వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదే శం చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్రకైవారం, అరణ్యం - అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) (సెకండు) లో అసురుల్ని సంహరించిన ఈ అర ణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.
నైమిశారణ్యము కొన్ని విశేషాలు
నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు.
సరళ (తెల్ల తెగడ)
, కొండగోగు, ధన (ఉమ్మెత్త), దేవదారు, చండ్ర, మామిడి, నెరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, పాటల (కలికొట్టు), నకుల (పొగడ), సప్తవర్ణ (ఏడాకుల పొన్న), పునాగ, సురపొన్న, నాగకేసర (నాగకింజల్కము), శాల, తాల (తాటి), తమాలము (చీకటిమాను), అర్జున (మద్ది ), చంపక (సంపెంగ).
నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.
నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాం చాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.
బలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆస్రమంలో యాత్రీకులకు బస, భోజన వసతులు లభిస్తాయి.
శ్రీరాముడు సవరించు
శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
మిత్రులందరికీ శుభోదయం
ఇద్దరు మనుషులు దేవుడున్నాడా లేడా అని వాదించు కుంటున్నారు అప్పుడే మూడో వ్యక్తి వచ్చి మీ సమస్య ను క్షణం లో తిరుస్తాను అన్నాడు. మరి చెప్పేవే అన్నాడు. నాకు తైలం పడందే, లాభం లేనిదే ఏవిషయము బయటకు చెప్పొద్దన్నారు మాగురువుగారు అన్నాడు.
నీకు లాభం వచ్చే సలహా ఇవ్వలేము కానీ ఇంద తైలం అంటూ చేతిలో పెట్టారు. వెంటనే తైలం లో ఉన్నాడు దేవుడు అంటూ వెళ్లి,పోయాడు. అంటే అతని మాటలకు అవాక్కయ్యారు.
చేసేది లేక వాళ్లిద్దరూ దగ్గర ఉన్న గుడికి వెళ్లి పూజారిని ప్రశ్నిద్దాం అనుకున్నారు, వెళ్లారు పూజారిని అడిగారు. నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను ముందు అవి తీసుకురండి అన్నాడు. సరె అని అవి తీసుకు వచ్చి ఇచ్చారు వెంటనే దేవునికి నైవేద్యం పెట్టి తీర్ధం ఇచ్చి కొబ్బరిచిప్ప చేతిలో పెట్టి ఇక వేళ్ళ మన్నాడు. మేము అడిగిన దానికి సమాధానము చెప్పలేదు ఎందుకు అన్నాడు.
ముందు ప్రాసాదం తినండి అన్నాడు, తిన్నారు.
ఇప్పుడు చెపుతున్న వినండి దేవుడు మీ డబ్బులతో ప్రసాదం కొనిపిచ్చి సగమే మీకు పెట్టాడు కదా అవును, అవును
మిగతా సగం లో దేవుడున్నాడు ఎందుకంటే అది అందరి కీ సమానంగా ప్రసాదాన్ని పంచుతాను అందరు దేవుని ప్రసాదం పెట్టాడు అను కుంటారు. మీలో దేవుడు ఉన్నాడు కదా ఇంత దూరం రాగలిగారు, దేవుడ్ని చూడగలిగారు అన్నాడు పూజారి.
పూజారి చెప్పిన మాటలు అర్ధం గాక బుర్రగోక్కున్నారు.
నడుస్తూ మరలా వాదించు కున్నారు అప్పుడే వారికీ ఓతాగుబోతు ఎదురయ్యాడు. త్రాగుబోతులు నిజం చెపుతారు అతన్ని అడుగుదామా అని అతని దగ్గరకు వెళ్లారు వారు.
బాబులు మీరు అడిగిన దానికి నిజం చెప్పాలంటే నాకు కిక్ తగ్గింది, కిక్ ఎక్కించండి అన్నాడు అప్పుడు నిజం చెపుతాను .
వెంటనే దగ్గర ఉన్న షొప్ వద్దకు పోయి అతనికి కిక్ ఎక్కించారు.
కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పెళ్ళీళ్ళు చేస్తారు ఎందుకో చెప్పండి అన్నాడు.
ఎలా సంపా ఇంచారో అనవసరం ఒక్క రోజులో కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎంతో మంది బాగు పడ్డట్టేగదా .
అంటే (నగల షాప్ వారు, వస్త్రాలు షాపువారు, వంట వారు, కళ్యాణ మండపం వారు ఇంకా ఎన్నో ఎన్నో ) అప్పుడు వీళ్ళందరికీ దేవుడు కనిపిస్తాడు అన్నాడు
నేను అడిగిన దానికి సమాధానము చెప్పలేదు అన్నాడు.
అనవసరముగా నా సమయాన్ని వ్యర్థం చేసారు, నాకు కిక్కు ఎక్కించి నా ఆరోగ్యం పాడు చేశారు కనుక మీమీద కేసు పెడతా పదా పోలీస్ స్టేషన్కు అంటూ ఇద్దర్ని పట్టుకున్నాడు
మీకు దేవుడున్నాడా లేదో ఆ పోలీసులే చెపుతారు.
వదులురా బాబు వదులు మమ్ము బుద్ధి తక్కువై పని చేసుకోకుండా వీధిని పడి సమయాన్ని వ్యర్ధం చేసుకున్నాం
మాకు బుద్దొచ్చింది మమ్మల్ని వదులు మాకు నీలో దేవుడు కనబడు తున్నాడు అంటూ గుంజుకొని చేతులను వదిలించుకొని ఓదేవుడా మమ్ము రక్షించు అంటూ పరుగెత్తారు ఇద్దరు.
*స్త్రీ పురుష తత్త్వం
ధవళ - (న)6/గ IIIII IIIII - IIIII IIIU
19 అతిధృతి 262144
సరిగమలు పదనిసలు - సరసములు జరపగా
పరుషముల ప్రకటనలు - పదనిసలు కలవగా
బిడియములను వదలుట - భుజములను కలపగా
మురిపెములు మునకలతొ - మధురిమలు పలుకగా
భవనమున బుధజనుల - ముదమున మదితెలుపగా
కలువల కువలయములు - కనులను వలయము గా
కవి తలపులు మరులను - కధల అనుకరణగా
నయనములను నటనను - నవవధువు వలపుగా
మఱిమఱియు నిలుచు నిది - మధురముగ మనసులో
విరిసి విరియు వలపు నిధి - వలుపులతొ తలపులో
కురిసి కురియు జలము నిధి -కురుల కదలిక లలో
మనసు మమత మధురిమ - మధు మలపు సరిగమలో
కనఁగ నిను హృదయ మిటఁ - గడు ముదము మురియుఁగా
ననలు బలు హృదయవని - నయముగను విరియుఁగా
కనకమయ వసనమునఁ - గరములను మురళితో
స్వనములను వినఁగ నిల - భవ మలరు విరళితో
ధవళమగు వలువముల - దరిసెనము నొసఁగుమా
నవములగు రచనలను - నవనిధిగ నొసఁగుమా
భువనమున బుధజనుల - ముదమనుచు గొలుతు నిన్
భవజలధి తరణమునఁ - దరణి యని తలఁతు నిన్
కువలయము మురిసెఁ బలు - కువలయము లలరఁగా
రవణముల నడుమ నట - రజని శశి వెలిఁగెఁగా
భవనమునఁ బ్రభ లిడుచుఁ - బలు దివెలు వెలుఁగఁగా
నవముగను నెద ముదము - నగుచు నను బిలిచెఁగా
సరసమగు పదములను - స్వర మలరఁ బ్రియముగా
మురిపెముల గళమునను - బులకలిడ నొసఁగఁగా
వరమనుచు మునిగెదను - స్వరసరసి సుధలలో
మఱిమఱియు నిలుచు నిది - మధురముగ మనసులో
వాగ్భూషణం - అవి ఎన్ని రకాలు
వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుత మైన వరం.
ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది...
మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది, మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది.
మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు.
బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు.
వైరివర్గం బంధుగణం అవుతుంది, అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు.
అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.
మిత భాషణం...
మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం, దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.
ప్రియ భాషణం...
ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం, దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.
మృదు భాషణం...
మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది.
ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు.
మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది, ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.
సత్యభాషణం...
🌻 మహా భారతం 🌻
భాగము 2
ధౌమ్యుని హితవచనాలు
తన సోదరులకు, ద్రౌపదికి పట్టిన దుస్థితికి ధర్మరాజు అపరాధ భావంతో కుంగిపోవడం ధౌమ్యముని గమనించాడు.
‘‘ధర్మనందనా, నువ్వు అనన్య సామాన్యుడవు. కాని, విధి బలీయమైనది. ఇంద్రుడంతటి వాడు ప్రచ్ఛన్నుడై నిషధాద్రిపై తలదాచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వామన రూపుడై అదితి గర్భాన జన్మించలేదా? సూర్యుడు ఒకానొక సమయంలో గోగర్భంలో ఒదిగి వున్నాడు కదా.... తరువాత వామనుడే త్రివిక్రముడై మూడు లోకాలను ఆవరించాడు.
తరుణం రాగానే సూర్యుడు స్వయం ప్రకాశంతో విశ్వానికి వెలుగులు నింపాడు. జరిగిన దానికి వగవక, విజయవంతంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయండి. మహారాజా, నీ మాటకు కట్టుబడి అర్జునుడు ఉదాసీనంగా వున్నాడుగాని, లేకుంటే కురుశ్రేణిని మట్టుపెట్టడం పెద్దలెక్కలోనిది కాదు- అనగానే ధర్మరాజు మనసు ఒక్కసారి ఉప్పొంగింది. ‘‘ఔనౌను, మునీశ్వరా, ఔనౌను’’ అన్నాడు ఉత్సాహంగా తలవూపుతూ.
పాండవశ్రేష్ఠులారా, ఇప్పటివరకూ మీరు మహారాజులు. ఇకపై మీరు రాజకొలువులో సేవకు సిద్ధమై వెళ్లనున్నారు. అన్నమాట నిలపడానికి రాజసేవకు సంసిద్ధులు కావడం నిజంగా గొప్ప సంగతి. ఈ సందర్భంలో మీ హితాభిలాషిగా కొన్ని సంప్రదాయాలను వివరిస్తాను.
వాటిని మీరు మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే, మీకు ఎలాంటి ఆపదా వాటిల్లదు. దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను, నాకేమని విర్రవీగడం శ్రేయస్కరం కాదు. కోటలో, కొలువులో, వృత్తి ధర్మాన్ని అనుసరించి, ఎక్కడ కూర్చోవాలో, ఎలాంటి ఆసనాన్ని అధిష్టించాలో గ్రహించాలి. ప్రభుచిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ వుంటుంది.
సమయాసమయాలను పసికట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. రాజభవనం కంటె అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు. వేషభాషలలో, ఆహార వ్యవహారాలలో రాజును అనుసరించరాదు. ఒక మెట్టు దిగువన వుండడమే మంచిది. వ్యవహార శైలిలో రాజు ఆలోచనలకంటే గొప్పవి తట్టినా, వాటిని రాజుకు స్ఫురించేలా చెయ్యాలేగాని మన వ్యూహరచనలా వ్యక్తీకరించకూడదు.
రాజాదరణ, దానివల్ల అధికారం, గౌరవం, ధనం లభించినపడు వాటిని అదునుగా తీసుకుని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయడం ముప తెచ్చి పెడుతుంది. ప్రభువుకి యెదురుగా లేదా వెనుక నిలబడకూడదు. పార్శ్వాలలో మాత్రమే వుండాలి. వినయంగా మాట్లాడాలి. నిష్టుర వచనాలను సైతం మృదుధోరణిలో రాజుకు విన్నవించాలి. క్రోధంలో రాజు తన, మన చూడడని గుర్తెరగాలి.
ప్రభువు, ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు. బయటివారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి. అంతఃపుర స్త్రీలతో, పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు. అపురూపమైన వస్తువాహనాలు ఏలిన వారు బహూకరిస్తేనే రాజాశ్రితులు స్వీకరించి వినియోగించుకోవాలి. రాజుగారి పొగడ్తకు అతిగా పొంగిపోకూడదు. తెగడ్తలకు కుంగిపోకూడదు.
ప్రభువు అప్పగించిన బాధ్యతలను, యెన్ని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించడానికి కృషి చెయ్యాలి. మాటలో, శరీర కదలికలో వినయం, వందనం వుట్టిపడాలి.శత్రువులు, వారి గూఢచారులు, రాజ తిరస్కృతులు, దురాలోచనాపరులు- వీరికి దూరంగా వుండాలి. భటుడు ఎపడూ అప్రమత్తుడై, తన జీవనశైలిని రాజదృష్టిలో పడకుండా కాపాడుకోవాలి.
రాజు మంచివాడే కావచ్చు. కాని అంతులేని అధికారం వల్ల సంక్రమించే లక్షణాలు కొన్ని వుంటాయి. నేను అనుభవంతో చేసిన సూచనలను పాటించండి. మీరు ఆడుతూ పాడుతూ అజ్ఞాతకాలాన్ని అవలీలగా అధిగమించ గలరు’’ అంటూ దీవించాడు ధౌమ్యమహర్షి. సోదరులు మహర్షికి పాదాభివందనం చేసి, కృతజ్ఞత లు తెల్పుకున్నారు. ధౌమ్యముని మంగళ వైదిక మంత్రాలు పఠిస్తూండగా, పాండవులు, పాంచాలి ముందుకు సాగారు.
దశార్ణ దేశానికి ఉత్తర దిశలో పాంచాళ దక్షిణభాగం వుంది. అక్కడ సాళ్వ, శూరసేన రాజ్యాలు వున్నాయి. అవి దాటితే కాళింది నది. నడుస్తున్న అడవిలో రకరకాల ఫలాలు, పట్టుతేనెలు, పుట్టతేనెలు వారిని సంతృప్తులను చేస్తున్నాయి. విరిసిన పుష్పగుచ్ఛాలు సుగంధ పరిమళాలతో శరీరాల సేద తీరుస్తున్నాయి.
చల్లని చెట్ల నీడలలో విశ్రమిస్తున్నారు. జలపాతాల కింద, నదీనదాలలో స్నాన సంధ్యాదులు ముగించుకుని, ముందుకు సాగుతున్నారు. వారు మత్స్యదేశ పరిసరాలకు వచ్చారు. మరికొంతసేపటికి విరాట రాజ్య ముఖ్యనగరం, అందులోని రాజసౌధాలు, ఇతర భవనాలు వారికి కనిపించాయి.
ఒక్కసారిగా ధర్మరాజునకు యేదో గుర్తుకు వచ్చింది. అందరూ చెట్టునీడలో ఆగారు. ‘‘మనం గడుపబోయే అజ్ఞాతవాసంలో, యీ ఆయుధాలు మనల్ని బట్టబయలు చేస్తాయి. అర్జునుని వైపు చూసి, మన ఆయుధాలన్నీ వొక ఎత్తు! గాండీవి కోదండం వొక్కటే వొక ఎత్తు! దానిని యెవరైనా గుర్తించగలరు. క్షణాలలో మన ఉనికి తేటతెల్లమవుతుంది.’’ అన్నాడు.
అల్లంత దూరంలో శ్మశాన వాటిక పక్కగా శమీవృక్షం అర్జునుని కంటపడింది. దట్టమైన కొమ్మలతో గాఢాంధకారం గూడుకట్టుకుని వున్న ఆ శమీవృక్షపంపై తమ ఆయుధాలను పదిలపరచడం మంచిదనిపించింది. ఆ చెట్టుపై కాకులు, గుడ్లగూబలు, రాబందులు చేస్తున్న ధ్వనులు భయంకరంగా వున్నాయి. మానవ సంచారం వుండని యీ ప్రాంతంలో, భీతిగొలిపే యీ జమ్మిచెట్టు సరైన తావుగా నిర్థారించారు.
ధనుస్సుల అల్లెతాళ్లను తొలగించి, అమ్ముల పొదులను , కవచ కరవాలాలను, గదలను వొక చోటికి చేర్చి, తాళ్లతో బంధించి దానికి శవాకృతి కల్పించారు. ధర్మజుడు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, పంచభూతాలకు, వనదేవతకు నమస్కరించి- యీ దివ్యాయుధాలు అన్యులకు భీకర విషసర్పాలుగా సాక్షాత్కరించునట్లు అనుగ్రహించండని వే డు కున్నాడు.
****
నమస్కారం లో వున్న పరమార్థం ఏంటో తెలుసా? 🌻
ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం.
ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా నాగరికత పై ఆధారపడి ఉంటుంది అయితే ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి.
ఈ పలకరింపు శాస్త్రీయతతో జీవించిన సంప్రదాయం . పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని. 'నమస్కారం'లో నమ' అంటే వంగి వుండటం.
అంటే.. పెద్దల ఎదుట అహంకరించకుండా వుండటం వుంటుంది అవి వారివారి సంస్కృతి సంప్రదాయాలు
అసలు ఎందుకు నమస్కరించాలి.? ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు పలకరించుకునే విధంగా 'హాయ్', 'హలో' అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు కానీ.. అలా చేయకుండా నమస్కారం కచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అందుకు బలమైన కారణం కూడా వుంది. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం సర్క్యూట్ పూర్తి అవుతుంది.
మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది.
రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటం ప్రకంపనలు కలుగుతాయి. అవి సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం
నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి.
తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు.
అంటే, కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు భూమిని తగిలేట్టుగా నమస్కరించటం.
స్త్రీలు పంచాంగాలు చేస్తే సరిపోతుంది.స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు.
నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం .
***
నేటి కవిత- నా ప్రేమ
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గాలి దీపంలా ఉంది నా ప్రేమ
ఇప్పుడారునో తెలియక రెపరెపలాడే
పలచని అద్దం లా ఉంది నా ప్రేమ
ఎప్పుడు జారిపడి ముక్క ముక్కలగునో
విరజాజి పూల లా ఉంది నాప్రేమ
నిట్టూర్పులకే వడలి వాడిపోవునో
తేట నీరుగా మారుతుంది నా ప్రేమ
దాహం తీర్చలేక ఎండి పోవునేమో
మానసిక నవ్వులా ఉంది నా ప్రేమ
నవ్వలేక ఏడ్వలేక వాడిపోయెనేమో
ఎదురుగాఉన్నా చెప్పలేని మూగప్రేమ
అందుకోలేని నక్షత్రంలా మారె నేమో
ఎదురై హృదయాన్ని తట్టిన నా ప్రేమ
దగ్గరలో దూరమై నన్ను బాదించునేమో
మొహమాటపు మాటకు నలిగింది నా ప్రేమ
విరహం ఓర్పుతో చెలిమి చేసి బతుకునేమో
పున్నమి పూసే వేళ పరవసించలేని ప్రేమ
వెన్నెల వికసించిన విప్పి వివరించలేనేమో
క్షణకాలం ధైర్యంతో నీముందు పంచే ప్రేమ
సెగకే కరిగే మంచు ముక్కలా మారునేమో
కష్టాల కడలిలో ఆశలతో ఉన్నది నా ప్రేమ
సుడిగుండాలమధ్య చిక్కి విలవిల్లాడిపోతానేమో
కన్నుమూసి తెరిస్తే మాయమయ్యే స్వప్నం నా ప్రేమ
ఈ హృదయస్పందన నీకోసమే ఆగిపోవునేమో
--((*))--
ఓం నమో భగవతే వాసుదేవాయ
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
శ్రీ భాగవతం - 100 వ భాగం
చదువుకుందాం భాగవతం
బాగుపడదాం మనం అందరం
దశమ స్కందము
శ్రీకృష్ణ లీలలు - 30
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
శమంతక మణి ఉపాఖ్యానము
ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారక నగరమునకు విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందఱో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు దేవతలు కృష్ణుడి దర్శనమునకు వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని పరుగు పరుగున వెళ్లి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు. సత్రాజిత్తు అనే రాజు. ఆరాజు సూర్య నారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడయిన పరమాత్మ ఆయనకు శమంతకమణి అనబడే మణిని బహూకరించారు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్య నారాయణుడే అని భ్రమపడ్డారు’ అని చెప్పాడు.
సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు ఏడో అలంకార ప్రాయమై మేడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. కానీ ఈ శమంతకమణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ శమంతక మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు. అక్కడ రోగములు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమయిన మానసికమయిన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ శమంతకమణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజూ తెల్లవారే సరికి ఎనిమిది బారువుల బంగారమును పెడుతుంది. ఆమణిని ధరించి మణులలో కెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు శమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ నోరువిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు! ఆయనకు చేత కాక కాదు! కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మథురలో ఉండే కొన్ని లక్షలమంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహా పురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు. లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయనకోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి!
సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనములు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమయిన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత యిబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆ శమంతకమణిని ప్రభువుకి బహూకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు.
అనగానే వచ్చిన సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆ మణిని యాదవ విభునకీయవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛచేత ఆ మణిని యివ్వడానికి అంగీకరించలేదు. మణిని యివ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు.
కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచెత్తినట్లు ముంచెత్తేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా వానిని ఏమీ చేయదు. ప్రమాదము తప్పుకుంటుంది.
కృష్ణుడు ‘నేను చెప్పాను. వినలేదు. నీవే పర్యవసానమును తెలుసుకుంటావు’ అని మనసులో అనుకున్నాడు.
సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు.
ఒకరోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమయిన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు. అపుడు ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహము చూసి మాంస ఖండం అనుకోని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకి దూకి అతనిని సంహరించి అతని మెడలోని మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది. అటునుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతోంది. సింహము మణిని పట్టుకు పోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్ధం కాదని కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఆడుకోవడానికి ఆటబంతిగా ఆవమణిని ఇచ్చాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.
సత్రాజిత్తు మణి గురించి ఎంతమంది సైన్యమునో పంపించాడు. ఎన్నోచోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటుకాని, గుర్రం కాని కనపడలేదు.
కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు’ అని ప్రచారం చేశాడు. ఇపుడు కృష్ణుడు తనమీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు వేసుకుని వెళ్ళాడు అని తెలుసుకుని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెదకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుఱ్ఱము, అతని కళేబరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లూకపు అడుగుజాడలు కనపడ్డాయి. అంటే సింహమును భల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాలమీద మణి వ్రేలాడుతోంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళుతుండగా జాంబవంతుడు వచ్చాడు.
ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేక పోయాడు. వారిరువురి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించినది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకుని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని, జాంబవతి అనే కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసి పంపించాడు. తరువాత బలరాముడు మొదలయిన వారందరితో సభచేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకు వెళ్ళాడు. నీ మణిని నీవు తీసుకో’ అని మణిని ఇచ్చివేశాడు.
మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్ళకి సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలనుకున్నాడు. ఆ శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా కృష్ణునికి ఇచ్చెయ్యాలని అనుకున్నాడు.
సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయములు కలిగినటువంటి స్త్రీ.
సత్రాజిత్తు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు.
శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపొయింది.
కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి శమంతకమణిని ఎత్తుకు రావడానికి శతధన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దానినుండి వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ వున్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు.
సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు. శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు.
శతధన్వుడు మిథిలానగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి క్రింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులయిన వారి యింట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి అక్రూరా నీవు శమంతకమణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకుని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి.
సత్రాజిత్తు మా పరమాత్మ మీద యిన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకుని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమో నని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతి భక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమయినా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరునిలో మూడు లక్షణములు కలిసి వచ్చాయి. ఒకటి అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, రెండు మహాపురుషుని తేజస్సు, మూడు అలవిమీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ వున్నా భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈవిషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలులేదు. మీరు వెళ్లి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకు రమ్మంటున్నాడు అని అక్రూరునికి చెప్పి తీసుకురండి’ అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపపడ్డాడు.
భక్తి సంయమనం ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువుచేసి అక్రూరునితో ఒక మాట అన్నారు. ‘మహానుభావా, నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే యిక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం నా అభిమతం కాదు. ఎందుకనగా నీవు నా భక్తుడవు. నీ అంత నీవుగా యిచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడనై నిలబడినట్లు ఉంటుంది’ అన్నాడు.
అంతకుమించి అక్రూరుని నిగ్రహించలేదు.
వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరకూ చూపించి అక్రూరునికి ఇచ్చి వేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన యింటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజూ ఎనిమిది బారువుల బంగారమును పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజూ చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అక్రూరునికి యిచ్చాడు. ఇప్పుడు ఆ శమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞ యాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అక్రూరుని వద్ద శాంతించినది.
పరమోత్క్రుష్టమయిన ఈ ఆఖ్యానమును ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమయిన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలాకాలము నుండి తను చెయ్యని నేరమునకు తనమీద అపనిందతో ఉన్నవాడు ఎవరయినా ఉన్నట్లయితే తన మీద వున్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా, మనస్సులో ఒక్కసారి తలచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహా భక్తుడయిన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మరచిపోకూడదు.
🙏 శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో....... 🙏
🙏 కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య🙏
(సశేషం.....)
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 51 🕉
వెనుక్ం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం
జెనకుంజీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం 📍
శ్రీ కాళహస్తీశ్వరా!
నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది.
త్వరలోనో కొంతకాలమునకో రానున్న దుర్మరణము తలుచుకొనగా ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మేలు సాధించనివాడనగుదునే.
నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొని వచ్చుచున్నట్లగుచున్నది.
మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.
🙏 ఓం నమః శివాయ 🙏
***
రుద్రాక్షలు = రుద్రుని యొక్క అక్షులు (శివుని యొక్క కన్నులు)
భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్ష లు
ఆధ్యాత్మికతతో నిండిపోయుండే భారతీయ హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు...
ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు.. అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి.... ఇప్పటికీ గురువులు, స్వామిజీలు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు.. వంటి వారు వీటిని ధరిస్తూ ఉంటారు.... అంతేకాదు పూజా గదులలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ ఉన్నారు....
రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉంది.... చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే ఉంటారు... వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు....
భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి.... వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయని.. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని 'జాబాలోపనిషత్' చెబుతోంది.... రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని.. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది....
రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది?
రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు.... అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి.... వాటి నుంచి జన్మించినవే రుద్రాక్షలు.... రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధం.... శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు....
ఇక రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవని తంత్ర శాస్త్రం చెబుతోంది.... *అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా,
శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా చెప్పబడుతున్నాయి....
కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణం కూడా ముఖ్యమే....
రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి.... సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి....
రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు.... మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.... ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది....
వాటి వివరాలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం...
1. ఏకముఖి రుద్రాక్ష:
ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి...
2. ద్విముఖి:
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీస్వర తత్వానికి సంకేతం... శివపార్వతి రూపంగా నమ్ముతారు... దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది....
3. త్రిముఖి:
త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది....
4. చతుర్ముఖి:
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం.... ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది.... పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి.... విద్యార్ధులకు మరింతా ఉపయోగం....
5. పంచముఖి:
పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం.... గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది... ఇది పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.... అంతేకాదు శతృవులను సులభంగా జయించవచ్చు....
6. షణ్ముఖి:
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక.... రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి....
7. సప్తముఖి:
సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక.... అకాల మరణం సంభవించదని విశ్వాసం...
8. అష్టముఖి:
అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక... కుండలినీ శక్తి పెరుగుతుంది....
9. నవముఖి:
నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపము.... ఇది భైరవునికి ప్రతీక..... దీనిని ఎడమ చేతికి ధరించాలి.... దుర్గ ఆరాధకులకు మంచిది....
10. దశముఖి:
దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపము.... ఇది జనార్ధనుడికి ప్రతీక.... అశ్వమేధ యాగము చేసినంత ఫలితము కలుగుతుంది... దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు....
11. ఏకాదశముఖి:
ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు.... రుద్రుని 11 రూపాలకు ప్రతీక.... దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది....
12. ద్వాదశముఖి:
ద్వాదశముఖి రుద్రాక్ష 12 మంది ఆదిత్యులకు ప్రతీక.... గౌరవం పెరుగుతుంది.....
13. త్రయోదశముఖి:
త్రయోదశముఖి రుద్రాక్ష కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక... పాలలో వేసి, ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది....
14. చతుర్దశముఖి:
చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమ శివుని కన్ను....
15. పంచదశముఖి:
పంచదశముఖి రుద్రాక్ష పశుపతికి ప్రతీక.... ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది...
16. షోడశముఖి:
షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలది.... ఇది కల్పిమాడుకుకు ప్రతీక.....
17. సప్తదశముఖి:
సప్తదశముఖి రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక.... దీని వల్ల ఆర్థిక సంపద కలుగుతుంది....
18. అష్టాదశముఖి:
అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు... ఇది భూమికి తార్కాణం....
19. ఏకోన్నవింశతిముఖి:
ఏకోన్నవింశతిముఖి రుద్రాక్ష 19 ముఖాలు.... ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం....
20. వింశతిముఖి:
వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు.... ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.....
21. ఏకవింశతిముఖి:
ఏకవింశతిముఖి 21 ముఖాలుగల రుద్రాక్ష.... ఇది కుబేరునికి ప్రతీక.... ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష.... 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు.... ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు.... అంతేకాదు జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి....
రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు:
*******
1). రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.....
2). రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు....
3). స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు....
4). కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు...
5). రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు....
6). రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు....
7). రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.....
ఎప్పుడు ఎలా ధరించాలి..?
*******
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి.... ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి....
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం.... వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతో గూర్చి గానీ ధరించాలి....
రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.... సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం శుభకరం.... వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది...
రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు.... వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.... సరైన ఆకృతి లేని రుద్రాక్షలను, ముల్లు లేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు..... రుద్రాక్షలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి....
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
***
మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది?
శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్లాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు. ఈ పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు.
అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూరహారతి ఇచ్చాడు. అప్పుడు భక్తుల 'శంభోశంకర' అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు.
తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్లెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు. తరువాత పళ్లెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపళ్లు ఉంచిన చోట పెట్టాడు.
అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులుపడుతూ ఇలా మాట్లాడుకున్నాయి:
నన్ను రెండుగా పగులగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప, చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా? అని కొబ్బరికాయ అరటిపండుతో అంది.
బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూరహారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని? మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది? అంది అరటిపండు.
ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి. విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణాంతంలో అవి, “కర్పూరం తనను దగ్ధం చేసుకొని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకొనడం వలననే, దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి” అని తేల్చుకున్నాయి.
తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి, కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకొంటారో, వారినే స్మరిస్తూ శ్లాఘిస్తారు.
“యోగం అంటే ఏమిటి?”
అన్న దానికి ఒక మహాత్ముడు ఇలా వివరణ ఇచ్చాడు. 'ఊరుకై పాటుపడడమే యోగం
శ్రేష్ఠత్వానికి గీటురాయి త్యాగమే. అది వ్యక్తిమాత్రుని ఉన్నతుని గావిస్తుంది, సమాజాన్ని ఉద్ధరిస్తుంది.
తక్కిన సాధనలకన్నా త్యాగం మనిషిని భగవంతుని వద్దకు సత్వరమే తీసుకుపోతుంది.
నిష్కామబుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో, అతడు అంత ఆధ్మాత్మికపరుడు, శివసాన్నిధ్యం పొందినవాడూ అవుతాడు.
*************
పురోహితుడు అంటే ఎవరు?
శ్లో:జన్మనా జాయతే శూద్రః సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
🦢పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును.
పురోహితుడు అనగా: ముందుగా హితము పలికెడివాడు
పురోహితుడు అనగా: ధర్మార్థ కామమోక్షములకు సోపానము
పురోహితుడు అనగా: పూజనీయుడు
పురోహితుడు అనగా సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
పురోహితుడు అనగా: నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
పురోహితుడు అనగా: ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
పురోహితుడు అనగా: హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
పురోహితుడు అనగా: సాదారణమైన పేరు వశిష్ఠుడు
పురోహితుడు అనగా: మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
పురోహితుడు అనగా: ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
పురోహితుడు అనగా: సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
పురోహితుడు అనగా: తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
పురోహితుడు అనగా: భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి
పురోహితుడు అనగా: భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
పురోహితుడు అనగా: శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
పురోహితుడు అనగా: నిత్య కాల గణన చేయు గణిత వేత్త
పురోహితుడు అనగా: గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
పురోహితుడు అనగా: పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
పురోహితుడు అనగా: ధర్మ శాస్త్ర ప్రియుడు.
పురోహితము:
*******
పు- పురజనులందరికి
రో- రోజురోజుకి
హి- హితముచెప్పుచు
త- తరింపజేసి
ము - ముదముగూర్చునది
ంంంంంం
సేకరణ:
No comments:
Post a Comment