Friday, 8 January 2021

ఆదివారము ఆరు కధలు10-01-2021

ఆదివారము ఆరు కధలు

 ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ: 

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

 మహాభారతం ఆదిపర్వం ఎనిమిదో భాగం
'''''''''''''''''''''''''''''"""""""""""""""""""""""""""""""""""""""""
జీవితమనే ఆట లో ఎలా విజయం పొందాలో చాలా చక్కగా వర్ణించిన  వ్యాస భగవానునికి నమస్కారములు
ఈ మహాభారత కావ్యానికి మరొక పేరు కూడా ఉంది ఆ పేరు " జయం "
ఈ కావ్యం పై పరిశోధన చేసిన వారు లేక మనసు పెట్టి ఆమూలాగ్రం గా కథను విన్న వారు జీవితంలో తప్పక విజయాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ కావ్యాన్ని అక్షరబద్ధం చేసింది జయస్వరూపుడైన... ఆది నాయకుడైన ...వినాయకుడు కనక. అందుకే ఈ కావ్యానికి జయం అనేటటువంటి పేరు వచ్చింది.
         🌼🙏🙏🙏🌼
అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తరువాత జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేసాడు. వ్యాస భగవానుని చూసి " తాత ! మీవంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు యుద్ధం ఎందుకు చేసారు ?! "అని అడిగాడు.
వ్యాసుడు వైశంపాయుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయునకు పూజలు చేసి బంధు మిత్ర పురోహిత సహితంగా భారతగాధను వినడానికి అతని ముందు కూర్చున్నాడు.
వేద వ్యాసుల వారి ఆజ్ఞ ను తలదాల్చి ముందుగా ఆయనకు నమస్కరించాడు వైశంపాయనుడు . వెంటనే జనమేజయుడు వైశంపాయనునికి తాంబూలం సమర్పించి  తన పూర్వీకుల గాధను వినిపించ వలసిందిగా  కోరాడు. వైశంపాయనుడు మరొకసారి గురువుకు నమస్కరించి మంగళప్రదమైన తన  గళం విప్పి భారతాన్ని ప్రవచించ సాగాడు.
ఓ శొనకాది మునులారా !  సభలో వైశంపాయనుడు ఎలా చెప్పాడో అలాగే మీకు వినిపిస్తాను . మాట తీరు నాది కాని మహత్వం వారిదే...శ్రద్ధాలువులై ఆలకించుడి. అని సూత మహర్షి కథ చెబుతున్నాడు
 వైశంపాయనుడు ఇట్లు చెప్పెను
గురు దేవుడైన వ్యాస భగవానునికి నమస్కారములు ...పెద్దలందరికీ నా ప్రణామములు ...విష్ణు స్వరూపి ఐన సభకు నమస్కారం ....శ్రీ వ్యాసులవారు విశ్వమానవ కల్యాణార్థం ...ఈ గాధను జయం అనే పేర రచించారు.భారత వీరుల కు చెందిన కథ కాబట్టి అందులోనూ బృహత్ కావ్యం కావడంవలన మహాభారతానికి ఆ పేరుపొందింది. తత్కాలానికి ఏకీ భూతమైన  వేదరాశిని చతుర్వేదములు గా విభజించి తన శిష్యులైన మా  చేతనే  వ్రాయించి వాటిని వ్యాప్తం చేసిన కారణంగా శ్రీ కృష్ణ ద్వైపాయను లగు వారికని వ్యాస దేవుడు అని శిష్యులైన మేము స్మరిస్తున్నాము.
భగవన్ లీల సమన్వితాలైన 18 పురాణాలను ప్రవచించి , బ్రహ్మజ్ఞానులకు సైతం ప్రమాణ భూతుడైన ఆ వ్యాసబ్రహ్మకు మరలా మరలా నమస్కరిస్తున్నాను.
బ్రహ్మ సూత్రాలను విరచించి చతుర్వదనో బ్రహ్మ అని సంస్తుతించబడిన భగవాన్ బాదరాయణునకు పునః పునః ప్రణమిల్లు తున్నాను.
రాజా జనమేజయ ! మహాభారత యుద్ధానంతరం తన వంశీయులైన భారత వీరుల గాథ సమస్తాన్ని ప్రబంధించాలనే సంకల్పంతో ......మూడు సంవత్సరాలపాటు అహోరాత్రులు శ్రమించి ...మా గురువుగారీ మహా భారతాన్ని తన మనసులోనే నిర్మించారు.. దానిని గ్రధితం చేసేందుకు తగిన లేఖకుని కోసం చింతిస్తూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి మా గురువుగారి మనో వాంఛితంబెరిగి ....ఆ మరాళ వాహనుడు లేకకునిగా శ్రీ మహా గణపతిని సూచించాడు. వ్యాసుల వారు తక్షణమే గణపతిని స్మరించి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు.
ఓ బాదరాయణ ! నన్ను తలచిన కారణం ఏమిటని ప్రశ్నించాడు మహాగణపతి .తన తలపుల లోని భారతాన్ని తాను ప్రవచిస్తుండగా గ్రంథంగా రాయమని కోరాడు వ్యాసుడు. అందుకు గణపతి నవ్వి... మునీశ్వరా !  నేను గంటం చేత పట్టిi రాయడం మొదలుపెడితే మీరు చెప్పగలరా.... శ్రీకారం చుట్టింది మొదలు చిత్తగించవలెను వరకు నా గంటం క్షణం కూడా ఆగదు సుమా ....అలా మీరు అవిరామంగా చెప్పగలిగితే తప్పకుండా రాసి పెడతాను అన్నాడు వినాయకుడు. శివ కుమార ! నీ చిత్రం ప్రకారమే కానీ.... నేను ప్రవచించే శ్లోకాలను ముందుగా నీవు అర్థం చేసుకోవాలి పరిశీలించాలి నీకు పూర్తిగా అర్థం అయితే తప్ప గంటం ముందుకు సాగకూడదు ...పార్వతీపుత్ర ! దయచేసి నాకు ఈ వరం అనుగ్రహించు అని కోరాడు వ్యాసుల వారు. అనుగ్రహించాడు వినాయకుడు.... శుభ ముహూర్తం చూసుకుని రచయిత అయినా వ్యాసుడు లేకకు డైన  గజముఖుడు కూర్చున్నారు. గణపతి యొక్క వేగాన్ని అందుకోవడం కోసం వ్యాసులవారు తొలి మూడు వేల శ్లోకాలను చాలా క్లిష్టంగా చెప్పారు . దూరాన్వయాలైన శబ్దజాలాలు, శిల్ప సంక్లష్టాలైన శ్లోకాలను చెప్పారు.
  వినాయకుడంతటి వాడికి ఆ శ్లోకాలను అర్థం చేసుకోవడం  గగనమైపోయింది ....కానీ విద్యలకెల్ల నొజ్జయైన ఆ బొజ్జ గణపతి తన వేగాన్ని నిరోధించేందుకు ఈ ముని ఇలా చెబుతున్నాడు అని గ్రహించి నవ్వుకొని అర్థం చేసుకుంటూ రాయడానికి శ్రీకారం చుట్టాడు. ఆ కాస్త వ్యవధిలోనే వ్యాసుడు కొన్ని వేల శ్లోకాలు అల్లుకొని సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో మహా గణపతి   ఒక విజ్ఞాన వాటిల్లింది  రాస్తున్న వేగానికి గంటం సహకరించడం లేదు. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని పెకలించి మహాభారతాన్ని వ్రాశాడు. అందువల్ల ను వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు ....ఈ విధంగా వ్యాసులవారు చెబుతుండగా గణపతి చే లిఖించబడిన ఈ భారతంలో తొలి  మూడు వేల శ్లోకాలు ఎంతటి ఉద్దండ పండితులకైన కొరుకుడు పడని విధంగా ఆ శ్లోకాలు భాసిస్తున్నాయి. ఇటువంటి శ్లోకాలతో కూడిన భారతం ఆదిపర్వం తో మొదలై స్వర్గారోహణ పర్వం తో ముగిసిన ఈ భారతం... మొత్తం 18 పర్వాలు ఆది.. సభ.. వన.... విరాట ...ఉద్యోగ భీష్మ ...ద్రోణ.... కర్ణ ...శల్య ...సౌప్తిక... స్త్రీ... శాంతి.... అనునాసిక... అశ్వమేధ... ఆశ్రమవాసిక ...మౌసల ...మహాప్రస్థాన స్వర్గారోహణ... ఈ 18 పర్వాలు అనేకమైన ఉప పర్వాలతో కూడుకుని అలరారుతున్నాయి.
            భారత కథా శ్రవణ ఫలము
         ----------------------------------
అత్యద్భుతమైన ఈ మహాభారత గాథను నిత్యము శ్రద్ధాభక్తులతో చదివిన , వ్రాసిన కూడా అనేకానేక ధర్మకార్యాలు చేసిన పుణ్యం కలుగుతుంది నాలుగు వేదాలను పద్దెనిమిది పురాణాలను ఆరు శాస్త్రాలను ఎనిమిది అంగాలని తొమ్మిది వ్యాకరణాలను పది ఉపనిషత్తులను ఏకమైనా పరతత్వాన్ని నేర్చుకోవడం వల్ల ఎంత జ్ఞానం కలుగుతుందో అంత జ్ఞానం ... ఒక్క ఈ భారతాన్ని శ్రద్ధగా చదవడం వల్ల కలుగుతుంది. తీరని కోరికలు ఏవో  కచ్చితంగా నెరవేరుతాయి అని వ్యాసుడు ప్రతిజ్ఞ చేసి మరీ ఈ గ్రంథాన్ని రచించాడు.......
మహాత్ములైన వ్యాసభగవానుడు మహాగణపతి మనలను సం రక్షించుగాక ! సర్వేజనా సుఖినోభవంతు శుభోదయం వందనాలతో మీ మిత్రుడు


బ్రహ్మ కు నమస్కారం

నమస్కార భూతాం

భూతాం ప్రాంజలి ఘటించె హనుమ ఈశ్వరా


హనుమ తూర్పుకు తిరిగి

తిరిగి సంతస పెరిగి

పెరిగి తండ్రి కి ఒదిగి

ఒదిగి నమస్కారం చేసేను హనుమంతు 


దక్షణాన తిర్గేను

తిర్గి దేహ మంతను

మంతను పర్వతం నొక్కె హనుమ ఈశ్వరా


కొలుచుటకు శక్యమ్ము

శక్యమవని దేహమ్ము

దేహమ్ము హష్తమ్ము

హస్తమ్ము పాదమ్ము

పాదమ్మతో పర్వతం నొక్కె హనుమంతు


పాద స్పర్శకు పూలు 

పూలు జలజలా రాలు 

రాలినవి హనుమంతుని కప్పే ఈశ్వరా 


పుష్పా కొండ వలెను

వలే పరిమళములను  

పరిమళ మయమైనది పర్వతము ఈశ్వరా 


ఏనుగులు మదాన్ని 

మదంతో గర్వాన్ని 

గర్వంతో విహరించే కరిగ హనుమంతు 


వెండి శిలలు నలిగియు 

నలిగి మెరుపు కలిగియు 

కలిగి నీలిరంగు గీతలు గా ఈశ్వరా 

 

మధ్యమ జ్వాలలతో   

జ్వాల ధూమములతో  

ధూమము వల్ల మణిశిలలు మెరయు ఈశ్వరా 


వికృత స్వరములతో 

స్వరము శబ్దముతో 

శబ్దఘోషకు మృగముల అరుపులు ఈశ్వరా 

--(())-- 



 
తాత మానవుడి చిన్న కధలు (18)           

సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాత ఐకమత్యం గురించి పాత  కధ ఎమన్నా ఉంటె చెప్పు
ఎందుకు లేవురా చాలా కధలు ఉన్నాయి ఒక కోతులు కదా చెప్తుతా విను  
అనగనగా ఒక అడవిలో కోతుల గుట్ట ఉండేది. అక్కడ చాలా కోతులు, కొండముచ్చులు నివసించేవి. ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్దపెద్ద ఊడలతో అందంగా ఉండేది. ఆ మర్రిచెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకొంటూ ఉండేవారు. 

కోతులు, కొండముచ్చులు ఎప్పుడు పోట్లాడుకునేవి. చెట్లకు కాసిన పళ్లు, కాయలు కోసుకుని తిని, చెరువులో నీటిని తాగి మర్రిచెట్టు మీద ఎగిరేవి. కొండముచ్చులు రాగానే కోతులు మర్రిచెట్టును వదిలి గుట్టల్లోకి పారిపోయేవి. 

ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు. అవి అప్పుడప్పుడు ముని తపస్సును భంగపరిచేవి. ముని పట్టించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు. 

ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి. దాంతో చెరువు ఎండిపోయింది. చెరువుని చూసి కోతులు, కొండముచ్చులు బాధపడ్డాయి. దాహం తీర్చుకోటానికి ఏం చేయాలో వాటకి తోచలేదు. అప్పుడే బుజ్జి కోతులు నీటి కోసం 'కిచకిచ'మని అరిచేవి. ముసలి కోతులకు కూడా కష్టమైంది. అవి నీటికోసం చాలా దూరం ప్రయాణించి మరో చెరువులో ఉన్న కొద్దినీటిని తాగి వచ్చేవి. 

మునికి కూడా స్నానాకి, ఇతర కార్యాలకు నీటి కొరత ఏర్పడింది. అతడు కూడా దూరంలో ఉన్న మరో చెరువులో స్నానం చేసి, తన కమండలంలో కొంత నీటిని తీసుకుని మర్రిచెట్టు కింద తపస్సు చేసుకుంటుండేవాడు. 

ఒకరోజు అతను తపస్సు చేసుకుంటుండగా ఒక కోతికి బాగా దాహంవేసి, దూరంగా ఉన్న మరో చెరువు దగ్గరకు పోలేక ముని కమండలంలోని నీటిలో మూతి పెట్టింది. ముని కండ్లు తెరచి చూశాడు. కోతికి భయం వేసింది. మునిని చూసి 'గుర్ర్‌' మని 

భయపెట్టింది. ముని మాట్లాడలేదు. తిరిగి కండ్లు మూసుకొని తపస్సు చేసుకోసాగాడు. కోతి, నీళ్లు తాగి కమండలం కిందపడవేసి వెళ్లిపోయింది. 

ఆ క్షణం అతడికి ఆ ప్రదేశం వదిలి మరోచోటికి వెళ్లి తపస్సు చేసుకోవాలనిపించింది. కానీ అడవిలో ఏ చోటైనా జంతువులు, పక్షులుంటాయని గ్రహించాడు. ఎండలకి అన్ని చెరువుల్లో దాదాపు ఎండిపోయిందని కనిపెట్టాడు. ఏం చేయటమా ....అని దీర్ఘంగా ఆలోచించాడు. అతడికి ఒక ఆలోచన తట్టింది. 

వెంటనే మర్రిచెట్టుకు కాస్త దూరంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ పూజ చేశాడు. కొబ్బరికాయ కొట్టి కండ్లు మూసుకుని నమస్కరించాడు. కొబ్బరి చిప్పలకై కోతులు, కొండముచ్చులు అక్కడ చేరుకున్నాయి. అతని ముందే కోతులు, కొండముచ్చులు పోట్లాడుకోసాగాయి. 

ముని మొదటసారిగా గొంతువిప్పాడు. ''ఆపండి! మీ పోట్లాట! అంటూ అరిచాడు. ముని మాట్లాడటంచూసిన కోతులు అవి ఆశ్చర్యపోయాయి. అతని కళ్లలో ప్రకాశిస్తున్న దివ్యజ్యోతిని చూసి భయంతో తలవంచుకొని నిలబడ్డాయి. ముని- కోతుల నాయముడు, కొండముచ్చుల నాయకుడిని దగ్గరకు పిలిచాడు. 

''వానరుల్లారా! మీ శక్తి అమోఘమైది. ఇలా కోతిచేష్టలతో మీ శక్తిని వృధా పరుచుకోకండి. మీ ఇద్దరూ ఎకమై నిలబడితే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించగలరు అన్నాడు ముని. 

ఐక్యంగా ఉంటే ఏ పనైనా తేలికగా సాధించడం సాధ్యమేనా? అని కోతుల నాయముడు ప్రశ్నించాడు. 

నిస్సందేహంగా- ''ఐకమత్యమే మహాబలం అని మరువకండి''. పట్టుదలతో ఉన్నవారికి ఏది అసాధ్యము కాదు. 

మునీంథ్రా! మేము అనుక్షణం నీటి కోరత వల్ల మాలో కొన్ని కోతులు మరణించడం వల్ల. మా రెండూ జాతుల మధ్య వైరం ఏర్పడినది. మా దాహార్తిని తీర్చే మార్గం చూపించి పుణ్యం కట్టుకొండి. 

మీ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తాను. 

మీ కోతుల దండు అంతా ఏకమైతే మీ దాహాం తీరిపోతుంది. 

''వానరులారా! నేను పూజచేసిన ఈ ప్రదేశంలో ఒక మంచి నీటిని బావిని తవ్వండి! 

అందులో జలసీరి ఎగసిపడుతుంది. మీ కష్టాలు సమసిపోతామని అభయమిచ్చాడు మునీంధ్రుడు. 

అంతే.....జాతివైరం మరచి, కోతులు, కొండముచ్చులు ఏకమయ్యాయి. బావి తవ్వకాని కావలసిన పలుగుపార, తట్టబుట్ట తీసుకోని బావి తవ్వడం ప్రారంభించాయి. రెండూ రోజులు కష్టపడి ఒక పెద్దబావిని త్వాయి. అందులో నుండి పాతాళ గంగ ఎగసిపడి కోతుల శ్రమను, అలసటను మరచిపోయేలా చేసింది. కోతులు, కొండముచ్చులు ఒకదానికోకటి తమ అభినందనలు తెలుపుకొని సంబరపడ్డాయి. 

ఆ వానరనాయకులు తమ అనుచరులతో మునీంధ్రునికి ప్రణమిల్లి. మీ పట్ల అపచారంగా ప్రవర్తించినందుకు క్షేమించమని ప్రార్థించాయి. 

అసలే కోతులు మీ బుద్ధి నిలకడగా ఉండదు కానీ, మీ సంకల్పం మాత్రం బహు గోప్పది. 

మీవల్ల నలుగురికి మంచి జరగాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుందని ఆశీర్వదించాడు. 

వనదేవత! మునీంధ్రుని ముందు ప్రత్యక్షమై....! వత్సా! నీ ప్రయత్నము అద్భుతము. నాడు శ్రీరాముడు లంకకు వారధికట్టి రావణ సంహారం కావించి, సీతకు రావణనుని చెరనుండి విముక్తి కలిగించాడు. నేడు ఈ వానరసేనతో పాతళగంగను భూమిపై గలగలపారించి అపరభగీరధుడవై నిలిచావు. నీకు సకల శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి, వనదేవత అదృశ్యమైంది. 

మునీంధ్రుడు రెండూ కనులు మూసుకొని తన ధ్యానంలో నిమగ్నమయ్యాడు.

ఐకమత్యం..........(పైడిమర్రి రామకృష్ణ.) 


తాత మానవుడి చిన్న కధలు (17)           
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత గొప్ప వారు ఎవరు తాత అని మనవుడు అడిగాడు ? 
ప్రతి ఒక్కరు గొప్పవారే సమయానాన్ని వ్యర్ధ చేయకుండా, ఎవ్వరికి భారం కాకుండా, ఎవ్వరిని మోసం చేయకుండా, నమ్మిన కళలో విజయ సాధించాలని తీవ్రకృషి చేసిన వారు గొప్పవారు, ధనం ఉన్న వారు గొప్పవారు అనుకోవటం తప్పు, 
అందుకే ఒక చిన్న కధ చెపుతా విను మనవుడా               

కాలం కదులుతుంది అది మనకు తెలియదు, పగలు రాత్రి కలయికతో ఒక రోజు కదుల్తుంది. ఆ మధ్య సమయంలో అనేక మార్పులు నిత్యమూ గోచరమౌతాయి. 

అందరి కన్నా గొప్ప నేను అనుకుంటారు ఎవరికి వారు అనగా ఓ అందమైన భవనాన్ని నిర్మించు టకు ఇటికలు గొప్పవని చెప్పుకున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న సిమెంటు అన్నది  మీరు విడిగా ఉన్నప్పుడు ఎవరు గమనించరు, ఇటుకలను  ఎక సూత్రముగా కలుపుటకు నేనుండగా మీ గొప్ప పెరిగింది అన్నది. అక్కడే ఉన్న దర్వాజాలు, కిటికీలు అందముగా మేము ఉండుటవల్లే ఇంటికి అందం పెరిగింది అది మీరు గమనించండి అన్నాయి.

అప్పుడే అటుగా మేస్త్రి పోతూ వీళ్ళ సంభాషణలు విని నేను కూలీలను  చేర్చి చక్కగా నిర్మించుట  వల్లా,  గొప్పగా కనిపించింది ఈ భవనము. అప్పుడే  అటుగా పోతున్న ఇంటి యజమాని వచ్చి మీ రందరు కాదు ఇది నా సంపాదన వళ్ళ ఏర్పడినది మీరందరు  నేను పిలవగా వచ్చిన వారు అన్నాడు.. అప్పుడే అటుగా ఒక స్త్రీ భాదపడుతూ వచ్చింది.

అమ్మా ఎవరు మీరు బాధ పడుతున్నారు అని అడిగాయి. నేను పుడమి తల్లిని మీ బరువు నంతా మోసున్నాను నన్ను మరిచి పోయారు మీరు,  మిరే గొప్ప అని అను కుంటున్నారు అది ఎంత వరకు నిజం  మీలో  "సంయమనం, సహనం, పరస్పర  సహకారం " లోపించింది. అందువల్లే నేను భాధ పడుతున్నాను . మమ్మల్ని క్షమించండి మా తప్పులు మన్నించండి. మేమందరం మీ బిడ్డలం .

మీకందఱకు నేను ఒకటే చెప్పేది ఐకమత్యం లోపించి, వ్యక్తిత్వమే ప్రాధాన్యత వహించిన చోట  సదా పతనం, పరాభవం లభిస్తుంది. మీ గొప్పలు ఆవతలు పెట్టి  ఐకమత్యంగా ఉండి " సంయమనం  సహనం పరస్పర  సహకారం ఉన్నత కాలం నేను మీ వెంటే ఉంటాను. మీరు ఎదురు తిరిగితే నేను పెట్టె కష్టాలను భరించ వలసి ఉంటుంది అని తెలుసు కొండి. ఒకరికొకరు సహకరాం అందించుకుటూ ఉంటేనే పగలు రాత్రి ప్రశాంతముగా ఉంటాయి.                 
తాతా అన్నిటి కన్నా గొప్పది భూమాత కదా తాత, అవునురా అందరికన్నా గొప్ప 
ఇంకా ప్రత్యక్ష దైవాలు " సూర్యచంద్రులు, పంచభూతాలు, తల్లి తండ్రులు, గురువు గొప్పవారు. 
మనవుడు నెమ్మదిగా వచ్చి  తాత పాదాలకు నమస్కరించాడు. 
ఏమిటిరా ఏ రోజు స్పెషల్ గొప్ప విషయాలు చెప్పారు, నా మనసుకు తృప్తి కలిగింది తాత               
ఏమీ తెలిసిందిరా నీకు 
ఎవ్వరూ గొప్పవారు కాదు, సత్యమ్, ధర్మం,న్యాయం నిలబెట్టే పరమేశ్వరుడే  గొప్పవారు తాత
అవును .........  అవునా  .......   అవును ... అవును   

--((**))--

Image may contain: people sitting
సమ్మోహనాలు () ... 1071----1080
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కనులు కలబడు చూపు
చూపుల చురక ఊర్పు
ఊపుల ఉయ్యాల పిలుపు ప్రేమ ఈశ్వరా

 చీకటి వెలుగు పిలుపు
పిలుపుల మనసు తలపు
తలపులు నిండి ఉన్నట్టు ప్రేమ ఈశ్వరా

  విరిసేను రవి కనులు
కనులేలు  కమలములు  
కమలాలు పంచెను సౌందర్యం ఈశ్వరా

రమ్ము ప్రియ సుందర
సుందర మదినివ్వర
మదినిచ్చి ప్రేమ పంట చూడర ఈశ్వరా

 మోసకారి ప్రేమ
ప్రేమ విధి ప్రాప్తమ
వధిబలీయమైనది తప్పదే.ఈశ్వరా

వచ్చి వెళ్ళే ప్రేమ
ప్రేమ చుట్టు కాలమ
కాలము కన్నెర్ర చేయించే ఈశ్వరా

మరవాలను కన్నను
ఉన్న ప్రేమ ఉన్నను
ప్రేమ జీవిగా మరువలేనులె ఈశ్వరా

నీకు ప్రేమ లెందుకు
 ప్రేమ బతుకు ఎందుకు
ఎందుకో నీలో ఉండు ప్రేమ ఈశ్వరా

వెన్నె లాంటి మనసుకు     
మనసు పంచు మమతకు
మమతల ప్రేమ ఇచ్చి పుచ్చే ఈశ్వరా

సుందరా0గుని చూపు
చూపు మేలు కొలుపు
మేలుకొలుపు తెలుపు సూర్య తేజ ఈశ్వరా   



--(())--
శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 57 🕉



చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా
మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం
జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!



📍 తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు.

🌹పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు.

🌹కాని వాస్తవమున వారికి ఏ విషయముననునిశ్చయజ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు.

🌹అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను.


🙏 ఓం నమః శివాయ 🙏


తాత మనవుడి చిన్న కధలు (16 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతా ఆర్ధతరంగా అధికారాన్ని రద్దు చేసు కొనుట ఎందుకు, వీధి, వీధి తిరిగి ఓటేయమని మరలా అడుగుట ఎందుకు? 

ఇది పెద్దవాల్ల విషయం

పెద్ద వాళ్లంటే ఎవరు తాతా

నేను నీకు ఏమౌతా వయసులో పెద్దవాడివి తాతా అంతేనా

అంతే కదా తాతా నీవే చెప్పావు " అందరికీ అన్నీ తెలియవు"  తెలిసిన దానిలో నిష్ణాతులుగామారి కుటుంబపోషణకు, దేశసేవకు సహకరిస్తారని చెప్పావు" 

అవునురా అవును, కానీ రాజకీయములో నిష్ణాతులకు విలువలేదు, మేధావులకు తావులేదు, విద్యార్థులకు గుర్తింపు లేదు కేవలము ధన సంపాదన, కీర్తి ప్రతిష్టల ప్రభుత్వ సొమ్మునే తనవారు తనచుట్టూ ఉన్నవారికి సహాయము చేసి జై జైలు కొట్టించు కుంటారు. అందరూ అంతేనా 

లేదు అందరూ అలా ఉండరు మహాత్మాగాంధీ దేశం కోసం, మరి ఎందరో ప్రాణాలు అర్పించారు. 

తాతా అసలు విషయం చెప్పలేదు

"చెపితే చాలా ఉన్నది చూస్తే ఏమీ కనబడదు" అన్నారు పెద్దలు. అర్ధం కాలేదు తాత
తలపండిన వారికే రాజకీయం గురించి అర్ధం కాదు, నాకు తెలిసినది చెపుతా విను.

మనిషికి అధికారానికి ఆశే జీవితం, అత్యాశపరుడుగా మారితే అంతా సర్వనాశనం. అధికారాన్ని రద్దు పరుచుటకు ఎదో ఒక ఆశ ఉండి ఉండవచ్చు, తాను అధికారంలో చేసిన పనులమీద నమ్మకం,  నెరవేర్చిన వాగ్దానాలమీద నమ్మకం, అందుబాటులో ఉన్న ధనం మీద నమ్మకం తో ప్రజలను మల్లి ఓటు అడగటానికి ముందుకు రావచ్చు. 
అందరికీ గెలుపు ఖాయమా తాత 
అది ఎవ్వరూ చెప్పలేరు    

మనిషి, అధికారులు ఊహించను గూడా లేని సంఘటనలను విధి జరిపిస్తుంది. జరగటానికి వీలుకాని వాటిని జరిపిస్తుంది. జరిగి పోతున్న వాటిని స్తంభింప జేస్తుంది. ఘటనా ఘటనలు విధి చేతులో వుంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు 'విధి బలీయం' అని అంటూంటారు.   

ఇతరుల దోషముల నెంచక చూపు సహజ చాకచక్యమును, తెలివినీ చూపి,  తమ దోషములను తిలి పిన వారిని గుర్తించి, వారు చెప్పిన విధముగా మారి, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ఓర్పుతో మాట్లాడుతూ, ఓదార్పుతో అనుకరిస్తూ, ప్రజాసేవకు అంకిత మైన వారినే ప్రజలు గెలిపిస్తారు, ఇదే లోక సహజం.  

మరి గెలిచిన వారందరు మంచివారా తాత

మొదట మంచివారైనా అధికారం వచ్చిన తర్వాత కొంత అహంకారం ప్రవేశించి తను పట్టిన కుందేలుకు 3 డే కాళ్ళని వాదించే వారు లేక పోలేదు.     
పాలు ఉపయేగపడేవేె, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి. అలాగే నాయకుడు ఉపయోగ పడేవాడే అవసరానికి ఒక్కరోజు లో సహాయము చేయని వాడు పాలతో సమానమే.   

పాలలొ మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది. అలాగే నాయకుడు మరొక నాయకునితో స్నేహము కలిపితే పార్టీ బలం, పెరుగుతుంది.   
పెరుగు మరొకరోజువరకు ఉపయోగపడతుంది. అలాగే పార్టీల మధ్య మనస్పర్థలు పెరిగితే  మొదటికే మోసం రావచ్చు ఒక్క రోజులో పెరుగులా మారొచ్చు.  
కాని పెరగు వేరొకరోజుకి పాడైపోతుంది.

పెరుగును మదిస్తే వెన్న అవుతుంది. మనస్పర్థలు రాకుండా మంత్రిపదవులు ఇచ్చి, అందు కున్నంత దోచుకో అని అవకాశము ఇచ్చి, నీటిలో వెన్న ముద్ద అంటనట్లు ఉంటె కొంత వరకు అధికారం నిలబడుతుంది. అంతే ఒక్క రోజులో ముదిరిన పాకంలా మారితే బెడిసి కొడుతుంది    

వెన్న మరొకరోజు వరకే ఉంటుంది. తరువాయి అదికూడా పాడైపోతుంది.

ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది. వెన్నలాంటి మనసు ఉండి, న్యాయం, ధర్మం,సత్యమ్, నిరంతరం బ్రతికుంచుటకు శ్రమను ధారపోసి ప్రజా సేవకు అంకితమై, తన కష్టార్జితమును కూడా ఖర్చుచేసి ప్రజల హృదయాలలో ఉండేవాడే నిజమైన 
నాయకుడు, ఇదే నేతితో సమానము        

ఈ నెయ్యి ఎన్నటికి పాడవ్వదు.

తాత కొందరు నేతిని వాడరు కదా

అవునురా మంచి చేసే వారు జీవితము సాగించలేరు, ప్రజల హృదయాలలో నేతిలా కరిగి పోతారు. 
తాత మరి నీవు ఓటు వేస్తావా " ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి నిజాయతీని బ్రతికించాలి. 
తాత నాకు ఓటు లేదుగా తొందరెందుకు ముందొస్తుంది ముసళ్ల పండగ అంటారు పెద్దలు. 
అంటే ఏమిటి తాత ..... బాబోయ్ ఇప్పుడు ఏమీ చెప్పలేను పార్టీ మీటింగుకు పోవాలి వస్తా ...          
--((**))--
            
*నేటి - నీతి కథ* 

ఒక గ్రామంలో ఐదుగురు మిత్రులు ఉండేవారు. వారు భిక్షువులుగా జీవించాలని నిర్ణయించుకొని, భిక్షా దీక్ష తీసుకున్నారు. ఇంద్రియాల్ని జయించిన వాడే గొప్ప భిక్షువు కాబట్టి ఐదుగురూ ఇంద్రియాల్ని జయించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. 

ఒకరోజున ఐదుగురూ ఒకచోట సమావేశమై జితేంద్రియులు కావడానికి చేయాల్సిన కృషి గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో మొదటివాడు -

మిత్రులారా! పంచేంద్రియాల్లో మనం ఎక్కువ జ్ఞానం పొందేది కన్ను ద్వారానే. రంగూ, ఆకారాలను చూసి అది మనల్ని కోర్కెల వెంట పరుగులు తీయిస్తుంది. కాబట్టి ముందుగా మనం దృష్టి జ్ఞానాన్ని అదుపు చేసుకునే పనితో మన శిక్షణ ప్రారంభిద్దాం అన్నాడు. 

లేదు మిత్రమా! కంటి కంటే చెవి ప్రమాదకరం. తీయని మాటలు విని మనల్ని మోసపుచ్చుతుంది. కాబట్టి శ్రవణేంద్రియ నియంత్రణతో ప్రారంభిద్దాం అన్నాడు రెండోవాడు. 

కన్నూ, చెవి కంటే ముక్కు వల్ల కలిగే వాసనలు ప్రమాదకరం. సువాసనలు మత్తెక్కించి మన మనస్సుకి మైమరపు కలిగిస్తాయి. మనల్ని ఇంద్రియ లోలత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాసనల్ని దూరం చేసుకొనే విధంగా మన ఇంద్రియ నియంత్రణ శిక్షణ మొదలెడదాం అన్నాడు మూడోవాడు. 

దానికి నాలుగోవాడు నవ్వి -

మిత్రులారా! రసతృష్ణకు మించిన తృష్ణ లేదు. నాలుక అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. రుచుల వెంట పడిపోయి, భ్రష్టులై, భంగపడినవారు ఎందరో...కాబట్టి రసతృష్ణను అదుపు చేసుకోవడంతో మన పని ప్రారంభిద్దాం! తేలిగ్గా జితేంద్రియులం అవుదాం అన్నాడు.

మీరు నలుగురూ చెప్పింది బాగానే ఉంది. కానీ శరీరం మొత్తం ఆవరించిన ఇంద్రియం స్పర్శ జ్ఞానాన్ని కలిగించే చర్మం. స్పర్శసుఖం అలవికాని ఆనందాన్ని రేకెత్తించి, మనల్ని త్వరగా పెడమార్గంలో పడేస్తుంది. కాబట్టి ముందు స్పర్శానుభూతులకు లోనుకాకుండా మన చిత్తాన్ని దృఢతరం చేసుకోవడం మేలు అన్నాడు ఐదోవాడు. 

వారికి చిత్త ఏకాగ్రత కోసం, ఇంద్రియాల్ని అదుపు చేయడం కోసం సాధన ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తేలలేదు. ఎవరి వాదాలు వారికి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. కొన్నిరోజులు గడిచిపోయాయి. కానీ సాధన ఆగలేదు. ఈ సమస్య తేల్చుకోవాలని బుద్ధుని దగ్గరకు వచ్చారు. నమస్కరించి, తమ సాధన విషయం చెప్పారు. ఏ ఇంద్రియాన్ని మొదటగా అదుపుచేయాలో సెలవియ్యండి అని విన్నవించుకున్నారు. 

భిక్షువులారా! ఏ ఇంద్రి నిగ్రహమైనా మంచిదే. మీకు ఏది ప్రాధాన్యం అనిపిస్తే ఆ ఇంద్రియ నిగ్రహంతోనే మొదలుపెట్టండి. ఒక ఇంద్రియాన్ని నిగ్రహించాక మిగిలిన ఇంద్రియ నిగ్రహాలు నెమ్మదిగా సాధించగలుగుతారు. ఎక్కడ మొదలుపెట్టాలంటూ తర్జన భర్జనల కంటే ఒక సాధనని ఎక్కడో ఒకచోట మొదలుపెట్టడం మేలు. ఒక ఇంద్రియ నిగ్రహం మంచిదే. అన్ని ఇంద్రియ నిగ్రహాలు మరీ మంచిది. 

చక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో
ఘాణీన సంవరో సాధు, సాధు జివ్హాయ సంవరో..
కాయేన సంవరో, సాధు వాచాయ సంవరో
మనసా సంవరో సాధు, సాధు సబ్బత్థ సంవరో

చూపులు, శబ్దాలు, వాసనలు, రుచులు, వాక్కులు, స్పర్శలపై, మనస్సుపై - వీటిలో దేనిపై అదుపు ఉన్నా మంచిదే. అంతేకాదు, అన్నింటిపై అదుపు ఉండడం మరీ మేలు అని చెప్పాడు. 

వారు వారికి నచ్చిన విధంగా సాధన మొదలుపెట్టారు. చివరికి జితేంద్రియులయ్యారు. 
        
కనులు కనులు కలబడి 
రారా ప్రియ. సుందర
రవి తేజ, వెన్నెలకు రాజ
వేచి నది రోజ-- కౌగిలి కి
రారా, ప్రియ. సుందర!

కనులు కనులు కలబడి చూచెను
పెదవి తొ పెదవి ముచ్చట లాడెను
మనసే మెచ్చి ,నచ్చిన సఖుడవు
మచ్చలేని నా మనో హరుడవు!
రారా ప్రియ సుందర......

రవి కిరణముల విరిసెను కమలము
చంద్ర కాంతి తో నవ్వెను కలువలు
సుందరాంగ నీ చూపులు సొకగ
పొందితి మిన్నగు సుందర రూపము
రారా ప్రియ సుందర.....

వున్నవి వెన్నెల చల్లని గాలుల
పొన్నల నీడన పానుపు పరచి
పరిమళించు ఈ పూవులు జల్లగ
పురుషోత్తమ నిను పొంద గోరితిర!

రారా ప్రియ సుందర.....

 ఓం నమో భగవతే వాసుదేవాయ
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
      శ్రీ భాగవతం - 106 వ భాగం
        చదువుకుందాం భాగవతం
      బాగుపడదాం మనం అందరం
              దశమ స్కందము
             శ్రీకృష్ణ లీలలు - 36
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

 శ్రీకృష్ణుని మహిమ - నారదుండరయుట :

నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు 16 వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా?” అని అడిగారు.

అప్పుడు ఆయన 16 వేలమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు?” అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన 16 వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16వేలమందికి 16వేల సౌధములు నిర్మించి 16 వేలమందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16 వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు.

ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు.

అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునాకు గురి అయ్యారో చూడండి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయల్దేరి భూలోకమునకు వచ్చాడు.

ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక యింట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16 వేలమంది స్త్రీలలో ఒక స్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది.  భార్యచేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతొ ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ ’ అన్నాడు.

అపుడు నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు యిటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు యీయవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు.  తరువాత బయటికి వచ్చి ఈ యింట్లో ఉన్నాడు కాబట్టి పక్క యింట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ యింట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క యింట్లోకి వెళ్లి యిలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు. నిలబడిన నారదుడు అన్నాడు –

ఏమి నా ఆశ్చర్యము! ఏమి నా ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు యింతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురదమీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు యిన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి.

దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ 16 వేలమంది కన్యలను మదము చేత చేసుకున్న వాడు కాదు. వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము!

ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాపకత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం యిచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది, పశు, పుత్ర, మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.

భీముడు జరాసంధుని వధించుట:

ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు.

కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు.

ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉండి ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారిచేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచడానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు.

‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.

ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది.

వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప.

ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీముడు బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు.

జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు.

కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!

“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడం లోనే వాని మరణం వచ్చింది.

‘కృష్ణా నాతో యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసంధునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.

వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు.

జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.


          🙏 శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో....... 🙏


🙏 కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య🙏

నాగ సుబ్బయ్య పైడి  (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

No comments:

Post a Comment