Sunday, 3 January 2021

05--01--2021హనుమాన్


 



మహాభారతం ఆదిపర్వం మూడో భాగం  (5)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
లోక పాలకుడైన ఈశ్వరునకు నమస్కారం
లోకమునందు అంతటా వ్యాపించి ఉన్న విష్ణువుకు నమస్కారం
 లోకమనే నాటకాన్ని తన మనసు చే సృష్టించిన వాడు కళాతపస్వి యగు బ్రహ్మయ్య కు నమస్కారము
త్రిమూర్తులను కన్నతల్లి యగు జగన్మాతకు నమస్కారము
           🌼🙏🙏🙏🙏🙏🙏🙏🌼
కలియుగ ప్రభావం నుండి సజ్జనులను రక్షించుటకై మహాత్ముడైన శౌనకుడు తన ఎనభై నాలుగు వేల మంది శిష్యులతో నైమిశారణ్యం నందు సత్రయాగం చేస్తూ ఉంటాడు. ఈ మహనీయుని ఆహ్వానం మేరకు సకల పురాణ దర్శి మరియు ప్రజ్ఞాశీలి అయినటువంటి సూతమహాముని అచ్చటికి విచ్చేశాడు.
ఎటువంటి ధర్మ సమస్యనైనా విప్పడం లోను ఏ పురాణమైన అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పడంలోను అత్యంత నిపుణులైన అతని రాకతో యజ్ఞవాటికొక క్రొత్త కళ వచ్చింది.
 ఆయన రాకతో అక్కడి మునులందరూ ఎంతగానో సంతోషించారు. ఆయనను కుశల ప్రశ్నలతో ...వినయ పూర్వకంగా..... అర్ఘ్యపాద్యాదు లతో గౌరవించారు..రవ్వంత బడలిక తీరి అతడు సుఖాసీనుడైన పిదప, అనేక మంది ఋషులు ఆయనను పరివేష్టించి కూర్చుని ఆప్యాయంగా మాట్లాడ సాగారు.
ఓ రోమహర్షణి ! యజ్ఞ ప్రారంభ ముహూర్తానికి మీరు వస్తారని మేము ఎంతగానో ఎదురు చూశాం ఇంత ఆలస్యం గా వేంచేశారు , మా ఆహ్వానం లో ఏదైనా లోపం ఉందా లేక ఆహ్వానం అందలేద అని వినయంగా ప్రశ్నించారు.
అప్పుడా ఉగ్రశ్రవసుడు మహాత్ములార ! మీ ఆహ్వానం చేరింది అందులో లోపం అనేది లేదు కానీ అంతకు పూర్వమే జనమేజయ మహారాజు చే నిర్వహించబడిన సర్పయాగానికి ఆహ్వానించ బడి ఉండడంచేత అక్కడకు వెళ్లి ఇలా వస్తున్నాను అదే ఆలస్యానికి కారణం అని బదులిచ్చిన ఉగ్రశ్రవసుడిని ఆశ్చర్యంగా చూస్తూ
 రోమహర్షిణి ! మీరు చెబుతున్న ఈ సంగతి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జనమేజయుడు చాలా ధర్మాత్ముడు. అటువంటి రాజు ఆచరించదగ్గ ఎన్నో గొప్ప  యాగాలు ఉండగా ఈ సర్పయాగం ఎందుకు చేసినట్లు ? ఎంతో బలమైన కారణం లేనిదే అటువంటి యాగం ఎవరు చేయరు కదా దయచేసి ఆ కారణం చెప్పవలసిందిగా మనవి అని ఆ తాపసులు అడిగారు..
కారణం లేక పోవడం ఏమిటి జనమేజయ మహారాజు యొక్క తండ్రి పరీక్షిన్నరపాలుడు పన్నగ ప్రభువైన తక్షకుని చే దష్టుడై మరణించాడు . అప్పుడు ఆ రాజు పసివాడు కావడం వల్ల ఆ విషయాన్ని వివరంగా ఎరుగడు ఇప్పుడు ఉదంకుడనే బ్రాహ్మణుడు వచ్చి ఆ కథలన్నీ కదిపి ఆ రాజును కాద్రవేయేష్టికి  ప్రేరేపించాడు " అని అన్నాడు సూతమహర్షి.
ఇంతకూ ఈ ఉదంకుడు ఎవరు స్వామి రాజు ని వక్ర మార్గాన్ని పట్టించారు అని బ్రాహ్మణులు అడిగారు
ఉదంకుడి వృత్తాంతం
వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు.
 ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. . ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి " నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను " అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు " మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి " అని బదులిచ్చాడు.
ఉదంకుడు అలాగే పౌష్యమహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు " వద్దకు వచ్చి " మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదు. కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి. " అన్నాడు. మహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి." అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గామయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ " ముని కుమారా ! ఈ కుండలములు " కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో" అని చెప్పింది.
ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట సవరించు
కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి " ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. . తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు " కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.
 తరువాత అతడు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదకుండు అనుష్టానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తానూ ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ " వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంతా ! నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారినుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా నన్ను అనుగ్రహించు" అని ప్రార్థించాడు......

 అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, పన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు. మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి " ఉదంకా నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో " అన్నాడు. ఉదంకుడు " ఈ నాగలోకం నాకు వశం కావాలి " అని కోరాడు. అలాగే అని వరమిచ్చిఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లి పోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి తెచ్చిచ్చాడు.
అటు తరవాత ఉదంకుడు అక్కడ నుండి బయటపడే మార్గం కాన రాక తను గురుకులం ఎలా చేరుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయాడు.  అయోమయంలో పడగా దివ్యపురుషుడు " ఉదంకా ! ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు " వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు.
గురువు ఉదంకునితో " ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది " అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు " ఉదంకా ! నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రం. వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది " అని పలికి ఆశీర్వదించాడు గురుదేవుడు
ఉదంకుడు గురుకులం వదిలి వెళ్ళాడు కొన్నాళ్ళు తపస్సు చేశాడు కానీ అతని అంతరాంతరాలలో అలనాటి తక్షకుడి మీద పగ ....పాము పగ లాగ అభివృద్ధి చెందిందే గాని తగ్గలేదు తక్షకుడు అని కాదు పాములంటేనే మంటగా ఉంది అతడికి .తన వల్ల కాని పని సమర్థుల చేత చేయించాలనుకున్నాడు. అతని దృష్టిలో మహారాజైనా జనమేజయుడు  మెదిలాడు. వెంటనే రాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు.
మిత్రులందరికీ శుభోదయం



చెల్లెలు చిన్న కధ  

తండ్రి పట్ల గౌరవం చూపక చీదరించుకుంటూ వెళుతున్న కొడుకుల్ని చూసి ఆ తల్లి బాధ వర్ణనా తీతమ్ కారణం తండ్రికి కరోనా వచ్చిందని ఇంటి బయట ఉన్న పాత పెంకుడుకొంప కు మార్చారు కొడుకులు.
తండ్రి సంపాదన గురించి వీలునామా వ్రాయమని కొడుకులు గొడవపెట్టుకున్నారు ఎందుకనగా నలుగురు కొడుకులు ఒక కూతురు పంపకం చేయమన్నారు. కూతురికి పెళ్ళిచేయమని కొడుకుల్ని కోరాడు తండ్రి.
కొడుకులందరు కలసి ఆవూరిలో వయసు ఎక్కువఉన్నవాణ్ణి తెచ్చి చెల్లెలు  వద్దన్నా పెళ్ళిచేసారు,
మంచంలో ఉన్న తండ్రి వద్దకు వచ్చి పంపకం  చేయమని అడిగారు కారణం తండ్రి రోగానికి ఊర్లో అప్పులు చేశారు కొడుకులు.  
అనుకోని విధముగా తల్లి తండ్రులు కరోనా వ్యాధికి చేరి స్వర్గస్తులైనారు. మరణముల చక్రభ్రమనాలగా జరిగిపోయాయి
అప్పుడే అక్కడ ఉన్న లక్ష్మి " సత్యం, ధర్మం,ధామం, దానము లేని చోట ఉండ లేనని వెళ్లి పోయినది.      
నలుగురు కొడుకులు అప్పలు తీర్చి ఆస్తిని నాలుగు ముక్కలు చేసి పంచుకున్నారు. కాపురాలు విడిపోయాయి            
సొంతఇల్లు లేదనే కానీ కూలి పనులు చేసుకుంటూ కాలం నెట్టుకుంటూ వచ్చారు పిల్లలు చదువుకొచ్చారు.   .
చెల్లెలు కు ఏమి ఇవ్వలేదు. చెల్లెలుకూడా అన్నల బుద్ధిని తెల్సుకొని అన్నల దగ్గరకు రావటం మానేసింది.
చెల్లెలకు బిడ్డ పుట్టినా ఆస్తిలో వాటా ఇవ్వలేదని అడుగుతుందని అన్నా వదినలు ఉత్తరసమాచారంతో ఎక్కడలేని ప్రేమ చూపారు, వచ్చుటకు వీలు కానిపరిస్థితి తెలియపరిచారు.
కాల గమనంలో అన్నయ్యల బిడ్డలు చెల్లెలి బిడ్డ చదువులకు వచ్చారు
కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు చదువుల నిమిత్తం గ్రామాన్ని వదలి అన్నలు వెళ్లిపోయారు
చెల్లెలి భర్త  అనారోగ్య  కారకంగా  చనిపోయారు. అన్నలు వచ్చి ముసలి కన్నీరు కార్చి చెల్లివద్దే డబ్బు తీసుకోని కర్మకాండ చేసారు వారు.         .           
చెల్లెలు పది సంవస్చరాల బాబును పెట్టుకొని అక్కడే  చిన్న కొట్టు పెట్టుకొని పిల్లవాడ్ని చదివించింది. పిల్లవాడు చదువు యందు  శ్రద్ద చూపటం , అమ్మ కష్టం గమనించటం కాలచక్రంలో ఉద్యోగం సంపాయించుకోవటం జరిగింది.నగరం కొచ్చి చిన్న ఇల్లు తీసుకోని ఉన్నాడు తల్లిని రమ్మనగా కొంచం స్థిరపడు అప్పుడు వస్తా అన్నది తల్లి.  
అప్పడు  అన్న కూతురిని (కట్నం లేకుండా)  వివాహము చేసి ఓక్ ఇంటి  వాడును చేసింది.
కొడుకు కోసం ఏంతో కష్టపడి కొంత డబ్బు మూట కట్టింది.
కొడుకు ఉద్యోగం వేరే ప్రాంతానికి మారటంవల్ల కొత్త కాపురానికి కొన్ని వస్తువులు కొని ఇచ్చి పంపించింది. ఆ తల్లి.
అమ్మ నువ్వు కూడా రామ్మా అన్న కొడుకు పిలుపుకు కంట నీరు తెచ్చుకొని మనం ఉన్న చోట ని చదువుకు అప్పులు చేసాను అవి తీర్చాలిరా,
నేను తీరుస్తాను అమ్మా               
నివ్వెమ్ తీరుస్తావురా అసలే కొత్త కాపురం నిన్ను నమ్మి వచ్చింది మీ ఇద్దరి మధ్య నేనెందుకురా
అప్పులు తీర్చి వస్తా
అమ్మా నీకు డబ్బు పంపుతాను నీవు కష్ట పడవద్దు అన్నాడు, కానీ పంపలేదు  
సరే జాగర్తగా ఉండండి గొప్పలకుపోయాయి అప్పులు చేయకండి అని చెప్పి వెళ్ళింది
తర్వాత అప్పులన్నీ తీర్చి కొడుకు దగ్గర ఉందామని ఎంతో ఆశతో వచ్చింది. ఇల్లు చుసేటప్పటికల్లా ఇంద్రభవణం లా ఉన్నది
అత్తయ్యగారు మీరు కష్ట పడుతున్నారని మీఅబ్బాయి వద్దన్నా అప్పు చేసి మరీ కొన్నాడు టీవీ వాషింమిషిన్,గ్రైండర్, మిక్సీ, ఇంకా
కోడలి మాటలకు అత్త తలగిర్రని తిరిగింది. నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నా అన్నది కోడలు
ఎమన్నా స్పెషలా కోడలా
ఇప్పుడే పిల్లలొద్దను కున్నాం అత్తయ్యగారు. మీకోసమని మీ అబ్బాయి బంగారు గాజులు అని చూపింది నాకెందుకమ్మా నీవే పెట్టుకో
డబ్బు తీసుకొనివెళ్ళిన కొడుకులో మార్పు గమనించింది ఏమి లోకమో ఇది కోడలొచ్చాక తల్లి కనబడదు, కష్టం కనబడదు.      .
నేను ఇక్కడ ఉండలేను నేను పాత ఇంటికే వెళ్తాను అక్కడే నాజీవితాన్ని నెట్టుకొస్తాను, నేను అనారోగ్యం లో పడ్డాక డబ్బు తీసుకోవటానికి తప్పకుండా రమ్మణమని  చెప్పమ్మా అన్నది కోడలుతో
అమ్మా వెళుతావటా అంటూ లోపలకు వచ్చాడు.
అవునురా శేషజీవితం మన అద్దెఇట్లోనే సాగాలని వెళ్తున్న.
ఇక్కడ లోనుతీసుకొని కొత్త ఇల్లు కొంటున్నానమ్మ.
బాబు నేను ఒకటే చెప్పదలచాను అప్పులు తీర్చటానికి అక్రమ మార్గం పోతునట్టున్నావు నేను నిన్ను నిజాయితీ పరుడుగా చూద్దామని  కష్ట పడి చదివిచ్చాను .
కనీసం నన్ను రైలన్నా ఎక్కిస్తావా
ఎమ్మా ఏమనుకోకు నాకు అర్జన్ట్ పని ఉంది నీకోడలు దించుతుంది ఏమనుకొకమ్మా.
ఏమనుకున్నా చేసేది లేదురా బిడ్డా అంటూ కోడలితో రైల్వెస్టెషన్ కు వెళ్ళింది. కోడల పిల్ల ఈ పదివేలు నీదగ్గర ఉంచుకో ఇంతకన్నా ఏమిఇవ్వలేని దాన్ని.అంటూ ఇచ్చింది.
మిగతా డబ్బుతో పుణ్యక్షేత్రాలు చేసి తనకొట్టుకు దగ్గరకు వచ్చింది  ఆ పాత ఇంటిలోకి ఒక స్త్రీ వచ్చి నాకేమన్నా సహాయం చేస్తావమ్మా కరోనా తో బాధపడుతున్నాడు బిడ్డను బతికించుకుంటా అన్నది. బిడ్డపై ఆశలు పెట్టుకోకకమ్మా నిన్ను నీవు నమ్ముకో నీకు డబ్బు ఇస్తా బిడ్డని బతికించుకో అన్నది.
 అందుకే  సత్యం ధర్మం దమం దానం ఉన్నచోట  లక్ష్మీ దేవి ఉన్నట్లుగా ముసలి వయసులో కూడా అనుభవాలను కధలు వ్రాస్తూ దానధర్మాలు చేస్తూ  గ్రామదేవతగా మారింది.      
          .
     --(())--


శ్రీ హనుమాన్ గుణగణములు
   
రామ పూజారి పర ఉపకారి
మహావీర భజరంగ బలీ       
సద్ధర్మ చారి సద్బ్రహ్మ చారి
మహా వీర భజరంగబలీ!       

జ్ఞాన గుణసాగర
రూప ఉజాగర
శంకర సువన
సంకట మోచన
మహా వీర భజరంగబలీ!       
       
కేసరి నందన
కలిమల భంజన
రాఘవ దూత
జయ హనుమంత
మహా వీర భజరంగబలీ!       
       
అంజని నందన
అసురనికందన
మంగళహారతి
మారుతి నందన
మహా వీర భజరంగబలీ!
   
జయ రణధీర
జయ రణశూర
జయ బలభీమ
జయ బలధామ
మహా వీర భజరంగబలీ!  
       
2*    శ్రీ హనుమత్ గాయత్రి       
ఓం అంజనీజాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్       

3*    మూల మంత్రం       

ఓం హ్రాం హ్రీం హ్రూమ్ హ్రైం హ్రౌం హ్ర:       
ఓం హం హనుమతే రామదూతాయ నమ:       

*   శ్రీ హనుమత్ ప్రార్ధన       

అంజని తనయా ఆంజనేయా !
దయగనుమా మమ దయామయా!       
అతులిత భక్తితో అహరహములు నీ
చిత్తము రాముని చింతించు నయా!       
నాతిని వీడిన నరహరి సేవా !
భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !!
అంజని తనయా ఆంజనేయా!!   
   
లంఘించి వారాశి లంకను పరిమార్చి !
 రాకాసి మూకలు శోకాలు మునుగంగా       
సాకేత రాముని చరణ దాసుడవీవు!
 మాకేటి భయమింక మరువగా బోమయ !!అంజని!!       

భక్తి శ్రద్ధల తోడ భజయించు వారము !
 శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము       
కామము గూల్చెడి రాముని పదముల!
రక్తి నోసంగుమా రామ రాజార్చితా!!అంజని!!       

*శ్రీ హనుమత్ ద్వాదశ నామ స్తోత్రము       

హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:       
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:       
ఉదధి క్రమణ శ్పైవ సితాసోక వినాశక:       
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!       
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన :       
స్వాపకాలేపఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత:       
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్       

*శ్రీ రామదూతాంజనేయ స్తోత్రం       

రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం       
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం       
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం       
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥       

ఖం ఖం ఖం ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం       
ఖం ఖం ఖం ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం దేవతాసుప్రకాశం       
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయస్వరూపమ్       
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతమ్ నమామి॥       

ఇం ఇం ఇం ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం       
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్యపూజార్చితాంగం       
ఇం ఇం ఇం సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం       
ఇం ఇం ఇం చిత్స్వరూపమ్ సకలదిశయశం రామదూతమ్ నమామి॥       

సం సం సం సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం       
సం సం సం సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం       
సం సం సం సామవేదం సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్       
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి       

హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్       
హం హం హం అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం       
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం       
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతంనమామి॥       

ఓం నమోభగవతే వాయునందనాయ       





Pranjali Prabha

*శ్రీ వీర హనుమత్ కవచము

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 

Pranjali Prabha
*శ్రీ పంచముఖి  హనుమంతమాల 

 ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                         
ప్రాంజలి ప్రభ
*శ్రీ హనుమత్ ప్రార్ధన                
                
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా                
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా                
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!                
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా                
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!                
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము                
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   
*శ్రీ  అంజనేయ సుప్రభాతము                
                
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !                
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !                
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !                
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !                 
                
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం                
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్                
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే                
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !               


*శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము                
                
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:                
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:                
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:                
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!                
                
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :                
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:                
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్                 

*శ్రీ హనమత్ స్తుతి:

అతులిత బలధామం  స్వర్ణ  శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా  మధీశం
రఘు పతి  ప్రియభక్తం వాతాజాతం నమామి

గోష్పధీకృత  వారాశిం  మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం   

అంజనా నందనం వీరం జానకి శోకనాశనం  
కపిస మక్షహంతారం వందే లంకా  భయం కరం

ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం       

*శ్రీ మారుతీ  స్తోత్రం 

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే 
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే 
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే 
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ 
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే 
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ 
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే

యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే 
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే 
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే 
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే 
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్             
                




*ఆంజనేయ సుప్రభాతము

అమల కనకవర్ణం  ప్రజ్వల  త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా  సుప్రసన్నం
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రనజయ కరవాలం రామదూతమ్ నమామి !!  

అంజనా సుప్రజా వీర  పూర్వా సంధ్యా  ప్రవర్తతే
ఉత్తిష్ఠ  హరిశార్దూల కర్తవ్యం  దైవమాహ్నికమ్
ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రావిజాకాంత  త్రైలోక్యం  మంగళంకురు !!

శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త  బృంగ
శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ  హృదయతాప నివారమూర్తే
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య   
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె 
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే 
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ  ప్రియ తనూజ సువర్ణ దేహ
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ మారుత  ప్రియ తనూజ మహబలాడ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణ వాహన సులక్షణ లక్షితాంగ 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంచాననస్య భావభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు  రుద్ర సువర్ష  సంఘా:
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ గౌతమ చ్యవన  తుంబుర  నారదాత్రి 
మైత్రేయ వ్యాస జనకాది మహర్షి  సంఘా:
గాయంతి హర్షభరితా స్తవ దివ్య కీర్తిం 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

బృంగావలీచ మకరందరసం పిబేద్యై
కూజమ్ త్యు తార్ధ  మధురం చరణాయుధాశ్చ                                    దేవాలయే  ఘన గంభీర సుశంఖ ఘోషా:
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధం                                                మాదాయ హేమ కలశై శ్చ  మహర్షి సంఘా:
తిష్టంతి త్వచ్హరణ పంకజ సేవనార్ధం  
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ సూర్యపుత్రి  ప్రియనాధ మనొజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగలాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య    
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!


హనుమాన్ స్తోత్రము

శాంతి దాంతి  భుషణాయ  ॥ నమ: ఆంజనేయ
సర్వ  దేవా వందితాయ   ॥ నమ: ఆంజనేయ
భానుపుత్ర భాగ్యదాయ  ॥ నమ: ఆంజనేయ
అంజనా తప: ఫలాయ   ॥ నమ: ఆంజనేయ
గ్రామ శాంతి కారణాయ  ॥ నమ: ఆంజనేయ
శత్రు గర్వ శోషణాయ     ॥ నమ: ఆంజనేయ
సుప్రసన్న విక్షణాయ    ॥ నమ: ఆంజనేయ
వేదశాస్త్ర పండితాయ     ॥ నమ: ఆంజనేయ
సత్య ధీర  పరాక్రమాయ ॥ నమ: ఆంజనేయ
సూర్యబిమ్బ భక్షకాయ  ॥ నమ: ఆంజనేయ
అష్టసిద్ధి  సంబృతాయ     ॥ నమ: ఆంజనేయ
ఆత్మయోగ తత్పరాయ   ॥ నమ: ఆంజనేయ
వార్ధి సేతు భంధణాయ   ॥ నమ: ఆంజనేయ
సర్వలోక కీర్తితాయ        ॥ నమ: ఆంజనేయ
భాను శిష్య భుశాణాయ  ॥ నమ: ఆంజనేయ
దుష్ట బుద్ధి నాశనాయ    ॥ నమ: ఆంజనేయ
నిత్యముక్త మానసాయ   ॥ నమ: ఆంజనేయ
రామచంద్ర సేవకాయ     ॥ నమ: ఆంజనేయ
భానువంస రక్షణాయ  ॥ నమ:  ఆంజనేయ
గూడకార్య సాధకాయ  ॥ నమ:  ఆంజనేయ
సర్వ బంధ మొచకాయ ॥ నమ:  ఆంజనేయ
మాయామంత్ర భంజణాయ  ॥ నమ:  ఆంజనేయ
రాగారోగా ఖండణాయ   ॥ నమ:  ఆంజనేయ
నిత్యశుద్ధి మానసాయ   ॥ నమ:  ఆంజనేయ
దాసతాప నాశకాయ     ॥ నమ:  ఆంజనేయ
బ్రహ్మహత్య హారకాయ  ॥ నమ:  ఆంజనేయ
శాకిని విఖండణాయ     ॥ నమ:  ఆంజనేయ
సర్వశాస్త్ర పారణాయ     ॥ నమ:  ఆంజనేయ
దైత్యమాయ నాశకాయ  ॥ నమ:  ఆంజనేయ
వీతరాగ రూపకాయ      ॥ నమ:  ఆంజనేయ
మాయామంత్ర మర్ధనాయ ॥ నమ:  ఆంజనేయ
రామభక్త వత్సలాయ     ॥ నమ:  ఆంజనేయ
సత్యవాక్ మహొన్నతాయ ॥ నమ:  ఆంజనేయ
దైవలోక వందితాయ     ॥ నమ:  ఆంజనేయ
రామపాద సేవకాయ     ॥ నమ:  ఆంజనేయ
రామరూప పూజితాయ ॥ నమ:  ఆంజనేయ
వజ్ర దేహ పంజరాయ    ॥ నమ:  ఆంజనేయ
శ్రీ పరేశ  సేవకాయ        ॥ నమ:  ఆంజనేయ
దైవకార్య పోషకాయ     ॥ నమ:  ఆంజనేయ
సీతాధు:ఖ నాశకాయ   ॥ నమ:  ఆంజనేయ
లంకాపుర దాహకాయ  ॥ నమ:  ఆంజనేయ
భీమగర్వ భంజణాయ   ॥ నమ:  ఆంజనేయ
రామ చంద్ర సేవకాయ   ॥ నమ:  ఆంజనేయ
రక్త వస్త్ర ధారణాయ       ॥ నమ:  ఆంజనేయ
క్షుద్రదేవ తామ్తకాయ    ॥ నమ:  ఆంజనేయ
రామనామ భావనాయ  ॥ నమ:  ఆంజనేయ
గోశ్ప దీ క్రుతార్ణవాయ    ॥ నమ:  ఆంజనేయ
సర్వరోగ హారకాయ       ॥ నమ:  ఆంజనేయ
పాపకర్మ భంజనాయ     ॥ నమ:  ఆంజనేయ
రామసత్కదా బుధాయ  ॥ నమ:  ఆంజనేయ
సర్వ ద:ఖ నాశనాయ     ॥ నమ:  ఆంజనేయ
కామ రూప ధారణాయ    ॥ నమ:  ఆంజనేయ
రక్తమాల్య భూషణాయ    ॥ నమ:  ఆంజనేయ
ధాకినీ గ్రహాంతకాయ       ॥ నమ:  ఆంజనేయ
లక్ష్మీ కాంత రామాణాయ ॥ నమ:  ఆంజనేయ
మొహ భంద చ్చేధనాయ   ॥ నమ:  ఆంజనేయ
     


*శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రము   

నమామి దూతమ్  రామస్య సుఖడంచ్ సురద్రుమమ్ 
పీన వృత్త మహాబాహు సర్వశత్రు నివారణము

నానా రత్న పమాయుక్త కుండలాది విరాజితం 
సర్వదా భీష్టదాతారాం  సతాం వై దృఢ మాహవే

వాసినం చక్ర తీర్ధస్య  దక్ష్మిణస్త గిరౌ సదా
తుమ్గామ్భోది తరంగస్య వాతేన పరిశోభితే

నానాదేశా  గతి సద్భి:  సేవ్య మానం నృపోత్తమై:
ధూపదీపాది నైవేద్య: పంచఖ్యాద్యైశ్చ  శక్తిత:

వ్రజామి శ్రీ హనుమంతం హేమకాంతి  సమప్రభం
వ్యాసతీర్ధ  యతీమ్ద్రానమ్ పూజితమ్ ప్రణిదానత:

త్రివారం య: పఠేన్నిత్యం స్త్రోత్రం భక్త్యా ద్విజోత్తమ:
వాంచితం లభతే భీ శతం షణ్మాసా  భ్యంతరే ఖలు 

పుత్రార్దీ లభతే పుత్రం యశోర్ధీ లభతే యాశ :
విద్యార్ధీ లభతే విద్యాం ధనార్ధీ లభతే  ధనం 

సర్వదా మాస్తు  సందేహ హరి సాక్షీ జగత్పతి:
య : కరోత్యత్ర సందేహం నాయాతి  నరకం ధృవం 
  





:   *శ్రీ హనుమత్ గద్య స్తోత్రము 

శ్రీ మాన్ నిరంతర కరుణామృత సారవర్షి  - పింగాక్ష: మహోఘదూర: - మహేమ్ద్రాయుధ క్షతాంచిత మహాహను: - అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండల: -  అతప్తకార్త స్వరశైల భాస్వర కవిత చూడా విరాజిత:  - అప్రతిమ దివ్య మాణిక్య కుండల  మండిత గండభాగ: -  సమాన మాననీయ రమాకాంత కరముల కవిత పాంచజన్య భందు కంభు కంధర: - ఇరావత హస్త సువర్తుల దీర్ఘ భుజార్గళ: అనన్య సాధారణ సంభవాస్తాన పీఠ పరినాహి బాహ్వామ్తర:  - అమూల్య పీతామ్బరాలంకృత కటి ప్రదేశ :అనవరత వినుత జన మనోరధ సాధన పాదయుగళ: -  ఉష్ట్ర  వాహన: - అమర గంగానదీ పరివేష్టిత హాటకాచల వద్ధీ ర్ఘ  లాంగూల రంగ దుత్తంగ  మంగళాంగద: - అమ్జనానండ  వర్ధన : - అమలోర్ద్వపుండ్ర స్తదుపరి కర్పూర మిశ్ర శుభ్ర విభూతి ధారణో  - యజ్ఞొప వీత తులసీ  భద్రాక్ష రుద్రాక్ష మాలాభి రామ: - శ్రీ రామచంద్ర చరనార విందా సంధిత హృదయారవిమ్ద: - అఖిల కళ్యాణ  గుణవాన్  - హనుమాన్  - ఉపాస్యతే స్మాభి:   
                                               


        
 *శ్రీ హనుమత్ స్తోత్రము 

నమో హనుమతే తుభ్యం నమో మారుత నూనవే
నమ: శ్రీ రామ్ భక్తాయ  శ్యామలంగాయతే  నమ:

నమో వానర వీరాయ  సుగ్రీవ  సఖ్య  కారిణే 
లంకా విదః నార్దాయ హేలా సాగర తారిణే 

సీతాఅ సోక వినాశాయ  రామ ముద్రా ధరాయచ 
రావణాత్త  కులచ్ఛేద  కారిణే తే  నమో నమ:

మీఘనాధ ముఖ ధ్వంస కారిణే  భయ హారిణే  
అశోక  వన విధ్వంస కారిణే నమో నమ:

వాయు పుత్రాయ వీరాయ అకాశోదర గామినే 
వనపాల శిరచ్చేద లమ్కాప్రాసాద  భంజినే

జ్వలత్కానక వర్ణాయ ధీర్ఘ లాంగూల ధారిణే
సౌమిరి జయ దాత్రేచ రామ దూతాయతే  నమ:     


*శ్రీ మారుతీ స్తోత్రము 

ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే  
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీ మతే 

మొహశోక వినాశాయ సీతాసోక వినాశినే
భగ్నా శోక వనాయాస్తూ దగ్ద లంకాయ వాజ్మినే 

గతి నిర్జిత వాతాయ  లక్ష్మణ ప్రాణ దాతాయచ 
వనోకసాం వరిష్ఠాయ  వాశినే వనవశినే

తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ  మహియసీ 
ఆంజనేయ  సూరాయ సుగ్రీవ సచివాయచ 

జన్మ మృత్యు  భయజ్ఞాయ సర్వక్లేశ  హరాయచ
నేదిష్టాయ్ నమజ్ఞాయ ప్రేత భూత భయ హారిణే

యాతనా నాశయాయాస్తు  నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీక్రుతే

మహాబలాయ  వీరాయ చిరంజీవిన  ఉద్ద్రుతే 
హారినే వజ్ర దేహాయ చూల్ల్మ్గిట మహాబ్ధయే 

బలీనామగ్ర గణ్యాయ నమోనమ: పాహి మారుతే 
లాభాదోషిత్వ మీలాశు  హనుమాన్ రాక్ష్ సాంతక
యశో  జయంచ మేదేహి  సత్రూన్ నాశయ 
స్వాశ్రితా  నామ భాయడం యం ఏవం స్తౌ టి మారుతిం 
హానికుతో భావేతస్య సర్వత్ర  విజయీ  భవేత్

    





              
                                                                    మూల మంత్రం                
                
ఓం  హ్రాం  హ్రీం హ్రూమ్  హ్రైం  హ్రౌం  హ్ర:                
                
ఓం హం హనుమతే రామదూతాయ నమ:     

            🌻  *మహా భారతం* 🌻


🩸 *భాగము 3* 🩸


💧 *కుంజరయూదంబు* 💧


🍃🌺పాండవుల అరణ్యవాసం పూర్తయింది. ఏడాదిపాటు అజ్ఞాతవాసం సాగించాలి. అపడుగాని జూదంలో ఓడిన పాండవులకు విముక్తి లేదు. ధర్మరాజు విషాద ధోరణిలో గతాన్ని నెమరు వేసుకుంటూ వుండగా, ధౌమ్య మహర్షి ఓదార్చాడు. 

🍃🌺‘‘ఎంతటి వారికైనా కాలం కలిసిరానపడు సమస్యలు తప్పవు. ధర్మనిర్ణయంలో, రాజ్యపాలనలో, ఔదార్యంలో నిన్ను మించిన వారు లేరు. ధర్మనందనా, ధైర్యము చిక్కబట్టి, జరగవలసిన దానిని గురించి ఆలోచించు’’ అన్నాడు మహర్షి. 

🍃🌺ధర్మరాజు ఆ మాటలకు తేరుకుని, అక్కడి వారందరికీ కృతజ్ఞతలు తెల్పి, సోదరులతో, ద్రౌపదితో అరణ్యమార్గాన ముందుకు కదిలాడు. నిరంతరం పాండవుల హితం కోరే ధౌమ్య మహర్షి వారిని అనుసరించాడు. ఒక చెట్టునీడలో విశ్రమించి, ఆ రాత్రి అక్కడే గడిపారు. మరునాడు ఉదయం ధర్మజుడు సోదరులతో తమ భవిష్యత్‌ కార్యక్రమం గురించి చర్చించాడు. 

🍃🌺‘‘అజ్ఞాతవ్రతం చేయటం అంత సులభం కాదు. పైగా మనం ఆరుగురం ఒక చోటనే వుండడం శ్రేయస్కరం.’’ అన్నాడు ధర్మరాజు. ‘‘మహారాజా, నీ ధర్మనిష్ఠకు మెచ్చి ధర్మదేవత తమకు అనుగ్రహించిన వరం వుంది కదా, మనల్ని ఎవరూ గుర్తించ లేరు. పాంచాల, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, శూరసేన, కళింగ, మగధ దేశాలలో మనం ఎక్కడైనా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవచ్చు. 

🍃🌺ఆ దేశ జనపదాలలో మనం యథేచ్ఛగా వుండవచ్చు గదా’’ అన్నాడు అర్జునుడు.సోదరుని సూచన అందరకూ నచ్చింది. ‘‘నీవు చెప్పింది బావుంది. నాకు మత్స్యదేశం ఆమోదయోగ్యం అనిపిస్తోంది. ఆ దేశాధిపతి విరాటరాజు అన్ని విధాలా యోగ్యుడని విన్నాను. విరటుని కొలువులో మనం ఏ విధంగా చేరాలో ఆలోచించి చెప్పండి’’ అన్నాడు ధర్మరాజు.

🍃🌺తిరిగి వెంటనే, ‘‘నేను కంకుభట్టు అనే పేరుతో పుణ్యపురాణ గోష్ఠి జరిపే బాధ్యతను స్వీకరిస్తాను’’ అంటూ సవివరంగా చెప్పాడు. భీముడు చిరునవ్వుతో ‘‘సోదరులారా, నేను పాకశాలలో చేరి రాజుగారి జిహ్వను ఆకట్టుకుంటాను. వచ్చే పోయే అతిథులను సైతం రకరకాల వంటకాలతో అలరింపజేస్తాను. 

🍃🌺ఇకపై నా పేరు వలలుడు’’ అనగానే ద్రౌపది తన పెదాలపైకి అప్రయత్నంగా వచ్చిన చిరునవ్వును దాచుకుంది. పాండవ మధ్యముడు అర్జునుడు తన సంగతి వివరించాడు. ‘‘అమరావతికి వెళ్లినపుడు అక్కడ అప్సరస ఊర్వశి నన్ను నపుంసకుడవు కమ్మని శపించింది. కాని ఆ శాప ఫలితాన్ని నా అభీష్టానుసారమే అనుభవించవచ్చని ఇంద్రుడు నాకు మాట యిచ్చాడు. 

🍃🌺ఇప్పుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాను. పేడిరూపుతో, బృహన్నల పేరుతో నాట్యాచార్యునిగా విరటుని కొలువులో చేరతాను. లాస్యచాతురిని ప్రదర్శించి, అంతఃపురంలో తిష్ఠ వేస్తాను’’ అనగా అందరూ ఆ ఆలోచనను మెచ్చుకున్నారు. అశ్వశిక్షకునిగా దామగ్రంథి పేరుతో విరటుని కోటలో స్థానం సంపాదిస్తాను అన్నాడు నకులుడు. 

🍃🌺తంత్రీపాలుడనే పేరుతో మత్య్సదేశాధీశుని గోశాలలో చేరతానన్నాడు సహదేవుడు. ఇక మిగిలింది ద్రౌపది. పాండవుల ముఖాలు వివర్ణం కావడం గమనించిన ద్రౌపది చిరునవ్వుతో, ‘‘సైరంధ్రీ వేషధారినై మత్స్యభూపతి పట్టమహిషి వ్యక్తిగత పరిచారికగా సేవలందిస్తాను’’ అన్నది. 

🍃🌺ధర్మరాజు ద్రౌపదికి, సోదరులకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ వివరించాడు. ‘‘రాజ దర్పాలను, బలపరాక్రమాలను బహిర్గతం కాకుండా కప్పిపుచ్చండి. మన అజ్ఞాతవాసాన్ని భంగపరచడానికి కౌరవ వర్గం అనుక్షణం ప్రయత్నిస్తూ వుంటుందని నిద్రలో కూడా మరువకండి’’ అని మరొకసారి అందరినీ అప్రమత్తం చేశాడు. 

🍃🌺ఎవరిదారిన వారు విరాట కొలువుకి బయలుదేరబోతున్న తరుణంలో ధౌమ్యమహర్షి వారికి కొన్ని హితోక్తులు యెరుక పరిచాడు.


🥀🙏🥀🙏🥀🙏🥀🙏🥀🙏🥀🙏
 *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
      *శ్రీ భాగవతం - 101 వ భాగం* 
        *చదువుకుందాం భాగవతం*
      *బాగుపడదాం మనం అందరం*
              *దశమ స్కందము*
             *శ్రీకృష్ణ లీలలు - 31*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

 *శ్రీకృష్ణుని అష్ట భార్యలు* 

కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో వున్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత యితర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాల వున్న రహస్యం వేరు.

*యాత్ర యోగేశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!*
*తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!!*

ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనకాల కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు.

అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యౌవనంలో ఉంది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో వున్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా వున్నావు. కాబట్టి నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. 

అపుడు ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో ఉంటూ వుంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది.

అపుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. తరువాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. *రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది.* 

ఆ తరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత *అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు.*

 కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన యింత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. 

తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవ వనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. 

అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో *మిత్రవింద* ను భార్యగా స్వీకరించాడు. 

కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు *నాగ్నజితి.* ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడు పొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన *నాగ్నజితి* ని తన భార్యగా స్వీకరించారు.

కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమెపేరు *భద్ర.* ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు.
తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన *లక్షణ* అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. 

*అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు.*

ఎనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది.

యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం.

భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. 

భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. 

ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండి పోతాయి. 

ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది.

*భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ!*
*అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!*

అవే *పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములు నబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది.* ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. 

ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. *ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది.* 

ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో వున్న రహస్యం. 

జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. 

*అందుకనే భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.*


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏


🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
       
                

 

No comments:

Post a Comment