
ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను నేను 2012 నుండి కధలు కవితలు అనేకమైన విశ్లేషకులు వాట్సాప్ వచ్చాక గౄపులు ద్వారా అంతర్జాల ము ద్వారా సేకరించినవి ఇందు పొందు పరుస్తున్నాను. ఇది ఉచితం ఆన్లైను అంతర్జాల పత్రిక ఇది "ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం " మాత్రమే
ప్రాంజలి ప్రభ
UIUI IIUU UUUU UUU (7)
సామరస్య సమభావం భిన్నత్వంలో ఏకత్వం
కాలమంత శుభ తేజం కన్నాప్రేమే జీవత్వం
సామ్య వాద కళ విద్యా వృత్తీ విద్యే భావత్వం
జాతి అంత ఒక మార్గం దేశం సేవ మిత్రత్వం
సృష్టి కార్య మనుజన్మే సత్యత్వంలో సాఫ్యల్యం
జన్మ సార్ధ కత పొందీ సత్యాన్వేషై ప్రాధాన్యం
మంత్ర శాస్త్ర కధ లన్నీ నిత్యానందం వాత్సల్యం
తాను ఏమి అని ఉన్న ఆత్మానందం సత్కర్మం
వాస్త వాన్ని సహనంతో సాధ్యంగానే ప్రేమత్వం
దివ్య భావ వినయంగా ప్రాధాన్యంగా స్నేహత్వం
ధర్మ పల్కు అనునిత్యం సౌజన్యంగా సౌకర్యం
విశ్వ మాత కరుణత్వం విశ్వాసంగా ఆంతర్యం
దేశనీతి గణతంత్రం సద్భావమ్మే హృద్యత్వం
సార్వభౌమ అధికారం ధర్మత్వమ్మే సాదృశ్యం
భారతీయు లలొజన్మా త్యాగాన్మిత్రం జన్మార్ధం
శాంతి సౌఖ్య సహజత్వం పూర్ణాపూర్ణం ప్రేమత్వం
మౌనవాక్కు లోనే ఆశత్వంలో శుధ్ధిత్వం
స్నానమేను మనకాయం ఆరోగ్యత్వం శుధ్ధిత్వం
ధ్యానమంత మనలోకం బుధ్ధిత్వాన్నీ శుధ్ధిత్వం
ఆత్మశుధ్ధి మనమేకం కర్తవ్యమ్మే ధర్మార్ధం
--(())--🙏 *ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు..
ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*
*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే..
నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...
ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..
మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*
*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*
*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*
*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*
*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*
*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*
*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*.
*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*
*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*
*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*
--(())--*ఒక చిన్న గదిలో* *నాలుగు మైనపు దీపాలు* *వెలుగుతూ ఉన్నాయి.*
*ఇంతలో పెద్దగా గాలి💨 రావడం మొదలయింది.*
*ప్రశాంతత అనే మైనం:-
ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.*
*ప్రేమ అనే మైనం:- కూడా
ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను* *ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*
*తెలివి అనే దీపం:-
నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూఆ గాలికి ఆగిపోయింది.*
*నాలుగో దీపం మాత్రం:-
నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* *ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది. ఆ గాలిని ఎదిరించి వెలిగింది.*
*దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు* *ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.*
*బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది.*
*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో* *అన్నదట...*
*సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు.*
*నా పేరు నమ్మకంఅని చెప్పింది... ఆ దీపం.*
*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*
--(())--
మధురిమలు .. అక్షరములు (261 --270 )
రచయిత : మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నమ్ముకున్న అక్షరాలు
అమ్మ యు నేర్పిన పదాలు
బ్రతుకు నేర్పు లక్షణాలు
మరువలేని మది తలపులు
అక్ష రాలలొ గమకాలు
రాగ యుక్త భావమ్ములు
అచ్చులలో ను హల్లులు
స్వరాలతోను సరిగమలు
అక్షరాలు గుప్త నిధులు
దాచుకొను నిక్షేపావలు
ఆదుకొనెటి ప్రాణాలు
మనిషికి అక్షర వాక్కు లు
ఏకత్వం లొ భిన్నత్వాలు
భిన్నత్వపు ఏకత్వాలు
ఎకత్వాక్షర కులాలు
మతాల అక్షర మాలలు
మనిషికి విభిన్న భాషలు
వేషంతో నే మార్పులు
అక్షర జీవగ్రంధాలు
అభివృద్ధి కే పథకాలు
స్వల్పం గాను ఎగుమతులు
అనంతంగా ఎగుమతులు
ధరల సూచిక పై చూపులు
అక్షరం చేయు మాయలు
ధరల తోను నేల చూపులు
అక్షరాస్యత గ చూపులు
దేశానికే రక్షక లు
దేశమంటే మనుష్యులు
అక్షర హృదయమ్ము నాడి
నాడి రక్త ముతో వేడి
వేడితొ మేధస్సు కలబడి
సక్రమం బుద్ధి తో బడి
నిత్య యవ్వన పరం గా
యవ్వన పర విద్యా గా
విద్య యే అక్షరం గా
జీవావికి ప్రాణంగా
సంకల్ప బలము వేదము
వేదము సత్సంకల్పము
పఠనము అక్షర వేదము
వేదము నిత్యా గ్రంధము
--(())--
-పద్మావతి అందం చూస్తుంటే ప్రబంధకవులకు మాట పడిపోయుండేది. మహారాజులకైతే మతి తిరగబడుండేది. మామూలు మాచవరం నాగేశ్వర్రావు సంగతి ఇహ చెప్పాలా.. పెళ్ళిచూపులప్పుడే ఫ్లాటయిపోయాడని!
మొదటి రాత్రి మాటా మంచీ అయింతరువాత పుస్తకంలా పడి నిద్రపోతున్నప్పుడు నాగేశ్వర్రావు చెవిలో ఏదో నాగుపాము బుస వినిపించింది ఆగకుండా! చీమ చిటుక్కుమన్నా లేచిపోయే దౌర్భాగ్యం అతగాడిది. లేచి లైటు వేసీ వేయంగానే బుస ఆగి పోయింది! లైటు తీసిన రెండు నిమిషాలకే మళ్లీ మొదలయింది!రాత్రంతా ఇదే కథ!
కాలం గడిచి.. పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు పెరిగి.. పెద్దయి.. వేరే దేశాలకని ఎగిరి వెళ్ళిపోయినదాకా.. పద్మావతి గురక రహస్యం ఆ ఇంటి నాలుగ్గోడల మధ్య మాత్రమే మిగిలిపోయిన గుట్టు. భారతీయులం కనక కుటుంబ బాంధవ్యాలు అంత బలంగా ఉంచుకొంటాంగానీ.. వేరే దేశంలోకి సీను మారంగానే మన మనస్తత్వాలనూ అంతే వేగంగా మార్చేసుకొంటాం.
కూతురు కాన్పుకోసమని ఆర్నెల్లకు అమెరికా వెళ్లిన పద్మావతి.. మూణ్నెల్లు తిరక్కుండానే ఇండియా తిరిగొచ్చేసింది. కొడుకు పిలిచాడని పడుతూ లేస్తూ వెళ్ళిన నాగేశ్వర్రావు దంపతులు.. మూడునెల్లు కూడా ఉండలేక మళ్లా అలాగే తిరిగొచ్చేసారు.
గుట్టు చప్పుడు కాకుండా ఇండియా వచ్చి పడినా భగవంతుడి పరీక్షలు ఆగలేదు. ఉన్నట్ట్లుండి పద్మావతి గుండెనొప్పితో పెద్దాసుపత్రిలో చేరడం,, చూడ్డానికొచ్చిన బిడ్డలిద్దరి చేతుల్లో భర్తను పెట్టి కన్నుమూయడం! లఘుచిత్రం చూసేంత సమయంకూడా పట్టలేదు కథ ముగింపుకి రావడానికి!
అంతా బాగానే ఉంది. వేళకు తిండి.. వ్యాయామం.. తనలాంటి ఇరుగుపొరుగుతో మాటా మంతీ! చీకటి బడటంతోనే దిగులు మొదలవుతున్నది నాగేశ్వర్రావుకి. కంటినిండా నిద్ర పోయింది
ఎన్ని మందులు మింగించినా.. ఎన్ని కొత్త వైద్యాలు ప్రయోగించినా నాగేశ్వర్రావుమీద ఫలితం చూపించలేక పోయేసరికి చేతులెత్తేసారు ఓల్డేజి నిర్వాహకులు.
సొంత వైద్యం ఆలోచన అప్పుడొచ్చింది నాగేశ్వర్రావుకి. భార్య ఫొటో పక్కనుంచుకొని.. ఆమె గురక రికార్డు ప్లేయర్లో ఆన్ చేసుకొంటే కంటిరెప్పలు కిందికి వాలుతున్నాయిప్పుడు!
పెళ్లయిన కొత్తల్లో పెళ్లాన్ని ఆటపట్టించేందుకు దొంగచాటుగా రికార్డు చేసిన గురక కేసెట్ అది!
✍️ కర్లపాలెం హనుమంతరావు
--(())--
గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........
"ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.
అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-
"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.
తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...
జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.
"ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.
శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.
అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది.
ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.
ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి - అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-
"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి. "తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.
"జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"
ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-
"మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి
విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు.
పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి
ప్రతీక... " అన్నారు.
"అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.
--(())--
శ్వేతార్క ఆంజనేయ స్వామి 🌻
🍃🌹తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి.
🍃🌹బ్రహ్మచర్యం పాటించాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి అంటే, పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి.
🍃🌹ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
🍃🌹శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి –
”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్”
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
🍃🌹జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి. ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాపన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి.
🍃🌹ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.
”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్” మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
🍃🌹శ్వేతార్క ఆంజనేయ స్వామిని ”హనుమజ్జయంతి” నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది.
🍃🌹శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటి? దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బాలారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి.
🍃🌹ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు.
🍃🌹కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు.
🍃🌹ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది.
🍃🌹ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:50 am, 26/01/2021] +91 94414 08564: 🌻 *ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే
లాభాలు!* 🌻
🍃🌺1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
🍃🌺2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
🍃🌺3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
🍃🌺4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
🍃🌺5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలగరు.
🍃🌺6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
🍃🌺7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
🍃🌺8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
🍃🌺9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.
🍃🌺10. ఆంజనేయస్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:52 am, 26/01/2021] +91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🩸 భాగము 26 🩸
💧 నిజ స్వరూపాలు 💧
🍃🌺ఎంత ఆలోచించినా, అన్నగారు ముభావంగా వుండడానికి కారణము కానరావడం లేదు. దీనికి హేతువేమిటో మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. నేనీ మనోవ్యధ నుంచి బయటపడతాను- అన్నాడు అర్జునుడు. సోదరుని బాధను గ్రహించిన ధర్మజుడు ఒక్కసారి సూటిగా అతని ముఖంలోకి ప్రసన్నంగా చూశాడు.
🍃🌺అర్జునా, దీనికి వేరే కారణమేమీ లేదు. కౌరవుల ఘోర పరాజయానికి తన కుమారుని శౌర్యప్రతాపాలే కారణమని విరాట భూపతి ప్రశంసిస్తుండగా, బృహన్నల సహాయసంపత్తి సమకూరినపడతనికేమి కొదవ అని నేనన్నాను. ఆమాటతో మత్స్యభూపతి సహనం కోల్పోయాడు. అసలే విజయాహంకారం ఆవరించి వుండగా, నా మాట ఆజ్యమైంది. భగ్గున మండిపడి, ‘‘నా సమక్షంలో ఆ పేడిని పొగుడుతున్నావా’’ అని గర్జించి, నిగ్రహం కోల్పోయి పాచికను నాపై విసిరాడు.
🍃🌺అది నా నుదుటికి తగిలింది. నెత్తురు జాలువారింది. ఆ దెబ్బ నీ కంటపడడం నాకు యిష్టం లేదు. అందుకే వస్త్రాంచలంతో నుదుటిని కపకుని నా ముఖాన్ని చాటేస్తున్నాను. ఇంతకుమించి కారణం వేరే ఏమీలేదు’’ అంటూ ఉత్తరీయపు చెరగును తొలగించాడు యుధిష్ఠిరుడు. అగ్రజుని నుదుటి గాయం సవ్యసాచి కన్నులలో జ్యోతులవలె ప్రతిఫలించాయి.
🍃🌺ఆగ్రహావేశాలతో, ‘‘దురహంకారి ఆ విరటునికి తరతమ భేదములు తెలియవు. వానినిపడే బంధుమిత్ర సపరివారంగా యమపురికి సాగనంపాలి. ఆ తరువాత యీ మత్స్యదేశానికి నీవే రాజుగా పట్టాభిషిక్తుడ వు కావాలి’’ అని అర్జునుడు గర్జించాడు. తమ్ముని మాటలు విని ధర్మజుడాతని శాంతింపచేశాడు.
🍃🌺‘‘విజయా! ఇంతవరకు మనమెవరమో విరాటుడెరుగడు. ఆయన ఆశ్రయంలో వుంటూ మనమందరం అజ్ఞాతదీక్షను నిర్విఘ్నంగా పూర్తిచేశాం. అలాంటిరాజుకు హాని తలపెట్టడం భావ్యం కాదు. ఏరుదాటి తెప్ప తగులబెట్టిన చందము కాదా? మన నిజరూపాలు తెలిశాక కూడా, మహీపతి యిలాగే ప్రవర్తిస్తే అప్పటిమాట ఆలోచిద్దాం’’ అని ఆగ్రజుడు సోదరులను పరికించాడు.
🍃🌺అర్జునుడు శాంతించాడు. మిగిలినవారు ధర్మజుని యోచన యుక్తియుక్తముగా వుందన్నారు. విరాటభూపతికి తమ నిజస్వరూపాలను తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు.తెల్లవారింది. బాలభానుడు కొత్త వెలుగులు సర్వత్రా ప్రవర్తిస్తున్నాడు. ప్రభాతవేళ స్నానసంధ్యాదికాలు నిర్వర్తించుకుని, తెల్లని పట్టువస్త్రాలతో, రాజఠీవికి తగిన అలంకరణలతో రాజసభామందిరంలో వారు అయిదుగురూ అడుగుపెట్టారు. ధర్మనందనుడు విరటుని స్వర్ణసింహాసనంపై సమాసీనుడైనాడు. భీమార్జున నకుల సహదేవులు ఉచితాసనాలను అలంకరించారు.
🍃🌺అంతలోనే విరాటరాజు వందిమాగధుల కైవారములతో, పుత్ర సమేతంగా కొలువులో అడుగుపెట్టారు. ఆ దృశ్యాన్ని చూసి రాజు నిర్ఘాంతపోయాడు. తనని అవమానిస్తున్నారని భావించి, ‘‘భట్టారకా! యిదేమి? మదించి మైమరచి సాక్షాత్తూ రాజసింహాసనాన్నే ఆక్ర మించావే! మేము వచ్చినా నువ్వు ఏమాత్రం చలించలేదంటే, అది మీ అహంకారానికి పరాకాష్ఠ..’’ అని వేడిశ్వాసతో విరటుడు గర్జించాడు.
🍃🌺ధర్మజుడు ఏమాత్రము చలించలేదు. అర్జునుడు మందహాసంతో గంభీర గళాన్ని విప్పి ‘‘విరాటరాజా! మాణిక్యకిరీటాలు ధరించిన మహీశ్వరులతో తన ముఖ్య నగరికి సజీవ దీపికలెత్తించిన వాడీ శౌర్య సముద్రుడు. తిరుగులేని ఒకేఒక ఆజ్ఞతోనే శాత్రవుల గుండెలలో గుర్రాలను పరుగులెత్తించిన దుర్వార పరాక్ర మశాలి. దయావీరం, దానవీరం యీ ఔదార్యమూర్తికి భుజకీర్తులు. ఆయన కీర్తికాంతి నాలుగు దిక్కులకూ శోభనిచ్చింది.
🍃🌺రాజసూయం నెరపిన సచ్చారిత్రుడు. పాండువంశ సాగరం నుంచి సముద్భవించిన పూర్ణిమా సుధాకరుడు. నిత్యసత్యవ్రతంతో, అజాతశత్రు బిరుదంతో విజయ పరంపరలను సాధించిన యీ ధీశాలి ఇంద్రసింహాసనానికి అర్హుడు. ఆయన నీ చిరుగద్దెపై కూర్చొనడం నీ సింహాసనం చేసుకున్న సుకృతం’’ అన్నాడు. ఆమాటలు విన్న విరాటభూపతి నివ్వెరపోయాడు.
🍃🌺కొద్దిసేపు గొంతు పెగలలేదు. తేరుకుని, అప్రయత్నంగా చేతులు ముకుళించి, యీ కంకభట్టారకుడే ధర్మతనయుడైన మరి భీమార్జున నకుల సహదేవులెక్కడ? సాధ్వి పాంచాలీదేవి ఎక్కడ?’’ అని వినయంగా ఆత్రుతగా అడిగాడు.సవ్యసాచి వెంటనే, మహారాజా నీ కొలువులో వుంటూ బెబ్బులలతో, మత్తేభాలతో అసహాయశూరుడై పోరాడి, పంచభక్ష్య పరమాన్నాలతో అన్ని పొద్దులా నీకు కొంగ్రొత్త చవులూరింప చేస్తున్న వలలుడే భీమసేనుడు.
🍃🌺బకాసురుని వధించి, ఏకచ్ఛత్ర ప్రజలకు ప్రాణభీతి తొలగించిన మహా సాహసి. కిమ్మీరాసురుని సంహరించ ఘోరారణ్యాన్ని తపోవనంగా మార్చి మహర్షుల మంగ ళాసీసులందుకున్న మాన్యుడీ భీమసేనుడు. హిడింబాసురుని కడతేర్చి, అతని సహోదరి హిడింబకు అభయమిచ్చి ఆమెను అర్ధాంగిగా స్వీకరించిన పరాక్రమశాలి.
🍃🌺దామగ్రంధి పేరుతో నీ అశ్వాలను సంరక్షిస్తున్నవాడు నకుల కుమారుడు. మీ ఆస్థానంలో గోపరిపాలన బాధ్యతలు నిర్వరిస్తున్న తంత్రీపాలుడే సహదేవుడు. మిక్కిలి సుకుమార హృదయుడు. గోహృదయం తెలిసినవాడు. కుంతీమాతకు ఆరవప్రాణం. సుధేష్ణాదేవి సన్నిధిలో సైరంధ్రీ సేవలో మాలిని పేరుతో మసులుకుంటున్న శీలవతి ద్రౌపది.
🍃🌺ఆ సాధ్విని ఆవమానించిన కీచకుల బీజాంకురాలు నేలపై లేకుండా రూపుమాపిన గంధర్వుడెవరో కాదు, మా భీమసేనుడే! భీముడు వినమ్రుడై విరటుని చూచి, ఏదో చెప్పడానికి వుద్యుక్తుడు కాగా, మహారాజు ఆసక్తిగా పరికించాడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 74 🕉
ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ:
ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలుఁజాలుఁగవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
📍 *తాత్పర్యం:* 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నావంటి కవులు తమ పరిమితమగు బుద్ధి శక్తి తో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము చాలు చాలును.
🌹సత్యమగు
వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా...
🙏 ఓం నమః శివాయ 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
🙏 శ్రీ వేంకటేశ్వర లీలలు 🙏
🍒 భాగము 41 🍒
🌻 శ్రీవివాహ మహోత్సవ లగ్నశుభపత్రిక 🌻
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺 విష్ణు సహస్రనామాలు 🌺
🌀 సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥ 🌀
🌹 26. శర్వః 🌹
🌺 ఓం శర్వాయ నమః 🌺
🍃🌺శృణాతి ఇతి శర్వః సంహార సమయమున రుద్ర రూపమున సకల ప్రాణులను సంహరించును; రుద్రునిచే సంహరింపజేయును. శృణాతి, హినస్తి పాపమితి శర్వః పాపములను హింసించువాడు (పోగొట్టువాడు). శృణాతి హినస్తి సర్వమంతకాలే ఇతీశ్వరః ప్రళయకాలమున అందరినీ హింసించువాడు.
🍃🌺కురుక్షేత్రమునందు భగవంతుని విశ్వరూప సందర్శనభాగ్యము కలిగినపుడు, అర్జునుడికి ఆ పరమాత్ము తెలిపినది ఆ సంధర్భమున అక్కడకు చేరుకొన్న యోద్ధలనుద్దేశ్యించి తెలిపినప్పటికీ, ఆ శ్లోకములో 'శర్వః' అన్న ఈ దివ్య నామము యొక్క వివరణ చూడవచ్చును.
:: భగవద్గీత విశ్వరూపసందర్శన యోగము ::
*కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।*
*ఋతేఽపి త్వా న భవిష్యన్తి సర్వేః
యేఽవస్థితాః ప్రత్యనికేషు యోధాః ॥ 32 ॥*
🍃🌺నేను లోకసంహారకుడనై విజృంభించిన కాలుడను అయియున్నాను. ప్రాణులను సంహరింపు నిమిత్త మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్షసైన్యములందుగల వీరులు నీవు లేకపోయినను (యుద్ధము చేయకున్నను) జీవించియుండరు (మృతినొందకా తప్పరు).
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సంకల్ప సూక్తమ్ 🌹
🌻. మనస్సుకు సత్సంకల్పము కలిగేలా చేసే సూక్తము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలు పెడితే పని నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము. ఇది శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత లోనిది. 6 మంత్రాలు కలది. యిలాటిదే మహన్యాసంలో 36 మంత్రాలు కలిగినది ఉన్నది.
దీనిని ప్రతి రోజూ నిద్రకు ముందు, లేచిన తర్వాత కూడా చదువుకోవచ్చు.
ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం
తదు సుప్తస్య తథైవేతి |
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 1
జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
యేన కర్మాణ్యపసో మనీషిణో
యఙ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరాః |
యదపూర్వం యక్షమన్తిః ప్రజానాం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 2
మేధావులు యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధి మంతుల ప్రార్థన లో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే ప్రాణులలో నెలకొని ఉన్నదో అటువంటి ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
యత్ ప్రఙ్ఞానముత చేతో ధృతిశ్చ
యజ్జ్యోతి నరన్తనరమృతం ప్రజాసు|
యస్మాన్న ఋతే కించ న కర్మ క్రియతే
తన్మే మనః శివ సంకల్పమస్తు || 3
ఏ ఆత్మైతే ప్రఙ్ఞానం, ఙ్ఞాపక శక్తి, మనో స్థైర్యములకు ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మైతే ప్రాణులలో నశించని జ్యోతి స్వరూపంగా ఉంటున్నదో, ఏ ఆత్మైతే లేకుంటే ఏ పనీ చేయజాలమో అట్టి ఆత్మ నా మనసును సత్సంకల్పం కలిగేలా ప్రేరేపించు గాక.
యేనేదం భూతం భువనం
భవిష్యత్ పరిగృహియమమృతేన సర్వమ్|
యేన యఙ్ఞస్తాయతే సప్త హోతా
తన్మే మనః శివ సంకల్పమస్తు|| 4
ఏ ఆత్మైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ గ్రహించుచున్నదో, ఏ ఆత్మైతే హోమం చేస్తున్న ఏడుగురికీ దానిని గురించి వివరిస్తుందో ఆ ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పం కలిగే లాగా ప్రేరేపించు గాక.
యస్మిన్ ఋచః సామ యజూగ్ంషి
యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః|
యస్మింశ్చిత్త
గ్ం సర్వమత ప్రజానాం
తన్మే మనః శివ సంకల్పమస్తు|| 5
రథ చక్రంలో ఆకులు ఎలాగైతే అమరి ఉంటాయో అలాగే ఋక్, యజుస్, సామ వేదాలు దేనిలో నెలకొని ఉన్నవో, పడుగు పేకలా జనుల మనస్సులు అన్నీ దేనిలో నెలకొని ఉన్నవో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పాన్ని కలిగేలా ప్రేరేపించు గాక.
సుషారథిరస్వానివ యన్మనుష్యాన్
నేనీయతే౽భిశుభిర్వాజిన ఇవ |
హృత్ప్రతిష్ఠం యదజిరం ఇవిష్టం
తన్మే మనః శివ సంకల్పమస్తు || 6
ఓం శాంతిః శాంతిః శాంతిః
నేర్పరియైన సారథి అశ్వాలను క్రమశిక్షణతో ఉంచినట్లు, మానవులు గుర్రాలను పగ్గాలతో ముందుకు నడిపినట్లు, హృదయస్థానంలో ప్రతిష్ఠితమైన ఏ ఆత్మైతే మానవులను నియంత్రిస్తుంటుందో, నిత్య యౌవనంగా ఉంటుందో, అన్నిటికన్న వేగవంతమైన దో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః|
🌹 🌹 🌹 🌹 🌹
🌹. వివేక చూడామణి - 3 🌹
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 3. సాధకుడు - 1 🍃
15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.
16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.
17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.
18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందు
టకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.
19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.
20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల.. తెలంగాణలో కొత్త రాజకీయయ పార్టీని నెలకొల్పబోతోన్నారంటూ వస్తోన్న వార్తలు.. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. సరికొత్త రాజకీయ సమీకరణాలు, డిబేట్లకు కేంద్ర బిందువు అయ్యాయి.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికంటూ ప్రత్యేకంగా కొంత బలమైన ఓటుబ్యాంకు ఉందని, దాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికే ఆమె సారథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి తెరవెనుక కేసీఆర్ హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వర రావు కొన్ని అనుమానాలను లేవనెత్తారు. వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ వెనుక భారీ స్కెచ్ ఉందని ఆయన చెబుతున్నారు. కుట్ర పూరిత రాజకీయాలు, హిందుత్వాన్ని అణచివేసే వ్యూహంతోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతోన్నారని హెచ్చరించారు.
తెలంగాణలో బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర కులాలను తన కొత్త రాజకీయ పార్టీ వైపు మళ్లించేలా వైఎస్ షర్మిల కసరత్తు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అధికారాన్ని అందుకోవడానికి రెడ్డి, క్రిస్టియన్ కమ్యూనిటీని విస్తృతంగా వినియోగించుకోవడం, ఇతర హిందూ కులాల మధ్య విభేదాలను సృష్టించాలనేది చర్చ్ స్ట్రాటజీగా కనిపిస్తోందని మన్నెం నాగేశ్వరరావు చెప్పారు.1999 నవంబర్లో పోప్ జాన్ పాల్-2 చెప్పిన క్రైస్తవ భారత్ ప్రణాళికలో ఇదంతా భాగమేనని అన్నారు.
Goof effort sir . Thank you 👏Sambasivarao. T poetand writer Hyderabad
ReplyDelete