృతికి త్యాగరాజస్వామి ’జింగ్లా’ అనే విచిత్రమైన పేరుగల
రాగాన్ని ఉపయోగించడం హాస్యరసాన్ని మరింత పెంపొందిస్తుంది. చిన్నప్పుడు ఈ
రాగం పేరు వింటే చాలు, నాకు నవ్వొచ్చేది.
విపరీతాలకారైర్వికృతాచారాభిదానషైవేశఈశ్చ ౹
వికృతైరర్థవిశేషైర్హసతీతి రసః స్మృతో హాస్యః ౹౹
- భరతముని నాట్యశాస్త్ర నిర్వచనము.
అనగా,
విపరీతమైన అలంకారాలచేత, వికృతమైన ఆచారం (ఆచరణ) చేత, వికృతమైన పేర్లచేత,
వేషాలచేత మానవుడు నవ్వుతాడు అని భరతముని నిర్వచించారు. ఈ హాసమే
హాస్యరసమునకు స్థాయీభావము.
ఈ సూత్రముననుసరించియే త్యాగరాజస్వామి, ఈ
కృతియొక్క రాగమునకు జింగ్లా అని పేరు పెట్టారేమోనని అనిపిస్తుంది. ఇట్లు
జింగ్లా అనే విచిత్రమైన రాగపు వలువతో బాహ్యసౌందర్యాన్నీ, చతురోక్తులుగల
సాహిత్యముతో, భావముతో మానససౌందర్యాన్నీ ఏర్పరచి, త్యాగరాజస్వామి ఈ కృతిలో
ఒక అద్భుతహాస్యరసాకృతిని మనకు దర్శింపజేస్తారు.
ఇప్పుడు ఈ కృతిని పరిశీలిద్దాం......
ప. అనాథుడను కాను రామ నే (ననాథు)
ఓ
రామా! నేను అనాథుడనుకాను. ఎందుకంటే నాకు నాథుడిగా నీవున్నావుకదా అని
త్యాగరాజస్వామి రామునికి చెపుతున్నారు. ఈ పల్లవిలో రాముడు తనవెనకే
ఉన్నాడనియు, అతడు తనను రక్షించుననియూ అపారమైన విశ్వాసాన్ని
ప్రకటిస్తున్నారు త్యాగరాజస్వామి.
అ. అనాథుడవు నీవని నిగమజ్ఞుల
సనాతనుల మాట విన్నాను నే (ననాథు)
ఓ
రామా! ఈ అనంతకోటి విశ్వములలో అనాథుడెవరంటే, అది నీవేనయా అని
చతురోక్తులాడతారు త్యాగరాజస్వామి. అంతేకాదు... ’రామా ఈ మాట నేననలేదయా,
తత్వవేత్తలంటున్నారు’ అని దైవదూషణనుండి తప్పించుకుంటారు. ఇది ఎంతహృద్యమైన
చతురోక్తియో అంతటి గంభీరమైన ఉపనిషద్వాక్యము.
దాసభూతమిదం తస్య జగస్థావర జంగమం౹
శ్రీమన్నారాయణస్వామీ జగతాం ప్రభురీశ్వరః ౹౹
అనగా
స్థావరజంగమసహితమైన ఈ సృష్టికి, నారాయణుడే నాథుడు. ఆయనకు వేరొక నాథుడు
లేడు. కావున ఆయనయే అనాథుడు అని వేదవాక్యము. ఇట్లు ఒక విశిష్టమైన
పరమార్థాన్ని ఒక చతురోక్తిలో నిక్షిప్తంచెయ్యడం మహాకవులకే సాధ్యమౌతుంది.
చ. నిరాదరవు జూచియీ కలినరాధములనెదరు
పురాణ పురుష పుర రిపు నుత
నాగరాట్శయన త్యాగరాజ నుత నే (ననాథు
నిరాదరవు జూచి - రామా! నాయెడ నీ నిరాదరణను గమనించింథి
కలి నరాధములనెదరు:
ఈ కలియుగములో దుర్మానవులంటున్నారు. ఏమని? త్యాగరాజు అనాథుడని....
పురాణపురుష : ఈ సృష్టియంతటికీ ఆదిపురుషా
పురరిపునుత :
త్రిపురాసురులను సంహరించిన శంకరునిచే వినుతించబడేవాడా
నాగరాట్ శయన:
సర్పశ్రేష్టుడైన
ఆదిశెషునిపై శయనించినవాడా అని అర్థము. అంతేకాదు, నా బాధలను
పట్టించుకోకుండా హాయిగా నిద్రిస్తున్నవాడా అని ఎత్తిపొడుపు.
త్యాగరాజనుత - త్యాగరాజుచే కీర్తించబడినవాడా
త్యాగరాజస్వామి హృదయభావం:
"ఈ
కలియుగములో అధములై, జ్ఞానములేనివారు, నాపై నీవు చూపే నిరాదరణనుచూచి నన్ను
ఇటు రాజాశ్రయమూ, అటు దైవాశ్రయమూ లేని అనాథుడని వెక్కిరించుచున్నారు. ఈ
సృష్టిలో ఎవరైనా అనాథుడు ఉన్నాడంటే, వేదాలలో చెప్పినట్లు అది నీవే.
సకలలోకాధినాథుడవైన నిన్ను ఆశ్రయించిన నేను అనాథుడను కాను. కావున ఓ
ఆదిపురుషా! శంకర వినుతా! నీవింక నిద్రనుండి మేల్కొని నన్ను కావుమయ్యా
రామా!" అని ప్రకటితమౌతున్నది. ఇందులోని చమత్కారభరితమైన హాస్యము మన హృదయాలను
పులకింపజేస్తుంది.
వెంటనే నాకు మరొక సందేహం కలుగుతోంది. ఈ కృతిలోని
స్థాయీభావము హాస్యమా? లేక కరుణా ? లేక ఈ రెండింటి కలయికా? దీనిని కొంత
విచారిద్దాము....
’నేను అనాథుడను కాను’ అన్న ఎత్తుగడలో
త్యాగరాజస్వామి ’రాముడు నన్ను రక్షించితీరుతాడు’ అనే నమ్మకాన్ని ’నీవు
నన్ను రక్షించితీరాలి’ అనే ముందరికాళ్ళబంధంగా వేస్తారు. ’నిరాదరవుజూచి
కలినరాధములనెదరు’ అన్నప్పుడు ఆయనహృదయపుబాధకి చతురోక్తి అనే ముసుగు
కప్పుతారు. అంతేకాదు ’నాగరాట్శయన’ అనేసంబోధనలో ’ఇక నీవు రక్షింపకపోతే నే
తాళలేను’ అనే ఆర్తిని అంతర్లీనంగా ధ్వనింపజేస్తారు.
ఈ ఆర్తిలో దుఃఖము లేదు. ఎత్తిపొడుపు మాత్రమే ఉంది. ఈ ఆర్తిని దర్శించగలిగితే మనకు ఇందులోని కరుణరసముయొక్క అనుభూతి కలుగుతుంది.
కావున ఈకృతి కరుణహాస్యరసముల అద్భుతమిశ్రమము.
భరతాదులు
వీరశృంగార రసములకు హాస్యరసము తోదైనపుడు ఆ కలయిక రసానుభవాన్ని
ఇనుమడింపజేస్తుందనియు, కానీ హాస్యకరుణరసముల కలయిక అందముగానుండదనియూ
అభిప్రాయపడ్డారు.
కానీ తత్వవేత్తలూ, అసాధారణప్రజ్ఞావంతులైన కవులూ,
వాగ్గేయకారులూ, కన్నీటిని చిరునవ్వు వెనుక దాచగలిగిన కళాకారులూ పై
అభిప్రాయాన్ని తప్పని ఋజువుచేయగలరు.
అష్టదిగ్గజాలలో ఒకడైన
తెనాలిరామకృష్ణకవీంద్రులు, తాను రచించిన పాండురంగమహాత్మ్యంలోని నిగమశర్మ
కథలో నిగమశర్మ అక్క దుఃఖములో హాస్యాన్ని మేళవించి అరుదైన రసావిష్కరణ
చేశారు.
అదే విధంగా విశ్వవిఖ్యాత చలనచిత్ర కళాకారుడు చార్లీ చాప్లిన్ తన అభినయంలో కరుణహాస్యరసాల సమ్మేళనాన్ని హృద్యంగా చూపించారు.
అట్లే ఈ కృతిలో త్యాగరాజస్వామి కూడా కరుణహాస్యరసాలను మిశ్రముచేసి, ఒక ఉత్కృష్టమైన రసానుభవాన్ని ఆవిష్కరించారు.
ఆలమూరు విజయభాస్కర్
హైదరాబాద్
గారికి ధన్యవాదములతో...🙏
[19:24, 07/10/2020] +91 94922 72764: బుద్ధికుశలత
కులాన్ని చూడకు గుణాన్ని చూడు అని చాటి కధ.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది...?
బెనారస్ హిందూ యూనివర్సిటీ!
దాన్ని ఎవరు స్థాపించారు?
మదన్ మోహన్ మాలవీయ
ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు...!
ఆయన్ని చాలా మంది "నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి" అని హాస్యమాడేవారు కూడా...!
అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు.
ఇదే క్రమంలో ఆయన నిజాం దగ్గరకి వెళ్లారు. నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి...!
" నీకెంత ధైర్యం...హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా" అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా..
మాలవీయ మారు మాట్లాడలేదు...!
ఆ చెప్పును కళ్లకద్దుకుని "మహా ప్రసాదం" అంటూ బయటకి వచ్చేశాడు.
బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు.
నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు..!
పోటీ పెరిగింది. వేలం మొదలైంది.
ఈ సంగతి నిజాం చెవిన బడింది.
నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే పరువునష్టం. ఆ చెప్పు మాలవీయ చేతికి ఎలా వచ్చిందో తెలిస్తే సర్వభ్రష్టం...!
ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే ప్రతిష్ఠ మూసీ పాలు!!!
అందుకే నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి "ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి" అని పురమాయించాడు...!
చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు. నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు...!
మాలవీయ గారు నిజాం
లాంటి వాడి నుంచి కూడా "తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు" అని నిరూపించారు...!
బహుశా మనస్సు వుంటే మార్గం ఉంటుంది అంటే ఇదే కాబోలు.
జీవితమూ
నిజాం నవాబు లాంటిదే. అది ఒక చెప్పే విసిరేస్తుంది. మనమూ *మదన్ మోహన్
మాలవీయ లాగా ఆ అరకొర అవకాశాన్ని కూడా వాడుకుంటామా లేదా అన్నదే అసలు
ప్రశ్న!!!
అన్నట్టు...మన దేశపు ధ్యేయవాక్యం "సత్యమేవ జయతే" ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ గారే...!
🌹 డా. ఓ. మహమ్మద్ రఫి 🌹
మంచి కథలు గ్రూప్ లో ప్రవేశం కొరకు క్రింది అవకాశం ఉపయోగించుకోవవచ్చును.
మొత్తం
30 గ్రూపులు ఉన్నాయి అన్నింటిలో ఒకే కధ పంపించబడుతుంది. ఓక గ్రూప్ లో
చేరిన వారు ఇంకో గ్రూపులో దయచేసి చేరకండి, అలా చేరిన వారని/ ఏదో ఓక
ప్రొఫైల్ ఫోటో లేని వారిని మంచి కథలు గ్రూప్ నుండి శాశ్వతం గా తొలగించబడును
తారకాసురవధలో యుద్ధకళ గురించి దయచేసి అందరూ పూర్తిగా చదవండి
------------------------------------
కుమారస్వామి
జన్మించినదే తారకాసురాది మహారాక్షససంహారానికి. కనుక ఆయనకు
దేవసైన్యాధ్యక్షాభిషేకం చేశారు. సకల దేవతలు, మునిగణాలు,
దేవతీర్థక్షేత్రాలు, నదులు, యక్షగంధర్వాదులు వచ్చి సరికొత్త శక్తులతో
సైన్యాన్ని మహాయోధులతో అప్పటి వరకూ లేని దివ్యశక్తులతో సమకూర్చారు.
కార్తికేయుని
రక్షగా విష్ణుమూర్తి కవచాన్ని ఒక స్వస్త్యయనం రూపంలో ప్రసాదించాడు. ( ఇది
బహుదుష్కరమైన యుద్ధకార్యాలకు వెళ్ళేవారికి జయం కోరి వెళ్ళేవారికి పరమ
శుభాలు కలిగించే స్తోత్రం. పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని సామాజిక మాధ్యమంలో
ఇవ్వడంలేదు.
అనంతరం కుమారస్వామి తన సేనలతో మాతృగణాలతో కలసి
పక్షిరాజు గరుత్మంతుడు ఇచ్చిన నెమలి వాహనం అధిరోహించి గగనమార్గంలో
యుద్ధానికి పయనం అయ్యాడు.
ఆయనతో పాటు దేవగణాలు కూడా వివిధ పక్షుల
ఆకారాలు ధరించి అనుసరించాయి. చాలా దూరం వెళ్ళాక తనతో వస్తున్న సేనలను
క్రిందికి భూమి మీదకు దిగమని ఆజ్ఞాపించాడు కుమారస్వామి.
అలా నేలకు
చేరుతున్న దేవగణాలు దిక్కులు పిక్కటిల్లేలా మహాధ్వని చేశాయి. ఆ ధ్వని
పాతాళంలోని రాక్షసులకు చేరింది. దీనిని విన్న తారకుడు ఆ కదనరంగ ధ్వని
ఎక్కడిది అని వివరాలు అడిగాడు.
ఇక్కడ నుంచీ ప్రాచీన యుద్ధకళ పురాణాలలో ఎలా నమోదు అయిందో గమనించవచ్చు.
ప్రతీ యుద్ధానికి ముందు సన్నద్ధం కావడం ఉంటుంది. దాని తరువాత ఒక్కొక్క అడుగూ ముందుకుపడుతుంది.
ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేయడానికి కుమారసంభవం, దేవసైన్యసమీకరణ పూర్తి అయింది. దేవసైన్యాధ్యక్షుడుగా అభిషేకం జరిగింది.
ఇప్పుడు
కుమారస్వామి గగన విన్యాసం చేశాడన్నమాట. తొలుత తన శక్తి సామర్ధ్యాలు
ప్రదర్శించమే మయూర వాహనం ఎక్కి తన దివ్యసైనిక శక్తులతో ఆకాశంలో సుదూరం
ఎగరడం. ఇలా చేయడం శత్రువులను తొడగొట్టి రెచ్చగొట్టడం వంటిది.
నేటికీ
అధునాతన యుద్ధప్రారంభాలలో ఈ విధంగా యుద్ధవిమానాలతో శత్రుభూముల మీద
విన్యాసాలు చేస్తారు. ఇలా చేస్తూనే అనేక సమాచారాలు సేకరిస్తారు. ముఖ్యంగా
యుద్ధక్షేత్రాన్ని నిర్ణయించుకుంటారు.
దాని తరువాత భూమి మీద సైనిక స్థావరాన్ని ఏర్పరచుకుంటారు. అదే కుమారస్వామి చేశాడు.
దీని తరువాత తాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అనే సంకేతం శత్రువుకు పంపుతారు. అదే దేవగణాలు సింహనాదం చేయడం అంటే.
యుద్ధానికి
వెళ్ళిన ప్రతీ సైన్యం కొంతకాలం స్థావరాల్లో సకల ఏర్పాట్లు చేసుకున్నా,
యుద్ధం ప్రారంభం కావడానికి కొంత సమయం తమ కందకాలలో వేచి ఉండాల్సి వస్తుంది.
ఇది శత్రువు యుద్ధానికి వచ్చే సమయం అన్నమాట. ఇది యుద్ధ వ్యూహాన్ని బట్టీ
ఉంటుంది. అంటే అమెరికా తన సైన్యాన్ని పాకిస్తాన్ లో మోహరించడం వంటిది.
సరిగ్గా
ఇదే జరిగింది. దేవగణాలు చేసిన యుద్ధనాదాన్ని అందుకున్న రాక్షసులు తమకు
వచ్చిన యుద్ధ ఆహ్వానం బహిరంగంగా అందుకున్నారు. తన సైనిక ప్రముఖులతో చర్చలు
జరపి వ్యూహరచనలో తారకాసురుడు మునిగాడు.
ఇక్కడ అతి ముఖ్యమైన అంశం దాగి ఉంది.
ప్రతీ యుద్ధం వెనుకా ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నామో ఆ కారణం బహిరంగంగా చెప్పవలసి ఉంటుంది.
నేటికీ అధునాతన యుద్ధాలలో కూడా ఇది తప్పని సరి.
అమెరికా
వంటి దేశం తమ ట్విన్ టవర్లు బిన్ లాడెన్ కూల గొట్టాడు అనే కారణం చూపి
ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం చేసింది. అయితే ఇక్కడే అది చతికిల పడింది.
జంటభవనాలు
కూల గొట్టింది ఎవరు అంటే చెడ్డీవేసుకోవడం రాని పిల్లాడు కూడా లాడెన్ అని
చెబుతాడు. కానీ చెడ్డీ పిల్లలు చెప్పేది కాదు అంతర్జాతీయ యుద్ధాలలో దేశాలు
చూపాల్సిన కారణం. వారు ఒక కోర్టులో ఒక కేసును ఎంత బలంగా సాక్ష్యాధారాలతో
దాఖలు చేస్తారో అంతపకడ్బందీగా కారణాలు అంతర్జాతీయ సమాజానికి చూపగలగాలి.
అమెరికా
ఇక్కడే పప్పులో కాలేసింది. లాడెన్ చాలా తెలివిగా జంటభవనాలను తానే
కూలగొట్టాను అనే మాట ఎక్కడా అనలేదు సరికదా, తానే కూలగొట్టానని అమెరికాను
నిరూపించమని బహిరంగ సవాల్ చేశాడు. దీంతో అమెరికా కుడితిలో పడ్డ ఎలుకలా
కొట్టాడింది. అన్నీ యుద్ధానికి సిద్ధం చేసుకున్నా తగిన కారణం చూపలేని
అసమర్థత వల్ల చాలాకాలం ఆగాల్సి వచ్చింది. అయితే ప్రపంచాన్ని తన కౌబాయ్
క్రౌర్యంతో అణచివేయడం తెలిసిన దేశం కనుక ఒక పది తెల్లకాగితాలు పట్టుకుని తన
దేశ ప్రతినిధికి ఇచ్చి ప్రపంచంలోని అన్ని అగ్రదేశాలకు ఒక ప్రత్యేక విమానం
ద్వారా పంపింది. ఆ తెల్లకాగితాలలో ఏ చిదంబర రహస్యం ఉందో నేటి వరకూ ఎవరికీ
తెలియదు. అమెరికా పౌరులు ఎన్ని నేప్ కిన్లు వాడతారు, టాయిలెట్ పేపర్
ఏడాదికి ఎన్ని క్వింటాళ్ళు ఖర్చుచేస్తారో చెప్పే అమెరికా బిన్ లాడెన్ ను
దోషిగా నిరూపించే సాక్ష్యాలు మాత్రం యుద్ధకాలంలో చూపలేకపోయింది.
అమెరికా
యుద్ధనీతుల్లో నేటికీ ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో ప్రపంచానికి లాడెన్ సవాల్
కు సమాధానం చెప్పని అంశం ఒక చెరపలేని మచ్చగా మిగిలిపోయింది.
వామన
పురాణం కూడా అత్యత్భుతంగా ఈ కారణం చూపే అంశాన్ని పేర్కొనడం జరిగింది.
కుమారస్వామి అప్పుడే పుట్టాడు. అతనికి రాక్షసులకు ఏ వైరం లేదు. కనుక ఏ
కారణం చూసి అతనితో యుద్ధం చేస్తారు? మహారాక్షసులైనా వారు కారణం కోసం ఆగారు.
అటువంటి కారణం వారికి పాతాళకేతువు ద్వారా దొరికింది.
పాతాళకేతువు
అనే రాక్షసుడికి భూలోకంలో మహర్షులు చేసే యాగాలు పాడుచేయడమే పని.
గాలవాశ్రమానికి వెళ్ళి అక్కడ యజ్ఞాలు నాశనం చేయడం ప్రారంభించాడు. వాడిని
వెంబడించి ఒక వీరుడు బాణాలతో ఒళ్ళు చీల్చడం ప్రారంభించాడు. ఆ బలశాలి నుంచీ
తప్పించుకు పోతూ దక్షిణసముద్రం చేరాడు. అక్కడ మహాసైన్యం ఉంది. ఆ సైన్యం
‘‘తారకాసురుడిని చంపుతాము, మహిషాసురుని చంపుతాము‘‘ అని గర్జిస్తూ ఉండడం
విన్నాడు. వీరుడు తరుముకు వస్తూ ఉండగా తారకుడిని చేరి ఈ సమాచారం చెప్పి
శరణు కోరాడు.
తారకుడు భయపడవద్దని అభయం ఇచ్చి ఈ కారణం చూపి సమరం ప్రకటించాడు.
రాక్షస
సైన్యాలు సమాయత్తం చేసి యుద్ధానికి అంధకాసురుడు, మహిషాసురుడు, కుంభుడు,
బాణుడు, జంభాసురుడు వంటి మహారాక్షసులతో కలసి దేవగణాలతో యుద్ధనికి వెళ్ళాడు.
దీని తరువాత యుద్ధకళలో ముందుగా ఎవరు ఫస్ట్ బులెట్ పేల్చారు అన్నది ముఖ్యం.
భూమండలంలో
దక్షిణసముద్రం దగ్గర వేచి ఉన్న కుమారస్వామి ఆధిపత్యంలోని దేవ సైన్యాన్ని,
పాతాళం నుంచీ వచ్చిన రాక్షససైన్యం చేరుకొంది. వస్తున్న సైన్యాన్ని చూసి
దేవసైన్యం ఎదురు వెళ్ళింది. కుమారస్వామి పరిఘపట్టి రాక్షసులను చంపడం మొదలు
పెట్టాడు.
ఇక్కడ మరో రహస్యమైన అంశం పురాణవిద్య అభ్యసించేవారు తెలుసుకోవాలి.
దేవసైన్యరహస్యాలు
ఎలా రహస్యంగా వామనపురాణంలో విచిత్రమైన పేర్లతో దాచి ఉంచారనే అంశం
తెలుసుకున్నాము. కుమారస్వామి సైన్యంలో దేవతలు ఇచ్చిన దివ్యశక్తుల యోధుల
పేర్లు చెప్పిన పులస్త్యుడు, యుద్ధవర్ణనలో ఈ వీరుల రహస్య శక్తులు చెప్పాడు.
వాటిని సూచనా ప్రాయంగా మాత్రమే చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా వారు కూడా
మామూలు యోధుల్లా యుద్ధం చేశారు అని చెప్పడంతో అధికశాతం పౌరాణికులు ఈ
రహస్యాలు కనుగొనలేకపోయారు.
ఉదాహరణకు జ్వాలాముఖుడు అనే దేవసైనికుడు
అందిన ప్రతీ దానవుడినీ తన నోట్లో వేసుకున్నాడని వర్ణించాడు. జ్వాలా ముఖుడు
అంటే భయంకరమైన అగ్ని ప్రయోగం చేసేవాడన్నమాట. తన నోట్లో వేసుకోవడం అంటే
మంటల్లో మండిచాడన్నమాట.
దండకుడు అంటే బానెట్ ఫైట్ చేసేవాడు. ఈ దేవసైనికుడు ప్రతీ దానవుడినీ చీల్చి సముద్రంలోకి విసిరేశాడని వర్ణించాడు.
సహస్రనయనుడు అనే వేయి కన్నుల దేవసైనికుడు శూలంతో అశ్వరథకుంజరసహితంగా దానవులను మట్టుపెట్టడం ప్రారంభించాడు.
షోడశాక్షుడు
అనే 16 కన్నుల దేవసైనికుడు, శతశీర్షుడు అనే వందతలకాయల మేటి ఖడ్గధారి,
శ్రుతాయుధుడు అనే ధ్వనితరంగాలను వినే నిష్ణాతుడు - వీరంతా వీరవిజృభణంగా
యుద్ధం చేశారు.
అయితే మహిషాసురుడు వీరిని అడ్డుకోవడానికి భీకరమైన యుద్ధం చేశాడు.
ఇవన్నీ ఇలా ఉండగా సుచక్రాక్షుని యుద్ధవర్ణన అతి ముఖ్యమైంది.
ఇక్కడ
గమనించాల్సిన ముఖ్యఅంశం ఒకటి ఉంది. ప్రతీరంగంలోనూ లైన్ అండ్ స్టాఫ్
డ్యూటీలు ఉంటాయి. వీరి గురించి అర్థం చేసుకోవడం చాలా సులభం. యుద్ధం
చేసేవారు కొందరు ఉంటే, యుద్ధం చేసేవారికి సాయకులుగా కొందరు ఉంటారు. సాయకుల
పని ప్రధానంగా యుద్ధం చేసే సైనికులకు సహాయం చేయడమే. అలా అని వారు యుద్ధం
చేయలేని వారు అని కాదు అర్థం. అవసరమైతే, చేయాల్సిన తమ విధులు లేకపోతే,
తీరికగా ఉంటే వారుకూడా యుద్ధం చేస్తారు.
అటువంటి వాడే
సుచక్రాక్షుడు. ఇతడు చక్రముల వంటి కళ్ళు కలవాడు. అంటే 360 డిగ్రీలలో
కదనరంగాన్ని చూస్తూ ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలిగిన వాడు. కనుకనే ఆయన
మహిషాసురుడు రెచ్చి పోవడం గమనించి స్వయంగా ఆయనే యుద్ధానికి వెళ్ళాడు.
సుచక్రాక్షుడిని మహిషాసురుడు ఎదుర్కోలేకపోయాడు.
దీంతో కపట యుద్ధం మొదలు దానవులు పెట్టారు.
ఎవరు పుట్టించారో చెప్పలేదు కానీ రాక్షససైన్యంలో ‘‘మహిషుడు చనిపోయాడు‘‘ అనే పుకారు పుట్టించారు.
ఇది అప్పటి యుద్ధరంగాల్లోని ఆన్ లైన్, రియల్ టైం సమాచార వ్యవస్థలను తెలుపుతుంది.
ఈ
పుకారుని విని బాణుడు అనే వెయ్యిచేతుల రాక్షసుడు మహిషుడి దగ్గరకు
పరిగెత్తుకు వచ్చి సుచక్రాక్షుడు కదల కుండా తన ఐదు వందల చేతులతో బంధించాడు.
మరో ఐదువందల చేతులతో మహిషుడిని రక్షించడం ప్రారంభించాడు.
దీన్ని
మకరాక్షుడు అనే మరో దేవ సైనికుడు చూశాడు. ఇంతకు ముందే మకరాక్షుని దివ్య
శక్తి గురించి తెలుసుకున్నాం. మొసలి కళ్ళకున్న దివ్యశక్తులు తెలుసుకున్నాం.
ఇటువంటి దివ్యదృష్టి కలవాడు కనుక వెంటనే రియల్ టైం రెస్క్యూ ఆపరేషన్ కు
వచ్చాడు.
వెయ్యి చేతుల బాణుడు చేతులు ఖాళీ లేకుండా యుద్ధం చేయడం
చూసి తేలిగ్గానే అతడి నెత్తిమీద బలంగా తన గదతో బాదాడు. బాణుడు భయంకరమైన
వేదనతో చక్రాక్షుడిని వదిలిపెట్టాడు.
ఈ లోపల తారకాసురుడిని
చంపివేసిన కుమారస్వామి మహిషాసురిడి వెంటపడ్డాడు. తారకుడు చనిపోవడం చూసి
కుమారస్వామి శక్తి తెలిసి మహిషుడు పారిపోవడం ప్రారంభించాడు. శరవణుడు వాడిని
వెంటతరుముతుండగా క్రౌంచపర్వతంలోని గుహలో దూరాడు.
ఇది చూసిన కార్తికేయుడికి ధర్మసందేహం వచ్చి గుహకు అడ్డంగా కూర్చుని వాడు బయటకు వస్తే చంపుదామని తన సందేహానికి సమాధానం వెతకసాగాడు.
క్రౌంచపర్వతం
సునాభుని పుత్రుడు. సునాభువు హిమవంతుడి పుత్రుడు. హిమవంతుడు శివుడికి
పిల్లనిచ్చిన మామగారు. అంటే పార్వతీదేవికి తండ్రి. అంటే సునాభుడు పార్వతి
తమ్ముడు. అంటే క్రౌంచపర్వతం గౌరీదేవికి మేనల్లుడు. అంటే తన తల్లికి
మేనల్లుడు కనుక తనకు బంధువు, రక్తసంబంధీకుడు.
ఈ రాక్షసుడు పోయి ఈ
పర్వతం గుహలో దాక్కున్నాడు. వాడ్ని చంపాలంటే పర్వతాన్ని పేల్చాలి. అలా
పేల్చితే బంధునాశం చేసిన వాడు అవుతాడు. కనుక ఏం చేయాలా అనే సందేహంలో
కుమారస్వామి పడ్డాడు.
ఇలా ఆలోచిస్తూ గుహముఖంలో కూర్చున్న గుహుడిని వెనకాలే వచ్చిన ఇంద్రుడు చూశాడు.
ఏంటి చూస్తున్నావ్ పర్వతాన్ని పేల్చేసి వాడ్ని చంపేయి అన్నాడు.
బంధుహత్య చేయనన్నాడు కుమారస్వామి.
దాంతో ఇంద్రుడు తన మాయోపాయాలు పన్నాడు.
కుమారస్వామిని రెచ్చగొట్టడం ప్రారంభించాడు.
కలుగులో
ని ఎలుకలా దొరికిపోయిన మహిషుడిని నిజానికి ఇంద్రుడు కొండగుహను పేల్చేసి
చంపగలడు. కానీ అలా చంపితే శివుడు, పార్వతులకు ఏం కోపం వచ్చి శపిస్తారో అనే
భయం ఉండనే ఉంది. అందులోనూ కుమారస్వామి తనకు పోటీ అనే భయం ఉండనే ఉంది.
అందులోనూ మొన్ననే శివుడి మహామోహం అడ్డుకొని సొంతభార్యలకు పుత్రులు జన్మించే
అవకాశం లేని శాపం పొందాడు. కుటిల రాజనీతిలో సిద్ధహస్తుడు కనుక తాను
క్రౌంచపర్వతాన్ని నష్టపరచకుండా కుమారస్వామితో చేయించాలని ఎత్తు వేశాడు.
కనుకనే కుమారస్వామిని రెచ్చగొట్టడం ప్రారంభించాడు.
‘‘శక్త్యాయుధంతో కొండబ్రద్దలు కొట్టి రాక్షసుడిని చంపు, ఆలోచిస్తున్నావేంటి?‘‘ అన్నాడు.
‘‘మా
అమ్మ తండ్రి మనుమడిని ఎలా చంపను? అమ్మకు మేనల్లుడు, నాకు సోదరుని వంటి
వాడు. నీకు తెలీదా పురాతన వేదవాక్కు. గోవు, బ్రాహ్మణుడు, వృద్ధుడు, బాలుడు,
బంధువు, దుష్టురాలుకాని ఆడది, గురువులు, గురుజనులు -వీరు అపరాధం చేసినా
చంపరాదు. కనుక నేను క్రౌంచాన్ని భేదించను మహిషుడు లోపల ఎన్నాళ్ళు ఉంటాడు.
బయటకు వచ్చాక చంపుతాను‘‘ అని కుమారస్వామి అన్నాడు.
కుమారస్వామి
మాటలు విన్న ఇంద్రుడు తనలోతాను దుష్టపన్నాగాలు పన్నుకొని ‘‘నువ్వు నాకంటే
తెలివైనవాడివిలా మాట్లాడుతున్నావు. విష్ణువు చెప్పిన మాట నీకు తెలీదా? ఒకడి
కోసం పదిమందిని చంపకూడదు. పది మందికోసం ఒకడిని చంపవచ్చు అని చెప్పాడు
తెలుసా? నేను సొంత తమ్ముడు నముచిని చంపాను (మరుత్తులజన్మవృత్తాంతంలో
వస్తుంది). కనుక తప్పేమీ లేదు కొండబద్దల కొట్టు‘‘ అని రెచ్చగొట్టాడు.
కుమారస్వామి
ఆ పని చేస్తే హిమవంతుడు, పార్వతులతో విరోధం వస్తుంది కనుక తన చేతికి
రక్తం అంటకుండా తనకు శాపం ఇచ్చిన అటు పార్వతిని, తనకు పోటీ అయిన కుమార
స్వామిని దెబ్బకొట్టాలని దుష్టపాచికవేశాడు.
కుమారస్వామికి తనను ధిక్కరిస్తూ ఇంద్రుడు మాట్లాడే సరికి మహాకోపం వచ్చింది.
ఇంద్రుడు
దేవతాధిపతి. ముల్లోకాధిపతి. కుమారస్వామి దేవసైన్యాధ్యక్షుడు. వీరిద్దరికీ
లడాయి పడిందిక్కడ. తనకన్నా శక్తిమంతుడైన సైన్యాధిపతిని రాజు
నియంత్రించుకోలేకపోతే తన గొయ్యి తానే తవ్వుకున్నవాడవుతాడు. కనుక ఇంద్రుడు
తన ప్రాణాలు అడ్డువేసి మరీ ఈ కుటిల యుద్ధానికి దిగాడు. తన ఎత్తు పారిందా?
కార్తికేయుడికి అపకీర్తి వస్తుంది, ఎదురులేని సింహాసనం వస్తుంది. పారలేదా
తనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇది ఇంద్రుడి ఎత్తుగడ.
దేవరాజు మీద కోపం వచ్చిన దేవసేనాపతి తిరుగుబాటు చేసి యుద్ధానికి రా అని సవాల్ చేశాడు.
ఇంద్రుడికి
తాను కుమారస్వామిని గెలవలేనని తెలుసుకనుక, ‘‘యుద్ధం ఎందుకులే ఇద్దరం కలసి
ఒకపందెం వేసుకుందాం. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టవస్తే వారు
గెలిచినట్టు‘‘ అని అన్నాడు.
కుమారస్వామి పర్వతాన్ని చుట్టి వచ్చి నేను గెలిచాను అన్నాడు.
ఇంద్రుడు ‘‘కాదు నేనే గెలిచాను నేనే ముందువచ్చాను‘‘ అన్నాడు.
మళ్ళీ జగడం మొదలైంది.
ఈ సారి మరింత విషం లాంటి ఆలోచన చేసిన ఇంద్రుడు ‘‘ఎవరు ముందు వచ్చాడో క్రౌంచాన్నే అడిగి తెలుసుకుందాం‘‘ అన్నాడు.
ఇంద్రుడి
దుష్టబుద్ధి అంతా ఈ మాటల్లో ఉంది. నిజానికి క్రౌంచం, కుమారస్వాములు
చిన్నపిల్లలు. వారికి వేదవేదాంగాలు తెలిసిన మహాశక్తిమంతులే అయినా ఈ కపటాలు
తెలియవు.
కుమారస్వామి ‘‘ ఎవరు ముందు వచ్చారు?‘‘ అని క్రౌంచాన్ని అడిగాడు.
ఈ
సమయంలో క్రౌంచం నిజానికి మౌనంగా ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ
పిల్లవాడు కావడం వల్ల, ఇంద్రుడి దుష్టత్వం తెలియదు కనుక ‘‘ఇంద్రుడే ముందు
వచ్చాడు‘‘అనేశాడు.
అది వినడం ఏమిటి కుమారస్వామి క్రౌంచాన్నిబ్రద్దలు చేశాడు. క్రౌంచనాశనం తో పాటు మహిషుడు చనిపోయాడు.
ఇంద్రుడి కళ్ళు అప్పుడే చల్లబడలేదు.
కుమారుడైన క్రౌంచపర్వతాన్ని కుమారస్వామి కూల్చివేశాడని తెలుసుకున్న మేనమామ సునాభుడు పరిగెత్తుకు వచ్చాడు.
సునాభుడు
రావడం చూసి బ్రహ్మ అశ్వినీ దేవతలు వసువులు అక్కడి నుంచీ వెళిపోయారు.
ఇంద్రుడు అక్కడ నుంచీ మెల్లగా జారుకున్నాడని స్పష్టంగా పులస్త్యుడు
చెప్పాడు.
మేనమామ పరిగెత్తుకు రావడం చూసి కుమారస్వామి శక్త్యాయుధాన్ని చేతపట్టి నిలిచాడు.
వెంటనే విష్ణుమూర్తి కుమారస్వామికి అడ్డుపడ్డాడు.
ఈ
లోపల అక్కడకు చేరుకున్న హిమవంతుడు మనుమడి పతనం చూసినా తట్టుకొని కుమారుడు
సునాభుడిని చెయ్యిపట్టుకొని సంఘటనా స్థలం నుంచీ లాక్కుపోయాడు.
దీంతో ఇంద్రుడు ఆశించింది సంపూర్తిగా జరగలేదు.
ప్రశాంతంగా తారకాసుర సంహారం జరిగింది.
కుమారస్వామి బంధునష్టకృత్యానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.
అయితే
యుద్ధంలో మకరాక్షుడి వల్ల ప్రాణాలు పొందిన వీరుడు చక్రాక్షుడు అవమానభారం
పొంది బాణుడి చేతులు నరికే చక్రాయుధం కావాలని శివుని గురించి తపస్సు
చేశాడు. శంభుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని ఇచ్చాడు.
యుద్ధచరిత్రలో
అతిముఖ్యమైనవి ఇవే. ప్రారంభమైన యుద్ధం దానితోనే పరిసమాప్తం కాదు.
ఒకయుద్ధంతోనే ముగిసే యుద్ధకళలేనే లేదు. ప్రారంభం కాకూడదు కానీ ప్రాణభయంతో
ఇంద్రుడి వంటి తుచ్ఛులు తమస్వార్థం కోసం తాము చేసిన తప్పులకు తమ తల
తెగిపడకుండా తెలివిగా ఇతరుల మీదికి నెట్టి, తాము గట్టున ఉండి ఎప్పుడూ
నిప్పురాస్తూనే ఉంటారు. వారి కంఠం నరకనిదే శాంతిపావురం ఎగరదు.
శాంతిరాదు.
శాంతి
కావాలనుకుంటే యువత చేతి లోనే ఉంది. ఇటువంటి ‘‘పాముల‘‘ దుష్టపన్నాగాలు
తెలుసుకోవాలి అంటే పురాణవిద్య తెలియాలి. ఇది సంస్కృతంలో ఉంది. మూలం
చదివితేనే కానీ మూలతత్త్వం బోధపడదు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది.
No comments:
Post a Comment