Monday, 11 January 2021

13--01--2021


భోగిమంటలు

సంక్రాంతి కవిత

శంతన మహారాజు చరిత్ర

కాళహస్తీశ్వర శతకం - 


Album No. - 10 Adi-Antham | The word Aadiyantha stands for '… | Flickr
 


భోగిమంటలు 'GAMANIMCHANDI"

         సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి.
భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగిమంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యాదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది.

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు. ఇలాంటి భోగిమంటల వల్ల వెచ్చదనం మాటేమోగానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం. మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగిమంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగిమంటలు వేసుకోవాలా! లేకపోతే నాలుగుకాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

--(())--

మధురిమల ..సంక్రాంతి
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సంక్రాంతి వచ్చింది
సంబరం తెచ్చింది
స్నేహన్ని  నిల్పింది
బిడ్డల్ని కల్పింది

కష్టాలు ఆపింది
ఇష్టాలు చూపింది
బంధువులు కలిపింది
కలసియె బతకమంది

తగు ఓర్పు నేర్పింది
ధైర్యాన్ని నేర్పింది
అడుగులు వేయమంది
ఆనందం ఇదంది

ప్రకృతి గాలి పంచింది
ధరణి పులకరించింది
అల్లుల్ల పండగైంది
కోడీ పందా లంది

గగన సుందర మైనది
పక్షుల కలకల మైంది
కొత్త బట్టల కధయిది
పాలు పొంగిచ్చ మంది

నమ్మకం బతుకంది
విశ్వాసం చూపేది
బతుకులకు కళైంది
కలల పండు గైనది

మనలోని మాధుర్య మిది
ప్రతి  హృదయ కదిలికే ఇది
మన మంచి సందేశ మిది
అంతట వెలుగు పంచేది

రంగుల ముగ్గులంది
సంక్రాంతి సొగసంది
కమ్మని పంటలంది
మధురిమ పండ గైంది

సుఖాలను పంచాలంది
సోమరిగా ను వద్దంది
కష్టాల్కి లొంగద్దంది
ఇష్టం ప్రేమ అవుతుంది

--(())--

పదకొండవ భాగం
                       జనమేజయుడు ఒక ప్రశ్న వేశారు ...
ఓ మహర్షి ! మా పూర్వీకుడైన శంతన మహారాజుకు ఆ గంగాదేవికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది వారి కలయిక ఎలా తటస్థించింది కాస్త వివరంగా చెప్పండి అని పలికాడు.
వైశంపాయనుడు ఇలా చెప్పాడు........
            పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే వాడు పుట్టి ఉత్తమ ధర్మ స్వభావు డై, 1000 అశ్వమేధ యాగాలను నూరు రాజసూయ యాగాలు చేసి ఇంద్రాది దేవతలను సంతృప్తి పరచి స్వర్గలోకానికి పోయి అక్కడ దేవతలతో కలసి బ్రహ్మ ను సేవిస్తూ ఉన్న సమయంలో గంగాదేవి దేవ వనీతా రూపం ధరించి .... బ్రహ్మ సభకు వచ్చేసింది.  ఇలా వస్తున్న తరుణంలో గంగాదేవి కట్టుకున్న చీర .....గాలికి చెదిరి... ఆమె తొడమొదలు వరకు తొలగింది.
 దానిని దేవతలందరూ చూడక సభా మర్యాదలు పాటిస్తూ తలలు ఉంచుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం ఆసక్తి తో దానిని చూచాడు . ఇది చూచి బ్రహ్మదేవుడు " మహా భిషా ! నీకు ఇంకా కామ సంబంధమైన కోరికలు తగ్గలేదు కనుక నీవు మళ్ళీ నరుడిగా జన్మించ  మని శపించాడు".
 మహాభిషుడు మిక్కిలి భయపడి " తాత ! నేను శ్రేష్టమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి వెయ్యి అశ్వమేధ యాగాలను నూరు రాజసూయ యాగాలు చేశాను కానీ ఉపయోగం ఏముంది ఇంద్రియాలను నిగ్రహించ లేకపోయాను....నా క్రియకు నేను సిగ్గు పడుతున్నాను... మీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను కానీ నాదొక చిన్న విన్నపం... రాజర్షి శ్రేష్ఠుడు అయినా ప్రదీపునికి కొడుకుగా జన్మిస్తాను మన్నించ వలసిందిగా ప్రార్థన " అని పలికాడు. అందులకు బ్రహ్మదేవుడు సమ్మతించాడు..
గంగ తనవల్ల ఒక పుణ్యాత్ముడు పతనం చెందాడని భావించి....అ మహాభిషుని ...గొప్పదనానికి అతని ధర్మనిష్ట కు, రూపలావణ్యా లకు ముచ్చటపడి తను కూడా అతని భార్య గా ఉండాలని తలపోసి భూలోకానికి బయలుదేరింది.....
ఇలా గంగాదేవి వస్తున్న తరుణంలో ఆమెకు ఎనిమిది మంది వసువులు చాలా దిగులుగా..
దుఃఖ వదనాలతో భూలోకానికి వెళుతుండటం గమనించినది...... అప్పుడు ఆ గంగాదేవి వారిని ఆప్యాయంగా పలకరించి నాయనలారా మీరు ఎందుకు అలా చింతిస్తున్నారు... మీ స్థానాలను వదిలి భూలోకానికి ఎందుకు వెడుతున్నారు ....కారణం ఏమిటని ప్రశ్నించింది
( Note '-  యమధర్మరాజు యొక్క 10 మంది భార్యలలో వసువు అనే ఆమెకు ఎనిమిది మంది తనయులు జన్మించారు వారిని అష్టవసువులు అంటారు వారు......
1. ఇపుడు...2. ధ్రువుడు....3. సోముడు...4. అధర్వుడు...
5. అనిలుడు...6. ప్రత్యుససుడు...7. అనలుడు.
.8. ప్రభాసుడు.....)
అందుకు ఆ అష్టవసువులు గంగా దేవికి నమస్కరించి మాత ! మా దురదృష్టం వల్ల వశిష్ట మహర్షి యొక్క కోపానికి గురి అయ్యాం ఆయన మమ్మల్ని మానవలోకంలో జన్మించమని శపించాడు అందుకు మేము ఆయనను శరణువేడితే  ఆ మహాత్ముడు మాకొక వీళు కల్పించాడు
"  మీరందరూ శంతనమహారాజు యొక్క కొడుకులై జన్మించండి. గంగాదేవి మీకు తల్లి అవుతుంది ఆమె తనకు పుట్టిన వారిని పుట్టినట్లుగా  మిమ్మల్ని గంగా లోపడేసి
... మీకు శాపం విమోచనం చేస్తుంది " అని శాపం తో పాటు వరం కూడా ఆ మహాముని మాకు అనుగ్రహించాడు కనుక నీవే మా కన్నతల్లివి  అని శిరస్సువంచి ఆ అష్టవసువులు ఆమెకు నమస్కరించారు.....
అందులకు గంగాదేవి " సరే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ దీర్ఘాయుష్మంతుడైన ఒక కొడుకును నేను కనాలని ఉన్నది . ఇది లోకకళ్యాణార్థం జరుగ వలసి ఉన్నది
 మీలో ఎవరు నాకు కొడుకు గా ఉంటున్నారు "  అని అడిగింది గంగాదేవి.
అందుకు వారు"  అమ్మ ! మాలో  చివరి వాడు అయినాప్రభాసుడు దీర్ఘాయుష్మంతుడు మీకు చిరకాలంగా కొడుగ్గా ఉంటాడు మా లోని నాలుగు అంశ అతనికి బలాన్ని , ఆయుష్షు ను చేకూరుస్తుంది "  అని నమస్కరించారు....
గంగా దేవి " సరే నాయనలారా మీరు సమయం  కొరకు వేచి ఉండండి నేను శంతన మహారాజుకు భార్య గా... కాబోతున్నాను"  అని చెప్పి ఆమె   బయల్దేరింది .
కురురాజు ప్రతీపుడు ఒకసారి గంగాతీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగా ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి "  ఏమి కావాలి " అని అడిగగానే గంగ ప్రతీపుడితో తనను వివాహం చేసుకొమ్మని కోరింది. అందులకు ప్రతీపుడు
" నన్ను క్షమించు నేను ఒకవేళ కామాన్ని ఆశ్రయించవలసి వస్తే నా అర్ధాంగి తో ఆ కామాన్ని పంచుకుంటాను అంతే తప్ప నేను కామ వశున్ని కాదు . ఇలా నేను     ప్రతిజ్ఞ చేసాను. అందువలన నీ  కోరికను అంగీకరించలేను., నీవు జ్ఞాన స్వరూపివి నీకు సకల ధర్మాలు తెలుసు. నా కుడి తొడపై కూర్చున్న నీవు నాకు కూతురు కానీ కోడలు కానీ అవుతావు ...నీ ఉద్దేశ్యం వేరు ఒకవేళ నీవు నా భార్యగా కావాలి అనుకుంటే ఎడమతొడపై కూర్చునేదానివి నన్ను పరీక్షించవద్దు నీకు నమస్కారము"  అని పలికాడు
 అందులకు గంగాదేవి "  మహాత్మా మీకు శుభము ...అయితే నా కోరికను మన్నించి  నీ కోడలిగా నాకు అర్హతను ఇవ్వగలరు " అని గంగాదేవి ఆ ప్రదీపుడి  తో పలికింది.
ప్రియమైన మిత్రులారా ధర్మ నిర్వహణ అనేది వెయ్యి అశ్వమేధయాగా కన్నా నూరు రాజసూయ యాగాల కన్నా చాలా గొప్పది అని ఈ కథ ద్వారా తెలుస్తోంది.
ఇలా మహాభారతంలో మనల్ని ప్రభావితం చేసే ఎన్నో గొప్ప అంశాలు ఉన్నాయి ఉంటాను మరి మిత్రులందరికీ శుభ శుభోదయం
--(())--



ప్రతి ఫలం

తండ్రీ కొడుకులు కలసి వ్యవసాయం చేసేవారు. అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు. అర్ద రాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే, బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు. తండ్రి పద్దతులు కొడుకు సూరికి నచ్చేవి కావు.
"ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడతావు? మనకు అవసరం  పడితే ఒక్కడూ ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడూ బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారికోసం పాటుబడటం శుద్ధ దండగ" అని కోపగించుకునేవాడు.

కొడుకు మాటలకు నొచ్చుకుంటూ "ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు." అని సర్ది చెప్పేవాడు.
ఓరోజు సూరి పొలం వెళ్ళే సరికి, ఎవరివో పశువులు తమ పొలం లో పడి మేస్తున్నాయి. పక్కపొలం  సుబ్బయ్య చూచీ చూడనట్టు వున్నాడు. వళ్ళు మండి తనే తరుము కున్నాడు . నాలుగు రోజుల తరువాత పంపు విరిగి సుబ్బయ్య పండిన చేలోకి నీరు పోసాగాయి.అది చూసిన తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు.

మొన్న జరిగింది చెప్పాడు. "ఎవడి పాపాన వాడు పోతాడు. కోత కొచ్చిన పంట తడిచిపోతే ,పాడయిపోతుంది చూస్తూ వుంటే వాడికి మనకు తేడా ఏముంది?" కోపంగా అన్నాడు. తండ్రి చెప్పినట్టే చేశాడు. ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి , ఇంటికి చేర్చాడు సూరి.ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు. ఎద్దుల గంగ డోలు నిమురుతూ"నాన్నా! ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే, రెండు చక్రాలు గుంటలో ఇరుక్కు పోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాడి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. తనకలాడు తున్నాయి. నేనొక్కడినే ఉన్నాను ఏం చేయాలో పాలుపోలేదు. అంతలో ఆ దారిన పోతున్న పెళ్ళి బృందం, గబగబా వచ్చి,ఎద్దులను పట్టుకుని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈ రోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి. "చూశావా!భగవంతుడు ఎంత సహాయం చేశాడో! నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువు ఎవరికి మంచి చేసినా, దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్ళి వారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతి ఫలం ఆశించక పదిమందికి సాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది."
ఇంతకాలం మొండిగా వాదించి నందుకు  తండ్రి ని మన్నించమని కోరాడు మన సూరి. జంజం కోదండ రామయ్య
--(()0--
ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా...

స్వామి వివేకానంద హిందూ యోగి:

స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
వివేకానంద
Swami Vivekananda-1893-09-signed.jpg
1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ , ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన , పవిత్రమైనది, ఆలోచనకి , నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను "[1]
జననం:నరేంద్రనాథ్ దత్తా 1863 జనవరి ౧౨ కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం
(ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) నిర్యాణము 1902 జులై 4 (వయసు 39)
బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)
జాతీయత: భారతీయడు స్థాపించిన సంస్ బేలూరు మఠం, రామకృష్ణ మఠం , రామకృష్ణ మిషన్
గురువు రామకృష్ణ తత్వం వేదాంత సాహిత్య రచనలు  రాజయోగ, కర్మయోగ, భక్తియోగ , జ్ఞానయోగ
ప్రముఖ శిష్యు(లు)డు: స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత,స్వామి సదానంద ప్రభావితులైన వారు: సుభాష్ చంద్ర బోస్, అరబిందో, భాగ జతిన్, మహాత్మా గాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి, జమ్సెట్జీ టాటా, నికోలా టెస్లా, సారా బెర్న్ హార్ట్ ,ఎమ్మా కాల్వె, జగదీశ్ చంద్ర బోస్ ఉల్లేఖన "లేండి, మేల్కొనండి , గమ్యం చేరేదాక ఆగవద్దు" (మరిన్ని పలుకులువికీఖోట్ లో చూడండి)

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఇతనుే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతను జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.

బాల్యం:

నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివెకనందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం,, ఔదార్య గుణాలు అలవడ్డాయి.

నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.
రామకృష్ణ పరమహంసతో పరిచయం:
 
(ఎడమ) వివేకానందుని గురువు రామకృష్ణ పరమహంస, (కుడి) వివేకానందుడు, కోసీపూర్ లో - 1886
రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు అతను దగ్గరకు వెళితే వారు అతనుకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతనును కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతను మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు అతనును చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో అతనును తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు అతనును ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. అతను ఆ పాటలు వినగానే అదోవిధమైన తాద్యాత్మత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, అతనుతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

అతను ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. అతనుకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, అతనుతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.

ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనుకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి అతనుకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం అతనును పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనుక…
స్వామి వివేకానంద. . ఈ పేరు వింటేనే నరనరాల్లో రక్తం వేడెక్కుతుంది. ఉత్సాహం తట్టి లేపుతుంది. ప్రపంచమంతా భారత దేశంవైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి.. ఓ శక్తి స్వామి వివేకానంద. ఆయన సూక్తులు విని, ఆచరించినవారు ఎంతటి బద్దకస్థులైనా జీవితంలో సక్సెస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. గొప్ప కుటుంబంలో పుట్టినా.. చిన్నప్పటినుంచే ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ చూపించారు. రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతను చదువుతూ ఏమైనా సందేహాలుంటే వెంటనే తన తల్లిని అడగి తెలుసుకునేవారు. చిన్న వయసులోనే ఏదైనా సాధించాలన్న తపనతో ఉండేవారు. తనకు మంచి గురువును ఎంచుకునే క్రమంలో ఒకరోజు ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుతారు.రామకృష్ణ పరమహంసను నీవు దేవుడిని చూశావా అని అడుగుతారు. అప్పుడు పరమహంస ఏ మాత్రం ఆలోచించకుండా చూశాను. నీవు నన్ను ఎంత దగ్గరగా చూస్తున్నావో.. అలాగే నేను దేవుడిని చూశాను అంటారు. ఆ ఒక్క మాటతో చలించిన స్వామి వివేకానంద .. రామకృష్ణ పరమహంసకు శిష్యుడు అవుతారు. తక్కువ కాలంలోనే రామకృష్ణ పరమహంస దగ్గర ఎన్నో కఠోర సాధనలు, ఆధ్యాత్మిక విషయాలు, తపస్సు నేర్చుకుని గురువుకు మించిన శిష్యుడు అయ్యారు.

ఆ తర్వాత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశ సంప్రదాయాలు, విలువలు, హిందూ ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోని పలుచోట్ల ఆధ్యాత్మిక సభల్లో పాల్గొని భారత దేశం గొప్పతనాన్ని ..సనాతన ధర్మాన్ని వెలుగెత్తి చాటారు. ముఖ్యంగా అమెరికాలో జరిగిన ప్రపంచ దేశాల మత సమ్మేళనంలో.. భారతదేశం తరుపున పాల్గొన్న స్వామీ వివేకానంద ప్రసంగం ఒక సంచలనమే సృష్టించింది. ఆయన ప్రసంగ విశిష్టత గురించి ప్రపంచ దేశాల పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి. అవన్నీ చూసిన అమెరికాలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త స్వామి వివేకానందను కలవాలి అనుకున్నారు. స్వామీజీ క్షణం తీరిక లేకుండా ఉన్నా కూడా తన పరపతిని అంతా ఉపయోగించి ఎలాగోలా అప్పాయింట్ మెంట్ సంపాదించుకున్నారు. అనుకున్న సమయానికి స్వామి వివేకానంద ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రవేశించారు. "స్వామి నేను క్షణం తీరిక లేని వ్యాపారిని. నేను తీవ్రమైన ఆధ్మాత్మిక జ్ఞాన పిపాసిని కూడా. కాకపోతే నాకున్న సమయం మాత్రం చాలా తక్కువ. అందువల్ల వేదాలు..ఉపనిషత్తులు చదవమని కానీ.. సాధువుల ప్రసంగాలు వినాలని కానీ..యోగా ధ్యానాలు చేయాలని దయచేసి నాకు చెప్పొద్దు. వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా ఒకటి రెండు మాటల్లోనే నాకు జ్ఞాన సిద్ధిని కలిగించే మోక్ష మార్గమేదైనా తెలిస్తే చెప్పండి. నిజంగా మీరు ఒకటి, రెండు మాటల్లో చెప్పాలనుకుంటే సరే అనండి. లేదంటే వెంటనే వెళ్లి పోతాను. ఎందుకంటే నాకు మీవద్ద ఎక్కువ గంటలు గడిపే సమయం లేదు" అంటారు.

ఆ వ్యాపారి మాటలు విన్న వివేకానంద.. హ..హ.. అంటూ నవ్వుతూ.. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు ఆశించినట్లే ఒకటి, రెండు మాటల్లోనే మీకు జ్ఞానం కలిగేలా చేస్తాను. మీరు వేదాలు, ఉపనిషత్తులు ఏవీ చదవద్దు. సాధువుల ప్రసంగాలు ఏవీ వినొద్దు. యోగా, ధ్యానాలేమీ చేయనే చేయొద్దు అన్నారు. ఆ మాటలు వినగానే వ్యాపారి మొఖంలో అంతులేని ఆనందం తొనికిసలాడింది. మరైతే నన్ను ఏంచేయమంటారు స్వామీజీ అన్నాడు వ్యాపారి ఎంతో ఉత్కంఠగా!. అప్పుడు వివేకానంద ఇలా అంటాడు.. చాలా సులువు రోజుకొకసారి మీ మరణాన్ని మీరు గుర్తు చేసుకోండి చాలు. నీకు జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది.. మీరు బయలుదేరవచ్చు అన్నాడు వివేకానంద!. ఆ మాటల్లోని అంతసారమేమిటో ఆ వ్యాపారికి చక్కగా అర్ధం అయిపోయింది. అతడి మనసు సంబ్రమాశ్చర్యాలతో నిండి పోయింది. ప్రతి రోజూ మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఏమిటి?. జీవితం ఎంతో చిన్నది అని తెలుసుకోవడమే!. ఇంత చిన్న జీవితంలో హీనమైన కార్యకలాపాలకు తావులేకుండా ఉన్నతమైన ఆలోచనలతో ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించాలన్న సంకల్పానికి రావడమే!. స్వామీజీ మాటల్లోని ఈ సత్యం ఆ వ్యాపారికి అర్థమైపోయింది. వెంటనే లేచి స్వామి వివేకానంద పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, నిండు ఆనందంతో వెళ్లిపోయాడు. ఇలాంటి సక్సెస్ స్టోరీలు స్వామీజీ జీవితంలో ఉన్నాయి.

ఎన్నో దేశాలు తిరిగిన స్వామీజీ అమెరికా పర్యటనను ముగించుకుని భారతదేశం ఎంతో గోప్పదని..స్వదేశంలో అడుగుపెట్టగానే భూమిని ముద్దాడుతూ నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన సూక్తులు యువతను మేల్కొలుపుతాయి. ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను" అన్న ఆధ్యాత్మిక యోగి స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ ప్రక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందేహంగా స్వామి వివేకానందుడిదే. ఆధునిక భారతదేశం ప్రపంచంలోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. కాషాయం వేషం కాదు..మన సంస్కృతి అని చాటి చెప్పిన గొప్ప సన్యాసి స్వామి వివేకానంద.

జనవరి 12, 1863లో జన్మించిన వివేకానంద..జూలై 4, 1902లో మరణించారు. నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, హాల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా.. వివేకానంద అడుగుజాడలో నడుస్తూ జీవితంలో సక్సెస్ అయినప్పుడే మనం ఆయనకిచ్చే ఘన నివాళి.
--(())--
 

           *వృద్ధాశ్రమాలెందుకు?*

 *టీ కప్పు హాండిల్ విరిగింది. దానిని ఏ బడ్స్ దాయటానికో, పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము !*

*దుప్పటి చిరిగిపోయింది ..దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం !*

*కుండ చిల్లిపడింది ! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం !*

*మరి సంపాదించే శక్తిఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం ?*

*కండరాల శక్తి వలననే ఉపయోగమా?*

 *వారి అనుభవాన్ని జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం?*

*పైగా వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం !*

*మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది*! 

*అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు,75 ఒకాయనకు! వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు!* 

*నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి అందరూ వృద్ధులే దాదాపుగా!*

*మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో!*

*ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది.*

*ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది.*

*ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి !*

*అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి!*

*వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!*

*వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది !*

*అసలు  వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి , సమాజానికి , కుటుంబాలకు ఉపయోగపడవద్దా* ? 

*అసలు వృద్ధాశ్రమాలెందుకు ?*

*ఆలోచించండి  !*

   *లోకా సమస్తా సుఖినోభవన్తు!

*చదివినవారికి ధన్యవాదాలు*

           *వృద్ధాశ్రమాలెందుకు?*

 *టీ కప్పు హాండిల్ విరిగింది. దానిని ఏ బడ్స్ దాయటానికో, పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము !*

*దుప్పటి చిరిగిపోయింది ..దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం !*

*కుండ చిల్లిపడింది ! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం !*

*మరి సంపాదించే శక్తిఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం ?*

*కండరాల శక్తి వలననే ఉపయోగమా?*

 *వారి అనుభవాన్ని జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం?*

*పైగా వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం !*

*మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది*! 

*అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు,75 ఒకాయనకు! వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు!* 

*నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి అందరూ వృద్ధులే దాదాపుగా!*

*మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో!*

*ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది.*

*ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది.*

*ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి !*

*అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి!*

*వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!*

*వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది !*

*అసలు  వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి , సమాజానికి , కుటుంబాలకు ఉపయోగపడవద్దా* ? 

*అసలు వృద్ధాశ్రమాలెందుకు ?*

*ఆలోచించండి  !*


                  

   *లోకా సమస్తా సుఖినోభవన్తు!

*చదివినవారికి ధన్యవాదాలు*

*💁‍♀️జనవరి 12 ..జాతీయ యువజన దినోత్సవం ..స్వామి వివేకానంద జయంతి ..*

*💲కెరటాలు నాకు ఆదర్శం. పడినందుకు కాదు.. పడి లేచినందుకు’ : స్వామి వివేకానంద...💲*

*🔰స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 — జూలై 4, 1902), (బెంగాలీలో ‘షామీ బిబేకానందో’) ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.*

♦️స్వామి వివేకానంద సూక్తులు🔽🔽

*1.రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.*

*2. నీ వెనుక ఏముంది…ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.*

*3. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.*

*4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.*

*5. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.*

*6. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.*

*7. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.*

*8. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!*

*9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.*

*10. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను.

నేను   :    బాబు కిలో ఎంత...?

అతను :  *"కిలో 80 సర్।"*

పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।

నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*

పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*

నేను అడిగా : "ఇంత తక్కువగాన..? 

పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!! 

కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*

అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*  మరియు *కుటుంబము* నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।

దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....

  ఈ జన్మకే....

ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...

ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...

ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...

ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...

ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు... 

ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!

మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !

కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!

పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,

ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న

బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.

అదే  నిలుపుకోవాలంటే  ?

తము గడిపిన  భయంకర  అవస్థలు తమ పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ  , ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే , తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు  వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ ,బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరుద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన అశాంతితోజీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .

ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?

దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?

జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు , అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం  అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి , ఇంటి లోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా , చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేనిశోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి

విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?

ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరుకొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా           ఈ  ఆస్థిపంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు. ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.

మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?

  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం . దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం . ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...

ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు. 

ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే

ఓం శ్రీ రాం.... శ్రీ మాత్రేనమః

*ఓ చిన్న కథ:*

*బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా*

*మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.*

*సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.*

*అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).*

*ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).*

*చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.*

*అందుకే:*

*మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.*

*ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.*

*ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ* *కాపలాదారుగా మారిపోయి*

*వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.*

*ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.*

*"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".*

*మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.*

( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

 

✍️.....నేటి చిట్టికథ


ఒక పెద్ద మామిడిచెట్టు మీద ఒక కాకి, ఒక కోకిల నివసిస్తూ ఉండేవి. 

చాలా కాలంగా మంచి స్నేహితులు అవి. 

కోకిల తన గుడ్లను కాకి గూట్లోనే పెట్టేది. ఒకవైపున కాకి వాటిని పొదుగుతుంటే, కోకిల మాత్రం ఆ చుట్టుప్రక్కల పాటలు పాడుకుంటూ తిరిగేది.

ఒకరోజున బాటసారి ఒకడు అటువైపుగా పోతూ  అలసి పోయి చెట్టు క్రిందే గడుపుదామని అనుకున్నాడు.

 ఆ సమయంలో కోకిల పాట పాడటం మొదలు పెట్టింది. ఆ పాట వింటూ చల్లగా హాయిగా నిద్రపోయాడు బాటసారి.

కాసేపటికి కాకి నిద్రలేచింది. 'కావ్!కావ్!' అని గట్టిగా పాట పాడటం మొదలుపెట్టింది. 

క్రింద నిద్ర పోతున్న బాటసారి ఆ పాట విని గబుక్కున నిద్రలేచాడు. కొంచెం చిరాకుగా లేచి నిలబడి , అటూ ఇటూ చూశాడు. తొందర తొందరగా నడచుకొని వెళ్లిపోయాడు.

'నీ పాట తో హాయిగా నిద్రపోయాడు, అందరూ నిన్నే మెచ్చుకొంటారు; నన్ను అసహ్యించుకొంటారు.. నేను నీ గుడ్లను పొదగను...అంటూ  కోపంగా  కాకి అరిచింది గట్టిగా.

"ఎందుకు అక్కా, అలా అరుస్తావు? ఆ బాటసారి వెళ్ళిపోయాడనే కదా, ..నేను వెళ్ళి ఆ బాటసారినే అడుగుతాను- అతను ఎందుకు చికాకు పడ్డాడో!" అని కోకిల బాటసారిని వెతుక్కుంటూ పోయింది.

దూరంగా నడుచుకొంటూ‌పోతున్నాడు బాటసారి. 

కోకిల ఎగురుకుంటూ అతని దగ్గరకు వెళ్ళి- "అయ్యా! కాకి పాట పాడితే మీరు అక్కడ నుండి వెళ్లిపోయారట, ఎందుకు? మీరు తనని అవమానించారని నొచ్చుకున్నది కాకి. అది ఇప్పుడు నన్ను, నా గుడ్లను అసహ్యించుకుంటున్నది" అన్నది.

"అయ్యో అలాగా! నేను మాట్లాడతాను ఆగు, కాకితో" అని బాటసారి వెనక్కి తిరిగి చెట్టు దగ్గరకెళ్ళాడు.

ముఖం ముడుచుకొని కూర్చున్న కాకితో అతను అన్నాడు- "కాకమ్మా! నన్ను క్షమించు. నిజం చెప్పాలంటే కోకిల గొంతు చాలా బాగా వుంటుంది, నీ గొంతు అంత బాగుండదు. అందుకే నేను నీ పాట వినబడగానే అక్కడి నుండి లేచి వచ్చేసాను.

అయినా మీరు ఇద్దరూ చాలా మంచి స్నేహితులని అందరూ అంటుంటే విన్నాను. అట్లాంటి మీరు గొడవ పెట్టుకున్నారా? 

నీ గొంతు బాగుండదు; కోయిల బాగా పాడుతుంది- అయితే మాత్రం ఏమిటట? కేవలం గొంతు బాగున్నంత మాత్రాన అది గొప్పదయిపోతుందా?

 దానికసలు పిల్లల్ని పొదగడమే తెలియదు గదా!? నువ్వే లేకపోతే దాని గతి ఏమికాను?

 ఎవరి గొప్పవారిది. దాని పాట విని నువ్వు ఆనందించాలి. తన పిల్లల్ని నువ్వు పొదుగుతున్నందుకు అది సంతోషించాలి!" అని.

బాటసారి మంచి మాటలకు కాకి ముఖం వికసించింది. 'అవును కదా, నేనేంటి ఇంత గొడవ చేశాను?' అనుకున్నదది. 

ఆనాటి నుండి కోకిల పాటలంటే కాకికి ఇష్టం; 

తన గుడ్లను చక్కగా పొదిగే కాకి అంటే కోకిలకు ఇష్టం!


🍁🍁🍁🍁🍁


పాపాన్నివారయతి యోజయతే హితాయ

గుహ్యం నిగూహతి గుణాన్ప్రకటీకరోతి ।

ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే

సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః ॥


నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో కవి ఈ పద్యంలో సూచిస్తున్నాడు. 

మనం పాపాలు చేసేటప్పుడు అతను నివారిస్తాడు; మంచిపనులు చేసే సమయంలో ప్రోత్సహిస్తాడు; రహస్యాలను దాచి ఉంచుతాడు; కానీ మనలోని సద్గుణాలను మాత్రం నలుగురిలో వెల్లడిస్తాడు; ఆపత్కాలంలో మిత్రుని వదిలిపోడు; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు.

🍁🍁🍁🍁

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

      *శ్రీ భాగవతం - 109 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 39*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట* 


దుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. 

అపుడు దుర్యోధనుడు,  అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. అపుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. 

ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. 

బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. 

బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. 

ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. “మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. 

బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. అపుడు బలరాముడు ‘నా తమ్ముడైన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది’ అన్నాడు. 

వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావయ్యా బాలరామా, కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది’ అని,  యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. 

బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేడు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి. 

ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు యింద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, 

ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, 

ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, 

ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయ పడుతుందో, నిరంతరమూ సేవిస్తోందో, 

ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణపరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’. అది పరమ యథార్థము. 

కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు యిన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురము కదిలింది. 

దుర్యోధనుడు ఏమి జరిగింది అని అడిగాడు. నీవు అనిన మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.

ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను యిచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. 

అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.

 *బలరాముడు తీర్థయాత్రకు జనుట* 

బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా, బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పొతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. 

ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి యితనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. 

అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బాలరామా, నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము “నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతునియందు దోషం లేదు. యిప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు. 

అపుడు బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి యిప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. 

అప్పుడు మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. యికపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు. 

నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు యింకా ఏదయినా అడగండి. చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

.......

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 60* 🕉


*ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే*

*లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి*

*త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో* 

*యున్నవారికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!*


 _*తాత్పర్యం:*_ 

🌹శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. 

🌹ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వతముగా

 సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా?

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼



No comments:

Post a Comment