మధురిమలు .. ప్రాణంగా
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విత్తులు వినయంగా
నిత్యము ఎదగంగా
చెట్టు సంభ్రమంగా
పుడమిన మెలకువగా
మోడే మౌనంగా
ప్రేమను పంచంగా
ఉసురుయు మురిపెంగా,
సకలమ్ము సమంగా
పసరును పరువంగా
కడనే కలశంగా
కళలే పండ0గా
కలపండె నిజంగా
రగడ ఒక నిజంగా
మనుగడయు నిజంగా,
పోకడ అంత కలగా
జీవితము రక్షగా
ఉద్భవ ఉచ్యంగా
ప్రాభవ ప్రాజ్ఞతగా,
ప్రక్రుతియు ఆకృతిగా
ప్రాణ్ముక్తం భక్తిగా
నిజమయు భ్రమణంగా
జీవం వర్తులంగా
జయం జీవమ్ముగా
సూర్యం ఉదయం గా
ఊరినే కన్నీళ్ళు గా
కాళ్ళ దాకా చేరగా
గుండె మారిన జావగా
మనసు ఘనీభవించగా
జ్ఞాపకాలే కుప్పగా .
మమకారపు తడిగా
పచ్చిగానే వెచ్చగా
ప్రతి రోజూ పండగా
మనసున మిన్నుమెరవగా
నిత్యము జగతి జయముగా
తృప్తిగ మన్ను మిగలగా
వెలుగు లన్నియు వ్యాప్తిగా
పకృతిన పరమావిధిగా
ఓర్పు నేర్పుయు బతుకుగా
కళ ప్రణమామ్యహం గా
నిత్యము పరంజ్యోతిగా
ధర్మం అంటే ఏమిటి.?
ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.
పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్థ సంపాదన ధర్మంగా ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మం గానే మోక్ష సాధ నకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబు తుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని మరి కొందరు చెబుతుంటారు. ఇక పురుషార్థాలలో ధర్మం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.
ధర్మం…
ధర్మం అనే పదానికి చాలా విస్తృ తమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచా రం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.
వేదం మానవుణ్ని ఏది చేయమని ఆజ్ఞాపిస్తుందో అది ధర్మమని జైమిని మహర్షి మంత్రపూర్వకంగా తెలి పారు. వేదం సమస్త ధర్మాలకు మూలం, ప్రమాణమన్నది మనుస్మృతి. అహింసా పరమో ధర్మ: (ఏ ప్రాణిని హింసించక పోవడమే శ్రేష్ఠమైన ధర్మం. ధర్మ శబ్దం పది లక్షణాలతో కూడుకున్నదని మనుస్మృతికారుడు మరొక చోట విశేష వివ రణ ఇచ్చాడు.
దశ లక్షణాలు…
ధృతి..
ఎల్ల్లప్పుడూ ధైర్యంగా ఉండడం. ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే కష్ట నిష్ఠురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది.
క్షమ..
ఓర్పు కలిగి ఉండడం. సుఖ దు:ఖాల్లో, లాభనష్టాల్లో మానావ మానాల్లో సహన శీలుడై సమ భావంతో ఉండటం క్షమ అనబడు తుంది.
దమము..
ఇంద్రియ నిగ్రహంతో ఉండటం
అస్తేయం..
దొంగతనం చేయకుండడం. ఇతరుల వస్తువులను వారి అనుమతిలేకుండా తీసుకోకూడదనే భావన.
శౌచము..
పవిత్ర భావాలు, భగవత్ప్రసాద బుద్ధి. దైవేచ్ఛ అనే ప్రపత్తి.
శమము..
మనో నిగ్రహం కలిగి ఉండడం.
ధీ..
ధీ అంటే బుద్ధి. బుద్ధిని మందగింపజేసే పనులు అనగా మాదక ద్రవ్య సేవనం, దుష్ట సాంగత్యం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం. మంచి బుద్ధి కలిగి ఉండడం.
విద్య..
పరమేశ్వర పర్యంతం పదార్థాల జ్ఞానం కలిగి వాని నుంచి ఉపకారం పొందడం విద్య. ఆత్మనందు ఉన్నట్టు మనస్సులో తలచడం, మనస్సులో తలచినది వాణి (మాట) ద్వారా పలకడం, వాణి మేరకే కర్మలయందు ప్రవర్తించడం విద్య.
సత్యం..
ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వినడం, ఆచరించడం, సత్యమనబడుతుంది. సత్యం చెప్పాలిగాని ఇంపుగా చెప్పాలి. సత్యాన్ని అప్రియం అంటే కష్టం కలిగేట్లు చెప్పరాదు. ఇంపుగా ఉంటుంది గదా అని అబద్ధం చెప్పకూడదు. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఉదాహరణకు అంగవైకల్యం కల వారిని అంగవైకల్యంతో సంబోధించరాదు.
అక్రోధం..
పరులకు కష్టాన్ని, హానిని కలిగించే కోపాన్ని విడిచి , శాంతం సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించడం అక్రోధం అవుతుంది. ఈ పది లక్షణాలతో కూడిన పక్షపాతరహిత న్యాయాచరణమనే ధర్మాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థులు, సన్యాసులు అందరూ సేవించాలి. ఇది ధర్మం అనే పదానికి మనువు చెప్పిన నిర్వచనం. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థకామాలు లభ్యమవుతాయని వ్యాస మహర్షి వచనం. అర్థాన్ని, కామాన్ని (కోరికలను) ధర్మంతో ముడిపెట్టి ఆచరించేవారికి మోక్ష మార్గం అప్రయత్నంగా లభిస్తుంది.
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత:
ధర్మాన్ని నశింపజేసే వ్యక్తిని అది నశింపజేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని నాశనం చేయకూడదు. మన చేత ధర్మం చంపబడక మనలనది రక్షించుగాక. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.
మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి ప్రతీక. భారతం ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి ఇబ్బంది కలిగించే ధర్మాన్ని ధర్మంగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమైనదై ఉండాలి. సమిష్టి ధర్మానికి, వ్యష్టిధర్మానికి వైరుధ్యం కలిగినప్పుడు వ్యష్టి ధర్మాన్ని త్యాగం చేయాలి. భీష్ముడు వ్యష్టి ధర్మాచర ణం కోసం సమిష్టి ధర్మానికి హాని చేయడం వలన మరణించాల్సి వచ్చిందని కొందరి అభిప్రాయం.
ధర్మాత్ములు…
తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదింటిని పూజించేవారు ధర్మాత్ములు అని శాస్త్రం చెబుతోంది. ధర్మం నిత్యం. సుఖ దు:ఖాలు అనిత్యం. అందువల్ల సుఖేచ్ఛ చేత గాని, భయం చేత గాని, లోభం చేత కాని ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ధర్మాన్ని విడువకూడదు. జీవుడు నిత్యుడు. అతడు నివసించే ఈ శరీ రం అనిత్యం. అందువల్ల్ల అనిత్యాలైన వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయక నిత్యుడైన జీవుడు నిత్యమైన ధర్మం కోసం యత్నించడం శ్రేయస్కరమవుతుంది.
నారాయణ ఉపనిషత్తు ప్రకారం – ‘ధర్మమే సర్వ జగత్తుకు ఆధారము’. ‘మనుస్మృతి’ ప్రకారం ధైర్యం, క్షమ, సంయమనం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, క్రోధ రాహిత్యం, సంశయం లేకుండా ఉండుట. ఈ పదింటిని జీవితంలో ధరించుటయే(పాటించుటయే) ధర్మం.
తమ ధర్మాన్ని ఎవ్వరైతే పాటిస్తారో వారు ఇహలోకంలోను, పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారు. మరణించిన తరువాత పరలోకంలో భార్యపుత్రులు, బంధువులు మనకు సహాయపడరు. అక్కడ మనం ఆర్జించిన ధర్మమే మనకు సహాయపడుతుంది. అందువల్ల మనుష్యులందరూ ధర్మ బద్దంగా నడుచుకోవాలి మరియు వారి వారి బాధ్యతలను ధర్మ బద్దంగా నిర్వర్తించాలి.
మనం ఆర్జించిన పదార్థాలన్నీ మన శరీర పరిత్యాగంతో దూరమైపోతాయి. ఒక్క ధర్మం మాత్రమే మన వెంట వస్తుంది. మనలను రక్షిస్తుంది.నిజానికి అదే మానవులందరికీ నిజమైన నేస్తం. అందుకే –
ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు – అంటే రక్షింపబడిన ధర్మం మనలను రక్షిస్తుంది. సంపాదించన ధర్మం కారణంగానే వ్యక్తి నరకాన్నుండి తనను తాను రక్షించుకొంటాడు. అధర్మం మనలను నాశనం చేస్తుంది.
ఈ శరీరం నీటి బుడగ వలె క్షణభంగురమైనది. ఎప్పుడు అది అంతరిస్తుందో మన మెరుంగం. అందువల్ల మన కళ్యాణానికి, మన ఆత్మలను ఉద్దరించుకోవడానికి మనం విధిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మంగా ఉండాలి.
ధర్మం కంటె శ్రేష్టమైనది వేరే ఏది లేదు. ధర్మాచరణ ద్వార నిర్భలుడు కూడ శక్తివంతులపై విజయం సాదించవచ్చు. అందువల్ల తాత్కాలికమైన కోరికల కోసం, దానం కోసం, లోభం కోసం ధర్మాన్ని పరిత్యజించరాదు. ధర్మం శాశ్వతమైనది. సుఖదుఃఖాలు ఆశాశ్వతమైనవి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శాశ్వతమైన జీవాత్మను అశాశ్వతమైన పదార్థాల ఆసక్తివైపు మరల్చడం వాళ్ళ మనకే నష్టం జరుగుతుంది.
ధర్మాచరణ ద్వార అధర్మంపట్ల మనం ఆసక్తిని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో సద్బుద్దిని పెంచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సత్యపూరితమైన ప్రవర్తనను నిర్మించుకోవచ్చు. మనమంతా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ధర్మాచరణ ద్వార వ్యక్తి ‘ఆత్మ జ్ఞానాన్ని’ పొందుతాడు. సచ్చిదానందుడగు ఈశ్వరునిలో లీనమవుతాడు. ఈ సందర్భంగా హరిచ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రుక్మాంగద మహారాజు, నల చక్రవర్తి, మేఘనాధుడు, తలాధరుడు, ఏకనాధుడు, మణికుండలుడు, మహర్షి దిధీచి వంటి భక్తులు పేర్కొనదగినవారు.
భగవంతుడు ప్రాణులను ఏ ప్రయోజనం నిమిత్తం సృస్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడమే వాటి ధర్మం. “ధారణాద్ధర్మ”.
సూతుదు శౌనకాది మునులతో, ‘దేన్నీ ఆచరించడం వాళ్ళ భాగవతుని పట్ల నిష్కామ భక్తీ జనిస్తుందో ,దేనివల్ల అంతరాత్మ సదా ఆనందంగా ఉంటుందో అదే మానవుని యొక్క ఉత్తమ ధర్మం’. అని అన్నాడు.
వ్యక్తులు జీవితంలో అవలంభించదగినది ధర్మం. పాటించ దగ్గది ధర్మం. భారతీయ వాజ్మయంలో ధర్మానికి వ్యాపకమైన అర్ధమున్నది. వర్ణాశ్రమ ధర్మం, క్షేత్ర ధర్మం, భ్రాత ధర్మం, పాతివ్రత్య ధర్మం, రాజధర్మం, ఆపద్దర్మం మొదలగునవి. ఈ ధర్మ సూత్రాల ఆధారంగానే కురుక్షేత్ర యుద్ద సమయంలో శ్రీకృష్ణుడు అర్జునినికి, అర్జునా! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని తెలిపినాడు.
‘ధర్మోహి విశ్వస్య జగతః ప్రతిష్టా’ - నిజానికి ధర్మం ఈ జగత్తునకు ఆధారం. ఈ జగత్తు కీర్తి ప్రతిష్టలు కూడ ధర్మం పైనే ఆధారపడి ఉన్నాయి. అధర్మాచరణము వల్ల ప్రాణులకు దుఃఖాలు కలుగుతాయి. ధర్మాచరణం వల్ల సకల సుఖాలు లభిస్తాయి. ధర్మాచార్ణం వాళ్ళ మనకు మేలు కలుగుతుంది. ఇతరులకు కూడ మేలు కలుగుతుంది. స్వధర్మాన్ని ఆచరించడం చాల శ్రేయస్కరము. సత్పురుషులు స్వయంగా ఏ విధంగా నడుచుకుంటారో, ఇతరులును ఏ విధంగా నడుచుకోమని తెలుపుటారో అది ధర్మం. వారు దేనిని ఆచరించరో, దేనిని నిందిస్తారో అది అధర్మం.
అగ్ని ధర్మం కాల్చుట, నీటి ధర్మం శుద్ధి పరచుట, త్రాగిన వారి ప్రాణరక్షణ చేయుట, వాయువు మనకు ప్రాణశక్తి నోసంగుట. అదేవిధంగా మానవులమైన మనకు కూడ కొన్ని ధర్మాలున్నాయి. వాటిని పాటించడం మన కర్తవ్యం. అహింస, సత్యం, అస్తేయం, ప్రేమ ఇవి మానవులందరి సామాన్య ధర్మాలు. స్వార్ధాన్ని, అభిమానాన్ని విడునాడుట. తన కర్తవ్యాన్ని నెరవేర్చుట, లోపల బయట శుచిగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం ,దానం చేయుట. మానసిక సంయమనం కలిగి యుండుట ఇవి అన్నియు కూడ ధర్మపు స్వరూపాలు.
మనుషులందరూ సుఖాన్ని కాంక్షిస్తారు. ధర్మాచరణము వల్లనే సుఖం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతివ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. అధర్మానికి మొదట విజయం లభిస్తున్నట్లు కనిపించిన చివరకు దానికి పరాజయమే లభిస్తుంది. భూమిలో విత్తిన గింజవలె పాప ఫలితం వెంటనే కనిపించదు. కాని సరియైన సమయం వచ్చినపుడు చేసిన పాపం పాపాత్మున్ని సమూలంగా నాశనం చేస్తుంది.
శ్రీ మద్భాగవతంలో మహారాజైన శుకదేవుడు ధర్మసంస్థాపన చేయడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సర్వ శక్తిమంతుడైన భగవంతుడు అవతారాన్ని ఎత్తుతాడు అని సెలవిచ్చాడు. ఇదే విషయాన్నీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ
‘పవిత్రాణాయ సాధునాం, వినాశాయ చ దుష్కృతం | ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే||’ అని అర్జునితో తెలిపినాడు.
నిరాకర స్వరూపమైన ఆ పరమాత్ముణ్ణి నిరంతరం మనం స్మరించడం వలన మనం ధర్మం పట్ల ఆశక్తిని పెంచుకోవచ్చు. భగవంతుని స్వరూపమే ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి మన మనసులో నిరంతరం స్మరిస్తూ మనం మన జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు.ఓం నమో పరమాత్మయే నమః
*వివాహానికి అగ్నిసాక్షి ఎందుకు?*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
సమ్మోహనాలు .. చిన్నపువ్వులు (1181- 1190)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సాగు కాల మెప్పుడు
మెప్పుడు కల ఇప్పుడు
ఇప్పుడు నసాధ్య సుసాధ్యము ఈశ్వరా
ఉద్వేగము నొందకు
నొందకూ బాధలకు
బాధలిచ్చిన సుఖము మావెంట ఈశ్వరా
జగతి గూర్చి తెలుపుము
తెలుపు తాను కష్టము
కష్టము ఉన్న బతకాలి మనము ఈశ్వరా
ఐకమత్యం మనదే
మన లోనె ఉన్నదే
ఉన్నదే మాయ తెర తొలగించు ఈశ్వరా
మనసు భ్రమతొ ఉంది
ఉంది తిమ్మిరి ఉంది
ఉంది అయినా నిగ్రహంగాను ఈశ్వరా
ఆనందం మనకే
మనకు ఓర్పు కొరకే
కొరకే అయినా కలిసి ఉంటాం ఈశ్వరా
జీవితం విచిత్రము
విచిత్రము ప్రేమము
ప్రేమమే మధురిమలకలయికే ఈశ్వరా
ప్రేమంటే మోహమే
మోహము సమ్మతమే
సమ్మతమే ప్రళయమైతె కష్టం ఈశ్వరా
హృదివేదన తీరగ
తీరుగ మనసు కథలగ
కథలు ఎన్ని చెప్పిన నమ్మరే ఈశ్వరా
నిర్మల కాంతి వచ్చి
వచ్చి మాకే ఇచ్చి
ఇచ్చిన ప్రకా రంగా బతుకు ఈశ్వరా
--(())--
అగ్నిసాక్షి గా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడ తాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు..
“సోమః ప్రధమో వివిధే,
గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః
తురీయప్తే మనుష్యచౌః”
అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు.. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం..
అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు).. ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు.
గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు.. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు.
“అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్నిసాక్షి గా వరుడు స్వీకరిస్తాడు.!!
*సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి - పాటించండి..*
ఓం శ్రీ రాం.. శ్రీ మాత్రేనమః
*కృష్ణుని లీలలు*
కంసుడు పంపిన పూతన అనే రాక్షసి శ్రీమహావిష్ణువు అవతరించిన వ్రేపల్లెకు ఆకాశమార్గాన వచ్చింది. మారురూపంలో, అందమైన యువతి వేషాన్ని ధరించి, ఇల్లిల్లూ పసివారిని వెతుక్కుంటూ, బాలకృష్ణుడు వున్న నందగోపుడి ఇంటికి సమ్మోహనంగా బయల్దేరి వచ్చింది పూతన. ఆమెను చూసిన గోపికలు, ఆమె అందానికి ఆశ్చర్యపోయి, శృంగార వేషంలో వచ్చిన లక్ష్మీదేవేమో ఈమె అని భావించారు. ఇంట్లో పడుకున్న పరాత్పరుడిని చూసింది. ఆమె బాలింత వేషంతో చనులకు విషం పూసుకుని తనను చేరడానికి వచ్చిన విషయాన్ని గ్రహించాడు చిన్ని కృష్ణుడు. గురకపెట్టుతూ నిద్రిస్తున్నవాడిలాగా నటించసాగాడు. పూతన బాలుడిని ఎత్తుకుని ముద్దాడుతూ రొమ్ముకు అదుముకుని పాలివ్వడానికి సిద్ధపడింది. యశోదారోహిణులు వారిస్తున్నా, వారి మాటలు లక్ష్యం చేయలేదు. తన చన్ను బాలుడి నోట్లో పెట్టింది.
బాలకృష్ణుడు మెల్లగా కన్నులు విప్పి, ఓరకంటితో చూశాడు. బద్దకంగా ఆవులించాడు. పూతన చంనును పట్టుకుని గుటుకు-గుటుకుమంటూ, రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా పీల్చేశాడు. భయంకరమైన ధ్వనితో పూతన నేలమీద పడిపోయింది. దాని పర్వతాకృతి దేహాన్ని చూసి గొల్లలంతా భయపడుతూ దూరదూరంగా వుండిపోయారు. ఆ మాయలాడి పొట్టమీద ఆడుకుంటున్న చిన్నవాడిని రోహిణీ, యశోదలు ఎత్తుకున్నారు. అతడి అవయవాలకు గోమయాన్ని పట్టించారు. గోపకాంతలు బాలుడికి రక్షకట్టుతూ, విష్ణునామస్మరణం చదువుతూ దీవించారు. యశోదాదేవి చన్ను ఇస్తూ జోలపాడి నిదురపుచ్చింది. ఆ తరువాత నందుడు, మొదలైన గోపకులు వచ్చి, పూతన కళేబరాన్ని గొడ్డళ్లతో నరికి దూరంగా దహనం చేశారు.
చిన్ని కృష్ణుడు ఒత్తిగిలి బోర్లాపడుతున్నాడని, వేడుకతో, అతడి పుట్టిన నక్షత్రం రోజున పొరుగునున్న గోపికలను పేరంటానికి పిలిచింది యశోద. వేడుక అయిన తరువాత బాలుడిని పానుపు మీద పడుకోబెట్టి నిదురపుచ్చింది. నిద్రలేవగానే బాలుడికి ఆకలేసి, మృదువైన తన పాదంతో, పక్కనున్న ఒకానొక బండిని తన్నాడు. అలా తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకి ఎగిరి నేలమీద పడింది. ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. బండి అమాంతంగా గాలిలోకి లేచిందని పక్కనే ఆడుకుంటున్న బాలురన్నారు. బాలుడి ఏడుపు విని, యశోద పరుగెత్తుకుంటూ వచ్చి, పిల్లవాడికి చన్ను కుడిపింది.
ఒకనాడు యశోద బాలకృష్ణుడిని తన తొడమీద పెట్టుకుని ముద్దాడుతుంటే, ఆ శిశువు చాలా బరువుగా అనిపించాడు. అప్పుడామె ఒడి నుండి నేలమీదకు దించింది. ఇంతలోనే, తృణావర్తుడు అనే రాక్షసుడు, కంసుడు పంపగా, చల్లటి సుడిగాలి రూపంలో, వింతగొల్పుతూ అక్కడికి వచ్చి, శిశువును ఎగరేసుకుని పోయింది. ఆ సుడిగాలి వేగానికి, భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. యశోదాదేవి ఇది చూసి, కన్నీరు మున్నేరుగా ఏడ్వసాగింది. ఆమెతో పాటే గోపస్త్రీలు కూడా విలపించసాగారు. గాలిరూపంలో వచ్చిన రాక్షసుడు బాలకృష్ణుడిని ఆకాశమార్గంలో చాలా దూరం తీసుకుపోయాడు. క్రమక్రమంగా బాలుడు బరువెక్కసాగాడు. ఆ బరువు మోయలేకపోయాడు రాక్షసుడు. వాడి మెడను పట్టుకుని కొండంత బరువుతో కిందకు వేల్లాడాడు చిన్ని కృష్ణుడు. రాక్షసుడు గిలగిలలాడసాగాడు. చివరకు కంసుడి అనుచరుడు తృణావర్తుడు నేలకూలాడు. ఇది చూసి గోపకాంతలు పరుగెత్తారు అక్కడికి. వాడి రొమ్ముమీద ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకున్నారు.
ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుడిని చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకుని, ముద్దాడి పాలు తాగించి, ప్రేమతో ముఖాన్ని నిమిరింది. అప్పుడు బాలుడు నిద్ర వస్తున్నట్లుగా ఆవులించాడు. అప్పుడా నోరు గుహద్వారం లాగా అగుపించి, అందులో సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలూ, లోకాలు, సమస్త ప్రాణికోటి సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా నివ్వెరపోయింది.
ఇదిలా వుండగా ఒకనాడు యాదవ పురోహితుడైన గర్గుడు, వాసుదేవుడు పంపగా వ్రేపల్లెకు వచ్చాడు. ఆయన్ను ఉచితరీతిన సత్కరించాడు నందుడు. ఆయన రాకకు కారణం అడిగాడు. కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాలతో నామకరణం చేయమని గర్గుడిని కోరాడు నందుడు. ఇలా చెప్పి తన కుమారుడిని, రోహిణి కుమారుడిని గర్గ మహర్షికి చూపించాడు. కంసుడికి ఇక్కడి విషయాలు తెలిసే ప్రమాదమున్నందున పసివారి సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిదని అన్నాడు గర్గుడు. తరువాత ముందుగా రోహిణీదేవి కుమారుడికి నామకరణం చేశాడు. అతడి పేరు రాముడని, బలరాముడుగా ప్రసిద్ధికెక్కుతాడని చెప్పాడు. సంకర్షణుడుగా కూడా పిలవబడుటాడని అన్నాడు.
ఆ తరువాత కృష్ణుడిని చూసి, నల్లటి వర్ణం కలవాడు కాబట్టి అతడిని కృష్ణుడని పిలవమని, వసుదేవుడికి పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా అంటారని అన్నాడు గర్గుడు.
ఓం శ్రీ రాం.. శ్రీ మాత్రేనమః
అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ? - స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’
ఈ ప్రపంచంలో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని నేనంటాను. స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండాలనుకునే వ్యక్తికి ఏమాత్రం భయంలేని ‘‘నిర్భయత్వం’’ పునాదిగా ఉండాలి.
ఈ విషయంలో ప్రపంచమంతా నన్ను వ్యతిరేకించినా నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే, నా అనుభవమే నాకు అత్యంత విలువైనది. అందుకే అది నాకు చాలా ముఖ్యం.
అంకెల లెక్కలను నేను ఏమాత్రం లెక్కచెయ్యను. ఎంతమంది నాతో ఉన్నారనేది నాకు ముఖ్యంకాదు. నా అనుభవానికి ఉన్న విలువనే నేను ఎప్పుడూ గమనిస్తాను. చిలక పలుకుల్లా నేను ఇతరులు చెప్పిన మాటలనే చెప్తున్నానా లేక నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్నానా అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం.
నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్న పక్షంలో అది నా రక్తంలో, ఎముకల మూలుగులలో భాగమైనట్లే.
అప్పుడు ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను వ్యతిరేకించినా నేను ‘‘ప్రపంచానిదే తప్పని, నేను చెప్పినదే- అది ఏమైనా కావచ్చు- వాస్తవమని’’ అంటాను. అందుకు నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలను స్వీకరించేవారికే ఇతరుల మద్దతు అవసరమవుతుంది.
కానీ, ఇంతవరకు మానవ సమాజం అదే తీరులో పనిచేస్తూ మిమ్మల్ని తన అధీనంలో ఉంచుకుంది. దానికి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వాటిని మీరుకూడా అనుభవించక తప్పదు. అదెలా ఉంటే మీరు కూడా అలాగే ఉండాలి.
అంతేకానీ, మీలో ఏమాత్రం తేడారాకూడదు. ఎందుకంటే, మీలో ఏమాత్రం తేడావచ్చినా మీరు ఏదో ప్రత్యేకతతో కూడిన స్వతంత్రులైనట్లే. అలాంటి వ్యక్తులంటే సమాజానికి చాలా భయం. ఎందుకంటే, మీరు దేనికీ తలవంచరు. అప్పుడు దాని దేవుళ్ళు, దేవాలయాలు, పూజారులు, పవిత్రగ్రంథాలు దిక్కులేకుండాపోతాయి.
ఎందుకంటే, హాయిగా ఆడుతూ, పాడుతూ జీవించేందుకు, మరణించేందుకు మీదారి మీరు చూసుకున్నారు. అంటే మీరు మీ ఇంటికి చేరుకున్నట్లే. కాబట్టి, గుంపులో ఉన్నంతవరకు మీరు మీ ఇంటికి ఎప్పుడూ చేరుకోలేరు. కేవలం ఒంటరిగా మాత్రమే మీరు మీ ఇంటికి చేరుకోగలరు.
మీ అంతర్వాణిని వినండి:
ఎందుకురా ఎప్పుడూ బుర్రగోక్కుంటున్నావు? అన్నాడు తండ్రి కొడుకుతో.
‘‘నా దురద ఎక్కడుందో నాకే తెలుస్తుంది నాన్నా’’అన్నాడు కొడుకు.
అదే మీ అంతర్వాణి.
అది మీకు మాత్రమే తెలుస్తుంది తప్ప, ఇతరులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే, అది బయటకు కనిపించే వస్తువుకాదు. మీకు తలనొప్పి వచ్చినా, సంతోషమొచ్చినా అది మీకుమాత్రమే తెలుస్తుంది. దానిని మీరు ఒక వస్తువులా ఇతరులకు చూపించలేరు.
మీ అంతర్వాణి మీ లోలోపల ఎంత లోతుల్లో ఉంటుందంటే, అది నిజంగా మీలో ఉన్నట్లు మీరు ఏమాత్రం నిరూపించలేరు. అందుకే విజ్ఞానశాస్త్రం దానిని చాలా అమానుషంగా ఖండిస్తుంది.
అయినా అది మీలోఉన్నట్లే. దాని విలువ దానికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే, ఒక వస్తువుగా ఇతరులకు చూపించలేని ‘ప్రేమభావన’ తనలో ఉన్నట్లు శాస్తవ్రేత్తకు కూడా తెలుసు. కానీ, శాస్ర్తియపరమైన శిక్షణ పట్ల అందరూ తమ అంతర్వాణిపై నమ్మకాన్ని కోల్పోయారు. అందుకేవారు ఇతరులపై ఆధారపడతారు. ఎవరైనా మీతో ‘‘మీరు చాలా అందంగా ఉంటారండి’’ అనగానే మీరు చాలా సంతోష పడతారు.
--(())--
మధురిమలు . .. ఇదా దేశం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మధుర జ్ఞాపకములు యే
చేదుగ అనుభవమ్ము యే
నాలో సైతం.కధ యే
వెంటాడే చీకటియే
మనో విహార కథలు యే
మమతల ఆర్భాటముయే
ఇది నోరుపై పోటుయే
సకలము పొందు బాధయే
తెగిన గాలిపటాలుయే
జీవితం అఘాదంయే
అధర్మ గీతం ఇదియే
భవిష్యత్ సూన్యముయే
ఇది రగిలే కుంపటియే
హృదయమునకు దెబ్బలుయే
గ్రహసంచార మాగుటయే
సంపదకు ఇక గండియే
కరకు కత్తులు వేటయే
ఇటు కబళించే ఆటయే
మల్లెల మత్తు బాటయే
దారంతో బంధీయే
ఇదియు బందిఖానాయే
చీకటి వెలుగు బతుకుయే
స్వేచ్ఛ బతుకు కాఁదుయే
bhaa రంతొ బంధమ్ము యే .
హృదయమ్ము కఠిన శిలయే
మనసు లేని మల్లెలు యే
మాట కరకు యుండుటయే
చేత కాని ఋషు లాయే
ముడిపడిన ఎదగదుల యే
ముప్పెరిగన ఊసులు.యే
కలిసినా హృదయాలుయే
కవ్వించగ కాంక్షలుయే .
అసామాన్య జ్ఞానముయే
విద్య నిధి అక్షయముయే
ఏమి లేని సంఘము యే
నిర్గు ణా సంపదయే
కలలు నిజము కానిదియే
కళల చెలిమి లేనిదియే
బతుకు బాట బాధలుయే
మాతృ మూర్తి దేశము యే
--(())--
ప్రక్రియ: క ధ
ఒక్క చిన్న పల్లెటూరి లోని సుబ్బారావు సూర్యకాంతం దంపతులకు కిషోర్ అనే ఒక కొడుకు ఉండేవాడు. వాళ్లకి చాలా పొలాలు స్థిరాస్తులు ఉన్నాయి. కొడుకు రోజు తండ్రికి పొలం పనులకు సహాయం కోసం వెళ్లేవాడు. పొలం కాపలాకి రామయ్య అనే ఒక నిరుపేద కుటుంబానికి సుబ్బారావు ఒక గుడిసె కట్టించి ఇచ్చాడు. రామయ్య మనవరాలు సీతకి దైవభక్తి అంటే చాలా ఎక్కువ అదే పొలంలో భూగర్భ దేవత అని ఒక గుడి ఉండేది ఆ గుడిని ఎవరూ పట్టించుకోక పోయినా సీత మాత్రం క్రమం తప్పకుండా దూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఉండేది సుబ్బారావు కొడుకు సీతను తప్ప ఎవరిని పెళ్లి చేసుకొను అని భీష్మించుకుని కూర్చోవడంతో సీత కి కిషోర్ కి పెళ్లి జరిపిస్తారు సుబ్బారావు దంపతులు.
పేదింటి పిల్ల అని సీతని సూర్యకాంతం అత్తగారు తండ్రి కొడుకులని పొలం కి పంపించి బండెడు చాకిరీ చేయించేది. పచ్చి గంగ కూడా ఇవ్వకుండా పస్తులు పెట్టేది.సీత మాత్రం ఎన్నాళ్లు అలా ఉండగలదు వంట చేసిన వెంటనే బిందెలో అన్నం కూర పెట్టుకొని పొలంలో దేవత గుడి కి వెళ్లి గుడి శుభ్రం చేసి వస్తానని గుడిలో తీసుకెళ్లిన అన్నం కూర నైవేద్యం పెట్టి అదే ఆరగించి వచ్చేసేది కోడలికి మూడు పూటలు పస్తు పెట్టిన ఎందుకు నీరసించి పోవడం లేదు అని ఒక వైపు ఆశ్చర్యం కలిగేది సూర్య కాంతం అత్తకి.
ఇది రోజు ఇలా జరుగుతుండగా దేవత గుడిలో ఒక వింత జరిగింది అది ఏంటంటే దేవత విగ్రహం ఎప్పటి లాగా కాకుండా ముక్కు మీద వేలు వేసుకొని ఉన్నది ఆ నోటా ఆ నోటా ఆ గ్రామ సర్పంచి వరకు విషయం వెళ్ళింది. అయితే గ్రామ సర్పంచి తో పాటు ఎంతో మంది దేవత ముక్కు మీద వేలు తీయ ప్రయత్నం చేశారు
రాతి విగ్రహం ఏంటి ముక్కు మీద వేలు వేసుకోవడం ఏంటి అని .ఆఖరికి సర్పంచ్ గారు ఒక చాటింపు వేయించారు ఎవరైతే దేవత ముక్కు మీద వేలు తీఇస్తారో వారికి నా ఆస్తిలో సగం ఇస్తాను అని.అప్పటి నుండి ఎవ్వరూ పట్టించుకోని దేవత గుడి కళకళలాడుతూ ఉంది ఊరు జనాలందరూ ఆస్తికోసం దేవత గుడి కి వెళ్లి దేవత ముక్కు మీద వేలు తీయించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమై వెనక్కి వచ్చేస్తున్నారు. ఎప్పటిలాగే సీత దేవతకు ఆరగింపు పెట్టి తను భుజిస్తూ ఉండగా సర్పంచి చూశారు. ఇదేమి చోద్యం ఇక్కడ తింటున్నావు అని నిలదీశారు సర్పంచ్ గారు .సీత వెంటనే రెండు చేతులు జోడించి దేవత ముందు నిలబడి నేను ఏం తప్పు చేశాను బాగా కష్టపడి ఇంటెడు చాకిరీ చేసి నీకు నైవేద్యం పెట్టి నా ఇంటి తిండి నేను తింటున్నాను నన్ను పెద్దల ముందు దోషిగా ఎందుకు నిలబెట్టావునేను నీకు చేసినపూజలు నిజమైనవే అయితే నీ ముక్కు మీద వేలు తీసి నా నిజాయితీ నిరూపించు అని గ్రామమంతా వినిపిం చేట ట్లు అరిచి చెప్పింది. నువ్వు రాయివి కాదని దేవతవని నిరూపించుకునే సమయం ఆసన్నమైనది... గ్రామ ప్రజలు అందరితో పాటు సూర్యకాంతం కుటుంబం కూడా దేవత గుడి ముందు చేరారు సీత అరుపులకు. అందరూ చూస్తుండగానే దేవత ముక్కు మీద వేలు తీసి సీతను గెలిపించింది. గ్రామ సర్పంచి ఆస్తి సగం రావడంతో సూర్యకాంతం అత్త కూడా కోడలని అప్పటినుండి కాలు కింద పెట్టకుండా చూసుకునేది .దేవత గుడి కూడా ఆ రోజు నుండి కళకళలాడుతూ ఉంది.
--(())--
[29/12/2020, 11:43 am] Prathyusha: హిందూ మతాన్ని హిందూ శాస్త్రాలను జ్యోతిష్యాన్ని విమర్శించే మేధావులకు అంకితం
అంతర్జాల సేకరణ !
వారానికి 7 రోజులు ఎందుకు?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??
ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా??
ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే మందు ప్రతి ఉగాది రోజు పంచాంగం ను, జ్యోతిష్యం ను అవమానించిన వాళ్లకి అంకితం..
మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..
ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?
ఎప్పుడు చంద్రగ్రహణం?
ఎప్పుడు సూర్యగ్రహణం?
ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే.. ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్న కి జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి.. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆతర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.
రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి? మంగళ వారం రాకూడదా??
రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది..
[30/12/2020, 10:11 am] Prathyusha: ✍🏻 నేటి చిట్టి కథ ✍🏻
*🌸దురాశకు పోతే దుఃఖం*🌸
ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు.
దానికా సాధువు సరేనని కోరుకున్నది జరిగేట్టు ఇంకో మంత్రం ఉపదేశించి పంపాడు. ఇంటికి వెళ్లాక ఆశారాం ‘నా ఇల్లేమిటి ఇలా దరిద్రంగా ఉంది..వట్టి మట్టికొంప, దీన్ని బంగారు ఇల్లుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో’ అనే ఆలోచన వచ్చి సాధువుచెప్పిన మొదటి మంత్రం చదివి ‘నా ఇల్లు బంగారంగాను’ (బంగారు ఇల్లు అవ్వాలని) కోరుకున్నాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు! ఇంట్లో వస్తువులతో సహా ఇల్లంతా బంగారమై మెరిసిపోతోంది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు తానెంతో ధనవంతుడనని, తనకెవరూ సాటిరారని గర్వపడ్డాడు...‘ ఇలా బంగారపు ఇంట్లో బంగారు వస్తువులతో జనం మధ్యలో వుంటే అందరి కళ్లూ నామీదే ఉంటాయి. దాంతో దొంగలు దోపిడీదారులు నా ఇంటిపై కన్నెస్తారు..ఇదంతా అపహరించుకోవడానికి’ అనే భయం పట్టుకుంది. ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తుంటే సాధువుగారు ఉపదేశించిన రెండో మంత్రముందిగా నా దగ్గర అనుకుని ఆ మంత్రం పఠించి ‘నా బంగారం నాకే కాక ఇతరులకు కనపడకుండుగాక’ అని కోరుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు ఇల్లు, అందులో వస్తువులు ఆశారాంకు తప్ప ఇతరులకెవ్వరికీ కనపడడంలేదు. చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు. ఆశారాం కనపడుతున్నాడు, కానీ ఇల్లేమైంది. వట్టి ఖాళీ జాగాలో ఉంటున్నాడేమిటో?’అని!
ఒకరోజు ఆశారాం తనవద్దనున్న బంగారంలో కొంత అమ్మాలనుకున్నాడు. రోజువారీ ఖర్చులకోసం డబ్బు కావాలి కదా! కొంత బంగారం పట్టుకుని బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆశారాం. తను కోరుకున్న రెండో వరం..తన బంగారం తనకేగానీ ఇతరుల కంటికి కనపడకుండా వుండాలన్నది మరిచిపోయాడు. వ్యాపారి వద్దకు పోయి ‘ఈ బంగారానికి ధరకట్టి డబ్బులియ్యండి’ అని బంగారం చూపించాడు. ఆ బంగారం తనకే గానీ వాళ్లకు కనపడదు కదా! దానికా వ్యాపారి ‘‘ఏమీ ఇవ్వకుండా బంగారం తీసుకుని డబ్బియ్యమంటావేమిటి? నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా?’’ అని కేకలేశాడు. దాంతో ఆశారాం పక్కనున్న వారిని ‘‘చూడండయ్యా, నేను బంగారం ఇస్తుంటే ఏమీ లేదంటున్నాడీయన, ఇదేంటి, ఇది బంగారం కాదా? చూడండి’’ అంటూ చేతిలోని బంగారం చూపిస్తున్నాడు అందరికీ.
ఆ బంగారం అతనికి తప్ప ఎవరికీ కనపడడంలేదు. అందుకని అందరూ ‘‘ పోవయ్యా వట్టి చేతులు చూపిస్తూ బంగారం ఉందంటున్నావు అందరికీ చెవిలో పువ్వులు పెడతావా? ఏది బంగారం! నీకేమన్నా పిచ్చా’’ అని ఆశారాం మాటలు ఎవరూ నమ్మలేదు. పైగా ‘పిచ్చివాడు’ అని అందరూ నవ్వడం మొదలుపెట్టి, పోరా పోరా పిచ్చోడా! అంటూ తన్ని తరిమివేశారు. పాపం! ఆశారాం ఆశపడి ఇంటిని బంగారం చేసుకున్నాడు. కానీ దురాశ అతడిని అన్నింటికీ దూరం చేసి పిచ్చివానిగా ముద్రవేసింది. ఇంటికే కాదు ఊరికీ దూరమయ్యాడు!
చూశారా! తృప్తిలో వున్నంత సుఖం ఎందులోనూ ఉండదు. ఆశ ఉండచ్చు. కానీ తగిన మోతాదులో ఉండాలి . మోతాదు మించి మొత్తానికే మోసం దు:ఖాన్నే మిగుల్చుతుంది.
కథలు మిగిలిన విషయ సేకరణలు బాగున్నాయి
ReplyDelete...ఉమ్మెత్తల