మహాభారతం ఆదిపర్వం ప్రధమాశ్వాసం
_______________________________
ప్రియమైన మిత్రులందరికీ శుభ స్వాగతం మనం భారత కథలోనికి వెళ్లేముందు ఇద్దరి పూజనీయుల గూర్చి తెలుసుకోవాల్సి ఉంది ఒకరు శౌనకుడు మరియొకరు పురాణ వక్త అయినటువంటి సూతుడు. వీరిద్దరి ద్వారానే మహాభారత్ అది సమస్త పురాణాలు వెలుగులోకి వచ్చాయి
ముందుగా శౌనక మహర్షి గురించి తెలుసుకుందాం ఈయన శునక మహర్షి కుమారుడు.
ఈ శునక మహర్షి రురుని (ప్రమతి)కుమారుడు. ఈ ప్రమతి చ్యవన మహర్షి కుమారుడు
చ్యవన మహర్షి భృగు మహర్షి సంతతికి చెందినవాడు.
చ్యవన మహర్షి వృత్తాంతం మహాబారతం లోనే గాక దేవీ భాగవతం, అష్టాదశ పురాణములో చెప్పబడింది. చ్యవన మహర్షి సూర్య కుమారులైన అశ్వనీదేవతలకు యజ్ఞాలలో హవిస్సులు సోమరసాన్ని ఇప్పించాడు. ఈతని భార్య సుకన్య. మామ గారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతి. వీరి కుమారులు ప్రమతి, దధీచి, ఆప్రవానుడు.
శర్యాతి వన నిహారం - చ్యవన మహర్షి చూపు పోవడం
శర్యాతికి ఒక కుమారుడు, కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా చేరు కొంటాడు. ఆ సరొవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశు పక్ష్యాదులు ఉండేవి. ఆక్కడే ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకొంటుండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలి చీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టు చేరడం వలన చ్యవన మహర్షి ఒక మట్టి ముద్ద వలే కనిపించేవాడు. శర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారం జరుపుతూ చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చ్యవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగు వలే సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలే ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన చ్యవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకొంటున్నానని తనని పుల్లతొ పొడవద్దని వారిస్తాడు. కాని ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతొ చ్యవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది, చ్యవనుడి కంటి చూపు పోతుంది. కంటి చూపు పోవడంతో చ్యవన మహర్షి కోపించి, శర్యాతి సైనికులకు, మంత్రులకు, శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు. మలమూత్రాలు బంది అవడంతో తాను చింతుడై ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెబుతుంది. అప్పుడు విషయం గ్రహినంచిన శర్యాతి సకల పరివారంతో అడవి వెళ్లి మహర్షి కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్య అని తనకిచ్చి వివాహం జరపమంటాడు. దానికి శర్యాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచార నివృత్తి చ్యవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారా నే తీరుతుందని తండ్రితో తన వివాహం చ్యవన మహర్షితో జరపమని చెబుతుంది. వివాహం జరిగాక చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుతుంది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటుంటుంది.
ఇంకా ఉంది .... ... 2
[
సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తధ్యం.నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.
🕉🌞🌎🌙🌟🚩
Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.
భారతదేశ జాతీయ ఆదర్శాలు త్యాగం, సేవ, దేశాన్ని వీటి ఒరవడిలో మరింత తీవ్రంగా ముందుకు సాగనివ్వండి. మిగిలినవన్నీ వాటికవే సర్దుకుంటాయి.
****
విశుద్ది చక్రము (throat centre) నిర్మాణమంతా అంగీరస మహర్షి అనుగ్రహము మీద ఆధారపడినది. ఆ చక్రము పద్మము అవ్వాలంటే సుశబ్దములు మాత్రమే పలకాలి. అపశబ్దములు, అబద్ధములు, మాటను మడతలు పెట్టుట మొదలగునవి చేయకూడదు. వాక్కు అన్నది మానవుని కొక్కనికే ఉన్నది. ఆ వాక్కుని చాలా తక్కువగా లౌకిక విషయముల యందు వాడుతూ, మిగిలినదంతా నామస్మరణ యందు వినియోగించాలి.
అలా చేస్తూ ఉంటే కంఠం నుండి తరంగములు బయలు దేరి చాలా శుద్ధిని కలిగిస్తాయి. కనుకనే ఒకరి మంచి వాక్కు వలన మఱియొకనికి శ్రద్ద కలుగును. సద్గురువు వాక్కు వలన శిష్యునికి శ్రద్ధ కలుగును. అంగీరసుని అనుగ్రహము ఉంటే మన మాట అందరూ వింటారు.
🕉🌞🌎🌙🌟🚩
[14:49, 02/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం - (759)
🕉🌞🌎🌙🌟🚩
"నిరంతరం ఏదోక అనుభవంతో కొనసాగే మనసు, ధ్యానంలో ఏవిధంగా ఉంటుంది !?"
మనసు శాంతిని పొందటం కోసం ధ్యానం చేస్తాం. నిజానికి ధ్యానం అంటే చేస్తున్న పనిలో ప్రజ్ఞ (ఎరుక) లీనమైపోవడం. ప్రజ్ఞ పనిగా ఉంటే దాన్ని ధ్యానం అంటాం. ప్రజ్ఞ తాను ఫలానా పనిచేస్తున్నానని గుర్తుపట్టేస్థితిలో ఉంటే అది అధ్యానం అవుతుంది. మన మనసు నిరంతరం ఏదోక అనుభవంగా ఉంటుంది. అనుభవం అంటే ప్రజ్ఞ దేనిగా అయితే మారిపోయిందో అదే అనుభవంగా ఉంటుంది. ఐస్క్రీమ్ తింటున్న పిల్లాడి మనసు అప్పటికే ఐస్క్రీమ్ గానే ఉంది. అదే అనుభవం. నిరంతరాయంగా ఏదో ఒక అనుభవంతో ఉండే మనసులో ఏ అనుభవం నిలిచిఉండదని, అనుభవం ద్వారా మనం సంపాదించుకునేది ఏదీలేదని తెలిస్తే నిజమైన ధ్యానస్థితి ఏమిటో బోధపడుతుంది. ఇప్పుడు ఏర్పడుతున్న అధ్యానం, అశాంతి పరిమితికి మించి ప్రాపంచిక విషయాలకు విలువనివ్వడంవల్లనే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
[14:49, 02/01/2021] +91 92915 82862: "ఋభుగీత" (226)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
ప్రవర్తన మారకపోతే నిజమైన ప్రయోజనం అందదు !
అశాంతికి కారణం సమాజ పోకడ. సమాజం అంటే వ్యక్తుల ప్రవర్తన. శాంతి కావాలంటే ప్రవర్తన మారాలి. అది మన నుండే మొదలవ్వాలి. భక్తి, పూజలు, పుణ్యకార్యాలు మనం భౌతికంగా బాగుంటానికి మాత్రమేకాదు, మానసికంగా బాగుపడటానికి కూడా. దేవుళ్ళు, గురువుల చుట్టూ తిరిగితే తనకు కలిసి వస్తుందనుకున్నంత కాలం గురువు, దైవంల నుండి రావాల్సింది రాదు. ధనం, సుఖం, కీర్తి, హోదా వంటి బయటదొరికే ప్రయోజనాలు, లాభాలకోసం గురువులను ఆశ్రయించడం అల్పత్వం అవుతుంది. తనపబ్బం గడుపుకోడానికి ఒక గుర్తింపుకోసం కోతిని వెంటేసుకొని ఆడించినట్లే మనిషి దైవాన్ని, మతాన్ని, గురువును మెడలో వేసుకున్నంతకాలం వాటి నిజమైన ప్రయోజనం అందదు !
🕉🌞🌎🌙🌟🚩
[15:08, 02/01/2021] +91 92915 82862: ఓం నమో భగవతే శ్రీ రమణాయ
🕉🌞🌎🌙🌟🚩
భక్తుడు:- మోక్షము పొందుటకు గృహస్థు ఏమి చేయాలి ?
మహర్షి:- నీవు గృహస్థుడవు అని అనుకోవడం ఎందుకు! సన్యాసి కూడా 'నేను సన్యాసిని' అనే ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది. ఇంటిలో ఉన్నా లేక అడవికి వెళ్లినా మనసు నీ వెంటే వస్తుంది.
ఆలోచనల అన్నిటికీ మూలం కారణం అహంభావన. అదే నీ శరీరాన్ని, విశ్వాన్ని కల్పించి నీవు గృహస్థుడవు అనే భావన కలిగిస్తుంది. ఎప్పుడైతే నీ మనసులో సంసారం అనే భావన వదలుతావో, అప్పుడే నీ మనసు గృహస్థు స్థానంలో సన్యాసిని , ఇంటి స్థానంలో అరణ్యాన్ని నిలుపుతుంది.
కానీ మాససికంగా ఆటంకాలు మిగిలే ఉంటాయి. స్థలం మార్పు వలన అవి ఎక్కువ తక్కువలు కావచ్చు. అసలు ఆటంకం మనసే. ఇంట్లోనైనా, అడవిలోనైనా మనసును జయించుట ముఖ్యం. మనసును జయించడం అడవిలో వీలైతే, ఇంట్లో ఎందుకు వీలుకాదు! పరిసరాలు ఎలా ఉన్నాసరే, ప్రయత్నం మానకూడదు కదా!
పరిసరాలు నీవు కోరినట్లు మారవు. నన్ను చూడు; నేను ఇల్లు వదిలి వచ్చాను; ఇక్కడ కూడా పెద్ద సంసారం (ఆశ్రమం ) నడవడం లేదా!
సంవత్సరాల తరబడి నిర్వికల్ప సమాధిలో ఉన్నా, దానిని వదలి బయటకు రాగానే, వారికి విధించి ఉన్న పరిసరాలను ఎవరూ తప్పించుకోలేరు.
కాబట్టి పరిసరాలు ఎలా ఉన్నాసరే, నీ సహజ స్థితిలో నిలకడ చెందడం మంచిది.
ఓం తత్సత్ ఓం
1] +91 92915 82862: 17-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
వరాళి - ఆది.
పల్లవి:-
అంతా రామమయంబీ జగమంతా రామమయం!! అం !!
చరణము(లు):-
అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ!! అం!!
సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు!! అం!!
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ !! అం!!
నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు!! అం!!
అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము!! అం!!
ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము!! అం !!
🕉🌞🌏🌙🌟🚩
[15:21, 02/01/2021] +91 92915 82862: 18-40-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ || సత్త్వాది త్రిగుణములతో గూడియుండని వస్తువు ఈ ముల్లోకములందును ఏదియులేదని వచించుచున్నారు -
న తదస్తి పృథివ్యాం వా
దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః ||
తా:- ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు వీభూలోకమునగాని, స్వర్గమందుగాని, దేవతలయందుగాని ఎచటనులేదు.
వ్యాఖ్య:- ముల్లోకములందలి ప్రతివస్తువున్ను సత్త్వరజస్తమస్సులను ఈ మూడు గుణములతో గూడియుండుననియు, ఆ గుణములతో గూడియుండని వస్తువు (జీవన్ముక్తుడు తప్ప) ఏదియు ఈ ప్రపంచమున లేదనియు చెప్పుచున్నారు. జీవన్ముక్తులగు మహనీయులు తప్ప తక్కినవారందఱు ఏదియో యొక గుణముతో కాని, గుణములతో గాని గూడియున్నవారే. స్వర్గలోకములో నున్నవారున్ను త్రిగుణములతో గూడినవారేయనియు, వానినుండి విడుదలపొందినవారు కాదనియు ఈ శ్లోకమున భగవానుడు చెప్పిరి. కాబట్టి వారున్ను బంధముననున్నవారే. వారున్ను ఎప్పటికైనను జ్ఞానాదులను బడసి గుణరహితులు, ముక్తులు కావలసియున్నారు.
“ప్రకృతిజైః” - అని చెప్పినందువలన ఈ మూడు గుణములకు ఉత్పత్తిస్థానము ప్రకృతి, లేక మాయ (అజ్ఞానము) అని స్పష్టమగుచున్నది. ఈ మూడు గుణములలో ఏది యున్నను వారింకను ప్రకృతితో గూడియున్నవారేయని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయముచేతను, అభ్యాసప్రాబల్యముచేతను దాటి సత్త్వగుణముయొద్దకు వచ్చి, క్రమముగ గుణాతీత ఆత్మస్థితిని బడయవలెను. అదియే మోక్షము.
ప్ర:- సత్త్వాది త్రిగుణములు దేనినుండి పుట్టినవి?
ఉ :- ప్రకృతినుండి (మాయనుండి, అజ్ఞానమునుండి).
ప్ర:- ఈ గుణములతో గూడని వస్తువేదైన ఈ ప్రపంచమున గలదా?
ఉ:- లేదు (జీవన్ముక్తుడు తప్ప).
ప్ర:- ఇట్టిస్థితి ఈ లోకమందేనా? లేక తదితర లోకములందుగూడనా?
ఉ:- స్వర్గాది ఇతర లోకములందును, దేవతలందును ఇదియే పరిస్థితి.
🕉🌞🌎🌙🌟🚩
[
భావం
ॐॐॐॐॐॐॐ
గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు - వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు .... తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క, స్తనములపై తన శరీరమును ఆనుకొని పరుండి, విశాలమైన కన్నులుగల ఓ నీలాదేవీ ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ? ఇంతమాత్రపు ఎడబాటుకూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు.
గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా?
లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింప కున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.
అవతారిక
ॐॐॐॐॐॐॐॐ
గోపికలు క్రిందటి పాశురములో నీలాదేవిని మేలుకొలిపి, ఈ పాశురమున శ్రీకృష్ణుని, నీలాదేవిని కూడా మేలుకొన వలసిందిగా అర్థించుచున్నారు. పరమాత్మని ఆశ్రయించునపుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలెను. ఆశ్రయించిన తరవాత లక్ష్మి - నారాయుణులను ఇద్దరినీ సమానంగా సేవించవలెను. అందుకే గోపికలు ముందు నీలాదేవిని ఒక్కరినే మేలుకొలిపి, ఈ పాశురమున లక్ష్మినారాయణులను మేలుకొలుపుచున్నారు.
తనని గోపికలు
అర్థించిరికదా అని .....నీలాదేవి తలుపులు తెరవబోయింది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపించును. కనుక తనే వచ్చి తలుపు తెరవవలెనని నీలాదేవిని వెనుకకు లాగి, మంచముపై పడవైచి, ఆమెపై తాను అదిమిపట్టి పరుండి యుండి, ఆమె స్పర్శ సుఖముచే ఒడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను. స్వామిని మేలుకొలిపి, తలుపులు తెరవవలసిందిగా నీలాదేవిని అర్థిస్తున్నారు. అంత ఆ ఆర్తనాదము విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచుండగా --- తలుపులు తెరచుటకు వీలులేదని నీలాదేవి తనకళ్ళతో ప్రతిబంధించినది. అది చూచి గోపికలు "అమ్మా ! ఇది న్యాయము కాదు" అని నీలాదేవిని అర్థించిరి.
స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయక యుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడక యుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.
కాపిరాగము - ఆదితాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ప.. తగదిది నీకిది తరుణిరొ వినవే!
జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!
అ..ప. తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు
మగని విశ్లేషమును సహింపజాలవె!
దీప కాంతులెల్లెడళ విరియగా
ఆ పంచగుణముల పడకను శయనించి
సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత
శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!
ఓ పద్మాక్షీ! విభుని లేపవే!
మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.
"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా! లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.
నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాపాడుతున్నారు.
"కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.
గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచం లో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల "నప్పిన్నై" ఆ అందగత్తే "కొంగైమేల్" వక్షస్తలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న *"మలర్ మార్బా!" వక్షస్తలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.
అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమే కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు.
"మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నివ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచం కఠినంగా పిలిచారు.
తిరుప్పావై 19వ పాశురము / తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీ . పలుకైన పలుకవా బదులు మాటలు నీవు
నవ మోహనాకార నళిన నేత్ర
పవళించెదవు నీవు పలుకవు రవ్వంత
తలగడగా నీవు కలికి నుంచి
పంచ తల్పము పైన పాన్పు గా పవళించ
దంతపు కోళ్ళతో తళుకుమనగ
కర్పూర దీపాల కాంతుల యందున
కురులయందున చేరే విరుల తావి
ఆ.వె.ఘడియ కాలమైన యెడబాటు లేకుండా
నిద్ర యందు నుండు నీరజాక్షి
పొగయు కాటుకలును సొగసుతో నిండగా
సుగుణవతికి తగదు శోభనాంగి
శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మనసున స్థిరముకమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[18:14, 02/01/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -113 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముఖ్య సూత్రములు - 1 🍀
1. ఇది కావలెను, యిది వద్దు అను భావము లేక జీవితమును గడుపుట సన్న్యాసము.
2. సన్న్యాస పూర్వకమగు కర్మానుష్ఠానము సన్న్యాస యోగము.
3. మననము ద్వారా బ్రహ్మముతో యోగము చెందియుండుట వలన క్రమముగ బ్రహ్మము అనుగ్రహించును.
4. సర్వభూతాత్మల యందలి అంతరాత్మగ బ్రహ్మమును దర్శించుచు జీవించువానికి కర్మబంధమంటదు. అతడు విశుద్ధుడు, జితేంద్రియుడు.
5. బ్రహ్మముతో యోగమును స్మరణ మాత్రమున పొందియున్న యోగి యింద్రియములతో గాని, మనసుతో గాని కర్తవ్యములను యాంత్రికముగ నిర్వర్తించుచు నుండును.
6. బ్రహ్మ స్మరణమున నున్న యోగి దినచర్య యంతయు స్వప్నముగ సాగును. కార్యము లన్నియు నీటి బిందువులవలె పడి జారిపోగా, తాను తామరాకువలె నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:14, 02/01/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 313 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 3 🌻
హే శంభో !నా కుడి భాగములు మరల మరల అదరుచున్నవి. ఈనాడు విజయము నిశ్చితము. హే ప్రభో !కావున నన్ను పంపించుము (41). హే శంభో !నాకు వర్ణింపశక్యము గాని ఆనందము, ఉత్సాహము కలుగుచున్నవి. నా మనస్సు నీ పాదపద్మముల యందు లగ్నమై యున్నది (42).
నాకు ప్రతి అడుగునందు శుభములు ప్రవాహము వలె ఒకదాని తరువాత మరియొకటి లభించగలవు. మంగళములకు నిధానమగు శంభుని (నీ) యందు ఎవనికి దృఢమగు భక్తి ఉండునో, వానికి ప్రతి దినము విజయము, ప్రతి దినము శుభము కలుగుట నిశ్చయము (43).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఉమాపతి యగు శివుడు వీరభద్రుని ఈ పలుకులను విని సంతసించి, 'వీరభద్రా !నీకు జయమగుగాక!' అని ఆశీర్వదించి, మరల ఆతనితో నిట్లనెను (44).
మహేశ్వరుడిట్లు పలికెను -
వత్సా!వీరభద్రా! నా మాటను మనస్సు లగ్నము చేసి వినుము. నేను చెప్పబోవు కార్యమును ప్రయత్న పూర్వకముగా శీఘ్రమే చేసి, నాకు ఆనందమును కలిగించుము (45). బ్రహ్మకు పుత్రుడు, దుష్టుడు, విశేషించి నన్ను ద్వేషించువాడు, మహా గర్వితుడు, మూర్ఖుడునగు దక్షుడు ఈనాడు యజ్ఞమును చేయుటకు నడుము కట్టినాడు (46).
ఆ యజ్ఞమును, దాని పరికరములతో సహా భస్మము చేయుము. ఓ గణశ్రేష్ఠా! అట్లు చేసి వెంటనే నా వద్దకు మరలిరమ్ము. దేవతలను, గంధర్వులను, యక్షులను, ఇంకనూ అచటనున్నవారిని వెనువెంటనే ఈనాడే భస్మము చేయుము (48).
అచట విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు కూడ ఉండవచ్చును (49). వారిని ఈనాడే ప్రయత్న పూర్వకముగా ఎవ్వరినీ విడువకుండగా పడగొట్టుము. దధీచి నా విషయములో చేసిన శపథమును ఉల్లంఘించి, ఎవరైతే (50) అక్కడ ఉన్నారో, వారిని ప్రయత్న పూర్వకముగా భస్మము చేయుము. సందేహించకుము. నీతో బాటు ప్రమథగణములు కూడ రాగలవు. విష్ణువు మొదలగు వారు భ్రమచే అక్కడనే ఉన్నారు (51).
వారిని వెంటనే నానాకర్షణ మంత్రముతో ఒక చోటకు జేర్చి భస్మము చేయుము. వారు నాకు సంబంధించిన శపథమును ఉల్లంఘించి అక్కడనే గర్వించియున్నారు (52). వారు నాకు ద్రోహము చేసిన వారే. కావున వారిని అగ్ని జ్వాలలతో దహించుము.
దక్షుని యజ్ఞమున జరిగే స్థలములో నున్న వారిని, వారి భార్యలను, వారి యజ్ఞోపకరణులతో సహా అగ్ని జ్వాలలో భస్మము చేసి, శీఘ్రమే మరలి రమ్ము (53).. నీవు అచటికి వెళ్లగానే విశ్వేదేవతలు మొదలగు వారు నిన్ను ఆదరముతో (54) స్తోత్రములను చేసెదరు. అయిననూ వారికి అగ్నికీలలలో భస్మము చేయుము. ద్రోహము చేసిన ఆ దేవతలను కూడా అగ్ని జ్వాలలతో చుట్టు ముట్టి (55), శీఘ్రముగా భస్మము చేయుము. హే వీర !దక్షుడు మొదలగు వారినందరినీ, వారి భార్యలను, బంధువులను కూడ అవలీలగా భస్మము చేసి నీటిని త్రాగుము. యజ్ఞములోని వేదవిధులను పరిరక్షించు బ్రహ్మ అనబడే ఋత్విక్కునైననూ లెక్క చేయ కుండగా సంహరించుము (56).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వేద మర్యాదను రక్షించువాడు, మృత్యువునకు మృత్యువు, సర్వేశ్వరుడునగు శివుడు క్రోధముతో ఎరుపెక్కిన కన్నులు గలవాడై మహావీరుడగు వీర భద్రునితో నిట్లు పలికి విరమించెను (57,58).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవది యగు సతీఖండలో వీర భద్రోత్పత్తి వర్ణ నమనే ముప్పది రెండవ అధ్యాయము
-
06. సుజ్ఞానమనేది ఉంది. అంటే సమ్యక్జ్ఞానమన్నమాట. అది కలిగితేకాని సత్కర్మ అనేది జరుగదు. ఏదిమంచో ఏది చేడో తెలుసుకోవడానికి వివేకం ఉండాలి. సుజ్ఞానం కలగాలి.
07. ఆ తరువాతే మనుష్యుడు సత్కర్మ చేస్తాడు. సత్కర్మ వలన విజ్ఞానం క
లుగుతుంది. సత్కర్మ, విజ్ఞానం ఒకదానికొకటి సాధనాలు. సుజ్ఞానం ఉంటేనే వీజ్ఞానం కలుగుతుంది. ఇవి రెండూ పరస్పర ఆధారాలు. ఈ రెండింటికీ ముందర, సదసద్వివేకసంపత్తి-మంచిచెడులవివేకం-ఎంతో అవసరం. సత్కర్మలు అనేవి నాలుగువిధాలుగా ఉంటాయి.
08. కులధర్మం, బ్రహ్మోపాసన ఈ రెండూ ప్రతివాడూ ఆచరించాలి. నీ కులమేదయినాసరే కులధర్మం ఆచరించు. బ్రహ్మోపాసన చెయ్యి. ఈ రెండూకూడా సాధ్యమే! ఇలా చేసినప్పుడు వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మవస్తువు అంటే ఏమిటనుకున్నావు? సాక్షాత్తూ మహావిష్ణువే. యజ్ఞాది వైదికకర్మలచేత విష్ణుప్రీతి కలుగుతుంది. ఆయన సమస్థఫలాలూ ఇస్తాడు.
09. ఎవరయినా తనకు దోషంలేనంతమాత్రాన ఒక నిషద్ధకార్యాన్ని ఆచరించకూడదు. అన్నిపనులూ చెయ్యకూడదు. తననుచూచి నేర్చుకుంటారు అనే ఆలోచన ఉండాలి. సంఘంకోసం తను నియమబద్ధుడై ఉండాలి.
10. భగవంతుడి అనుగ్రహం ఉంటే సృష్టిలో చేయలేనిపని ఏదీలేదు. అటువంటివాళ్ళను ఎవరూ ఏమీచేయలేరు. ఆపత్కాలంలో శరణుఅనటం సహజంగా భక్తుడికి ఉంటుంది. ఆపద అతి తీవ్రమైనటువంటిదై, ఏ మనిషి ప్రయత్నంచేతనూ అందులోంచి బయటపడెటటువంటి స్థితి లేనప్పుడు-అటువంటిస్థితిలో శరణగతి ఏర్పడుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[18:14, 02/01/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 137 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 16 🌻
556. ఆత్మ, పరిణామ దశలలోనికి దిగుటతో అయదార్థపు మాయ ప్రారంభమైనది. విజ్ఞాన భూమికలో ప్రవేశించుటతో యదార్థపు మాయ అంత మగుచున్నది.
557. ఆధి భౌతికమును భగవంతుడే, ఆధ్యాత్మికమును భగవంతుడే. ఈ రెంటికీ అతిశయుడును భగవంతుడే.
558. భగవంతుని చైతన్య రాహిత్య స్థితిలో నున్న భగవంతుడు, స్వీయమైన అనంతలీల ద్వారా, తన స్వీయ సత్యము యొక్క చైతన్యమును పొంది, తన అనంత స్వభావత్రయమును స్థితిలో అనుభవించెను.
559. చైతన్య ప్రవృత్తి:- అనంత సనుత్యాభూతి పొందుటకు నూతన చైతన్యము లేదు. పరాత్పరస్థితిలో అంతర్నిహితమైయున్న చైతన్యమే, పెల్లుబికి క్రమక్రమముగా పరిణామము చెందుచు, పూర్ణమైన సృష్టితో సంగమించి సృష్టి యొక్క అనుభవము నిచ్చినది.
ఈ పూర్ణ చైతన్యమే అంతర్ముఖమై అనంత సత్యమును ఏకైక సత్యముగా తన నిజమైన స్వీయమైన శాశ్వత అనంత స్థితి యొక్క అనుభవమును కలుగజేసెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:14, 02/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 101 / Sri Vishnu Sahasra Namavali - 101 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం
🍀 101. అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః|| 101 ‖ 🍀
🍀 941) అనాది: -
ఆదిలేనివాడు.
🍀 942) భూర్భువ: -
సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
🍀 943) లక్ష్మీ: -
లక్ష్మీ స్వరూపుడు.
🍀 944) సువీర: -
అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
🍀 945) రుచిరాంగద: -
మంగళమైన బాహువులు గలవాడు.
🍀 946) జనన: -
సర్వ ప్రాణులను సృజించినవాడు.
🍀 947) జన జన్మాది: -
జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
🍀 948) భీమ: -
అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
🍀 949) భీమ పరాక్రమ: -
విరోధులకు భయంకరమై గోచరించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 101 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Uttara Bhadra 1st Padam
🌻 101. anādirbhūrbhuvō lakṣmīssuvīrō rucirāṅgadaḥ |
jananō janajanmādirbhīmō bhīmaparākramaḥ || 101 || 🌻
🌻 941. Anādiḥ:
One who has no beginning because He is the ultimate cause of all.
🌻 942. Bhūrbhuvaḥ:
'Bhu' means support. One who is the support (Bhu) of even the earth, which is known to support all things.
🌻 943. Lakṣmiḥ:
He who is the bestower of all that is auspicious to the earth besides being its supporter.
🌻 944. Suvīraḥ:
One who has many brilliant ways of manifestation.
🌻 945. Ruchirāṅgadaḥ:
One who has very attractive armlets.
🌻 946. Jananaḥ:
One who gives brith to living beings.
🌻 947. Jana-janmādiḥ:
One who is the root cause of the origin of Jivas that come to have embodiment.
🌻 948. Bhimaḥ:
One who is the cause of fear.
🌻 949. Bhima-parākramaḥ:
One whose power and courage in His incarnations were a cause of fear for the Asuras.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
[20:35, 02/01/2021] +91 95058 13235: 2.1.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది మూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.10 (పదియవ శ్లోకము)
దేశః కాలః పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోఽగ్నయః|
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః॥9198॥
23.11 (పదకొండవ శ్లోకము)
తం బ్రహ్మ పరమం సాక్షాద్భగవంతమధోక్షజమ్|
మనుష్యదృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో న మేనిరే॥9199॥
23.12 (పండ్రెండవ శ్లోకము)
న తే యదోమితి ప్రోచుర్న నేతి చ పరంతప|
గోపా నిరాశాః ప్రత్యేత్య తథోచుః కృష్ణరామయోః॥9200॥
యథార్థముగా శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు. దేశము! కాలము, వివిధ ద్రవ్యములు (సంపదలు) మంత్రతంత్రములు, ఋత్విజులు, అగ్నులు, దేవతలు, యజమాని, క్రతువు, ధర్మము మొదలగునవి అన్నియును ఆ మహాత్ముని స్వరూపములే. ఇంద్రియాతీతుడు, పరబ్రహ్మ స్వరూపుడు (షడ్గుణైశ్వర్య సంపన్నుడు) ఐన శ్రీకృష్ణభగవానుడే ఆ గోపాలుర ద్వారా అన్నమును అభ్యర్థించెనని ఎఱుంగక, దేహాత్మ బుద్ధిగల ఆ మూర్ఖులు ఆ ప్రభువును సామాన్యమానవునిగా భావించిరి. అందువలన వారు 'ఔననిగాని, కాదనిగాని' పలుకక మిన్నకుండిరి. పరీక్షిన్మహారాజా! అంతట ఆ గోపాలురు నిరాశతో మఱలివచ్చి, బలరామకృష్ణులకు వాస్తవ విషయములను వివరించిరి.
23.13 (పదమూడవ శ్లోకము)
తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వరః|
వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిమ్॥9201॥
జగదీశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు వారి మాటలు విని లోకవ్యవహారరీతిని తెలియజేయుచూ బిగ్గరగా నవ్వెను. పిమ్మట ఆ స్వామి వారితో ఇట్లు చెప్పెను-
23.14 (పదునాలుగవ శ్లోకము)
మాం జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణమాగతమ్|
దాస్యంతి కామమన్నం వః స్నిగ్ధా మయ్యుషితా ధియా॥9202॥
"మిత్రులారా! ఈసారి మీరు ఆ విప్రులపత్నులకడకు వెళ్ళి, 'శ్రీకృష్ణుడు, బలరాముడు వచ్చియున్నారు' అని తెల్పుడు. వారు నాయందు మిగుల భక్తిశ్రద్ధలు గలవారు. వారి దేహములు ఇండ్లలో ఉన్నను మనోబుద్ధులు మాత్రము సర్వదా నా యందే లగ్నమై యుండును. కావున మీరు అడిగిన వెంటనే వారు మీకు సమృద్ధిగా భోజనపదార్థములను ఇయ్యగలరు".
23.15 (పదిహేనవ శ్లోకము)
గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వాఽఽసీనాః స్వలంకృతాః|
నత్వా ద్విజసతీర్గోపాః ప్రశ్రితా ఇదమబ్రువన్॥9203॥
పిమ్మట గోపాలురు విప్రపత్నులున్న స్థలములకు వెళ్ళిరి. అప్పుడు ఆ ఇల్లాండ్రు గృహిణీ ధర్మమునకు అనుగుణముగా వస్త్రాభరణములను ధరించి, సుఖాసీనలై యుండిరి. పిదప గోపాలురు ఆ సాధ్వీమణులకు నమస్కరించి, సవినయముగా వారితో ఇట్లనిరి.
23.16 (పదహారవ శ్లోకము)
నమో వో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసి నః|
ఇతోఽవిదూరే చరతా కృష్ణేనేహేషితా వయమ్॥9204॥
23.17 (పదిహేడవ శ్లోకము)
గాశ్చారయన్ స గోపాలైః సరామో దూరమాగతః|
బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతామ్॥9205॥
"మాతృమూర్తులారా! మీకు నమస్కారములు. మా వచనములను దయతో ఆలకింపుడు. శ్రీకృష్ణపరమాత్మ ఇచటికి సమీపముననే సంచరించుచున్నాడు. ఆ ప్రభువు మమ్ములను మీ కడకు పంపెను. ఆ స్వామి తన అన్నయగు బలరామునితోను, గోపాలురతోడను గూడి, గోవులను మేపుచు చాలదూరము ప్రయాణించి యున్నాడు. మేమందఱము మిక్కిలి ఆకలిగొని యున్నాము. అనుచరులతోకూడి ఆకలిబాధతోనున్న వారికి భోజనపదార్ధములను దయచేయుడు".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:58, 03/01/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[05:58, 03/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
773వ నామ మంత్రము 3.1.2021
ఓం పాటలీ కుసుమ ప్రియాయైనమః
ఎఱుపు, తెలుపు వర్ణముల మిశ్రమ వర్ణము కలిగిన పాటలీకుసుమము అనిన ప్రీతిగలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పాటలీకుసుమప్రియా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పాటలీ కుసుమప్రియాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధాయుతుడై ఆ పరమేశ్వరిని అర్చనచేయు భక్తునికి ఆ తల్లి కరుణించి, భౌతికపరమైన కోర్కెల (సిరిసంపదలు, పాడిపంటలు, సుఖశాంతులు మొదలైన కోర్కెల) తోబాటు, ఆత్మానందానుభూతిని కూడా కలుగజేయును.
స్త్రీలకు పుష్పములనిన మహాప్రీతి. పుష్పము సౌభాగ్యచిహ్నము. అష్టసౌభాగ్యములలో పుష్పము కూడా ఒకటి.
అష్టసౌభాగ్యములు
1. చెరకు, 2. చిక్కుడు, 3. జీలకఱ్ఱ, 4. ధనియాలు, 5. పాలు, 6. పుష్పము, 7. కుంకుమ, 8. ఉప్పు.
శ్రీవృక్షే శంకరోదేవః పాటలాయాస్తు పార్వతీ శ్రీవృక్షము అంటే బిల్వవృక్షము. బిల్వవృక్షమునకు శంకరుడు కాగా పాటలవృక్షానికి పార్వతీదేవి సంకేతమీ. అమ్మవారికి ఇష్టమైన కుసుమములు చాలా ఉన్నాయి.
అమ్మవారికి పుష్పములనిన మక్కువ ఎక్కువ అనడానికి లలితా సహస్ర నామావళి యందన్న ఎన్నో నామ మంత్రములలో వివిధ జాతి పుష్పములను ప్రస్తావించడం జరిగినది.
59వ నామ మంత్రము మహాపద్మాటవీ సంస్థా గొప్పదైన పద్మవనంలో విలసిల్లునది జగన్మాత.
60వ నామ మంత్రము కదంబ వనవాసినీ కదంబ కుసుమ వనము నందు నివసించునది.
323వ నామ మంత్రము కదంబ కుసుమప్రియా కదంబ కుసుమము లనిన ప్రీతిగలిగినది.
435వ నామ మంత్రము చాంపేయకుసుమప్రియా సంపెంగ కుసుమము లనిన ప్రీతిగలిగినది.
560వ నామ మంత్రము దాడిమీ కుసుమప్రభా దాడిమీ కుసుమము కాంతితో ప్రకాశించునది.
766వ నామ మంత్రము జపాపుష్ప నిభాకృతిః దాసాని పూవు వర్ణము (అరుణవర్ణము) తో ప్రకాశించునది.
773వ నామ మంత్రము పాటలీ కుమప్రియా పాటలీ(తెలుపు, ఎఱుపు వర్ణముల మిశ్రమముతో ఉన్న) కుసుమము లనిన ప్రీతిగలిగినది.
776వ నామ మంత్రము మందారకుసుమప్రియా మందార కుసుమము లనిన ప్రీతిగలిగినది.
919వ నామ మంత్రము చైతన్య కుసుమప్రియా చైతన్య మనే కుసుమము లనిన (హృదయపద్మము అనిన) ప్రీతిగలిగినది.
964వ నామ మంత్రము బంధూక కుసుమ ప్రఖ్యా బంధు జీవక పుష్పం యొక్క కాంతి (రక్తవర్ణం) తో ప్రకాశించునది
అమ్మవారికి మల్లెపుష్పములనిన కూడా మహాప్రీతి అని అంటారు.
జగన్మాత ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి వివిధ పుష్పములనిన మహాప్రీతి.
తెలుపు ఎఱుపుల మిశ్రము భక్తులయెడ పరమేశ్వరునియెడ, తన పుత్రులు వినాయకుడు, షణ్ముఖులయెడ విశేషమైన ప్రేమకు, వాత్సల్యానికి, తనను విశేషముగా కొలిచెడి సౌభాగ్యవతుల యెడ ఉన్న ఆప్యాయతకు సంకేతము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పాటలీకుసుమప్రియాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:58, 03/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
199వ నామ మంత్రము 3.1.2021
ఓం సర్వశక్తిమయ్యై నమః
*త్రిమూర్తులు, ఇంద్రుడు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, అష్టమాతృకలు, అష్టసిద్ధులు, అష్టమూర్తులు, చతుర్దశభువనములు, దశావతారములు, అష్టవసువులు, త్రిశక్తులు, షోడశనిత్యాదేవతలు, మహాచతుష్షష్టికోటియోగినీ దేవతలు, అకారాదిక్షకారాంత వర్ణములు మొదలైనవాటితో కూడిన సర్వశక్తిమయి అయిన శ్రీచక్రస్వరూపిణియగు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వశక్తిమయీ యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వశక్తిమయ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి అతని సాధనను సిద్ధింపజేసి లోకహితార్థమై శక్తులను ఉపయోగించుటలో ఆ సాధకునికి సత్ఫలములను అనుగ్రహించును.
సకలదేవతల శక్తుల సముదాయమును తన రూపముగా గలిగినది జగన్మాత. దుష్టసంహారానికి అవతరించిన నవదుర్గా స్వరూపిణి ఆ పరమేశ్వరి.
నవదుర్గలు
1) శైలపుత్రి 2) బ్రహ్మచారిణి 3) చంద్రఘంట, 4) కూష్మాండ, 5) స్కందమాత, 6) కాత్యాయని, 7) కాళరాత్రి, 8) మహాగౌరి, 9) దేవీసిద్ధిదాత్రి
లక్ష్మీతంత్రమందు ఓం దేవేంద్రుడా నేను మహాలక్ష్మిని, స్వాయంభువ మన్వంతరమున దేవకార్యార్థమై మహిషాసురమర్దినిగా పుట్టితిని, నాశక్తి లేశములే ఆయా దేవతల శరీరములందున్నవి. అవి అన్నియు కలిసి నా మంగళస్వరూపముగా అయినవి. నా శక్తులే దేవతల ఆయుధ స్వరూపములుగా అయినవి అనిగలదు.
ప్రపంచములో ప్రతీ వస్తువునందు ఒక విలక్షణశక్తి ఉండును. ఆ శక్తులన్నియును గౌరీదేవి అని విజ్ఞులు చెప్పుచున్నారు. ఈవిషయము లింగపురాణమునందు గలదు.
దేవతల యజ్ఞములందు ఆహూతులిచ్చునప్పుడు చెప్పే స్వాహాకారము,పితృయజ్ఞములందలి స్వాధాకారము ఆ పరమేశ్వరియే. శాశ్వతమైన ఓంకారము ఆ పరమేశ్వరియే. హోమము చేయునప్పుడు చెప్పు వషట్కారము ఆ పరమేశ్వరియే.
శ్రీచక్రమే జగన్మాతస్వరూపము. శ్రీచక్రములో తొమ్మిది ఆరణలు కలవు. ప్రతీ ఆవరణకు ఎనిమిది దిక్కులలోను దిక్కుకు ఎనిమిది చొప్పున ఆవరణకు అరువది నాలుగు చొప్పున తొమ్మిది ఆవరణలకు అయిదువందల డెబ్బదిఆరు (576) మంది యోగినులు ఉంటారు. ప్రతీ యోగినికి కోటిమంది సేవకులచొప్పున అయిదువందల డెబ్బది ఆరు (576) కోట్లమంది (9 ఆవరణలు x 8 దిక్కులు x 8 యోగినులు x 1 కోటిమంది సేవకులు = 576 కోట్లమంది యోగినులు) యోగినుల స్వరూపము జగన్మాతయే గనుక జగన్మాత సర్వశక్తిమయీ యని అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వశక్తిమయ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:58, 03/01/2021] +91 95058 13235: 3.1.2021 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది మూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.18 (పదునెనిమిదవ శ్లోకము)
శ్రుత్వాచ్యుతముపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకాః|
తత్కథాక్షిప్తమనసో బభూవుర్జాతసంభ్రమాః॥9206॥
23.19 (పందొమ్మిదవ శ్లోకము)
చతుర్విధం బహుగుణమన్నమాదాయ భాజనైః|
అభిసస్రుః ప్రియం సర్వాః సముద్రమివ నిమ్నగాః॥9207॥
పరీక్షిన్మహారాజా! ఆ విప్రసతులు ఆ ఇంతకుముందే శ్రీకృష్ణభగవానుని లీలావిలాసములను, ఎనలేని రూపసౌందర్యమును గూర్చి వినియుండిరి. ఆ స్వామిని ఎప్పుడు చూతుమోకదా! అను ఉత్కంఠతో అనుక్షణము ఆయన దర్శనమునకై ఉబలాటపడుచుండిరి. ఇంతలో శ్రీకృష్ణుడు తన సమీపదేశమునకే వచ్చియున్నట్లు వినినంతనే వారు మిగుల తత్తరపాటునకు లోనైరి. వెంటనే ఆ సాధ్వీమణులు అందఱును ఘుమఘుమ లాడుచున్న రుచికరములైన చతుర్విధ భోజన పదార్థములను (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను) వివిధ పాత్రలలో తీసికొని, తమకు మిక్కిలి ఇష్టుడైన శ్రీకృష్ణునికడకు, నదులు సముద్రుని చెంతకు పరుగెత్తునట్లు పరుగున చేరుకొనిరి.
23.20 (ఇరువదియవ శ్లోకము)
నిషిధ్యమానాః పతిభిర్భ్రాతృభిర్బంధుభిః సుతైః|
భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాః॥9208॥
23.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
యమునోపవనేఽశోకనవపల్లవమండితే|
విచరంతం వృతం గోపైః సాగ్రజం దదృశుః స్త్రియః॥9209॥
అంతట భర్తలును, సోదరులును, బంధువులును, సుతులును వారికి అడ్డముగా నిలిచి, 'పోవలదు' అని నివారింపసాగిరి. ఐనను సకలలోక విఖ్యాతుడైన ఆ పరమపురుషునియొక్క లీలాగుణ వైభవములను గూర్చి, ఎంతకాలమునుండియో విని, ఆ స్వామి సేవలకై ఆరాటపడుచున్న ఆ బ్రాహ్మణపత్నులు తమవారి మాటలను సరకుగొనక త్వరత్వరగా ముందునకు సాగిరి. అప్పుడు శ్రీకృష్ణుడు యమునా తీరమున క్రొత్తక్రొత్త చిగురుటాకులతో విలసిల్లుచున్న అశోకవృక్షములుగల ఉపవనమునందు బలరామునితో, గోపబాలురతో గూడి విహరించుచుండెను. ఆ పురుషోత్తముని దర్శించినంతనే వారు ఎంతయు ఆనందించిరి.
23.22 (ఇరువదిరెండవ శ్లోకము)
శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హధాతుప్రవాలనటవేషమనువ్రతాంసే| .
విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసమ్॥9210॥
అప్పుడు ఆ శ్యామసుందరుని తనువుపై బంగారు పట్టు పీతాంబరములు ధగధగలాడు చుండెను. కంఠమున వనమాల తేజరిల్లుచుండెను. ఆ స్వామి శిరమున అలంకృతమైన నెమలిపింఛము మిగుల శోభాయమానముగా ఉండెను. సర్వాంగములయందును గైరికాది ధాతువుల చిత్రములు మనోహరముగా ఉండెను. చిగురుటాకులతో అలంకృతుడైన ఆ ప్రభువు ఒక మహానటునివలె అలరారుచుండెను. ఆ స్వామి ఒక మిత్రుని భుజముపై వామహస్తమును ఉంచి, మఱియొక హస్తముతో కమలమును లీలగా త్రిప్పుచుండెను. ఆ ప్రభువుయొక్క కర్ణములపై ధరింపబడిన కలువలు, కమనీయములు, ఫాలభాగమునందలి ముంగురులశోభలు, మృదువైన కపోలముల కాంతులు అత్యంత మనోజ్ఞములు ఆ ప్రభువుయొక్క ముఖారవిందము, చిఱునవ్వుల సింగారములు ఎంతయు ఆహ్లాదకరములు.
23.23 (ఇరువదిమూడవ శ్లోకము)
ప్రాయః శ్రుతప్రియతమోదయకర్ణపూరైర్యస్మిన్ నిమగ్నమనసస్తమథాక్షిరంధ్రైః|
అంతః ప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర॥9211॥
పరీక్షిన్మహారాజా! విప్రపత్నులు ఇంతవఱకును తమకు ఇష్టుడైన శ్రీకృష్ణపరమాత్మయొక్క మహోన్నత లీలలను తనివిదీర వినుచు తమ చెవులు సార్థకమైనట్లు భావించుచుండిరి. అందువలన, వారు ఆ పరమపురుషుని తమ మనస్సులలో నిలుపుకొనియుండిరి. ఆ స్వామిని కనులార దర్శించిన పిదప ఇప్పుడు వారు ఆయనను తమ కన్నులనే ద్వారములగుండా లోపలప్రవేశపెట్టి తమ మనస్సులలోనే ఆ మధురమూర్తిని చాలాసేపు కౌగలించుకొని, ఆనందించిరి. ఈ విధముగా ఆ ప్రభువు యొక్క దర్శనమునకై ఇంతవఱకును వారు పడుచున్న ఆరాటమంతయును తీఱిపోయెను. ఇట్లే పరమాత్ముని దర్శించుటకై తహతహపాటుతో నున్న భగవద్భక్తులు - జాగ్రత్, స్వప్నావస్థలలోగల అహం వృత్తులు 'ఇది నేను, ఇది నాది' అను భావముతో తపించుచుందురు. కాని, సుషుప్తి అవస్థయందు దాని అభిమానియగు ప్రాజ్ఞుని పొంది అందులో లీనమయ్యెదరు. అప్పుడు వారిలోగల తాపము శాంతించును. అట్లే విప్రసతులు తమ మనస్సులలోనే శ్రీకృష్ణునితో ఐక్యభావమును పొందిరి.
23.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తాస్తథా త్యక్తసర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయా|
విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః॥9212॥
భగవంతుడు అందఱి హృదయములలోని భావములను ఎఱిగినవాడు. తమను, బంధుమిత్రులు, పతులు, పుత్రులు, నివారింపజూచినను వారిని సరకుగొనక, బ్రాహ్మణసతులు విషయవాంఛలను అన్నింటిని త్యజించి తనను దర్శించు కాంక్షతో వచ్చినట్లు ఆ స్వామి గ్రహించెను. అంతట ఆ ప్రభువు తన ప్రసన్న వదనమున దరహాసము తొణికిసలాడుచుండగా వారితో ఇట్లనెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 598 / Bhagavad-Gita - 598 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 15 🌴
15. శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర: |
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ: ||
🌷. తాత్పర్యం :
దేహముచే గాని, మనస్సుచే గాని, వాక్కుచే గాని మనుజుడు ఒనరించు న్యాయాన్యాయ కర్మలన్నింటిని ఈ ఐదు అంశములే కారణములు.
🌷. భాష్యము :
“న్యాయం” మరియు “విపరీతం” అనెడి పదములు ఈ శ్లోకమున అతి ప్రధానమైనవి. శాస్త్ర నిర్దేశముల ననుసరించి ఒనర్చబడెడి కర్మలు న్యాయకర్మలుగా తెలియబడగా, శాస్త్రనియమములకు విరుద్ధముగా ఒనర్చబడు కర్మలు విపరీతకర్మలుగా తెలియబడుచున్నవి. కాని ఏది ఒనరించినను అద్దాని పూర్ణ నిర్వహణ కొరకు ఈ ఐదు అంశములు అత్యంత అవసరములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 598 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 15 🌴
15. śarīra-vāṅ-manobhir yat karma prārabhate naraḥ
nyāyyaṁ vā viparītaṁ vā pañcaite tasya hetavaḥ
🌷 Translation :
Whatever right or wrong action a man performs by body, mind or speech is caused by these five factors.
🌹 Purport :
The words “right” and “wrong” are very significant in this verse. Right work is work done in terms of the prescribed directions in the scriptures, and wrong work is work done against the principles of the scriptural injunctions. But whatever is done requires these five factors for its complete performance.
🌹 🌹 🌹 🌹 🌹
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 206, 207 / Vishnu Sahasranama Contemplation - 206, 207 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻206. శాస్తా, शास्ता, Śāstā🌻
ఓం శాస్త్రే నమః | ॐ शास्त्रे नमः | OM Śāstre namaḥ
🌾శస్తా, शास्ता, Śāstā🌾
శ్రుతిస్మృత్యాదిభిః సర్వేషాం అనుశిష్టిం అనుశాసనం కరోతి శ్రుతి స్మృత్యాదుల ద్వారా ఎల్లవారిని, మీరిట్లు వర్తించుడు అని అనుశాసించువాడు శాస్తా.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
మ. వనజాక్ష స్తవశూన్యులై మఱి వషట్స్వాహా స్వధా వాక్య శో
భన రాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులు న్నైన వి
ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలిం బాటిల్లినం గల్కియై
జననం బంది యధర్మము న్నడఁచు సంస్థాపించు ధర్మం బిలన్. (198)
కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ళ నోటినుండి 'వషట్, స్వాహా, స్వధా' అనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు, భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 206🌹
📚. Prasad Bharadwaj
🌻206. Śāstā🌻
OM Śāstre namaḥ
Śrutismr̥tyādibhiḥ sarveṣāṃ anuśiṣṭiṃ anuśāsanaṃ karoti / श्रुतिस्मृत्यादिभिः सर्वेषां अनुशिष्टिं अनुशासनं करोति One who instructs, disciplines and directs all through the scriptures i.e., Śrūtis and Smr̥tis.
Śrīmad Bhāgavata, Canto 2, Chapter 7
Yarhyālayeśvāpi satāṃ na hareḥ kathāḥ syuḥ
Pāṣāṇḍinó dvijajanā vr̥ṣalā nr̥devāḥ,
Svāhā svadhā vaṣaḍiti sma giró na yatra
Śāstā bhavisyati kalerbhagavānyugānte. (38)
:: श्रीमद्भागवते, द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः
यर्ह्यालयेश्वापि सतां न हरेः कथाः स्युः
पाषाण्डिनो द्विजजना वृषला नृदेवाः ।
स्वाहा स्वधा वषडिति स्म गिरो न यत्र
शास्ता भविस्यति कलेर्भगवान्युगान्ते ॥ ३८ ॥
When it so happens that in none of the residences of so-called saints and respectable gentlemen, the topics on the subject of God exists; higher three classes declaring themselves to be atheists and governance is held by lower class, and when nothing is known of the techniques of sacrifice, even by word, at that time, at the end of Kaliyuga the Lord will appear as the supreme chastiser.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 207/ Vishnu Sahasranama Contemplation - 207🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻207. విశ్రుతాత్మా, विश्रुतात्मा, Viśrutātmā🌻
ఓం విశ్రుతాత్మనే నమః | ॐ विश्रुतात्मने नमः | OM Viśrutātmane namaḥ
🌾వశ్రుతాత్మా, विश्रुतात्मा, Viśrutātmā🌾
విశేషేణ శ్రుతః సత్యజ్ఞానాది లక్షణః ఆత్మా యేన ఎవనిచే సత్యం జ్ఞానం అనంతం ఇత్యాది రూపము అగు ఆత్మ తత్త్వము విశేష రూపమున శ్రవణము చేయబడెనో అట్టివాడు విశ్రుతాత్మ. జీవుడుగా పలుమారులు ఆత్మ తత్త్వ శ్రవణమును పరమాత్ముడే చేసియున్నాడు.
:: శ్రీమద్భగవద్గీత - జ్ఞాన యోగము ::
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥ 1 ॥
నాశరహితమగు ఈ నిష్కామకర్మయోగము పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువునకుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 207🌹
📚. Prasad Bharadwaj
🌻207. Viśrutātmā🌻
OM Viśrutātmane namaḥ
Viśeṣeṇa śrutaḥ satyajñānādi lakṣaṇaḥ ātmā yena / विशेषेण श्रुतः सत्यज्ञानादि लक्षणः आत्मा येन His nature marked by Satyam i.e., truth, jñānaṃ i.e., knowledge, anantam i.e., limitless - is well known. One who is specially known through signifying terms like truth, knowledge etc.
Śrīmad Bhagavadgīta - Chapter 4
Imaṃ vivasvate yogaṃ proktavānahamavyayam,
Vivasvān manave prāha manurikṣvākave’bravīt. (1)
:: श्रीमद्भगवद्गीत - ज्ञान योग ::
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान् मनवे प्र…
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 151 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 81 🌻
దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై,
ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు. నీ శరీరమందును, నా శరీరమందును, అన్య శరీరములయందును ఏ చైతన్యము సాక్షి రూపముగా నున్నదో, ఆ చైతన్యమే విరాట్ శరీరమందును సాక్షి రూపముగా ఉన్నది.
ఇచ్చట వ్యష్టి స్థూల, సూక్ష్మ, కారణ దేహములందు ఏ ప్రత్యగాత్మ విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నదో, అచట సమిష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములందు ఏ పరమాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత రూపముగా ఉన్నదో, అదియు, ఇదియు ఒక్కటే. అనగా పరబ్రహ్మమే భేదము లేదు. అఖండ ఆకాశమునందు భేదము లేనప్పటికి, ఘటము, మఠము, మొదలగు ఉపాధుల చేత భేదము పొందినట్లు, కన్పించుచున్నట్లుగా ఈ అఖండ చైతన్యము, ఉపాధులు మూలముగా భేదము పొందినట్లు కనిపించుచున్నది.
వాస్తవమున భేదము లేకపోయినప్పటికి, ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును, అనాత్మయగు శరీరధర్మములందు చూచి, ఆత్మను అనేకముగా తలంచుచున్నారు. ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూచుచున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును పొందుచున్నారు. సర్వ భేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమును ఎఱిగిన వారు, అమృతత్వమును పొందుచున్నారు.)
చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఏక స్వరూపము ఆత్మ. అనేక స్వరూపము అనాత్మ. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణము. ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే, ఇది ఏకత్వములోకి తీసుకువెళ్తుందా? అనేకత్వములోకి తీసుకు వెళ్తుందా? అనేటటువంటి విచారణని చేయాలి.
ఎప్పుడైతే అది అనేకత్వ స్థితికి దారి తీస్తుందో లేదా అనేకత్వం అనే లక్షణంతో ప్రకాశిస్తోందో, భాసిస్తోందో, లేదు ఆభాసగా ఉన్నదో, అప్పుడు అదంతా అనాత్మ. ఈ ఆత్మానాత్మ విచారణ మానవులందరూ తప్పక చేయాలి. సాధకులు ముఖ్యంగా చేయాలి. సాధన చతుష్టయ సంపత్తి కలవారు, నిరంతరాయంగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి. చేసి ఆత్మ వస్తువును ఆశ్రయించాలి.
అనాత్మ వస్తువును త్యజించాలి. ఈ లోకములో రెండు లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువులకు ఉనికి ఉన్నది. ఒకటేమో ఆత్మ వస్తువు. రెండవది అనాత్మ వస్తువు. మరి రెండూ ఒకచోటే ఉన్నాయి. వింతైన విషయమేమింటంటే, రెండూ వేరువేరుగా వేర్వేరు ప్రదేశాలలో ఉంటే, సులభంగా గుర్తించవచ్చు. కానీ రెండు వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. దీనికొక ఉదాహరణ చూద్దాము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 25 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 25 🍀
జాణీవ్ నేణీవ్ భగవతీ నాహీ!
ఉచ్చారణీ పాహీ మోక్ష సదా!
నారాయణ హరీ ఉచ్చార్ నామాచా!
తేథే కళికాళాచా రీఘ్ నాహీ!!
తేథీల్ ప్రమాణ్ నేణవే వేదాసీ!
తే జీవ జంతూ సీ కేవి కళే!!
జ్ఞానదేవా ఫళ్ నారాయణ పార్!
సర్వత్ వైకుంఠి కేలే అసే!!
భావము:
బుద్ధి తెలిసిన వాడా! తెలియని వాడా! అనే భేదభావము భగవంతుడి వద్దలేదు. నామోచ్ఛారణ చేయు వారందరికి సదా మోక్షమును ఇచ్చును. నారాయణ హరి అని నామ ఉచ్చారణ చేయు వారికి కలికాలముది, మరియు కాలుడిది. భయమే లేదు.
ఆ దేవుడి లీలలు వేదాలకు తెలియ జాలవు. మరి జీవజంతులకు తెలియుట ఎలా సాధ్యము. ?
నారాయణ నామ పఠనము యొక్క ఫలము నాకు అంతట వైకుంఠము వలెనే అగుపించినదని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -25 🌻
జ్ఞాని అజ్ఞానియని లేదు భేదము
భగవంతునికి అందరు సమానము
ఉచ్ఛరించినంతనే పలికేటి దైవము
చల్లగ చూసి ఇచ్చేను మోక్షము
నారాయణ హరినామ గీతము
మరవకుండగ పాడుచుండుము
కన్నెత్తి చూడదు కలి కాలము
సాగదు ఇచ్చట కాలుని పాశము
దేవుడి యొక్క సమగ్ర ప్రమాణము
తెలుసుకో జాలదు వేదము
జీవ జంతువులకు ఎలా సాధ్యము
హరి చరణములే మనకు శరణ్యము
జ్ఞానదేవునికి లభించిన ఫలము
నారాయణహరి నామ పఠనము
సర్వత్రము వెలిసెను వైకుంఠము
కలిగెను వారికి నామ అనుభవము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 96 / Sri Lalitha Sahasra Nama Stotram - 96 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
[06:45, 03/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 168 / Sri Lalitha Chaitanya Vijnanam - 168 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖
🌻168. 'నిష్క్రోధా' 🌻
క్రోధము లేనిది శ్రీదేవి అని అర్థము.
ద్వేషమున్నచో క్రోధముండును. ప్రేమయున్నచోట ద్వేష ముండదు. ప్రేమయున్నచోట తప్పులున్ననూ సహించుట యుండును. సహనము ప్రేమనుండే పుట్టును. క్రోధము తాను అనుకున్న రీతిలో సన్నివేశములు సాగకుండనప్పుడు రజోగుణ ద్వేషమున వుద్భవించును.
హిరణ్యకశిపుని కోపము, రావణుని కోపము క్రోధమునకు తార్కాణములు. తన భావమునకు, చేతకు, మర్యాదకు, గౌరవమునకు అడ్డము వచ్చిన వారినందరిని అణచివేయుట, సంహరించుట, హింసించుట క్రోధ లక్షణములు. క్రోధము ఆసురీ ప్రభావమున కలుగును.
మదించిన అహంకారము కలవారికి క్రోధమెక్కువగా నుండును. క్రోధము వలన పరిసరముల యందు శత్రుత్వమును పెంచుకొందురు. క్రోధనులు నిత్యమూ దుఃఖమునే అనుభవించు చుందురు. శ్రీమాతకు క్రోధము లేదు. ఆమె కందరూ ప్రియులే. ఆమె క్రోధమును నటించును గాని క్రోధమను గుణమునకు వశపడదు. ఇది నిజమగు దైవీ సంపత్తి. రాక్షస సంహారము చేయునపుడు శ్రీమాత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు క్రోధమును తెచ్చిపెట్టుకొనిరే కాని, క్రోధ వశులు కాలేదు. వారు క్రోధమును తెచ్చిపెట్టుకొని, అధర్మమును శిక్షింతురు.
వాలి సంహారమున శ్రీరాముని ప్రవర్తనము, మహిషాసుర వధయందు శ్రీదేవి ప్రవర్తనము గమనించినచో, నిహ్కోధ స్థితి అవగాహన యగును. తల్లితండ్రులకు తమ పిల్లలపై ద్వేషము, క్రోధము యుండవు కదా! కానీ అవసరమగుచో మందలింతురు కదా! వారి నడుమ యున్నది ప్రేమయగుటచే క్రోధము నాయుధముగా వినియోగింతురే గాని, క్రోధవశులు కారు. సమస్త సృష్టి జీవులూ తన బిడ్డలే యుగుటచే శ్రీమాత అందరియందునూ ఒకే విధమగు ప్రేమ కలిగి యుండును.
ఆమె కెవ్వరిపైన క్రోధముండదు. ఆమె క్రోధము నటించుట జీవోద్ధరణమునకే. అవతార పురుషులు కూడ అట్టివారే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 168 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Niṣkrodhā निष्क्रोधा (168) 🌻
She is without anger. Even at the time of total dissolution (mahā-pralayā), the Brahman is without anger. Kṛṣṇa says in Bhagavad Gīta (IX.29) “none is hateful to me, none is dear to me”. This is one of the qualities of the Brahman. Brahman is like a mirror.
Unless one stands before a mirror, he cannot see his image. Unless one is devoted to Her, he cannot realize Her grace. Whether one is devoted to Her or not, She is without anger.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
[11:42, 03/01/2021] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.
రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.
ఆత్మానందం.
ఆడియో నం.7
💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
[11:44, 03/01/2021] +91 92915 82862: 🌀👂🍯🎊💖🎊👂🍯🌀
శ్రీకృష్ణ కర్ణామృతం.
-- లీలాశుకుల రచన
ధనుర్మాసమును పురస్కరించుకుని.
ఆడియో నం.7
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
[12:13, 03/01/2021] +91 92915 82862: సూర్యోపనిషత్
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: !భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: !స్వస్తి న పూషా విశ్వవేదా: !స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: ! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !!ఓం శాంతి: శాంతి: శాంతి: !!!
ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక !యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక ! మీ స్తోత్రాలను గానంచేస్తూ మాకు నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో,సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని ఒసగెదరుగాక !
ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: !
ఓం! అథర్వణవేదంలోని అంగిరసుల సూర్యోపనిషత్ చెబుతాము.
బ్రహ్మా ఋషి: !గాయత్రీ ఛన్ద: !ఆదిత్యో దేవతా !హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ ! హృల్లేఖా శక్తి:!వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ !చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: !
బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీజం... హృల్లేఖ శక్తి... సృష్టి యావత్తూ.... కీలకం... చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ సాధన !
షట్ స్వరారూఢేన బీజేన షడఙ్గం రక్తామ్బుజ సంస్థితం సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాఁభయవరదహస్తం కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణ య ఏవం వేద స వై బ్రాహ్మణ: !!
ఆరు స్వరాల బీజం కారణంగా ఆరు అంశాలు కలవాడు. ఎర్ర తామర మీద ఉండేవాడు, ఏడు గుఱ్ఱాల రథం గలవాడు, బంగారు వర్ణం కలవాడు, నాలుగు భుజాలవాడు, రెండు పద్మాలతో అభయ వరద ముద్రలు కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు అయిన శ్రీ సూర్యనారాయణుని తెలిసినవాడే బ్రాహ్మణుడు.
ఓ భూర్భువ సువ: !తత్సవితుర్వరేణ్యంభర్గో దేవస్య ధీమహి ! ధి యో యో న: ప్రచోదయాత్ !
ప్రణవరూపమైన నిరాకారమైన "భూ, భువః, సువః" అనే మూడులోకాల రూపమైనడి, సృజన కర్తయొక్క దివ్యమైన ఆరాధనీయమైన ఏ కాంతి ఉన్నదో దానిని ధ్యానించు తాము. అది మా బుధ్థులను ఉత్తేజపరచు గాక !
సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ !సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయస్తే !సూర్యాద్యజ్ఞ: పర్జన్యోఁన్నమాత్మా !
మారిపోయే ప్రపంచంయొక్క మార్పులేని తత్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుడు నుండే ప్రాణులు జనిస్తారు.సూర్యుడు నుండి యజ్ఞము, మేఘము, అన్నము, పురుషుడు జనిస్తాయి.
నమస్తే ఆదిత్య ! త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి ! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి ! త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !త్వమేవ ప్రత్యక్షం ఋగసి ! త్వమేవ ప్రత్యక్షం యజురసి !త్వమేవ ప్రత్యక్షం సామాసి ! త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !త్వమేవ సర్వం ఛన్దోఁసి !
ఓ ఆదిత్యుడా! నీకు నమస్కారం. నీవే ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు. నీవే ప్రత్యక్షంగా ఉన్న ఋక్సామ యజురధర్వణ వేదాలవు. అన్ని వేద సూక్తాలు నీవే!
ఆదిత్యాద్వాయుర్జాయతే !ఆదిత్యాద్భూమిర్జాయతే !
ఆదిత్యాదాపోజాయస్తే !ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే ! ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !ఆదిత్యాద్దేవాః జాయస్తే !ఆదిత్యాద్వేదాః జాయస్తే !
ఆదిత్యుడినుండి వాయువు, భూమి, నీరు, అన్నీ పుడతాయి.ఆదిత్యుడినుండి వ్యోమం దిక్కులు పుడతాయి. ఆదిత్యుని వల్లనే దేవతలు పుడతారు. ఆదిత్యుని వల్లనే వేదాలు పుడతాయి.
ఆదిత్యో వా ఏష ఏతన్మణ్డలం తపతి ! అసావాదిత్యో బ్రహ్మా !
ప్రకాశించే, తపించే ఈ మండలం ఆదిత్యుడే. ఆదిత్యుడు బ్రహ్మము!
ఆదిత్యోంత:కరణ - మనోబుద్ధి - చిత్తాహంకారా: !ఆదిత్యో వై వ్యానస్సమానోదానోఁపాన: ప్రాణ: !ఆదిత్యో వై శ్రోత్ర - త్వక్ చశౄరసనధ్రాణా: !ఆదిత్యో వై వాక్పాణిపాదపాయుపస్థా: ! ఆదిత్యోవై శబ్దస్పర్శరూపరసగన్ధా: ! ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానన్దా: !ఆనన్దమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య: !
ఆదిత్యుడే అంతః కారణాలైన మనోబుధ్థిచిత్తాహంకారాలు. ఆదిత్యుడే వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణాలు. ఆదిత్యుడే శ్రోత్రత్వక్ రసనా ఘ్రాణాలు. ఆదిత్యుడే వాక్కు, పాణి పాదాలు, పాయూవస్థలు.ఆదిత్యుడే శబ్ధ, స్పర్శ, రూప, రస, గంథాలు. ఆదిత్యుడే పలకడం, స్వీకరించడం, రావడం, విసర్జించడం, ఆనందించడం. ఆనందమయుడై, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వారూపుడు ఆదిత్యుడే.
నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి ! భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ: !
మిత్రుడివన నీకు నమస్కారం! ప్రకాశ స్వరూపుడికి నమస్కారం! మృత్యువు నుండి నాన్ను రక్షించు. తేజోవంతునికి, విశ్వహేతువైన వానికి, నమస్కారం!
సూర్యాద్భవన్తి భూతాని సూర్యేణ పాలితాని తు ! సూర్యే లయం ప్రాప్నువన్తి య: సూర్య: సోఁహమేవ చ !
సూర్యుడినుండే ప్రాణులు పుడతాయి. సూర్యుడివల్ల పాలింపబడతాయి. సూర్యునిలో లయించుతాయి . ఎవరు సూర్యుడో అతడే నేను.
చక్షుర్నో దేవ: సవితా చక్షుర్న ఉత పర్వత: ! చక్షు-ర్ధాతా దధాతు న: !
దివ్యమైన సూర్యుడే మా నేత్రం. నేత్రదృష్థి మాకు పరిపూర్ణతను ఇస్తుంది. ఈశ్వరుడు మాకు దృష్టి ప్రసాదించుకాక.
ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి ! తన్న: సూర్య: ప్రచోదయాత్ !
సహస్రకిరణుడైన ఆదిత్యునికోసం జ్ఞానార్జన చేస్తాము. ధ్యానిస్తాము. అట్టి సూర్యుడు మాకు ఉత్తేజాన్ని ఇచ్చును గాక!
సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ !సవితా న: సువతు సర్వతాతిఁ సవితా నో రాసతాం దీర్ఘమాయు: !
వెనుక, ఎదురుగా, పైన, క్రిందా అంతటా సవితృడే. ఆ సవితృడే మాకు అంతటా పూర్ణత్వాన్ని ప్రసవించును గాక!మాకు సవిత్రుడు దీర్ఘాయువును ప్రసాదించును గాక!
ఓమిత్యేకాక్షరం బ్రహ్మా ! ఘృణిరితి ద్వే అక్షరే ! సూర్య ఇత్యక్షరద్వయమ్ !ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి !ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను: !
'ఓం' అనేది ఏకాక్షర బ్రహ్మము. 'ఘృణి' అనేది రెండు అక్షరాలు. 'ఆదిత్య' అనేది మూడు అక్షరాలు. "ఓం ఘృణిః సూర్యః ఆదిత్యః" అనేవి ఏకమైన సూర్యుని అష్టాక్షరీ మంత్రం.
యస్సదాహ రహ ర్జపతి స వై బ్రాహ్మణో భవతి స వై బ్రాహ్మణో భవతి !
ఈ మంత్రాన్ని ఎవరు సదా దినదినమూ జపిస్తారో అతడే బ్రాహ్మణుడవుతాడు.
సూర్యాభిముఖో జప్త్వా, మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే !అలక్ష్మీర్నశ్యతి ! అభక్ష్య భక్షణాత్ పూతో భవతి !అగమ్యాగమనాత్ పూతో భవతి ! పతిత సంభాషణాత్ పూతో భవతి ! అసత్ సంభాషనాత్ పూతో భవతి !
సూర్యునికి అభిముఖంగా నిలచి జపించడం వల్ల మహా వ్యాధి భయాన్నుండి విడివడుతాడు.దారిద్ర్యం నశిస్తుంది. తినకూడనిది తిన్న పాపం నుండి, పతితులతో కలసి సంభాషించిన పాపం నుండి, అసత్య భాషణ పాపం నుండి విముక్తుడై పవిత్రుడౌతాడు.
మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ ! సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !
మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్ ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా పాతకాలనుండి వెంటనే విముక్తుడౌతాడు.
సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ !
అదే సావిత్రీ విద్య. కొంచం కూడా, దేనికోసమూ ఎవరినీ పొగడడం కాని, నిందించడం కాని చేయరాదు.
య ఏతాం మహాభాగ: ప్రాత: పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి !వేదార్థం లభతే !
ఏ అదృష్టవంతుడు ఉదయమే దీనిని పఠిస్తాడో, అతడు భాగ్యవంతుడౌటాడు.పసు సంపద పొందుతాడు. వేదార్థాలను పొందుతాడు.
త్రికాలమేతజ్జప్త్వా, క్రతుశతఫలమవాప్నోతి ! హస్తాదిత్యే జపతి, స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!
దీనిని మూడు కాలాలలోనూ జపించడం వల్ల నూరు యాగాల ఫలాన్ని పొందుతాడు.ఆదిత్యుడు హస్తలో ఉండగా జపించినప్పుడు, అతడు మహా మృత్యువును దాటుతాదు ఇలా ఎవరు తెలుసు కొంటారో! ఇదే ఉపనిషత్తు.
ఓం శాంతి: శాంతి: శాంతి:!!
🕉🌞🌎🌙🌟🚩
[12:21, 03/01/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Jan 3.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జనవరి 3.
No great work can be achieved by humbug. It is through love, a passion for truth, and tremendous energy, that all undertakings are accomplished - therefore, manifest your manhood.
ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.
🕉🌞🌎🌙🌟🚩
THE AWAKENING
Inspirational Quotes of Swami Vivekananda
Truth, purity and unselfishness; wherever these are present, there is no power below or above the sun to crush the possessor thereof. Equipped with these, one individual is able to face the whole universe in opposition.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.
🕉🌞🌎🌙🌟🚩
[12:21, 03/01/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
మనలో ఉండే ఏడు కేంద్రాలలో సప్తఋషులను స్థాపన చేసుకోవాలి. వీరు మనయందున్నారని మనము గుర్తించుట చేత, వారు సంతోషించి మనకు సాన్నిధ్యాన్ని కలుగచేస్తారు. చాలా రకములైన ప్రయోజనములు ఋషి స్మరణ వలన కలుగును. మొత్తము వాఙ్మయము, విజ్ఞానము అంతా ఋషులు అందించినవే. ఉపనిషత్తులు గూడా వారే అందించారు. సృష్టి ప్రారంభము నుండి సమస్త విషయములు వారి చేత వ్యక్తమైనవి.
వారు తపస్సు చేసి, వారు పొందినటువంటి అనుభూతులనే వారు చక్కగా రచించి మనకు అందించారు. ఋషుల ద్వారా దైవాన్ని చేరడం సులభము. లేకపోతే మనకు దైవ స్వరూప, స్వభావాలు తెలియవు. దైవము ఎలా అంతా వ్యాప్తి చెంది ఉన్నాడో తెలియదు. అందుచేత ఋషులను తలచుకోవడం ప్రధానం.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
నిరంతరం - భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలి?
'అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు, వారికి మరు జన్మ అంటూ ఏదీ ఉండదు.' అని కృష్ణపరమాత్మ సెలవిచ్చారు.
మనం ఒక పరీక్ష పాసు కావాలన్నా, కొంత కాలం పాటు, మనకు అభ్యాసము, సాధన అవసరము.
సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి, తేలికగా ఉత్తీర్ణులం కాగలము, అంతే కానీ అప్పటికప్పుడు చదివితే ఉత్తీర్ణులం కాలేము కదా!.
కొంత అభ్యాసం లేకుండా ఏపనీ చేయలేము కదా...
అలాగే అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవిత కాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం.
జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలతో గడిపితే అంత్య కాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి కానీ పరమాత్మ గుర్తుకు రాడు.
కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే, నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యము....
వీటి పట్ల నిర్లక్ష్యము, సోమరితనం ఎట్టి పరిస్థితిలలోనూ రానీయకుండా చూసుకోవాలి.
లోకా సమస్తా సుఖినోభవన్తు
🕉🌞🌎🌙🌟🚩
[12:33, 03/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం - (760)
🕉🌞🌎🌙🌟🚩
🧘సాధన🧘♂
"ప్రశ్న : దృష్టిని భ్రూమధ్యలో నిల్పమన్నారు, సరియేనా !?"
భగవాన్ శ్రీరమణమహర్షి : తానున్నానని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఎరుకను వదిలి దైవాన్ని వేరుగా వెతుకపోతారు. భ్రూమధ్యలో దృష్టిని నిలిపి ప్రయోజనమేమి ? దైవం అక్కడ ఉన్నదనటం తెలివితక్కువ. అట్లు చేయమన్న సలహా చిత్త ఏకాగ్రత కుదరటానికి. మనసు చెదరక నిలిపే బలవదోపాయల్లో అది ఒకటి. అది మనసును ఒకే మార్గంలో బలవంతంగా చొప్పించటం అవుతుంది. ఏకాగ్రతకు అది సాయం చేస్తుంది. దానికన్నా ఉత్తమం ఆత్మవిచారణ. ఇప్పటి తగువు అంతా మనసుతోనే. ఆ మనసును మనసుతోనే తొలగించవలె !
"ప్రశ్న : ఆహార నియమాలు ఉండవలెనా !?"
భగవాన్ శ్రీరమణమహర్షి : సాత్వికాహారం మితంగా అయితే మంచిది.
"ప్రశ్న : బహువిధములైన ఆసనములు చెప్పియున్నారు ?
భగవాన్ శ్రీరమణమహర్షి : నిధిధ్యాసనం [చిత్తఏకాగ్రత] అన్నిటికన్నా మేలు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
[12:33, 03/01/2021] +91 92915 82862: "ఋభుగీత" (227)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
లోపల వస్తువుకు ఏవీ లేవన్న సత్యాన్ని చెప్పటమే "గీతబోధ" ఉద్దేశం !
ఆదర్శం అనేది మహాత్ముల బాధలను అనుసరించడం వల్ల సాధ్యమౌతుంది కానీ వారిని అనుకరించడంవల్ల కాదు. అనుకరించడం అనేది బాహ్యక్రియ. ఆదర్శం అనేది అంతరంగలోని సద్గుణం. బంధువులు, శత్రువులు, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, మనో,బుద్ధి, అహంకారచిత్రాలు, వృత్తి, కులం, భక్తి, మోహం, తృప్ణ, వయసు ఏవీ లేవని మహాత్ములు చెప్తున్నారు. అంటే వాటన్నింటికీ మూలమైన అహంకారం లేకపోతే అవేవీ లేవని మహానుభావుల బోధ. గదిలో దీపం పోగానే అక్కడే ఉన్న అన్ని వస్తువులు ఒక్కసారిగా కనిపించకుండా పోతాయి. అలాగే అహంకారంపోతే ఈ గుణాలు, వస్తువులు, బంధాలు అన్నీ భౌతికంగా ఉన్నా.. అవి తనవి కావని తెలుస్తుంది. లోపల వస్తువుకు ఇవి ఏవీ లేవన్న సత్యాన్ని చెప్పటమే గీతాబోధ ఉద్దేశం !
🕉🌞🌎🌙🌟🚩
[13:09, 03/01/2021] +91 92915 82862: 🌷117-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
క్షేత్రము-క్షేత్రజ్ఞుడు
14) క్షేత్రమునందు సర్వమును గ్రహింపదగిన సక్రమ ప్రవర్తనము అను వెలుగు జ్ఞానము, తద్భిన్నమగు ప్రవర్తనము అజ్ఞానము. అందు జ్ఞానము యొక్క క్రమము ఈ దిగువ విధముగా క్షేత్రజ్ఞుడగు జీవుని నుండి క్షేత్రమునందు వ్యక్తమగును.
1) దేనియందైనను అభిమానము నశించుట,
2)తాను గొప్ప అను భావము కరిగి పోవుట,
3)హింసా బుద్ధి నశించుట,
4) ఓర్పు అలవడుట,
5)మొహమాటము లేని సూటియైన ప్రవర్తనము,
6)గురువును అంగీకరించి పూజించుట,
7)శారీరక, మానసిక శుచిత్వము,
8)అచంచలత్వము,
9)ఆత్మనిగ్రహము,
10)శబ్ద స్పర్శ రూప రస గంధముల యందు వైరాగ్యము,
11)అహంకారము నశించుట,
12)జననము, మరణము, ముసలితనము, వ్యాధి, దుఃఖము, దోషములు కలుగు విధము తెలియుట,
13)దేనియందైనను విడువలేని ఆసక్తి తొలుగుట,
14)ఇది కావలెనని లేకుండుట, భార్యబిడ్డలు, గృహము తనకు సంబంధించినవి అను బుద్ధి నశించుట,
15)పరిస్థితులతో చిత్తము మారకుండుట,
16)అన్నిటి నడుమ ఒంటరితనమును సేవింపగలుగుట,
17)పదిమంది చేరిన చోట కారణము తెలుసుకొను కుతూహలము నశించుట,
18)ఆత్మను గూర్చిన జ్ఞానము నందు అభిలాష,
19)దేనియందైనను యథాస్థితిని దర్శింప కలుగుట,
20) నాయందు వ్యభిచార మెరుగని భక్తి.
వీని క్రమోన్మీలనము జరుగుచున్నపుడు జ్ఞానము అనబడును. అట్లు కాకున్నను, వీని సంకులత్వము సంభవించినను అజ్ఞానము అనబడును.
🕉🌞🌎🌙🌟🚩
[13:09, 03/01/2021] +91 92915 82862: 131) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
నిరధిష్ఠాన విభ్రాంతేరభావాదాత్మనోఽ స్తితా ౹ శూన్యస్యాపి ససాక్షిత్వాదన్యథా నోక్తిరస్య తే ౹౹76౹౹
76. ఆధారము లేక భ్రాంతి జనింపదు గనుక ఆత్మయే ఆధారముగ స్వీకరింపవలెను. శూన్యమును ప్రతిపాదించుటకు కూడా శూన్యమును గ్రహించు సాక్షి ఒకడుండవలెను.లేనిచో
"అది శూన్యము"అనుటయే అసంభవము గదా!
వ్యాఖ్య:-
శూన్యమే స్వప్రకాశమనినచో అది సత్తారూపమగు బ్రహ్మమే అని వేదాంత వాదము.
ఏది తెలియక భ్రాంతి పుడ్తుందో అది తెలిస్తేనేగాని ఆ"భ్రాంతి"పోదు.
సత్త అంటే ఉనికి.
శాశ్వతంగా ఉండటం--పారమార్థిక సత్తా,అది బ్రహ్మం.దీనికి బాధ లేదు.
వ్యవహారిక సత్తా--ఘటాది ప్రపంచము.దీనికి బ్రహ్మజ్ఞానంతో బాధ.
ప్రాతిభాసిక సత్త--వ్యవహారంలో గూడా లేనిది,కాని ఉన్నట్లు కనబడుతుంది.రంగరజతం,
రజ్జుసర్పం,మృగతృష్ణాజలము.
ఇందులో పారమార్థిక సత్త,శాశ్వతం అదిపోదు.మాయవలన మరుగున బడవచ్చు.
వ్యవహారిక సత్త బ్రహ్మజ్ఞానంతో తప్ప ఇంక దేనితోనూ పోదు.అనగా బాధ లేదు.బాధ అంటే స్పష్టంగా అదికాదని తెలియటం.
(అపరోక్ష మిధ్యా నిశ్చయం)మూలా విద్యా వస్తువు లయిన జాగరణంలోని జగత్పదార్థము లన్ని వ్యవహారిక సత్తులు.వీటి సత్త బ్రహ్మజ్ఞానం కలిగే వరకు తిరుగులేనిది.
రజ్జుసర్పాది భ్రాంతులు ప్రాతిభాసిక సత్తులు.తత్కాలికంగా అలా ఉన్నట్లు కనిపిస్తాయి.కాని వ్యవహారిక జ్ఞానం(శుక్తి రజ్జువు మొదలగునవి)వలన పోతుంది. కనుక సకల మిధ్యా పదార్థములకు వ్యవహారిక సత్త ఖాయం.ఈ ప్రాతిభాసిక సత్త బ్రహ్మజ్ఞానంతో బోయేది కాదు.వ్యవహారిక జ్ఞానంతోనే పోతుంది.
"శుక్తి"--
అజ్ఞానం వలన పుట్టిన రజితభ్రాంతి శుక్తి జ్ఞానంతోనే పోతుందిగాని బ్రహ్మజ్ఞానంతో పోదు.
"బ్రహ్మ"--
అజ్ఞానంతో వచ్చిన సంసార భ్రాంతి శుక్తిజ్ఞానంతో పోదు, బ్రహ్మజ్ఞానంతోనే పోతుంది.బ్రహ్మ జ్ఞానము వలన సకల మిధ్యాజ్ఞానాలు పోవాలి.
స్వప్నం ఎలా క్రమరహితమో జగత్తు అట్టిదే.క్రమ వివక్ష వ్యర్థము. అయినా కొన్ని ఉపనిషత్తులలో సృష్టి క్రమం రకరకాలుగా ఉన్నది.
ఛాందోగ్య,తైత్తిరీలలో తేడా ఉన్నది.
శ్రుతులన్నీ ఒక్కటే.సృష్టి క్రమ లయక్రమాలు మందబుద్ధులకు, ఉపాసనాపరులకు జిజ్ఞాస తీర్చటానికి చెప్పిందే గాని ఉపనిషత్తుల,ఆచార్యుల అసలు తాత్పర్యం అది కాదు.
అనాత్మ,మిథ్య అయిన ప్రపంచ పరిశోధన వ్యర్థము.సర్వమూల తత్త్వమయిన "బ్రహ్మం" గూర్చి చెప్పటమే వేదము యొక్క లక్ష్యము.అదే మనకు శ్రేయస్కరము కదా!
అవిద్య లేదా అజ్ఞానందుండే వాడు జీవుడు.జీవునకు తన స్వరూపము తెలియదు.ఇతర పదార్థ స్వరూపమూ తెలియదు.
కాని ఈశ్వరునకు శుద్ధ సత్త్వం వలన జ్ఞానం తప్ప,అజ్ఞానం/అవిద్య ఉండవు.ఇతడే స్రష్ట,సర్వవ్యాపి,నిత్యముక్తుడు
(తనస్వరూపం తెలిసిన వాడు) సర్వజ్ఞుడు,ఇతర పదార్థములందు ఆవరణం/అవిద్య లేనివాడు.
బంధ మోక్షములు అభాసుడయిన జీవుని యందే. నిరావరణుడయిన ఈశ్వరుని యందు అవి ఉండవు. తత్త్వజ్ఞుడు కదా!కనుక ఈశ్వరుని చిదాభాసుడు నిత్యముక్తుడు.
జీవన్ముక్తుడు-జ్ఞాని వీనిదృష్టిలో అజ్ఞానము దాని కార్యమయిన ప్రపంచము తుచ్ఛము.కనుక ప్రపంచం ఒక మిధ్య.కనుక దానికి కర్త లేడు ఈశ్వరుడు లేడు,
సాక్షి లేడు,సాక్ష్యము లేదు, దృశ్యము లేదు.కనుక దృక్కు లేడు.
అయితే సాక్షి అని దేన్ని పిలుస్తున్నామో ఆ చైతన్యం ఉన్నది.సంసారమే మిధ్య కనుక బంధం లేదు,అందుచే మోక్షమూ లేదు.అజ్ఞానం లేదు,కనుక జ్ఞానమూ లేదు.
ప్రపంచం ఉందని తలచిననాడే పై బిరుదులు.అది మిథ్య అయినపుడు బిరుదులు అంతే.(చెల్లెలుంటే అక్క అని ఉండవచ్చు. చెల్లెలు తమ్ముడూ లేరంటే అక్క లేదు.అలా ఇది)
అసలయిన పారమార్థిక స్థితి.కనుక సర్వకర్తవ్యాలు,కర్తృత్వబుద్ధి వదలాలి.ఆత్మ నిత్యముక్తము.ఈ "జ్ఞానం" గల జీవుడు "బ్రహ్మమే".
🕉🌞🌏🌙🌟🚩
[13:22, 03/01/2021] +91 92915 82862: 18-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
కాంభోజి - జంపె (బేగడ - త్రిపుట).
పల్లవి:-
సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు
ప్రకటముగ మాయింటను జానకీపతిపూజ యను పండుగాయెను మీరు!! స!!
చరణము(లు):-
నిరతమును పదునాలుగుభువనములు కుక్షిలోనుంచుకొని నిర్వహించెడి స్వామికి
ఇరవుగ నా హృదయకమలకర్ణిక మధ్యమున భక్తినుంచికొనియు
శరణాగతత్రాణ బిరుదుగల్గిన తండ్రి నను కరుణింపుమనివేడుచు
నరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరింపచేయువేళ!! స!!
తళుకు తళుకున ముద్దు గులుకు జిగికుందనపు నిలువుటంగి దొడిగి నే
నలరు ఘుమఘుమ పరిమళించే వనమాలికాహారములు మెడను వేసి
లలితకౌస్తుభ దివ్యరత్నాల చొక్కపుతాళి మెడలోవేసియు
అల దయాపరవిగ్రహునకు భుజకీర్తులనిడి యవి సవరించువేళ మీరు!! స!!
పదియారువన్నె బంగరుశాలువ దట్టికట్టి విదియచంద్రుని గేరు
నుదుట కస్తురి నామమునుదిద్ది తామరలవంటి మృదుపదములందు
కదిసి మువ్వలు పాదసరము లందెలు ఘల్లుఘల్లుమన పొంకముగా నుంచియు
కదిసి వడ్యాణములు మొలనూలు ఘంటలు హరికినలంకరించువేళ మీరు!! స!!
కౌమోదకీ శంఖచక్రనందక శార్ఙ్గకార్ముకాంచిత కరముల
శ్రీమించు కనకంపు హురు మంచిముత్యాల చికిలి కడియములనమర్చి
ప్రేమ చక్కవ్రేళ్ళ ముద్దుటుంగరములను ప్రియమొప్ప వీనులయందున
మా మనోహరునకు వజ్రముల కర్ణకుండలము లమరించువేళ మీరు!! స!!
శిరమునను శతకోటి సూర్యులనుమించు భాసురకిరీటమును ధరింపజేసి
హరిపాదకమలములను మంచి స్వర్ణకుసుమముల పూజచేసి అ
గరు ధూపదీపనైవేద్యతాంబూలాది సకలోపచార మొసగి
సరసభద్రాద్రీశునకు రామదాసుడు సాష్టాంగ మొనరించువేళ మీరు!! స!!
🕉🌞🌏🌙🌟🚩
[13:26, 03/01/2021] +91 92915 82862: 18-41-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII లోకములో జనులకు వారి వారి గుణములనుబట్టి కర్మములు విభజింపబడినవని తెలుపుచున్నారు –
బ్రాహ్మణ క్షత్రియవిశాం
శూద్రాణాం చ పరన్తప! |
కర్మాణి ప్రవిభక్తాని
స్వభావప్రభవైర్గుణైః ||
తా:- శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు వేఱువేఱుగా విభజింపబడినవి.
వ్యాఖ్య:- ఇదివఱలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్యములవారు వారివారి గుణములనుబట్టి కర్మలనుబట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పియుండిరి* ఇప్పుడును ఆ భావమునే వ్యక్తీకరించుచు వారివారి జన్మాంతర సంస్కారము వలన నేర్పడిన గుణముల ననుసరించియే వారివారికి ఆ యా కర్మలు, (వానిననుసరించి ఆ యా వర్ణములు) విభజింపబడినవని తెలియజేయుచున్నారు.
దీనిని బట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుటలేదనియు, వారి వారి గుణములనుబట్టియే జన్మ, కర్మలు ఏర్పడుచున్నవనియు స్పష్టమగుచున్నది. ఇట్టి పరిస్థితియందు ప్రతివానికిని ఊర్ధ్వస్థితికి బోవుటకు అవకాశము లభించుచున్నది. అనగా జన్మనా నీచజాతియందు పుట్టినప్పటికి తమ తమ కర్మలయొక్క శుద్ధత్వముచే, పారమార్థిక సాధనాతిశయముచే, పవిత్రతచే ఉత్తమవర్ణస్థులుగా తయారుకావచ్చును. ఈ ప్రకారముగ సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నతశిఖరముల నధిరోహించుటకు అవకాశములు కల్పించుట గీతయొక్క ఒకానొక విశిష్టతయై యున్నది.
ప్ర:- బ్రాహ్మణాది వర్ణములు దేనిచే నేర్పడినవి?
ఉ:- వారి వారి గుణములచే.
ప్ర:- చాతుర్వర్ణ్యములవారికి కర్మ లేప్రకారముగ విభజింపబడినవి?
ఉ: - వారి వారి (జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావమువలన పుట్టిన గుణములను బట్టి ఆ యా కర్మలు వారికి విభజింపబడినవి.
ప్ర: - పుట్టుకచే జాతి ఏర్పడినదా?
ఉ:- కాదు. వారి వారి కర్మలచే.
----------------------------
* చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః (4-13)
🕉🌞🌎🌙🌟🚩
[13:32, 03/01/2021] +91 92915 82862: తిరుప్పావై 20వ రోజు పాశురం_
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
20-పాశురం
ॐॐॐॐॐॐॐ
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్
నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్!!
భావం :-
ॐॐॐॐॐॐॐॐॐ
ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము కలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము.
బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.
ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారుy కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో.
అవతారిక :-
ॐॐॐॐॐॐॐॐॐॐ
గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి.
ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపు
తున్నారు.
స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.
నీళాకృష్ణులను మేల్కొలిపి, తమను కరుణించవలెనని గోపికలు ప్రార్ధించారు. యీ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతియైన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్ధిస్తున్నారు. సాక్షాత్తూ లక్ష్మీదేవివంటి తల్లియైన నీళాదేవిని కూడా మేల్కొలిపి, తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనందస్నానాన్ని చేయించుమని ప్రార్ధిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి.
సింధు భైరవి రాగము - ఆదితాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ప.. ముప్పది మూడుకోట్ల దేవతల
ముప్పును తొలగగ బ్రోచే బలుడా!
ముప్పునిచ్చువారిని గూల్పెడి - నీ
విప్పు డాశ్రుతుల గావమేలుకో!....
1. చ.. కనక కలశ సమ కుచయుగ శోభితకన, బింబాధర! కరి రిపుమధ్యా!
శ్రీ నప్పిన్నా! లక్శ్మి౧ మాయమ్మ!
వినుమోతల్లీ! యింక మేలుకో!
2. చ.. ముందుగ మాకొక వీవన నీయవె!
అందమైన అద్దమ్ము! నీయవే!
నంద సుతునితో విరహార్తులమగు
నందర మము నీరాడజేయవే!
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, భలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.
ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు, "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే. "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.
"శెప్పం ఉడైయాయ్! " సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఎమైంది నీ మాట. " తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా, ఏదోశం అంటని వాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.
అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరి పూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.
వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, " తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.
పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.
కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ
"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం
భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"
హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే.
అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలను కొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.
ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది.
పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు.
ॐॐॐॐॐॐॐॐॐॐ
తిరుప్పావై 20వ పాశురము/తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీ . మేలుకో శ్రీకృష్ణ మేలుకో వేమయ్య
మేల్కొని మాకింక మేలు సేయ
సామర్థ్యమున్నట్టి స్వామివి నీవని
దేవతలెల్లరు తెలుపుచుండ
అవమానముల బాపి నాదుకునెడు బల
శాలి వనుచు వనమాలి వనుచు
వెంటపడి విరోధి వీరుల నుసి చేసి
సంకటముల బాపు సరసిజాక్ష!!
తే.గీ.పూర్ణ గుణముల దేవిగా పొందు కీర్తి
క్రుంగి పోయిన కడుపున్న రంగ సఖియ
మేలుకో వమ్మ పరిపూర్ణ మేటి వనిత
ఆలసింపక నీరాడ యనుపుమమ్మ
శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[20:36, 03/01/2021] +91 95058 13235: 3.1.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది మూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.25 (ఇరువది ఐదవ శ్లోకము)
స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామ కిమ్|
యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వః॥9213॥
"సాధ్వీమణులారా! మీ కందరకు స్వాగతము. విచ్చేయుడు. నేను మీకొరకు ఏమి చేయాలి? మీ వంటి ప్రేమపూరిత హృదయులు నా దర్శనమునకై ఇచటికి విచ్చేయుట ఉచితమైసదే!
23.26 (ఇరువది ఆరవ శ్లోకము)
నన్వద్ధా మయి కుర్వంతి కుశలాః స్వార్థదర్శినః|
అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా॥9214॥
హితాహితములను బాగుగా ఎఱిగిన ప్రాజ్ఞులు తమ శ్రేయస్సును కోరుకొనుచు ఆత్మీయుల యందువలె సాక్షాత్తుగా నా యందును ప్రేమ చూపుదురు. కాని నా యందు చూపెడి భక్తి నిరంతరము నిష్కామ భావముతో ఒప్పుచుండును.
23.27 (ఇరువది ఏడవ శ్లోకము)
ప్రాణబుద్ధిమనఃస్వాత్మదారాపత్యధనాదయః|
యత్సంపర్కాత్ప్రియా ఆసంస్తతః కో న్వపరః ప్రియః॥9215॥
23.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
తద్యాత దేవయజనం పతయో వో ద్విజాతయః|
స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః॥9216॥
లోకములో ప్రాణములు, బుద్ధి, మనస్సు, దేహము, భార్యాపుత్రులు, ధనము మొదలగునవి ఆత్మసంపర్కమువలన ప్రియములగును. అట్టి ఆత్మకంటె, అనగా పరమాత్మనైన నా కంటె ప్రియమైన వస్తువు ఏదియు ఉండదు. ఏలయన సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడను నేనే. అందువలన త్రికరణ శుద్ధిగా నా దర్శనమును ఆశించియే మీరు ఇచటికి వచ్చితిరి. ఆ ప్రయోజనము నెఱవేఱినది. ఇక మీరు యజ్ఞశాలకు వెళ్ళవచ్చును. గృహస్థాశ్రమ ధర్మమును పాటించుచున్న మీ పతులయొక్క యజ్ఞకార్యములు మీ సాహచర్యమువలననే పూర్తియగును".
పత్న్య ఊచుః
23.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
మైవం విభోఽర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పదమూలమ్|
ప్రాప్తా వయం తులసిదామపదావసృష్టం కేశైర్నివోఢుమతిలంఘ్య సమస్తబంధూన్॥9217॥
బ్రాహ్మణపత్నులు ఇట్లు నుడివిరి "కృష్ణప్రభూ! జగత్పూజ్యుడవైన నీవు ఇట్టి పరుష వచనములను పలుకదగదు. 'ఒకసారి పరమాత్మను పొందిన భక్తులు తిరిగి సంసారసాగరమునందు మునుగరు' అని చెప్పిన వేదవాక్యమును సత్యము చేయుము. నిత్యము నీ పాదసేవాభాగ్యమును మాకు ప్రసాదింపుము. భక్తులద్వారా నీ పాదములయందు సమర్పితమైన తులసిమాలలను మా శిరములపై ధరించుటకొఱకే మా బంధువుల ఆజ్ఞలను సైతము ఉల్లంఘించి, నీ చరణములను ఆశ్రయించితిమి.
23.30 (ముప్పదియవ శ్లోకము)
గృహ్ణంతి నో న పతయః పితరౌ సుతా వా న భ్రాతృబంధుసుహృదః కుత ఏవ చాన్యే|
తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనాం నో నాన్యా భవేద్గతిరరిందమ తద్విధేహి॥9218॥
శత్రుసూదనా! ఒకవేళ నీ మాటప్రకారము మేము మా ఇండ్లకు తిరిగివెళ్ళినను మా భర్తలు, తలిదండ్రులు, పుత్రులు, సోదరులు, బంధుమిత్రులు మమ్ము స్వీకరింపరు (ఆదరింపరు). అంతేగాదు ఇతరులును మమ్ము చులకనగా చూతురు. అందువలన సర్వలోక పూజ్యములైన నీ దివ్యపాదములను శరణుజొచ్చిన మాకు అన్ని విధములుగా నీవే దిక్కుఇంక మాకు మఱియొక గతియే లేదు. కనుక ఇచటనే ఉండి నీ చరణములను సేవించుచుండెడి భాగ్యమును మాకు ప్రసాదింపుము.
శ్రీభగవానువాచ
23.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయః|
లోకాశ్చ వో మయోపేతా దేవా అప్యనుమన్వతే॥9219॥
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు చెప్ఫెను బ్రాహ్మణ పత్నులారా! మీ భర్తలు, కుమారులు, తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు మొదలగువారు ఎవ్వరునూ మిమ్ములను తిరస్కరింపరు. వారేకాదు, ఈ లోకమంతయునూ మిమ్ములను ఆదరించును. ఏలనన, ఇప్పుడు మీరు నావారు. నాతో కలసిపోయినవారు. పరికించుడు! దేవతలు కూడా నామాటను ఆమోదించుచున్నారు.
23.32 (ముప్పది రెండవ శ్లోకము)
న ప్రీతయేఽనురాగాయ హ్యంగసంగో నృణామిహ|
తన్మనో మయి యుంజానా అచిరాన్మామవాప్స్యథ॥9220॥
ఈ లోకంలో మానవులకు నా పట్ల కలిగే ప్రేమానురాగములకు నాయొక్క అంగముల సాంగత్యమే కారణము కాదు. కావున మీ మనస్సులను నాయందే నిలుపుడు. అందువలన అతితొందరగా మీరు నన్ను చేరుకొందురు. ఇక, మీరు వెళ్ళుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:36, 04/01/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[05:37, 04/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
774వ నామ మంత్రము 4.1.2021
ఓం మహత్యై నమః
సర్వలోకపూజిత మరియు మహత్తైన పరిమాణంగలిగన పరబ్రహ్మస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహతీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం మహత్యై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు ఐహిక సుఖశాంతులు మరియు ఆముష్మిక సద్గతులను ప్రసాదించును.
భగవంతుడు అంటే అందరికన్నా పెద్దవాడు. అట్టి భగవంతుడిని మహాన్ అని పిలుస్తారు. మహాన్ అనే శబ్దం పుంలింగ శబ్దము. ఈ శబ్దానికీ మహతీ యనునది స్త్రీలింగ శబ్దము. భగవాన్ అని భగవంతుడిని అనినట్లే భగవతీ అని అమ్మవారిని అంటాము. అలాగే ఈ మహతీ అనే శబ్దం అమ్మవారిని అందరికన్నా పెద్దది అని చెప్పునపుడు అంటాము. ఆ తల్లి మహనీయురాలు. దేవతలందరిచేత పూజ్యురాలు. సృష్టికి ముందే తానున్నది. త్రిమూర్తులకు కూడా ఆదిలోనే ఉన్నది గనుకనే అమ్మవారిని ఆదిపరాశక్తి అని అన్నాము. అలాగే ఇప్పుడు అమ్మవారిని మహతీ యని అన్నాము. బ్రహ్మాండం పరిమాణం ఒక కోటి ఎనబై ఏడులక్షల, డెబ్బై నాలుగువేల, తొమ్మిదివందలఇరవై (1,87,74,920) కోట్ల యోజనములు ఉంటే, అమ్మవారు ఆ బ్రహ్మాండమంతా తన స్వరూపమై ఉన్నది. అలాంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఉన్నవి. అటువంటి బ్రహ్మాండము లన్నిటియందూ తానే ఆవరించినది గనుకనే అమ్మవారు మహతీ యని అనబడినది.
మనశరీరంలో గల వెన్నెముక వీణా దండమైతే, ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు తంత్రులు కాగా, మూలాధారంలోని కుండలినీ శక్తి ఆ వీణా తంత్రుల నాదమవగా, ఆ వీణానాదమే కచ్ఛపీ యను సరస్వతీ దేవి వీణ. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ (27వ నామ మంత్రము) సరస్వతీ దేవి వీణయైన కచ్ఛపీ వీణానాదముకన్నా అమ్మవారి మధురమైనసల్లాపములు మధురమైనవని అన్నాము. అంటే అక్కడ (27వ నామ మంత్రములో) సరస్వతీ వీణను (కచ్ఛపీ వీణను) ప్రస్తావిస్తే, ఇక్కడ అమ్మవారిని నారదమునీంద్రుని మహతీ వీణగా ప్రస్తావించాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓంమహత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:37, 04/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
200వ నామ మంత్రము 4.1.2021
ఓం సర్వమంగళాయై నమః
మంగళప్రదములైన వన్నింటినీ ప్రసాదించునది మరియు భక్తుల కష్టములను తొలగించి శుభములను కలిగించు సర్వమంగళస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమంగళా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమంగళాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతోను, నిశ్చలచిత్తముతోనూ ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి వారి జీవనమంతయు మంగళప్రదమొనర్చును మరియు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించును.
సర్వమంగళా అనగా సర్వమంగళ స్వరూపిణి. జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలలో గయలో ఉన్న సర్వమంగళాదేవి ఒకటి. పరమేశ్వరి అంటేనే మంగళస్వరూపిణి. స్త్రీలకు సకలసౌభాగ్యాలను చేకూర్చు సౌభాగ్యదేవత మంగళగౌరి. అందుకే వివాహంలో శుభముహూర్తానికి ముందు వధువుచేత గౌరీ పూజ చేయించడం మన హిందూసాంప్రదాయం.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే|
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!
సమస్తములైన శుభములకును శుభ కరమగు దానా !శివుని అర్ధాంగి అయిన సమస్తములైన ప్రయోజనములను నెర వేర్చెడి శక్తి గలదానా భక్తులకు పెద్ద దిక్కు అయినదానా ! ముక్కంటి అర్ధాంగి విష్ణుమూర్తి సోదరీ ఓ పార్వతి మాతా ! నీకు నా యీ వందనము చెందును గాక !
భగదారాధన సమయంలో ప్రారంభంలో విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ, ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను కూడా సంస్మరిస్తు ఇలా అంటాము:-
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్
నామము చేతగాని, రూపము చేతగాని ఏదేవుడు శివుడో, ఏదేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణము సర్వత్ర, సర్వలోకములకూ మంగళకరము.
దేవాసురులు అమృతము కొఱకై సాగరమథన సమయంలో హాలాహలం ఉద్భవించగా, ఆ హాలాహలాగ్నికి లోకాలు అల్లాడిపోతుంటే జగన్మాత పరమేశ్వరుని ఆ హాలాహల భక్షణము చేయమనినప్పుడు బమ్మెరపోతనా మాత్యులవారు జగన్మాతను సర్వమంగళ యని అన్నారు.
కంద పద్యము
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
భావము
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.
బ్రాహ్మణుడు, ముత్తైదువ, గోవు, అగ్ని, బంగారము, నేయి, ఆదిత్యుడు, జలము, రాజు, తులసీదళములు, పుష్పములు, చెరకు, చిక్కుడు, జీలకఱ్ఱ, ధనియాలు, పాలు, కుంకుమ, ఉప్పు, నల్లపూసలు, పసుపు కొమ్ములు ఇత్యాదులు అన్నియును మంగళకరమైనవి. ఇటువంటివి అన్నియును సదా సమకూరి ఉండునట్లు జగన్మాత అనుగ్రహిస్తుంది గనుక అమ్మవారిని సర్వమంగళా యని అన్నాము. ధనధాన్యములు, పాడిపంటలు, సిరిసంపదలు, అలాగే స్త్రీలకు ఐదవతనమును ప్రసాదించును.
ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట. ఆ అయిదు మంగళ కర వస్తువులు 1.మంగళసూత్రము, 2. పసుపు, 3.కుంకుమ, 4.గాజులు, 5. మట్టెలు. కనుకనే మన హిందూ స్త్రీలు సర్వదా ఈ ఐదు అలంకారములను ధరించి ఉంటారు. మంగళకరమైస వీటిని స్త్రీలకు సదా కలిగియుండేలా జగన్మాత కరుణించును గనక అమ్మవారిని సర్వమంగళా యని అన్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమంగళాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:37, 04/01/2021] +91 95058 13235: 4.1.2021 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది మూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
23.33 (ముప్పది మూడవ శ్లోకము)
ఇత్యుక్తా ద్విజపత్న్యస్తా యజ్ఞవాటం పునర్గతాః|
తే చానసూయవః స్వాభిః స్త్రీభిః సత్రమపారయన్॥9221॥
శ్రీశుకుడు పలికెను శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ ద్విజపత్నులు తిరిగి యజ్ఞశాలలకు చేరిరి. ఆ బ్రాహ్మణులును తమ భార్యలను ఎట్టి దోషదృష్టితో చూడక ప్రేమతో ఆదరించిరి. పిమ్మట వారు తమ సతులతో గూడి యజ్ఞమును పూర్తిచేసిరి.
23.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
తత్రైకా విధృతా భర్త్రా భగవంతం యథాశ్రుతమ్|
హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనమ్॥9222॥
ఆ విప్రపత్నులలో ఒక వనిత తన భర్త అడ్డగింపగా ఇంటిలో ఉండిపోయెను. ఐనను ఆ భక్తురాలు తాను విన్నరీతిగా (తనకు తెలిసిన విధముగా) భగవంతుని తన హృదయమునందే నిలుపుకొని, పురాకృత కర్మఫలముగా తనకు లభించిన దేహమును త్యజించెను.
23.35 (ముప్పది ఐదవ శ్లోకము)
భగవానపి గోవిందస్తేనైవాన్నేన గోపకాన్|
చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః॥9223॥
శ్రీకృష్ణపరమాత్మ బ్రాహ్మణపత్నులు సమర్పించిన చతుర్విధములగు భోజన పదార్థములను ముందుగా గోపాలురచే భుజించేసెను. పిదప ఆ ప్రభువు తానును స్వయముగా ఆరగించెను.
23.36 (ముప్పది ఆరవ శ్లోకము)
ఏవం లీలానరవపుర్నృలోకమనుశీలయన్|
రేమే గోగోపగోపీనాం రమయన్ రూపవాక్కృతైః॥9224॥
ఇట్లు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు మానవలోకమర్యాదను అనుసరించుచు, తన రూపవైభవము చేతను, వాక్చాతుర్యములచేతను గోవులను, గోపాలురను, గోపికలను రంజింపజేయుచు విహరించెను. వారి అలౌకిక ప్రేమలకు తానును ఆనందించెను.
23.37 (ముప్పది ఏడవ శ్లోకము)
అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః|
యద్విశ్వేశ్వరయోర్యాచ్ఞామహన్మ నృవిడంబయోః॥9225॥
లోకకల్యాణార్థము అవతరించిన బలరామకృష్ణులు సామాన్య మానవులవలె మసలు కొనుచుండుటచే వారి మహత్త్వమును గుర్తింపలేక అజ్ఞానులైన ఆ బ్రాహ్మణులు ఆ దివ్యపురుషుల అభ్యర్థనను తిరస్కరించి, అపరాధమొనర్చిరి. పిమ్మట ఆ ద్విజులు తెలివితెచ్చుకొని, తామొనర్చిన అకృత్యమును (దోషమును) స్మరించుకొనుచు మిగుల పశ్చాత్తాపపడిరి.
23.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీమ్|
ఆత్మానం చ తయా హీనమనుతప్తా వ్యగర్హయన్॥9226॥
ఆ ద్విజులు శ్రీకృష్ణపరమాత్మునియెడ తమ పత్నులకు గల అలౌకికభక్తిని అర్థము చేసికొనిరి. పిదప వారు తమ భక్తిరాహిత్యమునకు నొచ్చుకొనుచు, పరితాపముతో తమను తాము ఇట్లు .నిందించుకొనిరి.
23.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
ధిగ్జన్మ నస్త్రివృద్విద్యాం ధిగ్వ్రతం ధిగ్బహుజ్ఞతామ్|
ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖా యే త్వధోక్షజే॥9227॥
'మనము ఉత్తమ కులముస జన్మించితిమి. గాయత్రీ ఉపదేశమును పొంది, ద్విజులమైతిమి. వేదాధ్యయన మొనర్చి దీక్షాపూర్వకముగా గొప్ప గొప్ప యజ్ఞములను ఆచరించితిమి. (ఈ విధముగా మనకు శౌక్ల్యము, సావిత్రము, దైక్షము, అను మూడు జన్మలు ప్రాప్తించినవి). వేదశాస్త్రములను సమగ్రముగా అధ్యయనము చేసితిమి. నియమనిష్ఠలతో బ్రహ్మచర్యమును పాటించితిమి. వైదిక (శ్రౌత) విజ్ఞానమును పుక్కిటబట్టితిమి. మనము పవిత్ర వంశమునకు చెందినవారము. యజ్ఞయాగాది కర్మలను నిర్వహించుటయందును, నిర్వహింపజేయుట యందును (యజనయాజనముల యందు) సర్వసమర్థులము. ఐనను కృష్ణభగవానుని యెడ భక్తిశ్రద్ధలు లేనట్టి మన ఈ జన్మాదుల ఔన్నత్యములన్నియును వ్యర్థములే.
23.40 (నలుబదియవ శ్లోకము)
నూనం భగవతో మాయా యోగినామపి మోహినీ|
యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః॥9228॥
భగవంతుని మాయ తిరుగులేనట్టిది. ఆ మాయ నిశ్చయముగా యోగీంద్రులను సైతము మోహింపజేయును. మనము ద్విజశ్రేష్ఠులమై మానవాళికి గురువులమైనప్పటికినీ దైవమాయామోహితులమై, మనకు ఏది శ్రేయస్కరమో ఎఱుగలేకపోయితిమి'.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 599 / Bhagavad-Gita - 599 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 16 🌴
16. తత్త్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు య: |
పశ్యత్యకృతబుద్ధిత్యాన్న స పశ్యతి దుర్మతి: ||
🌷. తాత్పర్యం :
కనుక ఈ ఐదు అంశములను గుర్తించక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థదృష్టితో గాంచలేడు.
🌷. భాష్యము :
పరమాత్ముడు హృదయమునందు మిత్రుని రూపమున నిలిచియుండి తనచే కార్యములు ఒనరింపజేయుచున్నాడని మూఢుడైనవాడు తెలిసికొనజాలడు. కార్యస్థానమైన దేహము, కర్త, ఇంద్రియములు, ప్రయత్నము అనునవి కార్యము యొక్క భౌతికకారణములు కాగా, పరమాత్ముడు చరమకారణమై యున్నాడు.
కనుక ప్రతియొక్కరు ఈ నాలుగు భౌతికకారణములనే గాక పరమకారణము సైతము గాంచవలసియున్నది. పరమాత్ముని గాంచనివాడే తనను తాను కర్తగా భావించును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 599 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 16 🌴
16. tatraivaṁ sati kartāram ātmānaṁ kevalaṁ tu yaḥ
paśyaty akṛta-buddhitvān na sa paśyati durmatiḥ
🌷 Translation :
Therefore one who thinks himself the only doer, not considering the five factors, is certainly not very intelligent and cannot see things as they are.
🌹 Purport :
A foolish person cannot understand that the Supersoul is sitting as a friend within and conducting his actions. Although the material causes are the place, the worker, the endeavor and the senses, the final cause is the Supreme, the Personality of Godhead.
Therefore, one should see not only the four material causes but the supreme efficient cause as well. One who does not see the Supreme thinks himself to be the doer.
🌹 🌹 🌹 🌹 🌹
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 208, 209 / Vishnu Sahasranama Contemplation - 208, 209 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻208. సురారిహా, सुरारिहा, Surārihā🌻
ఓం సురారిఘ్నే నమః | ॐ सुरारिघ्ने नमः | OM Surārighne namaḥ
🌾సురారిహా, सुरारिहा, Surārihā🌾
సురారీన్ హంతి దేవతల శత్రువులను చంపువాడు.
:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
చ. అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం
దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం
హుఁడు సురశత్రుయూథప వధోగ్రుఁడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై. (303)
దేవతా ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడూ, అత్యంత భయంకరమైన అట్టహాసంతోకూడిన ముఖం కలవాడూ, తన కోరలనుండి బయలు వెడలిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలవాడూ, ఊహింపశక్యంకాని మహిమ కలవాడూ అయిన శ్రీనృసింహదేవుడు అడవులయందూ, ప్రమాద స్థలాలయందూ, రణ భూములయందూ, నిప్పుల మంటలయందూ అన్ని యిక్కటులయందూ నాకు దిక్కగునుగాక!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 208🌹
📚. Prasad Bharadwaj
🌻208. Surārihā🌻
OM Surārighne namaḥ
Surārīn hanti / सुरारीन् हन्ति Because He kills the enemies of suras, devas i.e., gods, He is Surārihā.
Śrīmad Bhāgavata - Canto 6, Chapter 8
Durgeṣvaṭavyājimukhādiṣu prabhuḥ pāyānnr̥siṃho~surayūthapāriḥ,
Vimuñcato yasya mahāṭṭahāsaṃ diṣo vinedurnyapataṃśca garbhāḥ. (14)
:: श्रीमद्भागवते, षष्ठस्कन्धे अष्टमोऽध्यायः ::
दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहो~सुरयूथपारिः ।
विमुञ्चतो यस्य महाट्टहासं दिषो विनेदुर्न्यपतंश्च गर्भाः ॥ १४ ॥
May Lord Nṛsiḿhadeva, who appeared as the enemy of Hiraṇyakaśipu, protect me in all directions. His loud laughing vibrated in all directions and caused the pregnant wives of the asuras to have miscarriages. May that Lord be kind enough to protect me in difficult places like the forest and battlefront.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 209 / Vishnu Sahasranama Contemplation - 209🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻209. గురుః, गुरुः, Guruḥ🌻
ఓం గురవే నమః | ॐ गुरवे नमः | OM Gurave namaḥ
🌾గురుః, गुरुः, Guruḥ🌾
గిరతి సర్వాః విద్యాః ఉపదిశతి సర్వ విద్యలను ఉపదేశించును. లేదా గురుః అనగా తండ్రి; ఎల్ల ప్రాణులకును గురుడు లేదా తండ్రి.
:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43 ॥
సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తీ! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులునూ, సర్వశ్రేష్ఠులగు గురువులును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొక రెట్లుండగలరు?
:: శ్రీమద్భాగవతే ప్రథమ స్కన్ధే అష్టమోఽధ్యాయః ::
శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిగ్రాజన్యవంశదహనానపవర్గవీర్య ।
గోవిన్ద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే ॥ 43 ॥
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 209🌹
📚. Prasad Bharadwaj
🌻209. Guruḥ🌻
OM Gurave namaḥ
Girati sarvāḥ vidyāḥ upadiśati / गिरति सर्वाः विद्याः उपदिशति As He is the instructor of all vidyās i.e., arts and sciences, He is Guruḥ. Or as He is the originator of all beings, He is Guruḥ.
Śrīmad Bhagavad Gīta - Chapter 11
Pitā’si lokasya carācarasya tvamasya pūjyaśca gururgarīyān,
Na tvatsamo’styabhyadhikaḥ kuto’nyo lokatraye’pyapratimaprabhāva. (43)
:: श्रीमद्भगवद्गीत - विश्वरूपसंदर्शन योग ::
पिताऽसि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥
You are the father of all; of animate and inanimate alike. No one but you are worthy of worship. O Guru sublime! Unparalleled by any other in the three worlds, who may surpass you, O Lord of power incomparable!
Śrīmad Bhāgavata - Canto 1, Chapter 8
Śrīkr̥ṣṇa kr̥ṣṇasakha vr̥ṣṇyr̥ṣabhāvanigrājanyavaṃśadahanānapavargavīrya,
Govinda godvijasurārtiharāvatāra yogeśvarākhilaguro bhagavannamaste. 43.
:: श्रीमद्भागवते प्रथम स्कन्धे अष्टमोऽध्यायः ::
श्रीकृष्ण कृष्णसख वृष्ण्यृषभावनिग्राजन्यवंशदहनानपवर्गवीर्य ।
गोविन्द गोद्विजसुरार्तिहरावतार योगेश्वराखिलगुरो भगवन्नमस्ते ॥ ४३ ॥
O Kṛṣṇa, O friend of Arjuna, O chief amongst the descendants of Vṛṣṇi, You are the destroyer of those political parties which are disturbing elements on this earth. Your prowess never deteriorates. You are the proprietor of the transcendental abode, and You descend to relieve the distresses of the cows, the brāhmaṇas and the devotees. You possess all mystic powers, and You are the preceptor of the entire universe. You are the almighty God, and I offer You my respectful obeisances.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥
గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥
Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 152 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 82 🌻
పంచదార తెల్లగానే ఉంది, ఉప్పు తెల్లగానే ఉంది. ఈ రెండిటిని కలిపేశాము. ఇప్పుడు ఈ రెండిటిని వేరు చేయాలంటే ఎలాగా? రెండూ నీళ్ళల్లో కరిగిపోతాయి. మరి ఎట్లా వేరు చేయాలి? అని ఆలోచన చేస్తే, దానికో ఉపమానం చెప్పారు.
అంటే సాధకుడు చీమలాగా, ఆ పంచదారను ఉప్పు కలిసినటువంటిది తీసుకొచ్చి, చీమల ముందు పోసినట్లైతే, చీమ ఏం చేస్తుంది? ఉప్పు అంతా వదిలేసి, పంచదార పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే, దానికి స్పష్టంగా తెలుసు, ఉప్పేదో, పంచదార ఏదో...! అట్లాగే, ఈ ఆత్మ-అనాత్మ రెండూ ఒక్కచోటే ఉన్నాయి.
కానీ, మనిషి మాత్రం ఏమైపోతున్నాడంటే, కలగాపులగంగా అయిపోయి, అనాత్మను ఆశ్రయించి, ఆత్మ వస్తువును గుర్తించ లేకుండా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శరీర అధ్యాస. దీనిని ఏమన్నారు అంటే శరీర అధ్యాస.
ఎప్పటికప్పుడు శరీర అధ్యాసని పొందుతున్నాడు. ఏ స్థితిలో ఉంటే, ఆ స్థితికి సంబంధించినటువంటి శరీర అధ్యాసను పొందుతున్నాడు. అందుకని, ఇక్కడ ఎనిమిది శరీరాల యొక్క ప్రతిపాదన చేశారు. పరిణామ క్రమంలో మానవుడు తన వివేక స్థాయిలో ఎనిమిది శరీర భ్రాంతులను పొందుచున్నాడు.
ఎనిమిది అధ్యాసలను పొందుచున్నాడు. జాగ్రదావస్థలో జగత్తుతో తాదాత్మ్యత చెంది, జగత్తును భోగ్యవస్తుగా చూచి భోగ్య పదార్దముల యందు, శబ్దాది విషయములయందు ఆసక్తి కలిగి వ్యవహారశీలియై, వ్యవహారమే సత్యమనుకుంటూ, వ్యవహారం లేనిదే తాను లేనని, తన ఉనికిని, వ్యవహారశీలమైనటువంటి వజగత్ వస్తుభ్రాంతితో ముడిపడి, తాను ఏమయ్యాడు అంటే, ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు, ప్రతిబింబరూపుడైనటువంటి జీవుడయ్యాడు.
అయితే ఈ జగత్ వ్యాపారము నంతటిని సాక్షిగా చూస్తున్నటువంటి వాడెవడో, వాడు విశ్వుడు. ఇదే జీవుడు ఈ శరీరము నుంచి తప్పుకోగానే, ఈ శరీరము ఎందుకు కొరగానిది అవుతోంది. ఈ శరీరము నిరుపయోగము అవుతోంది. ఈ శరీరము నిష్ప్రయోజనము అవుతోంది.
ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైనటువంటి దేహం కాబట్టి, ఆ పంచభూతాలలోనే మరల కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దహనం చేసో, ఖననం చేసో, ఏదో ఒక రూపంలో ఈ దేహాన్ని ఏ పంచభూతాలనుంచైతే ఇది ఉత్పన్నమైందో, మరల అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు.
మరి, తరలిపోయిన జీవుడు ఏమయ్యాడయ్యా? తరలి పోయిన జీవుడు తన కర్మఫల విశేషం చేత, తన కర్మల బరువు చేత, తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప, విహిత కర్మ, అవిహిత కర్మల చేత, పుణ్యపాపముల చేత, ఏ సుఖదుఃఖాది మిశ్రిత కర్మ చేత, కర్మల సంచిని మోసుకొంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 26 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 26 🍀
ఏక తత్త్వ నామ దృఢ ధరీ మనా!
హరీసీ కరుణా యేఈల్ తుఝ!!
తే నామ్ సోపారే రామకృష్ణ గోవింద్!
వాచేశీ సద్గద్ జపే ఆధీ!!
నామా పరతే తత్ నాహీరే అన్యథా!
వాయా ఆణికా పంథా జాశీ ఝణీ!!
జ్ఞానదేవా మౌన్ జపమాళ్ అంతరీ!
ధరోనీ శ్రీహరీ జపే సదా!!
భావము :
ఓ మనసా.! నామము ఏక తత్త్వము, కావున దానిని ధృఢముగ పట్టినచో నీకు శ్రీహరి కరుణ లభించగలదు. నాలుకతో పాడడానికి అన్నింటికంటే సులభ సాధనము రామకృష్ణ గోవింద అనే నామాలు. ఈ నామములను ఎల్లప్పుడు జపించు చుండవలెను.
నామానికి మించిన తత్త్వము వేరుగ ఏమీ లేదు. కావున అనవసరముగ ఇతర పంథములను అనుసరించకుము. అంతరాత్మ యందు శ్రీహరిని పట్టుకొని మౌనముగ జపము చేయుచున్నానని జ్ఞానదేవులు తెలుపు చున్నారు.
🌻. నామ సుధ -26 🌻
ఏక తత్త్వము దేవుని నామము
దృఢతరమున మనసున నిలుపుము
శ్రీహరి కరుణను నోచుకొనుము
ఆత్మానందమున పరవశించుము
రామకృష్ణ గోవిందనామము |
పలుకుటకది బహుసరళము
నాలుకనుంచుము ఎల్లకాలము
ఆలసింపక జపము చేయుము
హరినామానికి మించిన తత్వము
లేదు అన్యము సాధన శూన్యము
ఇతర పంథము దుఃఖ మూలము
అనవసరము వ్యర్థ మార్గము
జ్ఞానదేవుని సాధన మౌనము |
అంతరంగమున నామ జపము
పట్టుకొనెను శ్రీహరి నామము
జపము చేసెను ఎల్లకాలము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 97 / Sri Lalitha Sahasra Nama Stotram - 97 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
[06:48, 04/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 169 / Sri Lalitha Chaitanya Vijnanam - 169 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖
🌻169. 'క్రోధశమనీ' 🌻
భక్తుల క్రోధమును శమింపజేయునది శ్రీదేవి అని అర్థము.
నిత్యమూ శ్రీమాత ఆరాధనము గావించువారి క్రోధమును, మాత్సర్యమును, లోభమును, అశుభభావనలను శ్రీమాత హరించును.
“నక్రోధో న చ మాత్సర్యం, నలోభా నా శుభామతిః |
భవంతి కృత పుణ్యానాం, భక్తానాం, శ్రీసూక్తం జపేత్సదా||"
శ్రీ సూక్తమందలి ఈ ఋక్కులు పై సత్యమును బోధించుచున్నవి. కోపము కలవాడు ఎన్ని సత్కార్యములొనర్చిననూ, వాని ఫలముల నాతడు పొందలేడని, తన కోపముతోనే ఫలములను
నాశనము చేసుకొనునని పురాణ గాధలు తెలుపుచున్నవి. క్రోధముతో కూడి ఎవడు యాగమొనర్చునో, ఎవ్వడు హోమము చేయునో, ఎవడు పూజించునో వాని ఫలము పచ్చి కుండ యందలి నీరువలె హరింప బడును.
కోపముగలవారికి శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువగ ఉండును. నందీశ్వరునిపై కోపముతో రావణుడు చేసిన శివతపస్సు ఫలించలేదు. పినతల్లిపై కోపముతో ధ్రువుడు చేసిన తపస్సు ఫలించ లేదు. కోపముతో భీష్మునిపై యుద్ధము చేసిన పరశురామునికి విజయము లభించలేదు.
అట్లే విశ్వామిత్రుని తపస్సు కూడ ఆయనను తిప్పలు పెట్టినది. క్రోధము స్వభావమున ఉన్నవారు క్రోధము ఉండరాదని, దానిని విసర్జించవలెనని ఎంత ప్రయత్నించిననూ, ఆ ప్రయత్నము కూడ విఫలమే అగుచుండును.
జీవులకు అరిషడ్వర్గ విషయమున బలహీనత యుండుట సహజము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము ఇవి అన్నియూ ఒక్కొక్కొ సమయమున ఒక్కొక్కటిగా స్వభావమునుండి విజృంభించి జీవుని వశము గావించు కొనుచుండును. తనకన్న బలమైన శత్రువును తాను జయించలేడు కదా! ఇట్టి సమయమున దైవారాధనమే శరణ్యము.
ఆరాధన వలన భక్తి, శ్రద్ధ, ఆర్ద్రత పెరుగుచున్నకొలది క్రోధాది బలహీనతలు శమించును. మరియొక మార్గము లేదు. అన్ని ప్రయోజనములకు భగవదారాధనమే శరణ్యమని పెద్దలు పరిశోధించి నిర్ణయించిరి. అట్టి భగవదారాధనమందు నిజమైన రుచి ఏర్పడిన వారికి పరిష్కారములు శీఘ్రమగును. జీవులు శమమును పొందుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 169 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Krodha-śamanī क्रोध-शमनी (169) 🌻
She destroys anger of Her devotees. Anger is one of the six deterrents (desire, anger, jealousy, confusion, pride and envy) to self-realization. It is said that any worship done with anger destroys the effect of such worship.
Kṛṣṇa cites the reasons for anger (Bhagavad Gīta II.63, 64) “while contemplating the objects of the senses, a person develops attachment to them and from such attachment desire develops, and from desire anger develops and from anger total dissolution arises…” This is the reason for considering sensory organs as evils. Kṛṣṇa also says that material mode of passion is responsible for all the sufferings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
+91 77026 90049 left
[10:39, 04/01/2021] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.
రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.
ఆత్మానందం.
ఆడియో నం.8
💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
[11:08, 04/01/2021] +91 92915 82862: 🌀👂🍯🎊💖🎊👂🍯🌀
శ్రీకృష్ణ కర్ణామృతం.
-- లీలాశుకుల రచన
ధనుర్మాసమును పురస్కరించుకుని.
ఆడియో నం.8
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
[11:16, 04/01/2021] +91 92915 82862: 🔱శ్రీపరమేశ్వర స్తోత్రమ్🔱
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1)జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూత పితః !
ప్రణతం పతితం హతబుద్ధిబలం జనతారణ తారయ తాపితకమ్ !!
2)గుణహీనసుదీనమలీనమతిం త్వయి పాతరి దాతరి చాపరతిమ్ !
తమసా రజసా వృతవృత్తిమిమం జనతారణ తారయ తాపితకమ్ !!
3)మమ జీవన మీనమిమం పతితం మరుఘోరభువీహ సువీహమహో !
కరుణాబ్ధిచలోమిర్జలానయనం జనతారణ తారయ తాపితకమ్ !!
4)భవవారణ కారణ కర్మతతౌ భవసిన్ధుజలే శివ మగ్నమతః !
కరుణాఞ్చ సమర్ప్య తరిం త్వరితం జనతారణ తారయ తాపితకమ్ !!
5)అతినాశ్య జనుర్మమ పుణ్యరుచే దురితౌఘభరైః పరిపూర్ణభువః !
సుజఘణ్యమగణ్య మపుణ్యరుచిం జనతారణ తారయ తాపితకమ్ !!
6)భవకారక నారకహారక హే భవతారక పాతకదారక హే !
హర శఙ్కర కిఙ్కరకర్మచయం జనతారణ తారయ తాపితకమ్ !!
7)తృషితఞ్చరమస్మి సుధాం హిత మే ఽచ్యుత చిన్మయ దేహి వదాన్యవర !
అతిమోహవశేన వినష్టకృతం జనతారణ తారయ తాపితకమ్ !!
8)ప్రణమామి నమామి నమామి భవం భవజన్మకృతిప్రణిషూదనకమ్ !
గుణహీనమనన్తమితం శరణం జనతారణ తారయ తాపితకమ్ !!
ఇతి పరమేశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ !!
🕉🌞🌎🌙🌟🚩
[11:28, 04/01/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Jan 4.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జనవరి 4.
Be pure first and you will have power. The chaste brain has tremendous energy and gigantic will-power. Without chastity there can be no spiritual strength. Continence gives wonderful control over mankind. The spiritual leaders of men have been very continent, and this is what gave them power.
పవిత్రులు కండి! శక్తి వస్తుంది. పవిత్ర మనస్సులో అనంతశక్తి, గొప్ప సంకల్పబలం ఉంటాయి. బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది.
🕉🌞🌎🌙🌟🚩
THE AWAKENING
Inspirational Quotes of Swami Vivekananda
It is the nature of the brute to remain where he is; it is the nature of man to seek good and avoid evil, it is the nature of God to seek neither, but to be eternally blissful let us be God.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
మార్పుని కోరని జడత్వం మూర్ఖుడి స్వభావం. చెడును నివారించి, మంచిని కోరడం మనిషి లక్షణం, ద్వందాలన్నింటినీ అతిక్రమించి దేన్నీ ఆశించక సదానందుడై ఉండడం భగవంతుడి తత్వం, అదే మన గమ్యం.
🕉🌞🌎🌙🌟🚩
INSPIRATIONAL INSIGHTS FOR SELF DEVELOPMENT / ఆత్మవికాశానికి స్ఫూర్తిదాయక ఆలోచనలు.
This is the gist of all worship to be pure and to do good to others. He who sees Shiva in the poor, in the weak, and in the diseased, really worships Shiva; and if he sees Shiva only in the image, his worship is but preliminary.
పవిత్రంగా ఉండడం, పరులకు మేలు చేయడం ఇదే పూజలన్నిటి సారాంశం. పేదలలో, దుర్చలమైన వారిలో, పీడితుల్లో దేవుని చూసేవారే నిజంగా దేవుని పూజించేవారు. దేవుణ్ణి కేవలం విగ్రహాల్లో మాత్రమే దర్శిస్తే వారి పూజ ఇంకా ప్రాథమికమైందే.
🕉🌞🌎🌙🌟🚩
[11:28, 04/01/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
రావణుడు కంఠారావమునకు అధిపతి. అనగా ఉచ్ఛారణమున కధిపతి. వేదమునకు స్వరము ఏర్పరచమని దేవతలందరూ బ్రహ్మ దేవునితో కలిసి మహాదేవుని దగ్గరకు వెళ్లి వేడుకుంటారు. అపుడు మహాదేవుడు నా పరమ భక్తుడైన రావణుడు ఏర్పరుస్తాడు అని అంటాడు.
రావణుడు మొత్తము వేదానికి స్వరము కట్టినటువంటి వాడు. రావణునికి సంగీతము తెలుసు. ఆయన వీణ వాయిస్తే సృష్టి అంతా కరిగిపోయేటంతటి జ్ఞానము కలిగిన వాడు. పరమశివుడు గూడా ఆయన వీణా గానమునకు పరవశించి పోయేవాడు.
ఉదాత్తము, అనుదాత్తము, స్వరము మూడు చక్కగా పలుకుతూ వేదగానము చేస్తే కంఠము నుండి ధ్వని తరంగములు ఏర్పడి శరీరమంతా శుద్ధి అయిపోతుంది.
🕉🌞🌎🌙🌟🚩
[11:34, 04/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం - (761)
🕉🌞🌎🌙🌟🚩
"నేను దేవున్ని అని తెలుసుకోలేకపోవటంలో గల మాయ ఏమిటి !?"
ఒక మామిడిపండు తాను మామిడిపండుగా మారాలని ప్రయత్నం మొదలుపెట్టింది. తానే మామిడిపండునని తెలియకపోవడం అవిద్య. సాధనచేసి ఆ అవిద్యను తొలగించుకొని తాను మామిడిపండునేనని తెలుసుకోవటం ఏఫలాన్ని ఇస్తుందో మామిడిపండుగా మారాలన్న ప్రయత్నాన్ని మానుకున్నా అదే ఫలాన్ని ఇస్తుంది. కారణం తానే మామిడిపండుకనుక. అలాగే భగవత్ స్వరూపులమే అయివున్న మనం భగవంతుడ్ని చూడాలని, భగవంతుడ్ని పొందాలని, చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ తానేమిటో తెలియకపోవడం మాయ ! ఈ మాయ ఎలా ఏర్పడిందో తెలుసుకొని దాన్ని తొలగించుకుంటే మనమే భగవంతుని స్వరూపమేనని తెలుస్తుంది. అలాకాక ఆ మాయకు లోనుకాకుండా సుఖ దుఃఖాలకు అతీతంగా ఏ సాధన లేకుండా ఉన్నా, మనం అదే భగవత్ స్వరూపంగా ఉంటామే గానీ వెరైపోము !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
ఘర్షణలేని మనసే శాంతి సామ్రాజ్యం !''- (అధ్యాయం -94)
🕉🌞🌎🌙🌟🚩
[11:34, 04/01/2021] +91 92915 82862: "ఋభుగీత" (228)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !
మౌనమే స్నానం, జపం, పూజ, మోక్షం అన్నీ అని సెలవిచ్చారు. మౌనం అంటే మనసుకు కలిగే నిశ్చింత. జననమరణాలు ఎప్పుడు అసత్యం అవుతాయంటే మనసుకు పరిపూర్ణమైన శాంతివచ్చినప్పుడు. అంతటి శాంతి ఎప్పుడొస్తుందంటే స్వస్వరూపం తెలిసినప్పుడు. స్వస్వరూపం పూజలు జపాలు, తపాలవల్ల తెలియదు. విచారణ, సత్సంగం, ధర్మాచరణ, ఆదర్శజీవనం వల్ల కలుగుతుంది. పూజలు, జపాలు, తపాలు అందుకు సహకరించేవే గానీ అవే మోక్షాన్ని ఇవ్వవు. అశాంతిగా ఉందని బాధపడుతుంటాం. అశాంతికి మూలాన్ని గుర్తించి ఆచరణాత్మకంగా దాన్ని తీసెయ్యకుండా అశాంతి ఎప్పటికీ పోదు. మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !
🕉🌞🌎🌙🌟🚩
[11:40, 04/01/2021] +91 92915 82862: 🧘సన్మార్గం🧘♂
🕉🌞🌎🌙🌟🚩
సన్మార్గం అంటే ఏమిటి - ఎలా ఆచరించాలి?
-[సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది]-
జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం.
స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు.
ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి...
సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి.
మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.
ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి, చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు.
దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు.
బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు...
శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి.
రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు. వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు.
ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట.
చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదాని కోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి.
సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు, మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం !
🕉🌞🌎🌙🌟🚩
[11:50, 04/01/2021] +91 92915 82862: 🌷118-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
క్షేత్రము-క్షేత్రజ్ఞుడు
15. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము వివరింపబడినవి. జ్ఞేయము లేక తెలియదగినది అను దానిని వివరింతును. దానిని జ్ఞానముగా పొందినవాడు అమృత స్వరూపుడగును. ఇచ్చట దానికది జ్ఞాన స్వరూపమై జీవికి జ్ఞేయముగా ఉండును. జీవి దానిని సమీపించిన కొలది అది జ్ఞానమగును. అప్పటికి జీవి కూడా జ్ఞానమగును.
ఆది అనగా ఎట్టిది? నిద్ర నుండి మేల్కాంచుట వంటిది. మెలుకువతో సర్వము దృశ్యమానమగును. దీనినే ఆది అందురు. ఇది చూచువానికి ఆది గాని, దర్శింపబడు తత్వమునకు కాదు. కనుక జ్ఞేయము ఆది లేనిది. దాని పరిమితి కూడా జ్ఞాత యొక్క పరిమితియే. కనుక, జ్ఞేయము పరము లేక పరిమితి లేనిది. ఇది కొలతలకు అతీతము కనుకను, ద్రష్ట కొలతలు కలవాడు కనుకను వాని కది జ్ఞేయముగా భాసించును. సృష్టి అంతయు ద్రష్టకు జ్ఞేయము. దానికది బ్రహ్మము. బ్రహ్మమనగా వ్యాపన శీలము. అదియే జ్ఞాతగా కూడ వ్యాపించినది గనుక బ్రహ్మమనబడును.
ద్రష్ట దృష్టిలో దానికి అస్తిత్వమున్నది. సొంతముగా దానికి అస్తిత్వము లేదు. ద్రష్టకు దృశ్యమంతయు ఉండుట, లేకుండుట అనువాని నడుమ ఉండును. నిద్ర నుండి మేల్కాంచినప్పటి నుండి మనకు సృష్టి యున్నది. మరల నిద్రించిన వెనుక మనకది లేదు. కనుక మేల్కాంచుట ఆది, నిద్రించుట అంతము. మేల్కాంచుట అస్తిత్వము. నిద్రించుట అసత్. అనగా లేకుండుట. ఈ స్థితులు జ్ఞాతకు గనుక జ్ఞేయమునకు ఉండవు. మనము నిద్రించునప్పుడు మన చుట్టునున్న ప్రపంచము న+అసత్=నాసత్ (లేకుండుట లేదు) అనుస్థితిలో ఉన్నది. ఈ సృష్టి మొత్తమునకు జ్ఞేయమగు పరబ్రహ్మము, అట్లే సత్ (అస్తిత్వం), అసత్ (అభావము), నాసత్ అను స్థితులకు అతీతముగా ఉన్నది, దీనిని జ్ఞేయము అందురు.
🕉🌞🌎🌙🌟🚩
[11:50, 04/01/2021] +91 92915 82862: 132) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
అన్యో విజ్ఞానమయత ఆనందమయ ఆంతరః ౹ అస్తీత్యేవోపలబ్ధవ్య ఇతి వైదికదర్శనమ్ ౹౹77౹౹
77. విజ్ఞానమయకోశము లోపల ఆనందమయకోశము గలదని వేదమతము.అది భావరూపము. అభావరూపము(లేకపోవుట)కాదు.ఇట్లు నైయాయికులు ప్రాభాకర మీమాంసకులు భాట్టమీమాంసకులు చెప్పుదురు.
తైత్తరీయ ఉప.2.5.1 కఠ ఉప.2.3.13 లోని వాక్యములు వీరి ప్రమాణము.
అణుర్మహాన్మధ్యమో వేత్యేవం తత్రాపి వాదినః ౹ బహుధా వివదంతే హి శ్రుతియుక్తి సమాశ్రయాత్ ౹౹78౹౹
78. వారియందును ఆత్మ అణుస్వరూపమనీ,కాదు చాలా పెద్దది మహత్స్వరూపమైనది అనీ,కాదు కాదు మధ్యమ ప్రమాణము గలది అనీ,శుతిని యుక్తి(తర్కము)ని అవలంబించి బహువిధములుగ వాదవివాదములు చేయుదురు.(వీరు అనుభవరహితులని ఉద్దేేశము)
కుమారిల భట్టాచార్యుని మతమున(భట్టమతం)ఆత్మ క్షణికం గాదు.విద్యుత్ వంటిది కాదు.స్థిరమయిన జడ చైతన్యము.
నిద్రలేచిన వాడిట్లనును
"నేను మొద్దు వలె నిద్రించితిని" మొద్దు అనేది జడము.అలా నిద్రించిన సంగతి తెలిసికొనడం వలన చైతన్యం.వెరసి ఆత్మ జడ చైతన్యం.
ఖద్యోత(మిణుగురు పురుగు) న్యాయమున ఆత్మ ప్రకాశ-అప్రకాశ రూపముగా ఉంది. ఆనందమయకోశము అట్టిది. సుషుప్తిలో చైతన్యాభాస సహితమయిన అజ్ఞానం ఉన్నది గదా!.అందులో అభాసం ప్రకాశం. అజ్ఞానం అప్రకాశం.
ఆనందమయకోశరూపమయిన అజ్ఞానము
అజ్ఞాన దృష్టిలో సత్యముగా ఉంటుంది.
అద్వైత జ్ఞానదృష్టిలో అనిర్వచనీయం.
జీవన్ముక్తుని దృష్టిలో తుచ్ఛం అసత్తు శూన్యం.
పూర్వమీమాంసకులలో ఒకరయిన ప్రభాకరుడు,నైయాయికులు ఇలా అంటారు.ఆత్మ శూన్యరూపము కాదు.అసలుశూన్యరూపం అనుభవ సత్యమా?కాదంటే శూన్యవాదానికి ప్రమాణం ఉండదు.అవునంటే శూన్యమును ఎవరు అనుభవించినట్లు?
ఆ అనుభవం కలవాడే ఆత్మ.
ఆత్మయందు మనస్సు కలిస్తే జ్ఞానం.జ్ఞానగుణం వలన ఆత్మను చైతన్యమంటారు స్వరూపరీత్యా ఆత్మజడమే.సుఖదుఃఖాదులు ఆత్మగుణాలు.
ఈ మతములో ఆనందమయకోశంలోని బుద్ధి గుణము.సుషుప్తిలో విజ్ఞానం పనిచేయదు.ఆత్మ జడము.వీరు స్వరూపతః ఆత్మను జ్ఞానమని అనరు. అనిత్యమయిన జ్ఞానగుణమును చెప్తారు.
అద్వైతులు దానిని అంతఃకరణ వృత్తి అయిన బుద్ధి అంటారు.
జ్ఞానేతర వస్తువులు జడములు ఘటాదులు.అవి అనిత్యములు. ఆత్మ జ్ఞానరూపంకాదంటే అనిత్యుడే.అపుడు మోక్షాది విషయములు వ్యర్థము.వేదాంత వాక్యములందు విశ్వాసం లేనివారు పంచకోశములలోని ప్రధాన వస్తువులయిన అజ్ఞానం,బుద్ధి మొదలగు వానిని ఆత్మలుగా అంగీకరించి ముఖ్యాత్మ అయిన సాక్షిని విస్మరించారు.దానికి కారణం అన్నమయాది కోశాలు ఆత్మకు ఆవరణంగా అవటమే.ఇదంతా పంచకోశములు జీవయథార్థ రూపమయిన సాక్షిని మరుగు పరచడం వలన వచ్చినది.
ఇలాగే ఈశ్వరుని సమిష్టిరూప పంచకోశాలు ఈశ్వరసాక్షిని అచ్ఛాదిస్తాయి.అందువలన ఈశ్వరునకు అజ్ఞానం రాదు.కాని మనకు ఈశ్వరతత్త్వం తెలియదు. అందువలన శుద్ధ చైతన్యాన్ని వదలి మాయారూపమయిన ఆనందమయకోశంలో ఉన్న అంతర్యామిని పరమతతత్త్వంమని భావిస్తున్నాము.
ఇంకా హిరణ్యగర్భ వైశ్వానరాది దేవతలను అశ్వత్థాది వృక్షములందున్న అంతర్యామిని పరమాత్మగా భావించుతున్నారు. ఉపాధితో గూడిన చైతన్యమును పరమాత్మగా భావించడం తప్పే. కాని వారు సాధనను అనుసరించి ఫలమును పొందడం నిజం.కాని మోక్షం రాదు.
ముంజము-ఇషీక. ముంజమునుండి ఇషీకము అనగా ఈనెను విడదీసినట్లు పంచకోశముల నుండి జీవేశ్వర తత్త్వమును విడదీయవలెను.
🕉🌞🌏🌙🌟🚩
[12:57, 04/01/2021] +91 92915 82862: 19-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
బిళహరి - త్రిపుట.
పల్లవి:-
భావయే పవమాన నందనం భావయే!! భా !!
చరణము(లు):-
మందార తరుమూల మానితవాసం
సుందర దరహాసం హరిదాసం!! భా !!
రఘునాథ కీర్తన రంజిత చిత్తం
అఘహర శుభవృత్తం శమవిత్తం!! భా !!
ఆనంద భాష్పాలంకృత నేత్రం
స్వానంద రసపాత్రం పవిత్రం!! భా !!
భద్రాచలపతి పాదభక్తం
క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం!! భా !!
🕉🌞🌏🌙🌟🚩
[12:59, 04/01/2021] +91 92915 82862: 18-42-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII స్వభావము వలన కలుగు ఆ యా కర్మలను పేర్కొనుచున్నారు–
శమో దమ స్తపశ్శౌచం
క్షాన్తి రార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రాహ్మం కర్మ స్వభావజమ్ ||
తా:- అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రహము), బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, ఋజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మకము గలిగియుండుట (అనునివి) స్వభావము వలన పుట్టిన బ్రాహ్మణకర్మయైయున్నది.
వ్యాఖ్య:- జ్ఞాన, విజ్ఞానముల రెండిటిని ముముక్షువు తప్పక గలిగియుండవలెనని భగవానుడు గీతయందు పెక్కుతావుల పేర్కొనుచున్నారు. కేవలము శాస్త్రజ్ఞానముచాలదు. అనుభవము గూడ నుండవలెను. అనుభవమువలననే మనుజునకు హృదయపరిణామము, ఆనందము కలుగుచుండును. మరియు జనులకు పరమార్థవిషయములపై విశ్వాసమున్ను ఉదయించుచుండును.
కాబట్టి ప్రతివారును శాస్త్రజ్ఞానముతోబాటు అనుభవజ్ఞానమున్ను సంపాదించవలెను. ఈశ్లోకమున శమదమాదులను తొమ్మిది కర్మలు చెప్పబడియున్నవి. ఆ సత్కర్మల ననుష్టించువాడు బ్రాహ్మణుడే యగునని భావము. ఇచట " తపస్సని చెప్పబడినదాని కర్థము 17వ అధ్యాయమున తెలుపబడిన శారీరక, వాచిక, మానసికతపస్సులే యని గ్రహించునది.
ప్ర:- ఏయే కర్మలు బ్రాహ్మణులకు స్వభావముగ నుండును? (లేక ఏయే కర్మలు బ్రాహ్మణత్వమును నిర్ణయించును)?
ఉ:- (1) అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రహము),
(2) బాహ్యేంద్రియ నిగ్రహము,
(3) తపస్సు,
(4) (బాహ్యాభ్యంతర) శుచిత్వము,
(5) ఓర్పు,
(6) ఋజు ప్రవర్తన,
(7) శాస్త్రజ్ఞానము,
(8) అనుభవజ్ఞానము,
(9) ఆస్తికభావము (దేవునియందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము) -
అను ఈ తొమ్మిది కర్మలున్ను బ్రాహ్మణులకు స్వభావముగ నుండును. లేక, ఇవి కలవాడే బ్రాహ్మణుడనబడును.
🕉🌞🌎🌙🌟🚩
[13:18, 04/01/2021] +91 92915 82862: తిరుప్పావై 21వ పాశురం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
21)పాశురం ॐॐॐॐॐॐॐॐ
ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;
ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్
తోత్తయాయ్ నిన్ఱశుడరే. తుయిలెళాయ్;
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్!!
భావం :-
ॐॐॐॐॐॐॐ
పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.
పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.
అవతారిక :-
ॐॐॐॐॐॐॐॐॐ
గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థించుచున్నది.
నీళాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీళాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసఝరిలో ఆనందస్నానం చేయించమని ప్రార్ధించారుకద! మరి వారి ప్రార్ధనను విన్న ఆమె 'భోగ్యదశలో నేనును మీలో ఒకతెనే కదా! కావున మనమంతా కలిసి 'శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే! శ్రీమతే నారాయణాయనమః' అని స్వామిని వేడుకొందామన్నది. ఈనాటి మాలికలో నీళాదేవితో కూడిన ఆండాల్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్ధిస్తున్నది. శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నది.
శహనరాగము - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐ
ప.. కడవల పాలిచ్చు గో సంపద గల నందపుత్ర!
విడిచిరావొ? నిద్ర! ఇంక మేలుకో!
అ..ప.. పుడమిని నిను నమ్మువారి కాపాడ నవతరించిన
వాడ! తేజోరూపుడా! నిద్ర మేలుకో!
చ.. ఎదుట నీకు నిలువలేక, బలహీనత శత్రువులు
పదముల శరణన్న రీతి, నీదు వాకిటచే నిలిచి
నీదు గుణ విశేషములను కీర్తించగ వచ్చినాము
నీకు మంగళాశాసన మాచరింప వచ్చినాము
కడవల పాలిచ్చు గోసంపద గల నందపుత్ర!
విడిచిరావొ? నిద్ర! యింక మేలుకో!
ॐॐॐॐॐॐॐॐॐ
ఆచార్యుడి ద్వారా శరణాగతి
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐ
భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు.
అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.
ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు.
వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.
అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట.
ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది.
ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు.
అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపం లో ఉన్నాడు.
అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం" అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.
ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం.
నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు.
ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే
"ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు.
కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో.
వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ భలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం, దింతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము.
అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ భలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం, వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు.
తిరుప్పావై 21 వపాశురము/తెలుగు పద్యానువాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీసమాలిక.
బంగారు కడవలు పాలతో నిండెను
పొంగి పొరలి పోయి భువిని చేరె
సంపద నిండైన స్వామిగా జనియించె
నందుని గారాల నందనుండు
వైకుంఠమును వీడి వైరుల వెదకుచు
జగములందు తిరిగి చంపినావు
ముక్తి నొసగుటకు భక్తుల చేరెడు
మేలుకో మా స్వామి జాలమేల
శౌరిని చూసిన వైరులు పారిరి
ఎదిరింప బీరులై బెదిరినారు!!
తే.గీ. సర్వ శక్తులు నీచెంత సన్నగిల్లె
ఉలుకు పలుకు లేక యిపుడు యుండనేల
పక్షి వాహనుండా మాకు పరను యొసగు
మంగళాశాసనము చేసి మమ్ము గావు
శ్రద్ధ భక్తిని కల్పించి బుద్ధి నొసగు
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
[20:33, 01/01/2021] +91 95058 13235: 1.1.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది రెండవ అధ్యాయము
గోపికావస్త్రాపహరణము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.33 (ముప్పది మూడవ శ్లోకము)
అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనమ్|
సుజనస్యేవ యేషాం వై విముఖా యాంతి నార్థినః॥9183॥
సకలప్రాణులను ఉజ్జీవింపజేయుచున్నట్టి వీటియొక్క జన్మలు పరమశ్రేష్ఠములైనవి. సజ్జనుల (వదాన్యుల) కడకు చేరిన అర్థులు రిక్తహస్తములతో తిరిగి వెళ్ళనట్లుగా, వీటి అండన చేరినవారు నిరాశతో మఱలరు. అనగా ఏదో ఒక లాభమును తప్పక పొందుచుందురు.
22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
పత్రపుష్పఫలచ్ఛాయా మూలవల్కలదారుభిః|
గంధనిర్యాసభస్మాస్థితోక్మైః కామాన్ వితన్వతే॥9184॥
ఇవి తమ పత్రములను (ఆకులను), పూవులను, ఫలములను, నీడలను, వేర్లను, బెరడులను, చెక్కలను, సుగంధములను, జిగురులను, భస్మములను, బొగ్గులను, చిగుళ్ళను, వేయేల తమ సర్వస్వమును జనుల మనోరథములను తీర్చుటకై ధారపోయుచున్నవి.
22.35 (ముప్పది ఐదవ శ్లోకము)
ఏతావజ్జన్మసాఫల్యం దేహినామిహ దేహిషు|
ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్సదా॥9185॥
లోకమున ప్రాణులు కోకొల్లలు. కాని ఎవ్వరైనను తమ సంపదలను, బుద్ధిబలమును, వాక్కులను, కడకు తమ ప్రాణములను ఇతరుల శ్రేయోలాభములకై వెచ్చించిన నాడే వారి జన్మలు సఫలములగుచుండును. అప్పుడు ఈ వృక్షములవలె వారి జన్మలు సార్థకములు. అనగా ఇతరులకు మేలుచేయని వారి జన్మలు వ్యర్థములు.
22.36 (ముప్పది ఆరవ శ్లోకము)
ఇతి ప్రవాళస్తబకఫలపుష్పదలోత్కరైః|
తరూణాం నమ్రశాఖానాం మధ్యేన యమునాం గతః॥9186॥
దారిలో ఇరువైపులయందును ప్రవాళములతో, పూలగుత్తులతో, ఫలపుష్పములతో, పత్రములతో ఒప్పుచు దర్శనీయముగా ఉన్న ఈ వృక్షములయొక్క కొమ్మలు వినమ్రములై నేలను తాకుచున్నవి. అప్పుడు శ్రీకృష్ణుడు మొదలగువారు ఈ విధముగా ఆ వృక్షములను కొనియాడుచు వాటి నీడలలో ముందునకు సాగుచు యమునా తీరమునకు చేరిరి.
22.37 (ముప్పది ఏడవ శ్లోకము)
తత్ర గాః పాయయిత్వాఽఽపః సుమృష్టాః శీతలాః శివాః|
తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలమ్॥9187॥
పరీక్షిన్మహారాజా! జీవనదియైన ఆ యమునానది యొక్క జలములు మధురములు, శీతలములు, స్వచ్ఛములు (ఆరోగ్యకరములు). శ్రీకృష్ణుడు మొదలగు గోపాలురు ఆ కమ్మని జలములను గోవులచే త్రాగించిరి. పిమ్మట వారును స్వయముగా ఆ స్వాదు జలములను తనివిదీర సేవించిరి.
22.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్ నృప|
కృష్ణరామావుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రువన్॥9188॥
మహారాజా! గోపాలురు ఆ నదీ సమీపమునగల ఉపవనములయందలి పచ్చికబయళ్ళలో గోవులను ప్రేమతో మేపిరి. అప్పుడు తామును ఆకలిగొనియుండుటచే వారు బలరామకృష్ణులకడకేగి ఇట్లనిరి. (తరువాయి 23వ అధ్యాయములో)
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వివింశోఽధ్యాయః (22)
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది రెండవ అధ్యాయము (22)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:21, 02/01/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[06:00, 02/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 14 🌴
14. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథకే చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||
🌷. తాత్పర్యం :
కార్యస్థానము (దేహము), కర్త, వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరగా పరమాత్ముడు అనెడి ఈ ఐదును కార్యమునకు కారణములై యున్నవి
🌷. భాష్యము :
ఇచ్చట “అధిష్ఠానమ్” అను పదము దేహమును సూచించుచున్నది. అట్టి దేహమునందున్న ఆత్మ కర్మఫలములకై వర్తించుచున్నందున “కర్త” యని తెలియబడుచున్నది. అట్టి ఆత్మ జ్ఞాత మరియు కర్త యని శృతియందు పేర్కొనబడినది. “ఏషహి ద్రష్టా స్రష్టా” (ప్రశ్నోపనిషత్తు 4.9).
ఇదే విషయము “జ్ఞోఽత ఏవ” (2.3.18) మరియు “కర్తా శాస్త్రర్థవత్వాత్” (2.3.33) అను వేదాంతసూత్రముల ద్వారా నిర్ధారితమైనది. ఇంద్రియములు కర్మసాధనములు కాగా, ఆత్మ అట్టి ఇంద్రియముల ద్వారా వివిధరీతుల వర్తించుచుండును. ప్రతికార్యమునకు వివిధ యత్నములు అవసరము.
కాని మనుజుని ఆ కార్యములన్నియును మిత్రుని రూపమున హృదయస్థుడై యున్న పరమాత్ముని పైననే అంత్యమున ఆధారపడియున్నవి. అనగా అతడే కార్యములన్నింటికిని పరమకారణమై యున్నాడు. ఇటువంటి స్థితిలో హృదయస్థుడైన పరమాత్మ నేతృత్వమున కృష్ణభక్తిరసభావనలో వర్తించువాడు సహజముగా ఎటువంటి కర్మ చేతను బంధితుడు కాకుండును.
అనగా సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావితులైనవారు తమ కార్యములకు ఏ విధముగను అంత్యమున బాధ్యులు కారు. ప్రతిదియు దివ్యసంకల్పము (పరమాత్ముడు, దేవదేవుడు) పైననే ఆధారపడియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 597 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 14 🌴
14. adhiṣṭhānaṁ tathā kartā karaṇaṁ ca pṛthag-vidham
vividhāś ca pṛthak ceṣṭā daivaṁ caivātra pañcamam
🌷 Translation :
The place of action [the body], the performer, the various senses, the many different kinds of endeavor, and ultimately the Supersoul – these are the five factors of action.
🌹 Purport :
The word adhiṣṭhānam refers to the body. The soul within the body is acting to bring about the results of activity and is therefore known as kartā, “the doer.” That the soul is the knower and the doer is stated in the śruti. Eṣa hi draṣṭā sraṣṭā (Praśna Upaniṣad 4.9). It is also confirmed in the Vedānta-sūtra by the verses jño ’ta eva (2.3.18) and kartā śāstrārthavattvāt (2.3.33).
The instruments of action are the senses, and by the senses the soul acts in various ways. For each and every action there is a different endeavor. But all one’s activities depend on the will of the Supersoul, who is seated within the heart as a friend. The Supreme Lord is the supercause.
Under these circumstances, he who is acting in Kṛṣṇa consciousness under the direction of the Supersoul situated within the heart is naturally not bound by any activity. Those in complete Kṛṣṇa consciousness are not ultimately responsible for their actions. Everything is dependent on the supreme will, the Supersoul, the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
[06:00, 02/01/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 204, 205 / Vishnu Sahasranama Contemplation - 204, 205 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻204. అజః, अजः, Ajaḥ🌻
ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ
అజతి గచ్ఛతి భక్తానాం హృదయేషు భక్తుల హృదయములలోనికి పోవును. అజతి క్షిపతి దుష్టాన్ దుష్టులను దూరముగా విసురును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహిత వీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నీ
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁ బల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! (753)
దామోదరా! వేదాంత వీథుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాలలో ఎల్లపుడూ నిలిచివుండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు. ఈ సమస్త సృష్టికీ కారణమైన నీవు సంసార సాగరాన్ని తరింపజేసేవాడవు.
95. అజః, अजः, Ajaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 204🌹
📚. Prasad Bharadwaj
🌻204. Ajaḥ🌻
OM Ajāya namaḥ
The root Aj has got as meanings both 'go' and 'throw'. Ajati gacchati bhaktānāṃ hr̥dayeṣu / अजति गच्छति भक्तानां हृदयेषु One who goes into the hearts of devotees or Ajati kṣipati duṣṭān / अजति क्षिपति दुष्टान् One who throws the evil doers to a distance or destroys them.
95. అజః, अजः, Ajaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 205/ Vishnu Sahasranama Contemplation - 205🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻205. దుర్మర్షణః, दुर्मर्षणः, Durmarṣaṇaḥ🌻
ఓం దుర్మర్షణాయ నమః | ॐ दुर्मर्षणाय नमः | OM Durmarṣaṇāya namaḥ
🌾దుర్మర్షణః, दुर्मर्षणः, Durmarṣaṇaḥ🌾
దానవాదిభిః దుఃఖేనాపి మర్షితుం సోఢుం న శక్యతే దానవాది దుష్టులచే ఎంత శ్రమచే కూడ సహించబడుటకు శక్యుడు కాడు. అనగా అపరాధులను సహించనివాడూ, వారిని శిక్షించు విష్ణువు దుర్మర్షణః అని చెప్పబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 205🌹
📚. Prasad Bharadwaj
🌻205. Durmarṣaṇaḥ🌻
OM Durmarṣaṇāya namaḥ
Dānavādibhiḥ duḥkhenāpi marṣituṃ soḍuṃ na śakyate / दानवादिभिः दुःखेनापि मर्षितुं सोढुं न शक्यते One whose might the evil doers cannot bear. He is unbearable by the asuras and such.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[06:00, 02/01/2021] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 150 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 80 🌻
బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది.
హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.
కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.
కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు.
అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.
జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.
కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:01, 02/01/2021] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 24 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 24 🍀
జప తప్ కర్మ్ క్రియా నేమ ధర్మ్!
సర్వా ఘటీ రామ్ భావ శుద్ధి!!
న సోడీ రే భావో టాకీరే సందేహూ!
రామకృద్దీ టాహూ నిత్య ఫోడీ!!
జాత్ విత్ గోత్ కుళ్ శీళ్ మాత్!
భజే కా త్వరిత్ భావనాయుక్!!
జ్ఞానదేవా ధ్యానీ రామకృష్ణ మనీ!
తేణే వైకుంఠ భువనీ ఘర్ కేలే!!
భావము:
జపము, తపము, కర్మలు, క్రియలు, నేమాలు మరియు ధర్మాలు ఏదైన కాని సర్వ ఘటాలలో రామ భావము పరిశుద్ధిగ కలిగి యుండి నేమాలు ఆచరించవలెను.
భావము వదలకూడదు, సందేహము వదిలి నిత్యము రామకృష్ణుల భజన చేయవలెను.
జాతిని, విత్తాన్ని, గోత్రాన్ని, కులమును, శీలాన్ని మరియు అభిమానాన్ని వదిలి, వేగిరపడి భావ యుక్తముగ భజన చేయుము.
నిరంతరము రామకృష్ణులలో మనసు నిలిపి ధ్యానము చేయుట వలన నేను వైకుంఠ భువనములో నివాసము ఏర్పరుచుకున్నాను అని జ్ఞానదేవులు తెలిపిరి.
🌻. నామ సుధ -24 🌻
జపము తపము కర్మ యుక్తము
క్రియయు నేమము మరియ ధర్మము
సర్వఘటములో రామ తత్త్వము
శుద్ధ భావనతో చేయు నేమము
ఎల్లవేళల వదలకు భావము
సందేహమును వదిలి పెట్టుము
రామ కృష్ణులను మరువక యుండుము
నిత్య నేమమున కీర్తన చేయుము
జాతి విత్తము మరియు గోత్రము
కులముశీలము వదిలివేయుము
వేగిర పడి భజన చేయుము
భావన ఎప్పుడు మదిలో నిలుపుము
జ్ఞానదేవుని మనసున ధ్యానము
రామ కృష్ణులది నిరంతరము
దానితో వారికి వైకుంఠ భువనము
లభించినాది లోక ప్రసిద్ధము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:01, 02/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 95 / Sri Lalitha Sahasra Nama Stotram - 95 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
[06:01, 02/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 167 / Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻167. 'పాపనాశినీ' 🌻
భక్తుల పాపములను నశింప చేయునది శ్రీమాత అని అర్థము.
పాప కర్మల నొనర్చువాని పాపముల రాశి, మేరుపర్వతమంత గొప్పదియైనను, కాత్యాయనిని పూజించిన- పూజించిన క్షణ మాత్రములో నశించును అని పురాణములు చెప్పుచున్నవి. “దుర్గా
రాధనాపరుని మహాపాతకముల వలన కలుగు దోషములు తామరాకు మీది నీటి బిందువులవలె అవి అతని నంటవు” అని పద్మ పురాణము తెలుపుచున్నది.
సర్వ పాపములతో కూడిన వాడైననూ శ్రీదేవి నారాధించు నరుడు పవిత్రుడై పరమపదము పొందును, అని దేవీ భాగవతము తెలుపుచున్నది. దేవీ ఆరాధనము అను అగ్ని మహా పాపములను కూడ తృణాగ్రము వలె నశింపజేయును. అగ్నితాకిన వెంటనే, గడ్డిపోచ కొనవెంటనే, భస్మమగును కదా! పాపములను హరించుటలో శ్రీమాతను మించిన శక్తి లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Pāpanāśinī पापनाशिनी (167) 🌻
She destroys the sins of Her devotees. Devotee is the one, who always thinks about Her not only at the time of reciting mantra-s, not only at the time of performing rituals but at all the times.
For such a devotee mantra-s and rituals become meaningless. It is also presumed that Her devotees will not perform those actions that are termed as sins. If knowingly someone commits a sin, She will not come to his rescue. But why does She want to destroy the sins of Her devotees?
Kṛṣṇa answers this question in Bhagavad Gīta (IV.14) “One who understands this truth (refer the previous nāma) about me, does not become entangled in the results of reactions of work (results of reactions mean karma-s. The concept of karma is based on Newton’s third law – for every action there is an equal and opposite reaction.
This equal and opposite reaction is karma.).She wants Her devotees to pursue the path of liberation for which sins are impediments. How does She consume their sins? Chāndogya Upaniṣad (V.xxiv.3) says, pāpmānaḥ pradūyante, which means all sins are burnt up.
The Upaniṣad further says ‘such sins are burnt like dry grass thrown into a fire’. The point driven home here is that when She is worshipped with all sincerity, the devotee gets rid of all his sins except prārabdha karma-s (the sum total of all karma-s accumulated over several past births) that have to be experienced.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Only admins can send messages
ఉపన్యాసం
ఎదగటం తేలిక, ఒదిగివుండటం కష్టం
బతకటం తేలిక, బతికించటం కష్టం
మాట్లాడటం తేలిక, ఆచరించటం కష్టం
ప్రేమించటం తేలిక, ప్రేమపొందటం కష్టం
ఆక్రోశించటం తేలిక, సాధించటం కష్టం
వాదించటం తేలిక, తీర్పు చెప్పటం కష్టం
ఏడిపించటం తేలిక, నవ్వించటం కష్టం
పోట్లాడటం తేలిక, శాంత పర్చటం కష్టం
మచ్చ బడటం తేలిక, మచ్చపోవటం కష్టం
మూర్ఖుణ్ణి నమ్మటం తేలిక, నమ్మి బతకటం కష్టం
పరీక్ష వ్రాయటం తేలిక, ఉద్యోగం సంపాయించటం కష్టం
పిల్లల్ని ప్రేమిచటం తేలిక, వారి ప్రేమను ఆపటం కష్టం
పెదాలమాట అర్ధం తేలిక, మనసులోని మాటకర్ధం కష్టం
పాట పాడటం తేలిక, పాటతో పరవశింప చేయటం కష్టం
ధనం సంపాయించటం తేలిక, దానం చేయుట కష్టం
పిల్లల పుటించటం తేలిక, విద్యనేర్పించి పెళ్ళిచేయటం కష్టం
--((**))--
కాలం విలువ
కాలనిర్ణయానికి కట్టుబడి చిత్తశుద్ధితో ప్రతిఒక్కరు నమ్మిన సిద్ధాంతంతో నడవాలి ముందుకు
ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి. ఎవరు ఏమన్నా నది సముద్రములో కలసినట్టు సాగుతూ పోవలసినదే.
నేను వంటరిని కాను నాకుతోడుడుగా దైవం నా వెనుక ఉండి నడిపిస్తుంది నాకు తోడుగా వచ్చిన వారుముందుకు నడిపిస్తారని నమ్మకంతో సాగాలి. నమ్మకమే మనిషి ఆరోగ్యం అదే మన:శాంతి మార్గం . కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... , ఆకు చివర మంచు బిందువులా... జారనివ్వండి, శిలగా ఉన్నానని అనుకోకండి నేనొక శిల్పిని అనుకొని ఏదైనా కొత్తది కనుకొనగలనని దృఢముగా ఉండండి మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.
సమయాన్ని అన్నీ దిశలో వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు.కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించండి కాలమెప్పుడు తనపని తను చేసుకుపోతుంది మనము అర్ధం చేసుకొని జీవిత సాఫల్యం పొందాలి. .
నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. కాలంతో నేను నడవలేక పోతున్నాను దిగులుతో ఉంటారు అటువంటి వారిని నిజాలుతెలిపి దైర్యం నూరిపోస్తే వారు అదృష్ట వంతులవుతారు.
సూర్య వెలుగులు ఆధారముగా మనిషి ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించండి.లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు.
వస్తాయో తెలుసుకోగల బుద్ధి ఏర్పడుతుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం.
ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొని నివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు
1.గడియారం సూచించే కాలమానం ఇది ఆగకుండా అలుపులేకుండా కదులుతుంది
2.మనస్సు కల్పించే మానసిక కాలం.ఇది చీకటి వెలుగులు చుట్టూ, కష్టసుఖాల చుట్టూ చక్రంలా తిరుగుతూ ఉంటుంది.
నిన్న,ఈ రోజు, రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.
అందుకే నేనంటాను నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి విచారించకు , నేడే ధర్మమార్గమున కాలాన్ని సద్వినియాగం చేసుకొని సాగేదే జీవితం, రేపటికి అని బాకీ ఉంచితే గట్టును దాటలేని సముద్రకెరటంలా మారిపోతావు.
నీతి : నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.
మనోనిగ్రహం తో ఉంటె కాలాన్ని జయించ వచ్చు రామచంద్రునిలా ధర్మాన్ని నిలబెట్ట వచ్చు
ఓం శ్రీ రాం.... శ్రీ మాత్రేనమ:... సర్వేజనా సుఖినోభవంతు ....ఓం శాంతి: శాంతి: శాంతి:
--(())--
Swami Vivekananda's Wisdom for Daily Inspiration -
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -
I have given you advice enough; now put at least something in practice. Let the world see that your reading of the scriptures and listening to me has been a success.
మీకు నేను కావలసినన్ని సలహాలు ఇచ్చాను. కనీసం కొంతైనా ఆచరణలో పెట్టండి. మీరు చేసిన పవిత్ర గ్రంధపఠనం, నా మాటల్ని వినడం సఫలమయ్యాయని లోకానికి తెలియనివ్వండి. మీ అందరికీ నా ఆశీర్వాదాలు.
🕉🌞🌎🌙🌟🚩
THE AWAKENING
Inspirational Quotes of Swami Vivekananda
Give up the world - this nonsense of the senses. There is only one real Desire, to know what is true, to be spiritual.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
ఇంద్రియ భ్రాంతి జన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి. పారమార్థికులమై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం.
🕉🌞🌎🌙🌟🚩
[ 🧘భగవంతుని చూడాలంటే🧘♂
🕉🌞🌎🌙🌟🚩
-[మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే]-
దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం.
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.
మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది.
_భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని *భగవాన్ శ్రీరమణమహర్షి అంటారు._*
దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అని !
కానీ మనకి కానరావడం లేదు… ఎందుకనీ ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన !
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు ! మొదటిది ‘నేను’ అనే తలంపు ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం ! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా ?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని – ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి.
అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).
మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.
సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.
శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.
మనస్సునూ బుద్ధినీ సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.
మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.
మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించం. ..ఇదే మాయ.
శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ.. ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.
మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది !
🕉🌞🌎🌙🌟🚩
[: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
గరుత్మంతుడు హంస తత్త్వానికి (స్పందనము) గమనము ఇస్తాడు. గరుత్మంతుడు హంస రెండూ ప్రాణస్పందనలే అయినప్పటికీ గరుత్మంతుడు అధో ముఖముగా దిగివచ్చి, ఊర్ధ్వ ముఖముగా తిరిగి వెళ్లగలడు. ఆరోహణ, అవరోహణ క్రమములో అవలీలగా చరించగలడు.
హంస శబ్దముతో కూడి ఉండి హృదయములో ఉండేవారిని 'హంసలు' అంటారు. హంస శబ్దముతో కూడి ఉండి ఆజ్ఞలో ఉండేవారిని 'రాజ హంసలు' అంటారు. హంస శబ్దముతో కూడి ఉండి సహస్రారములో ఉండేవారిని 'పరమహంసలు' అంటారు. హంస, రాజహంస, పరమహంసలనేవి ప్రజ్ఞల యొక్క స్థితులు.
🕉🌞🌎🌙🌟🚩
[: శ్రీరమణీయం -(757)
🕉🌞🌎🌙🌟🚩
"అసలు దైవానుగ్రహాన్ని కోరుకోవటం ఏమిటి ? తద్వారానే ఎలాంటి ప్రయోజనాలైనా కలుగుతున్నాయని నిర్ధారణ అవుతుంది !?"
దైవానుగ్రహం ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధ, కష్టం లేకుండా పోవాలని. ఎవరైనా భగవంతుని అనుగ్రహం కావాలనే పూజలు, జపాలు, తపాలు ఆచరిస్తారు. అయితే భగవంతుడు సూచించిన విధంగానే ఉండగలిగితే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది. ప్రాపంచిక విషయాలతో పరిమిత బంధమే దైవం సూచించే జీవనవిధానం. దైవాన్ని విశ్వసించటం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మనం కోరిన కోరిక తీరటం. రెండవది మన కోరికలు తీరటం మన చేతిలో లేదన్న సత్యం అర్థం కావడం. మనకు సాధ్యంకాని విషయాల్లో మాత్రమే దైవానుగ్రహాన్ని కోరుతాం. సాధ్యమయ్యే విషయాల్లో దైవాన్ని తలుచుకోనుకూడా తలుచుకోము. అంటే మనకు సాధ్యమవుతున్న పనులన్నీ మన ప్రతిభాపాటవాలతోనే నెరవేర్చుకుంటున్నామన్న భావన కలుగుతుంది. నియమబద్ధమైన దీక్ష జీవనంద్వారా మన ప్రతిపనిలోనూ దైవానుగ్రహం ఎలా ఇమిడివుందో తెలుస్తుంది. మన కోరికలు తీరడం, తీరకపోవడం రెండూ భగవంతుని దయాతోనే జరుగుతున్నాయని అర్ధమైతే మనసు శాశ్వత శాంతిని పొందుతుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
[: "ఋభుగీత " (224)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
మోక్షం పవిత్ర జీవనంతోనే సాధ్యం అవుతుంది !
మంచి మాటలు వినటం, మంచి ప్రవర్తన అలవర్చుకోవడం, మంచి దృక్పథం కలిగి ఉండటం ఇవే శాంతి సోపానాలు. భక్తి, జ్ఞాన, యోగ మార్గాలు ఏవైనా ఇదే సూత్రంతో సాగాల్సిందే. యోగశాస్త్రంలోని అష్టాంగమార్గాల్లో కూడా ముందు యమనియమాలను చెప్పిన తర్వాతనే ధ్యానం, సమాధి గురించి చెప్పారు. మనం ఎన్ని పూజలుచేసినా భగవంతుడు మన బుద్ధిజోలికి రాడు. దాన్ని మనమే సంస్కరించుకోవాలి. శీలంతో నిమిత్తం లేకుండాచేసే సేవా కార్యక్రమాల వలన పుణ్యం వస్తుంది. పుణ్యంవల్ల శుభం వస్తుంది గానీ మోక్షం రాదు. మోక్షం అంటే పరిపూర్ణమైన శాంతి రావడమే. అది పవిత్ర జీవనంతోనే సాధ్యం అవుతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[ 🌷115-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
అధ్యాయము-10
దివ్య వైభవము
20. ఆదిత్యులలో నేను విష్ణువును. వెలుగొందు వారలలో కిరణములు గల సూర్యమూర్తిని. మరుత్తులలో మరీచిని. నక్షత్రములలో చంద్రుడను.
(సృష్టి నిర్వహణము చేయుచున్న ప్రజ్ఞామయ మూర్తులు దేవతలు. వారు గంధర్వులనియు, దేవతలనియు, పితరులనియు మూడు విధములు. అందు గంధర్వులు బ్రహ్మాండ నిర్మాణమునకు ముందు నుండి ఉన్న ప్రజ్ఞలు. వారు సామమయ మూర్తులు. ఆనందమయ కోశము నందు ఉందురు. దేశము, కాలము, కొలతలకు అతీతులు. కనుక చందస్సులకు అతీతులు. వారిలో వేనుడు, సోముడు, విశ్వావసువు, చిత్రరథుడు ముఖ్యులు. వీరే బ్రహ్మ మనస్సుగా దిగి వచ్చిన వారు. పురాణములలో వీరిని నలుగురు కుమారులు అందురు. వీరికి కేంద్ర ప్రజ్ఞగా ఇంద్రుడు అను మనస్సు వెలువడును. వీరి నుండి బ్రహ్మ ప్రజ్ఞ బ్రహ్మాండముగా వెలువడును. అందు ఆదిత్యులు, రుద్రులు, వసువులు అను దేవతలు పుట్టుదురు. ఆదిత్యులు దివిదేవతలు అనబడుదురు. అనగా వెలుగునందుండు వారు. వీరి వెలుగు బహిఃప్రకాశం కాక, తత్వము అనబడు స్థితిలో 'తెలివి'గా ఉండును. వీరు పండ్రెండుగురు. వీరిలో వ్యాపించుట అను గుణము లేక దేవత విష్ణువు అనబడును. ఇతడు గంధర్వులకు ముందు నుండి బ్రహ్మాండ దేవతల స్థితిలోనూ, తరువాత స్థితులలోను కూడా అస్తిత్వము చెందును. బ్రహ్మాండ నిర్మాణమున ఆదిత్యులలో ఒకడుగా వ్యక్తమగును. జీవులలో కూడా ప్రజ్ఞగా ఉన్నది ఇతడే.
బ్రహ్మాండ దేవతలలో రెండవ తరగతి వారు రుద్రులు. వీరు తరంగమయ మూర్తులై ఆకాశమున, 'రోదసి' అనబడు సంఘర్షణ రూపమైన తత్వముగా కల్పింతురు. వీరి నుండి అణువులు మున్నగు తత్వములు పుట్టును. బహిర్వ్యాప్తమై ఇంద్రియ గోచరములగు శబ్ద, స్పర్శ, రూప, రస గంధములు, సంకోచ, వ్యాకోచములు, స్థానచలనం, స్పందనము, విద్యుత్తు, వేడి, వెలుగు అను మూర్తులుగా వ్యక్తమగుదురు. వీరి వెలుగు మొదలగునవి బహిర్వ్యాప్తములు. వీరు అంతరిక్ష దేవతలు అనబడుదురు.
పృథివీ దేవతలు ఎనిమిది మంది. వీరు మనస్సు, పృథి వ్యాపస్తేజో వాయురాకాశములు. పావకుడు లేక నిప్పు అనబడు అగ్ని, ప్రభాసుడు లేక ఘన పరిమాణము అనువారు. వీరి వలన అణువులు స్థూల తత్వము. భౌతిక పదార్థ ధర్మములు వర్తించును. అందు మనస్సు నుండి పంచేంద్రియములు పుట్టును. అవి అటు శబ్ద, స్పర్శాదులకును, ఇటు పంచభూతములకును ప్రజ్ఞను జోడించి, అస్తిత్వము అను అనుభూతిని ఇచ్చును. వీరు గాక "పితరులు' అను దేవతలు ఉద్భవించి, ప్రతిబింబము, బీజాంకుర ధర్మములు అన్న ధర్మము, పెరుగుట అను ధర్మము కలిగించును. వీరందరును బ్రహ్మాండ దేవతలు. అణువులు, శరీరములు నిర్మాణము అగుచుండగా వీరే వాని యందును వసించి పిండాండ దేవతలు అనబడుదురు. వీరు కాక రుద్రులలో వెలుగు నుండి జ్యోతిర్దేవతలు పుట్టుదురు. వారు 'చిత్ర శిఖండినులు' గా పురాణములలో చెప్పబడిన ఏడుగురు. వీరి సమాహారమున అంశుమంతుడు అను కిరణ్మయమైన సూర్య మూర్తి పుట్టును. వీరికి వసులోకమున ప్రతినిధులుగా, వసువులలో ప్రజాపతులు పుట్టుదురు. వీరు మనువులను దేశకాల అంతర్భాగములుగా విభజించి సంవత్సర, మాస, పక్షాది విభాగములను, మండల ప్రవృత్తులను కల్పించి, సృష్టి యొక్క పునరావృత్తి ధర్మమును కాపాడుచుందురు. ఇంకనూ రుద్రులలో వేడి నుండి ఊష్మకులు నలుగురు, మరుత్తులు ఏడుగురు పుట్టుదురు.
ఇది స్థూలముగా దేవతల వంశ వృక్షము. అందు మరుత్తులలో మరీచి, పవనుడు వ్యక్త మూర్తులు. మరీచి అనగా ఏడు కిరణముల నుండి ఆకాశమున, ఏడు విధములైన స్పందనములు పుట్టించువాడు. వీని ప్రభావముననే ఎండమావులు కనిపించుట. పవనుడనగా వీచునట్టి వాయువు. నక్షత్రములు అనగా ఒక గోళము చుట్టును గల ఆకాశమును సమ భాగములుగా విభజించుటకు పరివర్తన చేయుచు ఆవృత్తులు చేయువారు. అట్టివారిలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచూ, 28 దినములలో భూమధ్యరేఖ చుట్టును ఆకాశమేఖలను ఇరువది ఎనిమిది సమ భాగములు చేయును. వీని ప్రభావముననే స్త్రీలకు ఋతుకాలము కలుగుట జరుగును. ఈ భాగములలో సూర్యుడు చరించుచు, కార్తెలు అను 13 దినముల విభాగములను కల్పించి, భూమికి ఋతు కాలములను, ఋతు ధర్మములను, బీజాంకురాదులను కల్పించును.).
🕉🌞🌎🌙🌟🚩
[ శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ౹ శ్రుతో మనోమయః కోశస్తేనాత్మేతీరితం మనః ౹౹68౹౹
68. జీవుని బంధమోక్షములకు మనస్సే కారణమని శ్రుతి చెప్పును. మనోమయకోశము కూడ శ్రుతియందు చెప్పబడినది కనుక మనస్సే ఆత్మ అని వీరందురు.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
చైతన్యపు ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది.స్వతంత్రముగ కాదు.
"నా మనస్సు శాంతముగ ఉన్నది" అనే ప్రయోగమున జ్ఞాతయగు "నేను"మనస్సు కంటె భిన్నము.
మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము.
కామనా రహితమైనచో మోక్షమునకు సహకారి.
ఆకాశములోనికి ఎగురగోరు పక్షి తన గ్రుడ్డుపెంకు(చిప్ప)ను పగురగొట్టి వెలుపలకు వచ్చు విధముగా నీవు నీ వాసనలను పరిత్యజింపుము.అజ్ఞానజనితములగు ఈ వాసనలను నశింపజేయుట కష్టము.మరియు అవి అనంతమగు దుఃఖమును కలిగించును.
అజ్ఞానముతో ఆత్మను పరిమితముగావాంచు ఈ మనోవాసనయే అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నముగా జూచును. అయినప్పటికి,
సూర్యుడు మంచును తోలగించు విధముగా,అత్మతత్త్వవిచారణ, అజ్జానముతోఆత్మను పరిమితముగావించు ఈ వాసనను తొలగించును.
విచారణను చేపట్టవలెనను కోరికయే మార్పును కలిగింపజాలి యున్నది.
నిత్యవర్తమానమగు ఆత్మను దేశ,కాలములు ఆవరించుట (కప్పివేయుట)యే మరణము.
దేహము పడనిమ్ము లేక లేవనిమ్ము లేక మరియొక లోకమునకు పోనిమ్ము , నేను దేహమునకు పరిమితుడను కాను.అప్పుడు ఇది అంతయు నన్ను ఎట్లు బాధించును.
దేహము పడినప్పుడు ఆత్మ నశింపదు.
మనస్సు గూడ,ఆత్మజ్ఞానాగ్నిలో దగ్ధమగునంత వరకు నశింపదు.
బాధ నిన్ను స్పృశించక పోయినను,బాధను నీవు అనుభవించుచున్నట్లు అజ్ఞానదశలో మాత్రమే భావించుచున్నావు.
ఈ విషయములు ఆత్మలో వుండవు.
నీవు బద్ధుడవు కావు,అయినను"బద్ధుడను"అని చెప్పుచు ఎందుకు వ్యర్థముగా దుఃఖించుచున్నావు?
ఆత్మతత్త్వము అనంతము;అది ఎందుకు ఎట్లు ఎవని చేత బద్ధమగును?
ఆత్మలో విభాగము లేదు,ఏల అనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.అప్పుడు దేనిని "బంధ"మందురు?,దేనిని "మోక్ష"మందురు?
భావనలు,ఆలోచనలే బంధము. అవి అంతమొందుటే మోక్షము. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
"నేను బ్రహ్మము కాను"అను దృఢసంకల్పము వలన మనస్సు బద్ధమగును.
"నేను బ్రహ్మమే"అను దృఢసంకల్పమువలన మనస్సు ముక్తమగును.
🕉🌞🌎🌙🌟🚩
14-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩
వరాళి - ఆది (మోహన - ఆది)
పల్లవి:-
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీత ముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతియుండెడి!! ఇది !!
చరణము(లు):-
చారుస్వర్ణప్రాకార గోపుర
ద్వారములతో సుందరమైయుండెడి!! ఇది!!
అనుపమానమై యతిసుందరమై
దనరుచక్రమది ధగధగ మెరిసెడి!! ఇది !!
కలియుగమందున నిలవైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి!! ఇది !!
పొన్నల పొగడల పూపొదరిండ్లతో
చెన్నుమీరగను చెలగుచునున్నది!! ఇది!!
శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము!! ఇది!!
🕉🌞🌎🌙🌟🚩
18-38-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అII రాజససుఖమును వివరించుచున్నారు –
విషయేన్ద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ |
పరిణామే విషమివ
తత్సుఖం రాజసం స్మృతమ్ ||
తా:- ఏ సుఖము విషయేంద్రియ సంబంధమువలన మొదట అమృతమును బోలియు, పర్యవసానమందు (అనుభవానంతరమున) విషమువలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది.
వ్యాఖ్య:- విషయసుఖము తాత్కాలికమైనది; క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు సంయోగము కలిగినపుడే ఆ సుఖ ముదయించును. మఱల వెంటనే పోవును. మఱియు ప్రారంభములో అమృతముపగిది సుఖముగా తోచినను, పర్యవసానమున విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించునని ఇచట తెలుపబడినది.
దీనిని బట్టి రాజససుఖము ప్రారంభమున జీవులకు అమృతమువలె తోచుసుఖము అమృతము కాదనియు, పయోముఖవిషకుంభస్థవిషమే యనియు తెలియుచున్నది. విషరూపమగు ఆ అమృతము మహాప్రమాదకరమైనవస్తువు. ఏలయనిన ఆ అమృతములోన విషబీజములు కాపురముండును. ఆ సుఖమందు దుఃఖబీజములు నివసించును. కాబట్టి అట్టి అమృతమును విడనాడనిచో, దానిలో దాగియున్న విషబీజములనుగూడ స్వీకరించవలసివచ్చును.
కావున ముముక్షువులు దృశ్యవిషయములద్వారా తమకేదైన సుఖము గలిగినపుడు అది దుఃఖగర్భితమని, చేపయొక్క ఎరలోపలనుండు గాలమువంటిదని నిశ్చయించి దానిని త్యజించివేయవలెను. ఆ సుఖము ఈ జీవితమునేకాక అనేక భావికాల జీవితములనుగూడ నాశనముచేయును. కనుకనే భగవానుడు కరుణించి సాధకులకిచట హెచ్చరికచేయుచున్నారు. ఆ దృశ్యసుఖములయొక్క అసలురంగును గీతాచార్యులు బయటపెట్టుచున్నారు.
"మోసపోకుడు” అని సలహానిచ్చుచున్నారు. అజ్ఞాను లీసత్యము నెఱుగక తృణావృతకూపముల వలె కానవచ్చు శబ్దాదిదృశ్యవిషయములనే సేవించి అగాధసంసారకూపములో పడిపోవుచున్నారు.
భగవానుని ఈవాక్యములు జీవులకు అంధకారమునందు వెలుగునిచ్చుచున్నవి. జగత్తు యొక్క వాస్తవస్వరూపమును బోధించుచున్నవి. పైపై తళుకుబెళుకులకు మోసపోగూడదను విషయమును తెలియబఱచుచున్నవి.
కావున ముముక్షువులు విషయసుఖమువలన కలుగు ఈ కీడును గుర్తెఱిగి, ఇంద్రియములకు మనస్సునకు ఆ యా విషయములతో నేమాత్రము సంయోగము కలుగకుండ చూచుచుండవలెను. ఒకవేళ జన్మాంతరసంస్కారప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై పరుగెత్తినను, వానిని వివేకముతోనే వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మయందు నెలకొల్పవలెను.
ప్ర:- రాజససుఖముయొక్క లక్షణమేమి?
ఉ:- మొదట అమృతమువలె మహాసుఖముగ కానుపించి, తుట్టతుదకు (అనుభవానంతరమున) విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించుటయే రాజససుఖలక్షణము.
🕉🌞🌎🌙🌟🚩
తిరుప్పావై 17వ పాశురము
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్!!
భావం :-
ॐॐॐॐॐॐॐॐ
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచినీరు కావలసినవారికి మంచినీరు, అన్నము కావలసినవారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాలా, మాస్వామి మేలుకొనుము.
సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురువంటి దానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా, యశోదా మేలుకొనుము--- ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటిని కొలిచిన త్ర…
సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది రెండవ అధ్యాయము
గోపికావస్త్రాపహరణము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.17 (పదిహేడవ శ్లోకము)
తతో జలాశయాత్సర్వా దారికాః శీతవేపితాః|
పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుః శీతకర్శితాః॥9167॥
22.18 (పదునెనిమిదవ శ్లోకము)
భగవానాహ తా వీక్ష్య శుద్ధభావప్రసాదితః|
స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితమ్॥9168॥
అంతట ఆ ముగ్ధలు ఉహుఉహూ అని చలికి వణుకుచు, సిగ్గుతో మర్మాంగములను చేతులతో కప్పుకొని ఆ నదీజలములనుండి బయటికి వచ్చిరి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కన్యలను జూచి, వారియొక్క విశుద్ధ (నిష్కపట) భావనలకు ప్రసన్నుడయ్యెను. పిమ్మట ఆ ప్రభువు వారి వస్త్రములను తన భుజముపై పెట్టుకొని, ముసిముసి నవ్వులు నవ్వుచు మిగుల ప్రీతితో ఇట్లనెను.
22.19 (పందొమ్మిదవ శ్లోకము)
యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా వ్యగాహతైతత్తదు దేవహేలనమ్|
బద్ధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్తయేంఽహసః కృత్వా నమోఽధో వసనం ప్రగృహ్యతామ్॥9169॥
"కన్యలారా! మీరు మిక్కిలి దీక్షవహించి, ఒక మాసముపాటు నియమనిష్ఠలతో కాత్యాయనీ వ్రతమును ఆచరించితిరి. అందువలన మీరు ఎంతయు ప్రశంసార్హులు. కానీ మీరు నగ్నముగా జలకములాడుటద్వారా జలాధిదేవతయైన వరుణుని పట్లను, యమునానది యెడలను అపరాధమొనర్చితిరి. కనుక తద్దోషపరిహారార్థము శిరస్సున అంజలి ఘటించి, తలలు వంచి నమస్కరింపుడు. పిదప మీమీ వస్త్రములను గైకొనుడు.
22.20 (ఇరువదియవ శ్లోకము)
ఇత్యచ్యుతేనాభిహితా వ్రజాబలా మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిమ్|
తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః॥9170॥
శ్రీకృష్ణుని మాటలను విన్న పిమ్మట ఆ గోపకన్యలు 'నగ్నముగా పవిత్ర నదీజలములలో స్నానములొనర్చుట వ్రతభంగమే' అని గ్రహించిరి. ఆ దోషనివృత్తికై వారు సర్వకర్మలకును సాక్షియైన శ్రీకృష్ణునకు నమస్కరించిరి. పరమాత్మకు ప్రణామము లొనర్చుటవలన సకలదోషములు తొలగునుగదా! (దాసుని తప్పులు దండముతో సరిగదా!)
22.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
తాస్తథావనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః|
వాసాంసి తాభ్యః ప్రాయచ్ఛత్కరుణస్తేన తోషితః॥9171॥
దేవకీసుతుడైన కృష్ణభగవానుడు ఆ విధముగా వారు తలలు వంచి నమస్కరించినందులకు ఎంతయు సంతుష్టుడయ్యెను. అంతట ఆ స్వామి కనికరము చూపుచు వారి వస్త్రములను ఇచ్చివేసెను.
22.22 (ఇరువది రెండవ శ్లోకము)
దృఢం ప్రలబ్ధాస్త్రపయా చ హాపితాః ప్రస్తోభితాః క్రీడనవచ్చ కారితాః|
వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం తా నాభ్యసూయన్ ప్రియసంగనిర్వృతాః॥9172॥
శ్రీకృష్ణుడు 'మీరు వివస్త్రలై స్నానమాచరించితిరి' అని తమను గట్టిగా ఆక్షేపించినను, 'ఇక్కడికి వచ్చి మీ వస్త్రములను తీసికొనుడు' అనుచు నలుగురిలో ఎంతగా తమ సిగ్గులు తీసినను, 'నిజమే పల్కుచున్నాను. ఇందులో దాపఱికము లేదు' అనుచు మిగుల పరిహసించినను, 'మీ దోషనివారణకై శిరమున అంజలి ఘటించి నమస్కరింపుడు' అనుచు వారిని తోలుబొమ్మలవలె ఆడించినను, అంతేగాదు, వారి వస్త్రములను అపహరించినను, ఆ గోపకన్యలు ఆ స్వామియెడ ఎంతమాత్రమూ కినుక వహింపనేలేదు. పైగా తమ ప్రియతముడైన శ్రీకృష్ణుని సమాగమముచే వారు ఎంతయు సంతోషముతో మురిసిపోయిరి.
22.23 (పదిహేడవ శ్లోకము)
పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసంగమసజ్జితాః|
గృహీతచిత్తా నో చేలుస్తస్మిన్ లజ్జాయితేక్షణాః॥9173॥
పిమ్మట ఆ కన్యలు తమ వస్త్రములను ధరించిరి. వారు తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ ప్రభువుయొక్క సాంగత్యమునకై ఉబలాటముతోనుండిరి. వారి చిత్తములు పూర్తిగా శ్రీకృష్ణుని పరమై ఉండుటవలన వారు అక్కడినుండి ఒక్క అడుగుకూడ కదపలేకపోయిరి. అంతేగాదు, వారు సిగ్గు దొంతరలలో మునుగుచు, ఏమాత్రము ఱెప్పవాల్చక తమ స్వామిని ఓరచూపులతో చూడసాగిరి.
22.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శకామ్యయా|
ధృతవ్రతానాం సంకల్పమాహ దామోదరోఽబలాః॥9174॥
తన పాదాబ్జములను స్పృశించుకాంక్షతోనే (తనను పతిగా కోరియే) వారు కాత్యాయనీ వ్రతమును ఆచరించుటకు సంకల్పించినారని శ్రీకృష్ణభగవానుడు గ్రహించెను. అంతట ఆ దామోదరుడు ఆ కన్యల ప్రేమకు వశుడై వారితో ఇట్లనెను.
(యశోదామాతయొక్క వాత్సల్యమునకు వశుడై, ఆనాడు శ్రీకృష్ణుడు ఉలూఖలబంధమునకు కట్టువడి దామోదరుడు అని ప్రసిద్ధి వహించెను. ఇప్పుడు ఆ స్వామి గోపకన్యలయొక్క ప్రేమానురాగములకు కట్టువడి గోపీవల్లభుడు గా ఖ్యాతికెక్కెను. ఉలూఖలము అనగా ఱోలు)
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
771వ నామ మంత్రము 1.1.2021
ఓం దురారాధ్యాయై నమః
చంచలములైన ఇంద్రియములు గలవారికి అనగా ఇంద్రియ నిగ్రహము లేనివారికి, స్థిరమైన దైవిక భావములు లేనివారికి ఆరాధింప వీలుకాని పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దురారాధ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం దురారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అరిషడ్వర్గ రహితుడై, స్థిరచిత్తుడై, భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు ఆ తల్లి భౌతికముగా సుఖశాంతులు, ఆముష్మికముగా మోక్షసాధనాసక్తియు ప్రసాదించి ఉపాసనలో ముందుకు సాగుటకు మార్గము సుగమము చేయును.
స్థిరచిత్తులు కానివారు, ఇంద్రియనిగ్రహము లేనివారు, ద్వైతభావన కలవారు, బ్రహ్మము అన్నదానిపై నమ్మకము లేని నాస్తికులు జగన్మాతను ఆరాధించుటకు అర్హులు కారు. కాబట్టి జగన్మాత దురారాధ్యా యని అనబడినది.
దీనినే సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఇలా చెప్పారు:
సౌందర్య లహరి - ప్రథమ శ్లోకము
1) శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి ||
పరాశక్తి తో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడు అయినను కదలుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి, స్థితి, లయలకు కారణభూతులైనారు.
అమ్మా! పరమశివుడే అయినా నీతో కలసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు.
అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా.
(శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది)
శివరూపమైన లింగం శక్తిరూపమైన పానమట్టం లేనిదే నిలబడలేదుగా.
అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లుసాధ్యం.
నిన్ను నిత్యము శివుడు,విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.
అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.
పుణ్యం లేనివారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించటానికి అర్హులు కానేరరు. 'నాకు శక్తి ఉంది' అనటం మనం తరచూ వింటూ ఉంటాం. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి, ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి.
ఈ కారణం చేతనే శ్రీవిద్య ఎవరికి పెడితే వారికి గురువులు ఉపదేశించరు. అభిలషించువారి అర్హతమేరకు మాత్రమే శ్రీవిద్య ఉపదేశింపబడుతుంది.
యోగినీ హృదయంలో ఇలా చెప్పబడింది.
న దేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో న చేశ్వరీ
న శుశ్రూషాలసానాంచ నైవానర్థప్రదాయినః
అన్యమతస్థులకు, వేరే గురువుయొక్క శిష్యులకు శ్రీవిద్యను ఉపదేశించరాదు. అట్టివారు జగన్మాతను ఆరాధించడానికి అర్హులు కారు.
వేదాలపై నమ్మకంలేనివారు, భగవంతుడు అనేది కేవలం భ్రమ మాత్రమే అనేవారు, పరాశక్తిని హేళన చేయువారు, బ్రహ్మము అన్నది లేనివారు జగన్మాతను ఆరాధించడానికి అర్హులు కారు.
గురువు నమ్మకం లేనివారు, గురుద్రోహులు, గురువు గారి కూతుళ్ళపై వక్రభావం ఉన్నవారు, గురుపత్నులను అవమానించువారు జగన్మాతను ఆరాధించడానికి అర్హులు కారు.
కాబట్టి జగన్మాత దురారాధ్యా యను నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దురారాధ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
197వ నామ మంత్రము 1.1.2021
ఓం సాంద్రకరుణాయై నమః
అత్యంత దయాస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సాంద్రకరుణా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సాంద్రకరుణాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరులై ఆ శ్రీమాతను ఉపాసించు సాధకులకు ఆ కరుణాసముద్రురాలు అనంతమైన జ్ఞానసంపదతోబాటు ఐహికపరమైన శాంతిసౌఖ్యములు ప్రసాదించును.
పరమేశ్వరి మూర్తీభవించిన ఘనమైన దయాసముద్రురాలు. అత్యంత పరాకాష్ఠస్థాయి గల దయాస్వభావానికి ఆ పరమేశ్వరియే ప్రమాణము. అంతకు మించి కరుణారసం అనుగ్రహించడానికి లోకంలో ఏ మాత్రుమూర్తులూ కూడా సరితూగరు. బిడ్డలపై ఏ ప్రాణికోటిలోని మాతృమూర్తి కూడా దయాస్వభావం లేకుండా ఉండదు. తన గర్భంలో జీవం పోసుకుని పెరిగే పిండస్థాయినుండి శిశువుగా ప్రేగు తెంచుకుని భూమిపై పడేవరకూ గర్భంలో ఉన్న నవమాసాలు నిండువరకూ తన్నినా, ఒత్తి గిల్లినపుడు బాధపెట్టినా ఓర్చుకుని, ఆ బాధలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ మురిసిపోతూ ఉంటుంది మాతృమూర్తి. మలమూత్రాలను తన పక్కలోనే పోసినా, ఆ తడిలో తను పడుకొంటూ, తన బిడ్డను పొడిగా ఉన్న ప్రక్కకు చేర్చి తను చలికి వణికితూ, ఇంకో ప్రక్క బిడ్డ తలనిమురుతూ, ముద్దులాడుతూ స్తన్యాన్ని ఇస్తూ అరమోడ్పుకనులతో బిడ్డవైపు ప్రేమగా వీక్షిస్తూ ఉంటుంది. కాన్పుకష్టమైనపుడు, తల్లి బ్రతికితే బిడ్డబ్రతకదు. బిడ్డబ్రతకాలంటే తల్లి కన్నుమూయాలి. ఏ ప్రాణంకావాలని అయిన వాళ్ళను అడుగుతుంటే, తాను పోయినా తనబిడ్డ బ్రతికితే చాలంటుంది మాతృమూర్తి. బిడ్డప్రాణాలకోసం యమునితోనైనా పోరాడతానంటుంది మాతృమూర్తి. మేతకు వెళ్ళి, సంధ్యవేళ ఇంటికి చేరిన గోమాత 'అంబా' యని ఆప్యాయంగా అరుస్తూ తన లేగదూడను పిలుస్తుంది. అడవిలో పులి తనను మ్రింగుటకు సిద్ధమైతే, తన బిడ్డ ఇంటివద్ద ఉన్నాడు. కడుపునిండా పాలుపట్టి, తోటివారికి బిడ్డను అప్పగించి వస్తానని హోరాహోరీ పులితో సంవాదం పెట్టుకున్న గోమాత ప్రేమలోని గొప్పదనానికి కొలప్రమాణములు ఉండవుగదా. అందంట అందంట తిరుగుతూ, పంటచేలో గింజలను ముక్కుతో కరచిపట్టి గూటికి వచ్చి రెక్కలు ఇంకారాని పక్షికూన నోట్లో పెడుతుంటే, ఆ కిచకిచ అరుపులలో పొడసూపిన ఆ తల్లిపక్షి ప్రేమను వర్ణించడానికి ఏభాష సరిపోతుంది? ఇది అంతా లోకంలో ఉన్న జీవకోటిలోని మాతృమూర్తుల కరుణా స్వభావానికి దర్పణమేగదా!తన బిడ్ద అనాకారి అయినా, అవిటివాడయినా ప్రేమమాత్రం కొరవడదు. అంతా? ఇంతా? లేక ఎంత? అని అడిగినా చెప్పలేని, ఆకాశం కూడా హద్దులు కావని చెప్పేది మాతృప్రేమ. జగన్మాత కరుణా సాంద్రత సామాన్య మాతృమూర్తుల కరుణా సాంద్రతకు అనేక రెట్లు అధికము. అందుకనే జగన్మాత సాంద్రకరుణా యని అనబడినది. ఒక్కొక్క తల్లి తన బిడ్డలకు తల్లి అయితే జగత్తులోని తల్లులకే తల్లి శ్రీమాతా యని తొలి నామంతో స్తుతించే మన జగన్మాత.
జీవకోటి యంతా తన బిడ్డలే. దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గులపైన జగన్మాత కరుణ కొరవడదు. సన్మార్గంలోకి తీసుకు రావడాని ప్రయత్నిస్తుంది. మాట వినకపోతే కోపగించదు. తనలో లీనం చేసేసుకుంటుంది.
మహిషాసురుడు, భండాసురుడు, దుర్గుముడు మొదలైనవారు లోకకంటకులే. తొలుత వారిని ప్రేమగా లాలించి మంచిమాటలతో చెప్ఫింది. వినలేదు. మరింత లోకకంటకులయారు. వారు అలా కావడానికి కారణం కూడా ఆ తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోయి ఆ తల్లిలోనే లీనం కావడానికే. కొందరు చస్తారు చరిత్ర హీనులుగా. ఆ తల్లిచే సంహరింపబడి ఆ అసురులు నిలచిపోయారు జగత్ప్రసిద్ధులుగా పురాణాల్లో. అమ్మను గూర్చి లోకాలకు తెలియజేయడానికే అలా సంహరింపబడినారు. అమ్మ కరుణించినా మంచిదే. కరుణతో తనలో లీనం చేసుకున్నా మంచిదేకదా.
తన పెనిమిటి మూడవనేత్రంనుండి వెలువడిన అగ్నికీలలలో మాడి భస్మరాశి అయిన మన్మథుని సజీవునిజేసిసాటి స్త్రీ రతీ దేవి యొక్క సౌభాగ్యాన్ని కాపాడిన జగన్మాత కరుణా సాంద్రత అపారము. గనుకనే సాంద్రకరుణా నామాంకిత అయినది. సాగరమథనంలో వెలువడిన హాలాహలాగ్నికి మాడిమసి అవబోతూ అల్లాడిన లోకాలను వీక్షించి, కరాణాప్రపూరితహృదయంతో, తన మాంగల్యం గట్టితనంపై ఎనలేని నమ్మకంతో గరళం మొత్తాన్ని తన భర్తచే మ్రింగించిన ఆ పరమేశ్వరి అపారమైన కరుణకు అవధులు లేవుగదా. అందుకనే ఆ జగన్మాతను సాంద్రకరుణా యనే నామ మంత్రంతో స్తుతిస్తున్నాము. తన భర్త ఆగ్రహజ్వాలలకు ముద్దులపట్టి బాలగణేశుని తలతెగిపడితే, తిరిగి తన బిడ్డడి ప్రాణాలకోసం లోకాలనే చీకట్లమయం జేసి తిరిగి తన బిడ్డడి ప్రాణాన్ని సాధించుకున్న అపార కారుణ్యమూర్తి జగజ్జనని సాంద్రకరుణా యను నామ మంత్రమునకు సార్థకత పొందినది.
అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సాంద్రకరుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ఇరువది రెండవ అధ్యాయము
గోపికావస్త్రాపహరణము
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.25 (ఇరువది ఐదవ శ్లోకము
సంకల్పో విదితః సాధ్వ్యో భవతీనాం మదర్చనమ్|
మయానుమోదితః సోఽసౌ సత్యో భవితుమర్హతి॥9175॥
22.26 (ఇరువది ఆరవ శ్లోకము
న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే|
భర్జితా క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేష్యతే॥9176॥
వస్త్రాపహరణం సందర్భంగా శ్రీకృష్ణభగవానుడు గోపికలతో ఇట్లు పలుకుచున్నాడు:
"ముద్దుగుమ్మలారా! మీరు బయటికి చెప్పకున్నను మీ మనసులలోని సంకల్పములను (మీ ఆంతర్యములను) నేను ఎఱుగుదును. మీరు నన్ను పతిగా పొంది సేవించుటకై ఈ నోమును (కాత్యాయనీ వ్రతమును) నోచినారు. ఇక అది తప్పక ఫలించును. ఇది ముమ్మాటికిని నిజము. నన్ను గొల్చినవారి కోరిక తీరుటయేగాక, వారికి సకలార్థ సంపదలునూ సమకూరును. అంతేకాదు కడకు మోక్షముగూడ ప్రాప్తించును. త్రికరణశుద్ధిగా తమ మనస్సులను, ప్రాణములను నాకే సమర్పించి, తపనతో నన్ను గొల్చినవారికి సాంసారిక భోగములయందు కాంక్ష ఏమాత్రమూ జనింపదు. వేగిన, ఉడికిన విత్తనములు మఱల మొలకెత్తవుగదా!"
22.27 (ఇరువది ఏడవ శ్లోకము
యాతాబలా వ్రజం సిద్ధా మయేమా రంస్యథా క్షపాః|
యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః॥9177॥
వస్త్రాపహరణం సందర్భంగా శ్రీకృష్ణభగవానుడు గోపికలతో ఇంకను ఇట్లు పలుకుచున్నాడు:
"కన్యలారా! మీ కోరికలు నెఱవేరినట్లే. ఇక మీరు వ్రజభూమికి వెళ్ళవచ్చును. రాబోవు శరద్రాత్రులయందు మీరు నాతో విహరించెదరు. సతులారా! ఈ ఉద్దేశ్యముతోనే మీరు దుర్గాదేవిని అర్చించుటద్వారా కాత్యాయనీ వ్రతమును ఆచరించితిరిగదా!
శ్రీశుక ఉవాచ
22.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము
ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః|
ధ్యాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్నిర్వివిశుర్వ్రజమ్॥9170॥
శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ గోపకన్యలు తమ కోరికలు నెఱవేరినట్లేయని భావించిరి. పిమ్మట వారు తమ మనస్సులలో ఆ స్వామి చరణకమలములనే నిలుపుకొనుచు అతికష్టముమీద అచటినుండి కదలి బృందావనమున ప్రవేశించిరి.
22.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము
అథ గోపైః పరివృతో భగవాన్ దేవకీసుతః|
వృందావనాద్గతో దూరం చారయన్ గాః సహాగ్రజః॥9179॥
అంతట కృష్ణపరమాత్మ బలరామునితోను, గోపాలురతోడను గూడి, గోవులను మేపుకొనుచు బృందావనమునుండి చాలదూరమునకు వెళ్ళెను.
22.30 (ముప్పదియవ శ్లోకము
నిదాఘార్కాతపే తిగ్మే ఛాయాభిః స్వాభిరాత్మనః|
ఆతపత్రాయితాన్ వీక్ష్య ద్రుమానాహ వ్రజౌకసః॥9180॥
అది గ్రీష్మఋతువు - సూర్యుని కిరణముల వేడిమి తీవ్రముగా ఉండెను. ఆ తాపమును తట్టుకొనలేక సేదదీర్చుకొనుటకై వారు అందఱును దట్టమైన పెద్ద పెద్ద చెట్ల నీడలకు చేరిరి. మహావృక్షములు తమకు గొడుగులుగా అమరుట చూచి, శ్రీకృష్ణుడు తోడిగోపాలురతో ఇట్లనెను.
22.31 (ముప్పది ఒకటవ శ్లోకము
హే స్తోక కృష్ణ హే అంశో శ్రీదామన్ సుబలార్జున|
విశాలవృషభ తేజస్విన్ దేవప్రస్థ వరూథప॥9181॥
22.32 (ముప్పది రెండవ శ్లోకము
పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థైకాంతజీవితాన్|
వాతవర్షాతపహిమాన్ సహంతో వారయంతి నః॥9182॥
"స్తోక కృష్ణా! అంశూ! శ్రీరామా! సుబలా! అర్జునా, విశాలా! వృషభా! తేజస్వీ! దేవప్రస్థా! వరూథపా! మహోన్నతములైన ఈ వృక్షములను ఒక పర్యాయము పరికించి చూడుడు. ఇవి తమ జీవితములను పూర్తిగా పరోపకారమునకే వెచ్చించుచున్నవి. పెనుగాలులు, జడివానలు, మండుటెండలు, హిమపాతములు మొదలగువాటివలన కలుగు బాధలను తామే ఓర్చుకొనుచు వాటి తాకిడులు మనపై పడకుంఢా ఆదుకొనుచున్నవి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
శ్రీమద్భగవద్గీత - 596 / Bhagavad-Gita - 596 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 13 🌴
13. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||
🌷. తాత్పర్యం :
ఓ మహాబాహుడవైన అర్జునా! వేదాంతము ననుసరించి కర్మలు సిద్ధించుటకు ఐదు కారణములు గలవు. వాని నిపుడు నా నుండి ఆలకింపుము.
🌷. భాష్యము :
ప్రతికర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణభక్తిరసభావితుడు తను చేయు కర్మల ఫలితములచే సుఖదుఃఖములను అనుభవింపడనుట ఎట్లు సంభవమనెడి ప్రశ్న ఉదయించును.
కాని అది ఎట్లు సాధ్యమో తెలియజేయుటకు శ్రీకృష్ణభగవానుడు వేదాంత తత్త్వమును ఉదహరించుచున్నాడు. ప్రతికార్యమునకు ఐదు కారణములు గలవనియు మరియు కార్యముల సిద్ధికి ఈ ఐదు కారణములను గమనింపవలెననియు శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.
సాంఖ్యమనగా జ్ఞానకాండమని భావము. అలాగుననే వేదాంతము ప్రసిద్ధులైన ఆచార్యులచే ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమస్వరూపము. శ్రీశంకరాచార్యులు కూడా ఆ వేదాంతసూత్రములను యథాతథముగా స్వీకరించిరి. కనుక ప్రామాణమును సర్వదా గ్రహించవలెను.
చరమనిగ్రహము పరమాత్ముని యందే కలదు. ఇదే విషయము “సర్వస్య చాహం హృది సన్నివిష్ట:” అని ఇంతకు పూర్వమే భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమాత్ముడు ప్రతియొక్కరిని వారి పూర్వకర్మలను గుర్తు చేయుచు వివిధకర్మల యందు నియుక్తుని చేయుచున్నాడు. అంతరము నుండి కలుగు అతని నిర్దేశమునందు ఒనర్చబడు కృష్ణభక్తిభావనాకర్మలు ఈ జన్మయందు కాని, మరుజన్మ యందు కాని ఎటువంటి ప్రతిచర్యను కలుగజేయవు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 596 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 13 🌴
13. pañcaitāni mahā-bāho kāraṇāni nibodha me
sāṅkhye kṛtānte proktāni siddhaye sarva-karmaṇām
🌷 Translation :
O mighty-armed Arjuna, according to the Vedānta there are five causes for the accomplishment of all action. Now learn of these from Me.
🌹 Purport :
A question may be raised that since any activity performed must have some reaction, how is it that the person in Kṛṣṇa consciousness does not suffer or enjoy the reactions of work? The Lord is citing Vedānta philosophy to show how this is possible.
He says that there are five causes for all activities, and for success in all activity one should consider these five causes. Sāṅkhya means the stock of knowledge, and Vedānta is the final stock of knowledge accepted by all leading ācāryas. Even Śaṅkara accepts Vedānta-sūtra as such. Therefore such authority should be consulted.
The ultimate control is invested in the Supersoul. As it is stated in the Bhagavad-gītā, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ. He is engaging everyone in certain activities by reminding him of his past actions. And Kṛṣṇa conscious acts done under His direction from within yield no reaction, either in this life or in the life after death.
🌹 🌹 🌹 🌹 🌹
[06:53, 01/01/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 202, 203 / Vishnu Sahasranama Contemplation - 202, 203 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻202. సంధిమాన్, सन्धिमान्, Sandhimān🌻
ఓం సంధిమతే నమః | ॐ सन्धिमते नमः | OM Sandhimate namaḥ
ఫలభోక్తా స ఏవేతి సంధిమానుచ్యతే హరిః సంధాతగా భిన్న భిన్న కర్మలలో నిస్సంగ జీవాత్మలను సంధించు విష్ణువు, ఆ కర్మల వలన ఏర్పడిన భిన్న భిన్న శరీరముల ద్వారమున కర్మ ఫలములను అనుభవించుచు సన్ధిమాన్ అని పిలువబడుచున్నాడు. జీవుడుగా కర్మఫల భోక్తయు తానే కావున కర్మఫలములతో సంధి లేదా కలయిక విష్ణునకు కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 202🌹
📚. Prasad Bharadwaj
🌻202. Sandhimān🌻
OM Sandhimate namaḥ
Phalabhoktā sa eveti saṃdhimānucyate hariḥ / फलभोक्ता स एवेति संधिमानुच्यते हरिः As the One who unites Jīvas with the fruits of their actions He is known as Saṃdhātā and He himself as the enjoyer of the fruits of actions, He is Sandhimān.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 203 / Vishnu Sahasranama Contemplation - 203 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻203. స్థిరః, स्थिरः, Sthiraḥ🌻
ఓం స్థిరాయ నమః | ॐ स्थिराय नमः | OM Sthirāya namaḥ
సదా ఏక రూపః విష్ణువు ఎల్లపుడును ఒకే రూపముతో నుండువాడు గనుక, స్థిరుడు.
:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ.హరికి నర్థముఁ బ్రాణ మర్పితంబుగ నుండు వాని కైవల్య మెవ్వనికి లేదువనజలోచను భక్తచరుల సేవించిన వాని కైవల్య మెవ్వనికి లేదువైకుంఠ నిర్మల వ్రతపరుం డై నట్టి, వాని కైవల్య మెవ్వనికి లేదుసరసిజోదరు కథా శ్రవణ లోలుండైన వాని కైవల్య మెవ్వనికి లేదుతే.లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి, శమ దమాదుల సత్యశౌచముల దానధర్మసుఖముల సుస్థిర స్థానమైన, వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము. (55)
ఎవరైతే శ్రీహరికి తమ అర్థమూ, ప్రాణమూ సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటివారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తివల్ల సంప్రాప్తించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్లకానీ, బ్రహ్మచర్యాది నియమాలవల్లకానీ, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్లకానీ, సత్యపరిపాలనం వల్లకానీ, శుచిత్వం వల్లకానీ, దానధర్మాలవల్లకానీ, యజ్ఞాలు చేయడం వల్లకానీ ప్రాప్తించదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 203🌹
📚. Prasad Bharadwaj
🌻203. Sthiraḥ🌻
OM Sthirāya namaḥ
Sadā eka rūpaḥ / सदा एक रूपः One who is always of the same nature. Being always of the same form, He is Sthiraḥ or constant.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[06:53, 01/01/2021] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 149 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 79 🌻
కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.
కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.
జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.
కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.
దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై, ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు.- విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:53, 01/01/2021] +91 98494 71690: 🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 23 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 23 🍀
సాత్ పాచ్ తీన్ దశకాంచా మేళా!
ఏక తల్వీ కళా దావీ హరి!
తైసే నక్టేనామ్ సర్వత్ర వరిఫ్ట్!
యేథే కా హీ కష్ట న లగతీ!!
అజపా జపణే ఉలట్ ప్రాణాచా!
తెథేహి మనాచా నిర్థారు అసే!!
జ్ఞానదేవా జిణే నామే వీణ్ వ్యర్డ్!
రామకృద్దీ పంథ్ క్రమీయేలా!!
భావము:
ఏడు, ఐదు, మూడు మరియు పది, ఈ తత్త్వాల కలయిక అంతా మిథ్యాభాసము. దీనినంత ఒక్కటే తత్త్వములో శ్రీహరి చూపినారు.
నామము అన్ని మార్గములలో వరిష్టమైనది. నామ మార్గము స్వీకరించుటకు ఎలాంటి కష్టము కూడ కాదు. అజపాజపము వాణి విషయము కాదు. కావున లోనికి బయటకు ప్రవహిస్తున్న ఉఛ్ఛ్వాస నిశ్వాసలపై మనసు నిర్ధారము చేయుము.
.
నామము లేనిది అంతా వ్యర్థము కావున నేను రామకృష్ణుల పంతము పట్టినానని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -23 🌻
ఏడు, ఐదు, మూడు దశక సమూహము
ఇరువది ఐదుల కూడిక దేహము
ఈ కళలన్నీయు మిథ్యాభాసము
శ్రీహరి చూపెను ఒక్కటే తత్త్వము
ఆ విధముగ లేదు నామము
అన్ని మార్గములలో ఇదే వరిష్ఠము
“ఇష్టము ఉన్న కాదు కష్టము”
ఈ విధానము సులభతరము
అజపాజపము ప్రాణ ప్రవాహము
కాదుర సుమతీ వాణి విషయము
ప్రవహిస్తున్న ఉఛ్వాస నిశ్వాసము
అక్కడ మనసు నిర్ధారము చేయుము
జ్ఞానదేవుల పలుకులు వినుము
నామము మరిచిన బ్రతుకు వ్యర్థము
రామకృష్ణుల నడత భవ్యము
చెప్పినడిచిరి లోక ప్రసిద్ధము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:53, 01/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 94 / Sri Lalitha Sahasra Nama Stotram - 94 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
[06:53, 01/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 166 / Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻166. 'నిష్పాపా' 🌻
పాపము లేనిది శ్రీమాత అని అర్థము.
సృష్టియొక అగ్నికార్య మగుటచే, తత్కారణముగ కొంత మసిబారుట జరుగుచున్నది. మలినము లేర్పడుచుండును. ఈ మలినములనే పాపములు అందురు. వీనినెప్పటికప్పుడు తొలగించు
చుండవలెను. లేనిచో అది జ్ఞానమును కప్పి, జీవుని దుఃఖమున ప్రడదోయును. బ్రహ్మకైనను ఇట్టి అజ్ఞానమావరించుటకు అవకాశమున్నది. జీవునికి అహంకారము కారణముగ అభిమానము కలుగును. ఇది మొదటి మాయావరణము. దానివలన మోహము పుట్టును.
మోహము కారణముగ కోరిక జనించును. మోహము తీరనపుడు, ప్రయత్నము కోపముగ మారును. కోపము తీవ్రమైనపుడు అంధకార మిశ్రము అను ముదురు కటి ఏర్పడి ఏమియు తెలియని స్థితి ఏర్పడును. దానివలన మనసుకు చాంచల్యము కలిగి, భ్రమ పుట్టి, అది చిత్త విభ్రమమై లేనిది ఉన్నట్లు గోచరింపజేయును. ఇట్లు ఐదు స్థితులలో, సహజముగ జ్ఞానస్వరూపుడైన జీవుడు అజ్ఞానవశుడై పడియుండును.
చతుర్ముఖ బ్రహ్మకూడ తాను సృష్టిచేయవలెను అని భావించుట వలన, అహంకారమునకు అభిమాన మేర్పడి, మోహము, కోపము, అంధతా మిశ్రము, చిత్తభ్రమ కలిగినవి. ఏ జీవికైనను ఇంతే. తాను చేయుచున్నాడని భావించినపుడు, బంధింపబడుట తప్పదు.
చేయుటకు సంకల్పము దైవమునదని, దాని ననుసరించుచు నిర్వర్తించుట తాను చేయవలసిన పని అని తెలియవలెను. చతుర్ముఖ బ్రహ్మ ఏమి చేయవలెనో తెలియక ఉన్నప్పుడు, అంతర్వాణి తపస్సు చేయుమని నిర్దేశించెను.
తపస్సు చేయగా, పరతత్త్వానుభూతి కలిగెను. అటుపైన సృష్టి చేయమని అంతర్వాణి పలికినది. తపస్సు చేయుట, సృష్టి చేయుట తనకందింపబడిన సంకల్పములే కానీ, తనవి కావు. తాను
సృష్టి చేయుదుననుకొనుట ఏమి? అదియే అహంకారము వలన కలుగు అభిమానము. అజ్ఞానమున కదియే నాంది.
జీవులు కూడ తామే సంకల్పించుచున్నామని, నిర్వర్తించుచున్నా
మని భావించుటవలన ఇట్టి అవిద్యయను పాపమునందు పడుచున్నారు. శ్రీమాత సంకల్పములకు పుట్టినిల్లు, ఆమె పరమాత్ముని సంకల్పము. ఆమె సంకల్పించిన పిమ్మటే సృష్టి ఆరంభమగును.
స్థితి లయములు కూడ ఆమె సంకల్పమే. ఆమె సంకల్పమేమో తెలిసి అనుసరించుటకే సమస్త ఆరాధనములు. ఆమె జ్ఞానమునకు, అజ్ఞానమునకు కూడ అధిష్టాన దైవము. పాప పుణ్యములకు కూడ ఆమెయే పుట్టినిల్లు. ఆమె నుండి పుట్టినవి ఆమెపై ఆధిపత్యము
వహించలేవు. అందువలన ఆమె పాపపుణ్యములకు కూడ అతీతమై యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 166 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Niṣpāpā निष्पापा (166) 🌻
She is without sins. Pāpa means sin. Sins arise out of desires. It has already been discussed that She is without desires (156 Nīrāgā). Kṛṣṇa says, (Bhagavad Gīta IV.14) “There is no work that affects me, nor do I aspire for the fruits of action.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
[15:50, 01/01/2021] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.
రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.
ఆత్మానందం.
ఆడియో నం.6
💥🎊💥🎊💥🎊💥🎊💥🎊
[16:00, 01/01/2021] +91 92915 82862: 🌀👂🍯🎊💖🎊👂🍯🌀
శ్రీకృష్ణ కర్ణామృతం.
-- లీలాశుకుల రచన
ధనుర్మాసమును పురస్కరించుకుని.
ఆడియో నం.6
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
[16:07, 01/01/2021] +91 92915 82862: శ్రీ ఆది శంకరాచార్య విరచితము శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం
💫🌞🌏🌙🌟🚩
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి
💫🌞🌏🌙🌟🚩
శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ మంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్య మానస పూజ!!!
భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు)అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తుంటాము. భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు ధ్యానం,ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యం, ఆచమనీయము, పంచామృతస్నానం, శుద్దోదకస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, అంగపూజ, స్తోత్రం(అష్టోత్తరం / సహస్రనామావళి ), ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, నీరాజనం, ఛత్రం, చామరం, నృత్యం, గీతం, వాయిద్యములు, మంత్రపుష్పం, ప్రదక్షిణం, మొదలగునవి.
శ్రీ మంత్రమాతృకా పుష్పమాలస్తవం (పంచదశి మంత్ర యుక్తమైన స్తవ…
[16:12, 01/01/2021] +91 92915 82862: అంతర్యామి సాధన
🕉🌞🌎🌙🌟🚩
*సర్వకాలముల యందలి సంసార జీవులును, తమతమ మార్గములకు సంబంధించిన వానినిగా భగవంతుని దర్శింప వలెను. ఉత్తమ గృహిణి తన భర్తగా దర్శింపవలెను. బిడ్డలు తమ తండ్రిగా దర్శింపవలెను. బుద్ధిమంతులు తమ బుద్ధికధిపతిగా దర్శింప వలెను. ప్రజలు ప్రభువుగా దర్శింప వలెను. అందరును తన చుట్టునున్న జగత్తు నందలి జీవుల యందంతర్యామిగా దర్శింప వలెను.
ఎవరికి సంబంధించిన రూపమున వారికి కనిపించు నైపుణ్యముగల వాడు భగవంతుడు.
కేవలము ఆ రూపములను, తమకు వారితో గల సంబంధములను మాత్రము చూడగలవారు సంసారబద్దులు.*
🕉🌞🌎🌙🌟🚩
(మాస్టర్ ఇ. కె భాగవతంనుండి)
శ్రీగురుభ్యోనమః
సమస్త గురుపరంపర ఆశీస్సులతో ఏసుక్రీస్తు పుట్టిన శుభసందర్భము, నూతన సంవత్సర ప్రవేశము, గురుపూజా మహోత్సవ ఆనందాలు, సంక్రాంతి వేడుకలు అన్నిటిని కలగలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలములోనికి ప్రవేశించాము. సాయన పద్ధతిలో డిసెంబర్ 22 నుండి ఉత్తరాయణము మొదలైనది.
క్రొత్త సంవత్సరములో ఆత్మప్రజ్ఞ ఉత్తరముఖముగా పయనించాలి. పదార్ధము నందు ఇమిడి ఉన్న ప్రజ్ఞను వికసింప చేసుకోవడము మన కర్తవ్యము. ప్రతి సూర్యోదయము నూతనమే. ప్రతి దినము నూతనమే. కాని భావన మాత్రము నూతనము, వికాసవంతము కాకపోతే జీవితము పాతది గానే నడచును. వర్జనీయమగు పాత భావములను విసర్జించి, పురోగతి సాధించవలెను. నూతన సంవత్సరము ఇట్టి పురోగతి అందించవలెనని పరమగురువులను ప్రార్ధించుటయే మన కర్తవ్యమై ఉన్నది.
🕉🌞🌎🌙🌟🚩
[16:17, 01/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం - (758)
🕉🌞🌎🌙🌟🚩
"దీక్షలు, నియమాలు ఎంత వరకు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ? కొందరు దీక్ష ముగియగానే ఎప్పటిలా ప్రవర్తిస్తున్నారే !?"
అవసరం లేని విషయాలను పరిహరించటం కోసం, ప్రాపంచిక విషయాలకు తగినంత మాత్రమే విలువ ఇస్తూ నియమాలు విధించబడ్డాయి. అనేక రకాల దైవాల పేరుతో పలు విధాలైన వ్రతాలు, దీక్షలు, మాలధారణలు చేస్తూ ఉంటారు. మాలధారణ అంటే నిజానికి నియ'మాల' ధారణే. దీక్షపేరుతో శరీరంపై ధరించేమాల, దుస్తులు పరిమితకాలమే ఉంటాయి. కానీ మనసులోని నియ'మాల'ను ఎల్లప్పుడూ ధరించి సాగిపోవటమే నిజమైన దీక్ష కావాలి. మనం మంచిగా ఉండాలన్నదే నిజమైన దీక్ష. మంచిగా ఉండటమంటే మనసును శుచిగా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. దానిద్వారా మంచిగా ఉండాలన్న నియమాన్ని జీవితకాలం మనం ధరించే ఉండాలి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''- (అధ్యాయం -93)
🕉🌞🌎🌙🌟🚩
[16:17, 01/01/2021] +91 92915 82862: "ఋభుగీత "(225)
🕉🌞🌎🌙🌟🚩
బ్రహ్మానందము"
16వ అధ్యాయము
ఎన్నిక్షేత్రాలు తిరిగినా మనోక్షేత్రంలో మార్పురాకపోతే ప్రయోజనం ఉండదు !
రామాయణ, భారత కాలాల్లోనూ మనిషి మనసు ఇలాగే ఉంది. కాకపోతే ధర్మం విషయంలో రానురాను పతనం అవుతుంది. దైవాన్ని, గురువుని నమ్మిన తర్వాత మనం వ్యక్తిగా ఎంత ఎదిగాం అన్నదే కొలమానం. మనం ఎంత శాంతిగా ఉన్నాము, ఇతరులను ఎంత శాంతిగా ఉంచుతున్నాము అన్నదే కొలమానం. ఎన్నిక్షేత్రాలు తిరిగినా మనోక్షేత్రంలో మార్పురాకపోతే ప్రయోజనం ఉండదు. దైవంతో, గురువుతో సక్రమంగా ఉండాలంటే ముందు మన భార్య, పిల్లలు, కుటుంబం, సమాజంతో సక్రమంగా ఉండాలి. ఎవరినీ మోసం చేయకుండా జీవిస్తే అదే గురువుకి మనం ఇచ్చే నిజమైన గురుదక్షిణ అవుతుంది !
🕉🌞🌎🌙🌟🚩
[16:17, 01/01/2021] +91 92915 82862: 🧘ప్రార్థనాశక్తి🧘♂
🕉🌞🌎🌙🌟🚩
భక్తుడు ఆర్తితో, ఆర్ద్రతతో భగవంతుడికి చేసే విన్నపమే ప్రార్థన.
ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి పట్ల ఉన్న అపారమైన విశ్వాసం ఎలాంటి కష్టాన్నయినా తొలగిస్తాయని పెద్దల మాట. శరణుజొచ్చి ఆర్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడని ఎందరో విశ్వసిస్తారు. ప్రార్థన అనేది గుండెల లోతుల నుంచి పెల్లుబికి వచ్చే మనోభావం.
నోటితో ప్రార్థించలేనివారు మనసులో ప్రార్థించవచ్చు. నిజానికదే మేలైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలవల్లే ఉత్తమ సంస్కారాలు అలవడతాయి. సాధనా ప్రణాళికలో ప్రార్థనకు విశిష్టస్థానం ఉంది. పరిశుద్ధ అంతఃకరణం, నిర్మలమైన భక్తికి భగవానుడు సంతుష్టుడవుతాడు.
ప్రార్థనకు శ్రద్ధాభక్తులతోపాటు దృఢమైన విశ్వాసం సైతం ముఖ్యం. ఇలాంటి ప్రార్థనలు శీఘ్రంగా ఫలవంతమవుతాయంటారు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, మీరాబాయి, త్యాగయ్య, గోపయ్య మొదలైన మహాభక్తుల ప…
[16:38, 01/01/2021] +91 92915 82862: 🌷117-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
🥀 క్షేత్రము-క్షేత్రజ్ఞుడు🥀
1.పొలమునందు మట్టి సుక్షేత్రమగుటకు అనేక రసాయనిక పదార్థముల సమ్మిశ్రముండును. అట్లే క్షేత్రమునందును కలదు. అవి ఈ దిగువ అంశములుగా ఉండును.
(2)-1. మహాభూతములు (పంచభూతములు) 5
2. అహంకారము. 1
3. బుద్ధి. 1
4. అవ్యక్తము. 1
5. ఏకాదశేంద్రియములు 11
6.ఇంద్రియార్థములు. 5
-----
24. 24
-----
7. ఇచ్ఛాద్వేషములు. 2
8. సుఖదుఃఖములు. 2
9. సంఘాతము(శాల్తీ(unit) 1
10. చేతన 1
11. ధృతి (unity) 1
-----
…
[16:38, 01/01/2021] +91 92915 82862: 129) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
చైతన్యపు ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది.స్వతంత్రముగ కాదు.
“నా మనస్సు శాంతముగ ఉన్నది” అనే ప్రయోగమున జ్ఞాతయగు “నేను”మనస్సు కంటె భిన్నము.
మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము.
కామనా రహితమైనచో మోక్షమునకు సహకారి.
ఆకాశములోనికి ఎగురగోరు పక్షి తన గ్రుడ్డుపెంకు(చిప్ప)ను పగురగొట్టి వెలుపలకు వచ్చు విధముగా నీవు నీ వాసనలను పరిత్యజింపుము.అజ్ఞానజనితములగు ఈ వాసనలను నశింపజేయుట కష్టము.మరియు అవి అనంతమగు దుఃఖమును కలిగించును.
అజ్ఞానముతో…
[16:50, 01/01/2021] +91 92915 82862: 15-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
సావేరి- త్రిపుట.
చరణము(లు):
అమ్మ ననుబ్రోవవే రఘురాముని
కొమ్మ ననుబ్రోవవే... సీతమ్మా ననుబ్రోవవే !! అ..
అమ్మ నను బ్రోవవే సమ్మతితో మా
అమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద!! అ..
కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో!! అ..
వుల్లములో మీయుభయుల నెర నమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు!! అ..
చలము మాని భద్రశైల రామదాసుని
అలసట బెట్టక ఆదరణ జేసి!! రా..
🕉🌞🌏🌙🌟🚩
18-39-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అll ఇక తామససుఖమునుగూర్చి వర్ణించుచున్నారు–
యదగ్రే చానుబన్ధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||
తా:- నిద్ర, సోమరితనము, ప్రమత్తత - అనువానివలన బుట్టినదై ఏ సుఖము ఆరంభమందును, అంతమందును (అనుభవించిన మీదటను) తనకు మోహమును (అజ్ఞానమును, భ్రమను) గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది.
వ్యాఖ్య:- అతినిద్ర, సోమరితనము (బద్ధకము), ప్రమత్తత - అనువాని వలన కలుగునదియే తామససుఖము. ఇది ఆరంభమునను, మధ్యమునను, అంతమునను గూడ జీవునకు మోహమును (అజ్ఞానమును, భ్రమను) గలుగజేయునదియే యగుటచే అత్యంత నికృష్టమైనది. ఇది జీవుని అజ్ఞానకూపమున ఇంకను అధికముగ త్రోసివేయునది యగుటచే మహాప్రమాదకరమైనది యగును. కావున అతినిద్రతోను, సోమరితనముతోను గూడి అమూల్యమగు ఈ మానవజీవితకాలమును వ్యర్థముగ గడపి వేయువారు సంసారదుఃఖ సౌధప్ర…
: తిరుప్పావై 18వ రోజు పాశురం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
18 పాశురం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్
నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;
వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్!!
భావం :-
ॐॐॐॐॐॐॐॐ
ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగువంటి బలముకలవాడును, యుద్ధములో శతృవులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశపాశముగల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత పాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది, చూడుము. బంతి చేతిలో పట్టుకొనినదానా ! మా బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి, నీవు సంతోషముతో లేచి నడచివచ్చి, ఎర్రతామర పూవును బోలిన నీచేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.
నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువక పోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.
అవతారిక
ॐॐॐॐॐॐॐॐ
గోపికలు కృష్ణుని పొంది అనుభవింపవలెను అనెడి ఆవేశంతో కృష్ణపరమాత్మ అగుపడగానే తము అనుభవింపవచ్చునని ఆశపడి మేలుకొలిపిరి. కృష్ణుడు మేల్కోలేదు, ప్రక్కనే ఉన్న బలరాముని మేల్కొలిపిరి, ఐనను కృష్ణుడు మేల్కోలేకపోవుటచే .... నీలాదేవిని ఆశ్రయించవలెనని ఆమెను ఈ పాశురమున మేలుకొలుపుచున్నారు.
అమ్మవారికి 'పురుషకారము' అని వ్యవహారము. ఆమె మధ్యవర్తిని. జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు సర్వేశ్వరుని మార్చునది కావున ఆమెను 'పురుషకారము' అందురు. జీవులు తమ పాపములకు తామే నిష్కృతి ఒనర్చుకొని పరమాత్మను చేరలేరు. ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మను పొందలేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొలుపుచున్నారు.
భగవానుని అమ్మవారిద్వారా ఆశ్రయించుట మహాకౌశలము. అట్టి కౌశలము కలవారగుటచేతనే భగవద్రామానుజులు శ్రీమన్నారాయణుని శరణము పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణము నొందిరి.
శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి. ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీళాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపు చున్నారు.
పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది. పెరుమాళ్ళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరినీ ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీళాదేవిని ప్రార్ధించి, మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్ధించుచున్నారు. శ్రీకృష్ణుని దర్శింపజేయుమని వేడుకొంటున్నది మన గోదాదేవి.
సావేరిరాగము - ఏకతాళము
ॐॐॐॐॐॐॐॐॐॐ
ప.. మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
నందగోవునికి కోడల! నప్పిన్నా! మేలుకో!
అ.ప. గంధిల కుంతల తరుణీ! కోళ్ళు కూయుచున్నవదే
మధుర కూజితములు సేయు పిక గణముల గనవటే!
చ. నీ పతి శ్రీకృష్ణుని తిరు నామములను పాడిపాడి
మా పాటల విభుని మేలుకొలుపగ నిట వచ్చినాము
ఈ పదముల సంతసించి శ్రీ కంకణములు మ్రోయగ
నీ పద్మకరాల గడియల నికనైనను తీయరావె!
మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి
నందగోపునికి, కోడల! నప్పిన్నా! మేలుకో....
అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐ
ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.
లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు.
అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన భాదలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖంగా భావించటం.
వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయిy కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్శ్రేయోదాయకం.
అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తుంచేది.
అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ నాజ్ఞజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషకారం అంటారు. ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.
"ఉందు మదకళిత్తన్" మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు.
"నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ. "కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.
"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్నీ కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.
నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాదవి లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.
భహుషా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.
"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ" నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం.
"శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.
తిరుప్పావై 18వ పాశురము/తెలుగు పద్యాను వాదము
ॐॐॐॐॐॐॐॐॐॐ
సీ .నందుని కోడలా యెందుకమ్మా నీవు
తలుపు తెరువుము మాధవుని వీడి
గురివింద పొద లందు గోరింక పలికెను
కందుకముల పైన కదిలె వేళ్ళు
నీలమ్మ చూడమ్మ నీవైన మా వంక
కనక కుందనముల కంకణాల
సవ్వడి వినబడె శ్రవణము లను చేర
యెర్ర తామర బోలు కేలి సొగసు
తే.గీ.సుందరుడైన మీ స్వామి శుభములన్ని
అందరము గూడి పాడెదమమ్మ
యిపుడు
గంధ సింధూర జలముతో
బృందము లను
కూలదోసెడు స్వామిని కూర్మి కొరకు
శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరముకమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
యోగ సూత్రమ్ : మూర్ద జ్యోతిషి సిద్ధ దర్శనమ్
(యోగ సూత్రం - విభూతి పాదం)
మూలం : పతంజలి మహర్షి
📚✍️ భట్టాచార్య
భావం : శిరస్సు (సుషుమ్నాంతం) నుండి వెలువడే తేజస్సులో సంయమము చేయుట వలన, సిద్ధ పురుష దర్శనం కలుగుతుంది.
వ్యాఖ్యానం : యోగాభ్యాసం చేస్తున్న వాడికి శిరస్సులో ఉన్న వెలుగు అనుభూతం అవుతుంది. సాధకుడు, యోగిగా పరిణామం చెందే క్రమంలో....రక రకాల రంగుల్లో, రక రకాల రూపాల్లో వెలుగు కనబడుతుంది(అనుభూతం అవుతుంది). అయితే ఇది క్రమంగా జరిగే పరిణామం.
అయితే, నూట ఒక్క హృదయ నాడులలో, ఈ సుషుమ్న, బ్రహ్మ రంధ్రమున బయలు పడును. అది మూర్ధ ద్వారము. అట్టి మూర్ధ ద్వారము నందు గల జ్యోతిపై "సంయమము" చేయుట వలన సిద్ధుల దర్శనం కలుగును.
అయితే ఈ మూర్ధ జ్యోతి అంటే ఏమిటి?
సాధనలో యోగి తన ప్రాణశక్తి ప్రవాహాలను, వెనుబాము అనే పెద్ద నాళం లోనికి, అక్కడ నుండి సూక్ష్మ మేరుదండం లోనికి, అటనుండి మూలాధారం వద్ద గల సుషుమ్న లోనూ, ఆపైన స్వాధిష్ఠానం వద్ద మొదలయ్యే వజ్రా నాడిలోనూ, మణి పూరకం వద్ద గల చిత్రా నాడిలోనూ ప్రసరిస్తూ...చివరికి వాటన్నిటికీ లోతట్టునున్న బ్రహ్మ చైతన్యం కేంద్రీకరించబడిన బ్రహ్మ నాడిలోనికి పంపిస్తాడు. ప్రారంభంలో రక రకాల రంగులు, సాధనలో కనపడతాయి. సాధన తీవ్రమయ్యే కొద్దీ, కొన్ని ప్రత్యేక రంగులు దర్శనం ఇస్తాయి. కొంత కాలానికి, ఇవన్నీ వెళ్ళిపోయి, ఏ రంగు లేని "శుద్ధ స్పటిక సంకాశం", మిగుల్తుంది. దానినే "నిరంజనో జ్యోతిః" అంటారు. రంగు ఉందంటే మనస్సు స్పర్శ ఉందన్న మాట. ఈ రంగులకు అతీతమైన వెలుగే "జ్యోతి". అదియే "మూర్ధ జ్యోతి". అట్టి మూర్ధ జ్యోతి యందు సంయమము చేసినచో, సిద్ధ దర్శనం జరుగును.
🌹. గీతోపనిషత్తు -112 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముందు మాట - నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట. కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును. మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము. 🍀
కర్మఫల సన్న్యాసమే కర్మసన్న్యాసముగ ఈ అధ్యాయమున పేర్కొనబడును. కర్మఫల సన్న్యాసము అనుభవమైన వారికి కర్మ చేయుట అను భావన నశించి, కర్మ జరుగుట అను అనుభూతి దైనందినముగ కలుగుచునుండును. కర్మ సన్న్యాస మనగ తమనుండి యితరుల నుండి జరుగుచున్న కర్మను సాక్షీభూతుడై గమనించుట.
నదీ ప్రవాహమును నదియొడ్డున నుండి గమనించినట్లు, జరుగుచున్న కర్మను గమనించు స్థితి అభ్యాసవ శమున నిష్కామ కర్మ యోగులకు కలుగును. వారికి కర్మ జరుగుచుండుట ఎక్కువగ గోచరించును. చేయుచుండుట అందులో భాగమని తెలిసి యుండును. పడవ ఒకటి ప్రవాహమున ప్రయాణము చేయుచుండగ, పడవ నడచుచున్నదని గ్రహించుట ఒక పద్ధతి.
ప్రవాహమే పడవను నడిపించుచున్నదని తెలియుట మరియొక పద్ధతి. పడవ లోని ప్రయాణికుడు తాను ప్రయాణము చేయుచున్నాడని భావించుట మరియొక పద్ధతి. పడవకు ప్రయాణికునికి ప్రవాహమే ఆధారము కదా! ప్రవాహమే లేనపుడు పడవకు, ప్రయాణికునికి ప్రయాణమే లేదు.
నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట.
క్రొత్తగ వాహనము నడుపుట నేర్చినవాడు తానే వాహనమును నడుపుచున్నానని భావించును. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు హెచ్చరికగ వాహనము నడుపుట యందు లగ్నమై యుండును. క్రమముగ నిపుణతరాగ ఆడుచు, పాడుచు, సంభాషణములు చేయుచు, గంభీరమైన విషయములను మాట్లాడుచు వాహనము నడుపుచుండును.
ఇచట గమనించవలసిన విషయమొకటున్నది. బాహ్యేంద్రియములు వాహనమును యాంత్రికముగ నడుపుచుండగ, అంతఃకరణములతో జీవుడు ప్రసంగించుట, ఆడుట, పాడుట చేయుచుండును.
అతనికి వాహనము నడపు చున్నానను భావన కూడ అంతంత మాత్రముగనే యుండును. ఛలోక్తులతో ఆసక్తికర ప్రసంగములతో, పాటలతో సమయము గడచుచుండగ, ప్రయాణము పూర్తియగును. తాను వాహనము నడపిన భావమే యుండదు.
అట్లే కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును.
మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 312 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
77. అధ్యాయము - 32
🌻. వీరభద్రుడు - 2 🌻
జగత్సంహారమును చేయు ఆ రుద్రుడు అపుడు ఒక జటను ఊడబెరికి పర్వతముపై కోపముతో విసిరి కొట్టెను (20). ఓ మహర్షీ! ఆ ప్రభువు యొక్క జట విసిరి కొట్టుటచే రెండు ముక్కలై, మహాప్రలయమునందు వలె భయంకరమగు గొప్ప ధ్వని కలిగెను (21).
ఓ దేవర్షీ! ఆ జటయొక్క పూర్వభాగమునుండి మహాబలుడు, అతి భయంకరుడు, గణములకు నాయకుడు అగు వీర భద్రుడు జన్మించెను (22). ప్రలయకాలాగ్ని వలె ప్రకాశించువాడు, మిక్కిలి ఎత్తైన వాడు, వేయి భుజములు గలవాడు అగు ఆ వీరభద్రుడు భూమిని అంతనూ పూర్తిగా చుట్టివేసి ఆపైన పది అంగుళముల వరకు వ్యాపించి యుండెను (23).
అచట సర్వేశ్వరుడగు మహారుద్రుని కోపముతో గూడిన నిట్టూర్పుల నుండి వంద జ్వరములు, పదమూడు సన్నిపాత రోగములు పుట్టినవి (24). శివుని జటయొక్క రెండవభాగమునుండి మిక్కిలి భయంకరురాలగు మహాకాళి జన్మించెను. వత్సా! ఆమెను కోట్లాది భూతములు చుట్టువారి యుండెను (25).
విగ్రహమును ధరించిన క్రూరములగు ఆ జ్వరములన్నియు సర్వలోకభయమును గొల్పుచూ, తమ తేజస్సుచే ప్రకాశించుచూ, సర్వమును దహించునా యన్నట్లుండెను (26). అపుడు వీరుడు, చక్కగా మాటలాడే నేర్పు గలవాడునగు వీరభద్రుడు దోసిలియొగ్గి పరమేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (27).
వీరభద్రుడిట్లు పలికెను -
మహారుద్రా !నీవు అతి భయంకరుడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నీ నేత్రములు. ఓ ప్రభో! నేను చేయదగిన పని యేమి ?వెంటనే ఆజ్ఞాపింపుము (28). హే ఈశానా !అర్ధ క్షణములో సముద్రములను ఎండింపజేయవలెనా? ఓ ఈశ్వరా! ఆర్థ క్షణములో పర్వతములను నుగ్గు చేయవలెను? (29) హే హరా! క్షణకాలములో బ్రహ్మాండమును భస్మము చేయవలెనా యేమి? క్షణకాలములో దేవతలను గాని, మునిశ్రేష్ఠులను గాని భస్మము చేయవలెనా? (30)
హే శంకరా! సర్వలోకములలో వాయు సంచారము లేకుండగా చేయవలెనా? ఈశానా! సర్వప్రాణులను సంహరించవలెనా యేమి? (31) ఓ మహేశ్వరా! నీ అనుగ్రహముచే నేను చేయలేని పని ఎచ్చటనైననూ లేదు. పరాక్రమములో నాతో సమానమైన వాడు పుట్టలేదు, పుట్టబోడు (32).
ఓ ప్రభూ! నీవు నన్ను ఎచటికైననూ ఏ కార్యమునైననూ ఉద్దేశించి పంపవచ్చును. నేను నీ అనుగ్రహముచే ఆ కార్యమును సత్వరమే నిశ్చయముగా సాధించగలను (33). మంగళకరుడగు నీ శాసనముచే అల్పులు కూడ సంసారసముద్రమును తరించెదరు. హే హరా! నేను మహావిపత్తు అనే సముద్రమును తరింప సమర్థుడను కాకపోదునా ?(34)
ఓ శంకరా !నీచే నియోగింపబడిన గడ్డి పోచయైననూ సునాయాసముగా గొప్ప కార్యమును క్షణములో చేయగల్గుననుటలో సందేహము లేదు (35). హే శంభో! కార్యము నీ సంకల్పరూపమగు లీలచేతనే సిద్ధించును. అయిననూ, ఆ కార్యము కొరకై నన్ను పంపుడు. ఇది మీకు నాపై గల అనుగ్రహమే (36).
హే శంభో! నాకు ఇటువంటి శక్తి నీ అనుగ్రహమువలననే కలిగినది. హేశంకరా! నీ అనుగ్రహము లేనిదే ఎవ్వనికైననూ శక్తి ఉండదు (37). ఎవడైననూ నీ ఆజ్ఞ లేనిదే గడ్డిపోచవంటి వస్తువులనైననూ కదల్చ సమర్థుడు కాడనుటలో సందేహము లేదు. ఇది సత్యము (38).
హే శంభో! మహేశ్వరా! దేవాదులందరూ కూడ నీ ఆజ్ఞకు బద్ధులగుదురు. సర్వప్రాణులను నియంత్రించునది నీవే. అటులనే, నీవు నన్ను కూడ నియోగించుము (39). ఓ మహాదేవా !నీకు నేను అనేక నమస్కారముల నాచరించుచున్నాను. హే హరా !నీవు నీకు అభీష్టమగు కార్యమును చక్కబెట్టుట కొరకై నన్ను ఇప్పుడు వెంటనే పంపించుము (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దుర్వాసమహర్షి-కందళి - 1 🌻
జ్ఞానం:
01. దుర్వాసమహర్షి, దూర్వాసమహర్షి అనే పేర్లు వ్యాకరణం ప్రకారం సరి అయిన మాటలు కావు. ఆయన అసలుపేరు వ్యాకరణయుక్తంగా ‘దుర్వాసోమహర్షి’. ఆయన అత్రిమహర్షికి త్రిమూర్తులు ప్రసాదించిన వరం. అతడు రుద్రుడి అంశలో పుట్టినవాడు.
02. త్రిమూర్తులయొక్క అంశతో దుర్వాసుడు తల్లిగర్భంలో పెరుగుతున్న సమయంలో, అత్రిమహర్షిమీద కోపంతో హైహయ వంశంలో పుట్టిన ఒక రాజు అనసూయను అవమానం చేయదలుచుకుని, ఆవిడగర్భంలో శిశువు పెరగకుండా ప్రయోగంచేసాడు.
03. గర్భవతి అయినటువంటి అనసూయ బాధపడింది. ఆమె గర్భంలో పెరిగే శిశువు – ఆ రాజును భస్మంచేయదలచి, రుద్రుడి అంశలో ఉన్నవాడు కాబట్టి, రుద్రత్వంతో క్రోధమూర్తిగా మారింది. ఈ లక్షణంలేకుండా మామూలుగా పెరిగి పెద్దవాడైతే అతడు సాత్వికుడై ఉండేవాడు. తమోగుణంలోని కోపస్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ శిశువులో ప్రవేశించింది.
04. పెద్దవాళ్ళెవరైనా మౌనంగా ఉంటే, వాళ్ళను విస్మరించి వాళ్ళకు నమస్కారమైనా చేయక, వాళ్ళ ఎదురుగా నవ్వుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకోవటం దోషం. భరించటానికి రెండే ఉండాలి. అహంకారం ఏమీ లేకుండా చచ్చినట్లు పడి ఉండడం తెలియాలి గయ్యాళిభార్యతో! లేకపోతే, ఆ గయ్యాళితనమనే రోగం తగ్గించగలిగిన సమర్థుడై ఉండాలి. రెండూ లేకపోతే వదిలిపెట్టాలి. అంతేకదా! ఎంత గయ్యళి అయినా లొంగదీసుకునేటటువంటి భర్తలున్నారు. పరమసాత్వికులున్నారు కొందరు.తిట్టినా కొట్టినా పడిఉండేవాళ్ళు కొందరున్నారు. అప్పుడు కాపురం బాగుంటుంది. ఆవిడకు బాగుంటుంది ఆ కాపురం.
05. దుర్వాసుడు తన భార్యమీద ప్రేమ ఉందని లోకానికి చాటిచెప్పటానికి ఈ భూమిపై శాశ్వతంగా ఆవిడపేరుమీదుగా ఒక వృక్షజాతిని సృష్టిస్తాను అని కదళీవృక్షజాతిని ఆయన సృష్టించాడు. కదళీవనం అంటే అరటితోట. ఆవిడ పేరు శాశ్వతంగా ఉండేటట్ట్లుగా, కదళి-అంటే అరటిచెట్టును సృష్టించాడు. ఆమే మీద తనకు క్రోధంలేదు, తాను ఆవిడను చంపలేదు అని అరటిపండుద్వారా చెపుతున్నాడాయన.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 15 🌻
551. ఆత్మ, అనుభవ పూర్వకముగా, ఆత్మజ్ఞానమును సంపాదించుటకు గల "ప్రధమ ప్రేరణము"ను ఇచ్చటే సార్థక పరచినది.
552. మానవునకు అజ్ఞానము ఉన్నంత వరకు మాయారూప సమన్వితంబైన బహుత్వమునకు అంత్యము లేదు. అట్లే - దివ్య జ్ఞానము సిద్ధించిన తరువాత, భగవంతుని అఖండ ఏకత్వమునకు కూడా అంత్యము లేదని మానవుడు గ్రహించును.
553. వాస్తవము ఏమనగా:- మానవుడే దేవుడయ్యేను. మానవుడే దేవుడు కాగలడు. తెలిసినను తెలియక పోయినను, మానవుడే భగవంతుడు.
554. సప్తమ భూమికలో, నిజమైన అనుభవముచే భగవంతుని అస్తత్వమును నమ్మెదరు.
555. నిజమునకు, ఆద్యంతములు లేకుండా ఎల్లప్పుడు 'ఆత్మయే భగవంతుడు' అన్నది ఏకైక సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasra Namavali - 100 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం
🍀 100. అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖ 🍀
🍀 932) అనంతరూపః - అనంతమైన రూపములు గలవాడు.
🍀 933) అనంత శ్రీః - అంతంలేని శక్తివంతుడైనవాడు.
🍀 934) జితమన్యుః - క్రోధము లేనివాడు.
🍀 935) భయాపహః - భయమును పోగొట్టువాడు.
🍀 936) చతురశ్రః - కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
🍀 937) గభీరాత్మా - గ్రహింప శక్యంగాని స్వరూపము గలవాడు.
🍀 938) విదిశః - అర్హులైనవారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
🍀 939) వ్యాధిశః - బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
🍀 940) దిశః - వేదముద్వారా జీవులకు కర్మఫలములను తెలియజేయువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 100 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for PoorvaBhadra 4th Padam
🌻 100. anantarūpō nanta śrī: jitamanyu rbhayāpahaḥ |
caturaśrō gabhīrātmā vidiśō vyādiśō diśaḥ || 100 || 🌻
🌻 932. Ananta-rūpaḥ:
One who has innumerable forms, as He dwells in this all-comprehending universe.
🌻 933. Anantaśrīḥ:
One whose Shri (glory) is infinite.
🌻 934. Jita-manyuḥ:
One who has overcome anger.
🌻 935. Bhayāpahaḥ:
One who destroys the fears of beings from Samsara.
🌻 936. Caturaśraḥ:
One who is just, because He bestows on Jivas the fruits of their Karma.
🌻 937. Gabhirātmā:
One whose nature is unfathomable.
🌻 938. Vidiśaḥ:
One who distributes various furits of actions to persons differing in their forms according to competency.
🌻 939. Vyādiśaḥ:
One who gives to Indra and other deities directions according to their varied functions.
🌻 940. Diśaḥ:
One who in the form of the Vedas bestows the fruits of their ritualistic actions on different beings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Only admins can send messages
--(())--
No comments:
Post a Comment