Wednesday, 20 January 2021

22-01-2021


 

 మధురిమలు . .. ఇదా దేశం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మధుర జ్ఞాపకములు యే
చేదుగ అనుభవమ్ము  యే  
నాలో సైతం.కధ యే
వెంటాడే  చీకటియే

మనో విహార కథలు యే
మమతల ఆర్భాటముయే
ఇది నోరుపై పోటుయే
సకలము పొందు బాధయే

తెగిన గాలిపటాలుయే
జీవితం అఘాదంయే
అధర్మ గీతం ఇదియే
భవిష్యత్ సూన్యముయే

ఇది రగిలే కుంపటియే
హృదయమునకు దెబ్బలుయే
గ్రహసంచార మాగుటయే    
సంపదకు ఇక  గండియే

కరకు కత్తులు వేటయే
ఇటు కబళించే ఆటయే
మల్లెల మత్తు బాటయే
దారంతో బంధీయే

ఇదియు  బందిఖానాయే
చీకటి వెలుగు బతుకుయే  
స్వేచ్ఛ బతుకు కాఁదుయే  
దారంతొ బంధమ్ము యే .

హృదయమ్ము కఠిన శిలయే   
మనసు లేని  మల్లెలు యే
మాట కరకు యుండుటయే
చేత కాని ఋషు లాయే

ముడిపడిన ఎదగదుల యే
ముప్పెరిగన ఊసులు.యే
కలిసినా హృదయాలుయే
కవ్వించగ కాంక్షలుయే .

అసామాన్య  జ్ఞానముయే  
విద్య నిధి అక్షయముయే  
ఏమి లేని సంఘము యే  
నిర్గు ణా సంపదయే  

కలలు నిజము కానిదియే
కళల చెలిమి లేనిదియే
బతుకు బాట బాధలుయే  
మాతృ మూర్తి దేశము యే

--(())--

మనసెరిగిన మాధవుడు..

         గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.
              ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో  తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
              నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.
             మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.

                 ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి?  దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు.

                  అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.
                   ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి  ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు.

                తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.

               కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

                     తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి  విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.

                      భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.

                     ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.
                     ఓం మాధవాయ నమః

 *మహా భారతం*

 *గురువుని మించిన శిష్యుడు*

ఉత్తరుని తత్తరపాటుని అర్జునుడు వినోదించాడు. చిరునవ్వుతో ‘‘నేనుండగా నీకేమి కొదవ? నిర్భయంగా రథాన్ని శత్రుసేనలపైకి నడిపించు’’ అని వాత్సల్యంగానే ఆదేశించాడు. ఒక్కసారి గాండీవాన్ని ఎక్కుపెట్టి ధనుష్ఠంకారం చేశాడు. ఆ ధ్వనికి శాత్రవుల గుండెలు అదిరాయి. రణరంగం దద్దరిల్లింది.

 ‘‘ఉత్తరా, అల్లదిగో ఎర్రని గుర్రాలు పూన్చిన రథంలో, ఆజానుబాహువులతో, విశాల వక్షస్థలంతో మేరుగిరివలె వెలిగిపోతున్న మహనీయుడు ద్రోణాచార్యుడు. మా సోదరులందరికీ ధనుర్విద్య అనుగ్రహించిన అస్త్రశస్త్ర పారంగతుడు. చతుర్వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వేదమూర్తి. నీతిశాస్త్ర కోవిదుడు. శిష్యవాత్సల్యంతో ఆయనకు సరిసాటి మరొకరు లేరు. 

రాకుమారా, కన్నకొడుకు మీద కన్న నా పట్ల ఆయనకు అనురాగం మిన్న. అయినా, ఆచార్య దేవునిపై విల్లెక్కుపెట్టవలసిన అగత్యం నాకు ఏర్పడింది. క్షత్రియ ధర్మనిర్వహణలో యిటువంటి సంకటాలు తప్పవు. మరి ఆలసించక పగ్గాలను సడలించి, రథాన్ని పరుగు పెట్టించు’’ అనగానే అశ్వాలు నాలుగు కాళ్లపై పరుగు ప్రారంభించాయి.

తృటికాలంలో ద్రోణునికి ఎదురుగా నిలిచింది పార్థుని రథం. అర్జునుడు చేతులు జోడించి, ‘‘ఆచార్యా! ఎన్నో ఏండ్లు కారడవులలో బాధలు అనుభవించి, మాట నిలుపుకున్నాము. తరువాత యీ విధంగా రణరంగంలో మీ దర్శనానికి నోచుకోవడం బాధాకరంగా వుంది. గురుదేవా, ఆగ్రహం విడిచి ఆపదలలో కూరుకుపోయిన మాపై కరుణ చూపండి. మీరు నేర్పిన విద్యతోనే మీపై శరప్రయోగం చేయడం నావల్ల కాదు. మొదట మీరే అస్త్ర సంధానం చేయండి’’ అన్నాడు శిరసు వంచి.

ద్రోణాచార్యుడు శిష్యుడిచ్చిన గౌరవానికి తన్మయుడయ్యాడు. తిరిగి వీరావేశంతో ఇరువది బాణాలను అర్జునునిపై పలువిధాలుగా ప్రయోగించాడు. కౌరవ భటులలో మరల ఉత్సాహాన్ని రగిలించాడు. విజయుడు ఆచార్యులవారు సంధించిన శరాలను మార్గమధ్యంలోనే ఖండించి, తను అసంఖ్యాకంగా బాణాలను గుప్పించాడు. గురు శిష్యులిరువురు అతిరథులు. శస్త్రాస్త్ర శాస్త్రవేత్తలు. అతిలోక బాహు సంపన్నులు. యోధాగ్రేసరులు. 

క్షణకాలంలోనే వారిరువురు తలపడిన వైనం, దూసుకు వెళుతున్న శరాలు చేస్తున్న శబ్దం యుద్ధభూమినంతటినీ ఆవరించింది. ఆ సంగ్రామ దృశ్యాన్ని అందరూ నిశ్చేష్టులై చూస్తూ వుండిపోయారు. సవ్యసాచి సాక్షాత్తూ గురువుకే దీటుగా నిలిచాడని వేనోళ్ల చూపరులు కొనియాడారు. పుంఖానుపుంఖాలుగా ద్రోణాచార్యుడు ప్రయోగించిన బాణాలను, గమ్యం చేరకముందే కుప్పకూలుస్తున్నాడు విజయుడు. 

గురువు వదలిన శరాలు ఆకాశమార్గాన తెల్లమబ్బులవలె తరలి వస్తుంటే, శిష్యుని అస్త్రాలు కారుమబ్బుల వలె వాటిని కమ్ముకుంటున్నాయి. ఆ అపురూప దృశ్యాన్ని అందరూ రెప్పవేయక చూస్తున్నారు. వారిద్దరి మధ్య పోరు తీక్షణంగా సాగింది. ధనుర్వేత్తలిద్దరూ ఇంద్రవాయు వరుణాస్త్రాలను అభిమంత్రించి ప్రయోగించారు. అనుగుణంగా విరుగుడులు ప్రయోగించారు.

విశాల ఆకాశాన్ని వీరి అస్త్ర శస్త్రాలు ఆక్రమించాయి.వున్నట్టుండి కురుసేన, ద్రోణాచార్యుని వెనకగా వుండి విక్రమించింది. అర్జునుని చుట్టుముట్టింది. సవ్యసాచి ఏకధాటిగా యిటు ఆచార్యునికి, అటు సేనకు జవాబు చెప్పాడు. శక్తివంతమైన బాణాలతో ద్రోణుని రథాన్ని కూల్చాడు విజయుడు. ఆచార్యుడు డస్సిపోయాడు. గుర్రాలు దెబ్బతిన్నాయి. విజయుడు విజృంభిస్తున్నాడు. తండ్రి నిస్సహాయ స్థితిని చూసి, అలజడిపడిన అశ్వత్థామ వందల కొలది రథికులతో కిరీటిని ముట్టడించాడు. 

అర్జున, అశ్వత్థామల నడుమ ఘోర సంగ్రామం మొదలైంది. మహోత్సాహంతో వీరులు పెడుతున్న కేకలు భీతిగొల్పుతున్నాయి. శంఖనాదాలు ఆకాశంలో వురుములను తలపింపజేస్తున్నాయి. అశ్వత్థామ, విజయుడు పరస్పరం భీకర అస్ర్తాలను ప్రయోగించుకున్నారు. కదనరంగం అగ్నికీలలతో ఒకవైపు వెలిగిపోతుండగా, మరొకవైపు ఆకాశం పొగలు కమ్మింది. 

అశ్వత్థామ అమ్ములపొది ఖాళీ అయింది. సవ్యసాచి అక్షయ తూణీరంలో, తీస్తున్న కొద్దీ శరాలు పుట్టుకు వస్తున్నాయి. ద్రోణపుత్రుడు అశ్వత్థామ అసహాయత కృపాచార్యునికి అవగతమైంది. త్రుటిలో కృపాచార్యుడు అర్జునునిపై దృష్టిసారించాడు. నిశిత బాణాలూ సారించాడు. ధనంజయుడు శాత్రవ దుర్నిరీక్షుడై, శరపరంపరతో ప్రకంపనాలు సృష్టించాడు. క్రోధంతో కృపుడు ప్రయోగిస్తున్న శరాలు అర్జునుని కపికేతనాన్ని గజగజలాడిస్తున్నాయి. రెప్పపాటులో కృపాచార్యుని రథకేతనాన్ని కూల్చాడు విజయుడు. 

యుద్ధరంగంలో వీరుని కేతనం పతనమైతే, ఆ యోధుడు శిరస్సు తెగినట్టే లెఖ్ఖ! కృపాచార్యుని పరిస్థితిని పరికించి కురువీరులైన చంద్రకేతుడు, చిత్రాశ్వుడు, మణిమంత్రుడు, మంజుమౌళి, హేమవర్మ, సుర థుడు, సుషేనుడు, అరిష్టుడు, సంకేతుడు, ఆచార్యుని రక్షణకు పూనుకున్నారు. ఆయన రథచక్ర సంరక్షకులుగా జాగరూకులై నిలిచారు. వారంతా ఏకకాలంలో కిరీటిని చుట్టుముట్టారు. 

విజయుడు తన కరకుటమ్ములతో వారి శీర్షాలను గగన తలంలో చిందులాడించాడు. మరి రెండు వాడి శరాలతో కృపాచార్యుని రథచక్రాలను, ఇరుసును, కాడిని ముక్కలు చేశాడు. తరువాత అశ్వాలు నేలకొరిగాయి. సారథి వీరమరణం చెందాడు. కృపుని చేతి వింటినారి అర్జునుని శరాఘాతానికి పెద్దశబ్దంతో తెగిపోయింది. ఆచార్యుని చేతివిల్లు, చేతికర్రగా మిగిలింది. పార్థుడు ప్రత్యర్థిని ధిక్కారంగా చూసి, ఒక్కసారి ధనుష్ఠంకారం చేసి, ఫెళఫెళార్భాటాలు సృష్టించాడు.

om sri raam

ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది... 

ఆమెనడిగాడు... మీది ఏ కులం?

ఆమె సమాధానం "మహిళ"గా చెప్పాలా "అమ్మ"గా చెప్పాలా? 

రెండిటినీ  కూర్చి చెప్పండి, అన్నాడతడు. 

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!

అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు... 

ఆమె సమాధానం...  

తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి 

పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత 

పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది. 

చివరగా...   

పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది. 

ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!

గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు... 

మాతృమూర్తులందరికి అంకితం🙏

ప్రతి నిత్యం మన జీవితాలని ఉత్సహంగా మలిచే అమ్మ కి🙏

[21/01, 6:11 am] +91 99858 31828: *జగన్మోహిని*

దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు.

మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై…..

కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు.

జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ….,

అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.

ఈ విషయాన్ని కలహ భోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు.

అప్పుడు పరమశివుడు ‘మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు’ అన్నాడు.

అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి

‘నీ జగన్మోహన రూపాన్ని చూపించు’

అని అడిగాడు.

పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి..

విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై..

తనను తానే మరచి ఆ జగన్మోహినినీ ఆనుసరించాడు..

(ఇక్కడ తెలియనితనం తో చాలామంది శివుడు వెంట బడ్డాడు అని అంటారు.

కానీ కాదు ,మహిషి ఘోర తపస్సు చేసి తనను చంపగలిగేవాడు హరిహారాదులకు పుట్టినవాడు కావాలని కోరుకుంది,అందుకు అక్కడ అయ్యప్ప జననం జరగాలి,విష్ణువు ,అమ్మవారికి సోదరుడు కనుక పార్వతి అంశ తనలో ఉండబట్టే పార్వతి దేవిలా శివునికి భార్యలా ప్రవర్తించగలిగాడు విష్ణువు)

*కొన్ని జోకులు*

0::::::::::::::::::::::::::0


(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)

ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.

వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బందువొస్తోంది...పలకరించండి"

అంది నవ్వుతూ.

వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"

నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని

పలకరించాడు వరహాల రావు.

*****

అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"

.ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

*****

భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసుఆ?

భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.

*****

పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?

.బబ్లూ : మీరు పాఠం చెప్పడం వాస్తవం అది మేము వింటున్నాము అనుకోవడం భ్రమ.😆

*సేకరణ*

ఒక మెకానికల్ ఇంజనీర్ కారులో  వెళ్తున్నాడు  ఉన్నట్టుండి  టైర్   పంచర్ అయ్యింది 

అటుగా ఎక్కడా ఎవరి రాకపోకలు  లేవు ఎలాగోలా  స్టెప్ని  టైర్ మార్చడానికి తనే స్వయంగా  సిద్ధమయ్యాడు


బోల్టులన్నీ తీసి  టైర్  మారుస్తుండగా చెయ్యి జారీ  బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో  పడిపోయింది  

ఇప్పుడేం చేయాలా  అని ఆలోచిస్తుండగా  

మురికి బట్టలు అందులోనూ అక్కడక్కడా  చినిగిపోయిన   బట్టలు వేసుకున్న  వ్యక్తీ అటుగా వచ్చాడు 


ఈయన్ని చూసి అయ్యా ఏమైందని  అడిగాడు 

అప్పుడు ఆ ఇంజనీర్ కు ఆ కాలువలో దిగడానికి  సరైన వ్యక్తి దొరికాడని జరిగిందంతా చెప్పాడు 

ఆ కాలువ  నుండి బోల్టులు తీసిస్తే  ఎంత డబ్బైనా ఇస్తానని  చెప్పాడు 


అప్పుడు ఆ వ్యక్తి 

అయ్యా!!

కాలువలో  దిగడానికి నాకు ఎటువంటి ఇబంది  లేదు కానీ అంతకంటే సులభమైన  మార్గం ఉంది 

మిగతా మూడు టైర్ ల నుండి ఒక్కో బోల్టు తీసి  ఈ టైర్ కు వేయండి  తరువాత వచ్చే మెకానిక్  షాప్  లో నాలుగు బోల్టులు తీసి వేసుకుంటే  సరిపోతుంది అన్నాడు అంతే ఇంత చదువుకున్న  నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా  అని ఆశ్చర్యపోయాడు 

మనిషిని చూసి తక్కువ అంచనా  వేయకండి చిన్నచూపు  చూడకండి  


ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని  పెంచి  జ్ఞానాన్ని  సూన్యం చేస్తున్నాయి

అన్ని తెలివితేటలు ఉన్నా ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో  తెలియడం  లేదు 


ప్రాణాలతో ఉన్న పక్షికి  చీమలు ఆహరం 

చచ్చిన పక్షి చీమలకు  ఆహారం  

పరిస్థితులు   ఎలాగైనా  మారొచ్చు  

ఎవరిని తక్కువ చేసి చూడకండి

*సేకరణ: 🙏

 *తాళపత్రం* 

🌻 *గ్రహణ సమయంలో సూర్యుడి వైపు చూడవచ్చా?* 🌻

గ్రహణ సమయంలో సూర్యుని వైపు. చూడకూడదనే మన పూర్వకాలం నుండి వస్తున్న విశ్వాసం. ఆధునిక సైన్స్ కూడా దీన్ని ఆమోదించింది. సూర్యుని వైపు సూటిగా చూడటం వల్ల సూర్యకిరణాలు మన కంటి పై పడి నేత్ర పటలాన్ని కాల్చివేస్తుంది. 

ఇలా చూడటం గ్రహణం సమయమైనా, మామూలు రోజుల్లోనైనా ప్రమాదకరం. కాని మామూలు రోజుల్లో మనము సూర్యుని వైపు,చూసినప్పుడు ఆ ప్రకాశాన్ని వేడిని భరించలేక కనురెప్పలు మూసుకుపోతాయి. ఇలా కంటి రెప్పల ద్వారా మనకు రెటీనా రక్షించ బడుతుంది.

కానీ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని ఎంతగానో అడ్డుగా ఆక్రమించి ఉంటాడు. కావున సూర్యకిరణాల తీవ్రత తగ్గివుంటుంది. 

ఈ సమయంలో సూర్యుడిని ఎలాంటి కంటి శ్రమ లేకుండా చూడగలుగుతాము అదే పొరపాటు. ఒకవేళ అలా గ్రహణ సమయంలో చూసినట్లయితే సూర్యకిరణాలు గ్రహణ సమయంలోనైనా, మామూలు సమయంలోనైనా ఒకే వేడిని కలిగి వుంటాయని గ్రహించబడినది.

కావున అలా సూర్యుడిని చూడడం కళ్ళకు ప్రమాదకరం. చూడడానికి అనువుగా ఉందని అలా సూర్యుడిని గ్రహణ రోజుల్లో చూసే ప్రమాదం ఉందనే, మన పెద్దలు అలా చూడరాదని తెలియజేశారు.

 🙏 *భగవంతునికి సమర్పించవలసినది...* 🙏

మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు.

భగవంతునికి మనం పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో , సమర్పించడమన్నది మనం భగవంతుని యందు చూపించే కృతజ్ఞత మాత్రమే.  

మనకు ఈ దేహాన్నిచ్చి,  సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికే, నిజానికి ఆయనకు కావలసిన దేమీ లేదు.  

ఆయన సర్వ సంపూర్ణుడు. అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా చెప్పింది.           

*పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి*

*తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః "*

నిర్మల బుద్ధి తో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమును గానీ  నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను.

 పై శ్లోకంలో ని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం

1.  పత్రం :  "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం. మనిషిని పడవేసేది  మనస్సు. కాబట్టి పత్రాన్ని సమర్పించాలీ అంటే మనమనస్సును

దైవాంకితం చేయాలని దాని అంతరార్థం.

2.  పుష్పం:  "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి   కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని 

అంతరార్థం.

3.  ఫలం  :  "విశీర్యతే ప్రహారైరితి ఫలం" ప్రహారైః   అనగా దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలము.   జ్ఞాన బోధము అనే దెబ్బలచే  పగిలేది మనస్సులోని అహంకారం. కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలని అంతరార్థం.

4.  తోయం:  "తాయతే_పాయతీతి". అనగా రక్షించునది కనుక తోయము. సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంచుకొని , రక్షించేది  చిత్తము. కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం. అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలని భావము.

మనస్సు మన పతనానికి మూలకారణము. అందుకే దాన్ని మనం ముందుగా భగవంతు నికి సమర్పించాలి. 

శంకరులు తమ శివానందలహరి లో  "భవతు భవదర్థం మమ మనః " ..అంటారు..

అనగా ఈశ్వరా ! నా మనస్సు నీ స్వాధీనం అగు గాక " అని కోరుకున్నారు...............

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀


No comments:

Post a Comment