*ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరీరానికి నూనె ఎందుకు రాసుకోరాదు?*
రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిసున్న రోజులలో తలకు
మరియు దేహానికి నూనె రాసి స్నానం చేయకూడదు
నూనెను అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి వుంది
శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది.
ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది
కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది.
తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.
🌼
🙏 *శ్రీ వేంకటేశ్వర లీలలు* 🙏
🍒 *భాగము 1* 🍒
*నైమిశారణ్య ప్రాధాన్యము*
శ్రీలతో తులతూగుచూ పాడిపంటలు పుష్కలముగా నుండి సర్వప్రజలు నీతిమంతులై విలసిల్లిన దేశము భారతదేశము.
అందమైన హిమాలయములు, మహా శిల్పుల పనితనమునకు మచ్చుతునకలుగానున్న దేవాలయములు మున్నగు వానితో దేశము శోభాయమానముగానుండెడిది.
ఎచ్చట జూచినను దైవపూజలే యెచ్చట వినినను పుణ్య కథా శ్రవణములే! ఎచ్చట మెట్టినను ఆధ్యాత్మిక చింతనలే! అట్టి పవిత్ర భారత దేశమున అనఱ్యములు ప్రజలకు విజ్ఞాన విషయములందించుటలో విజ్ఞాన విశేషములను శోధించి, నూతన విషయములు కనుగొని, ప్రజల ఉపయోగార్థమందించెడివారు.
భయంకరారణ్య సీమలందు మోక్షకాముకులై అనేక మంది మునీశ్వరులు తపస్సు చేసుకొనుచెండెడి వారు. చక్రవర్తులు, రాజులు, పరిపాలనను సరిగా చేయుచు మధ్యమధ్య ఆయా మునీశ్వరులను సందర్శించి వారు ప్రబోధములు వినిచు ఉత్తేజితులయ్యెడివారు.
నైమిశారణ్యము భారతదేశమున గల అరణ్యములలో గొప్పదై విలసిల్లినది. సూతులవారు శౌనకాది మహర్షుల కనేక పౌరాణిక కథలను, భగవన్మాహాత్మ్యములను ఆ యరణ్యమునందే చెప్పెడివారు.
సర్వవేద పురాణ విజ్ఞాన నిధియైన సూతులవారు చెప్పు విషయములు ఆసక్తికరములై మోక్షదాయకములై యుండెడివి. ఆయన విప్పని ధర్మసందేహములు లేవు. చెప్పని పురాణ రహస్యములు లేవు.
అనేక ధార్మికాంశములతో ఆయన శౌనకాదులకు సర్వ పురాణములు వినిపించుచుండిరి.
🙏
*కర్ణపర్వము..*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైఃఃైైైైైైైైైైై
లోక భీకర రీతిలో దుశ్శాసనుడి వధజరగటం కళ్ళారా చూసిన కర్ణుడు ఒకవిధమైన నిర్వేదంతో కూడిన భయంకలిగిన వాడై కూలపడిపోయాడు ! దుర్యోధనుడు దారుణమైన తన తమ్ముని మరణం జీర్ణించుకోలేక నిశ్చేష్టుడైనాడు.
అప్పుడు కర్ణుడి కొడుకు వృషసేనుడనేవాడు అర్జునుడి మీదకు రాగా అతనిని అవలీలగా చంపివేసి కర్ణునివైపు రధం మరలించమన్నాడు అర్జునుడు.
బాధ నుండి తేరుకొని యుద్ధానికి సిద్ధమయి అర్జునుని ఎదురుగా రధం నిలిపాడు కర్ణుడు !
లోకోత్తరమైన యుద్ధం మొదలయ్యింది ! అందరి చూపులూ అటువైపే !.
ధర్మజుడు గాయాలకు మందువేసుకొని కవచం తొడుగుకొని మరల వీరిరువురి యుద్ధం చూడటానికి అక్కడకు వచ్చాడు .
అర్జునుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే దానిని వారుణాస్త్రంతో ఉపశమింపచేశాడు కర్ణుడు ! .
ఒకరి దివ్యాస్త్రాలను మరొకరు వమ్ము చేసుకుంటున్నారు ! కాసేపు ఒకరిది పైచేయి అయితే మరికాసేపు ఇంకొకరిది పైచేయిగా పోటాపోటీగా హోరాహోరీగా సాగుతున్నది కర్ణార్జునుల యుద్ధం !.
కర్ణుడు సర్పముఖాస్త్రం తీశాడు అందులో ఒక నాగుడు యోగబలంతో దాగి ఉన్నాడు ,వాడు ఖాండవదహనమప్పుడు అర్జునుని మీద పగబట్టినవాడు.
అప్పుడువాడు పిల్లనాగు! ఇప్పుడు దూకుడు మీదున్న కోడెనాగు!
వాడున్న సంగతి కర్ణునకు తెలువదు ఆ బాణాన్ని సరిగ్గా అర్జునుడి కంఠానికి గురి పెట్టివదిలాడు !
ఈ సంగతి పార్ధసారధి గ్రహించాడు, వెంటనే గుర్రాలకు ఆజ్ఞ ఇచ్చాడు మోకాళ్లమీద వంగి కూర్చోమని !తమ యజమాని చెప్పినట్లు అవి చటుక్కున వంగాయి.
రధం ఎత్తు అడుగు మేర తగ్గిపోయింది . కంఠానికి గురిపెట్టబడ్డ బాణం కిరీటాన్ని ఎగురకొట్టి పోయింది .
పగతో రగులుతున్న నాగుడు మరల కర్ణుని వద్దకు వచ్చి తనను ప్రయోగించమన్నాడు ! ఎవడవురా నీవు అన్నాడు కర్ణుడు ! నేను అర్జునుని శత్రువును అన్నాడు నాగుడు !
ఒకసారి ప్రయోగించిన బాణం తిరిగి ప్రయోగించడం నా చరిత్రలోనే లేదు నీవు వెళ్లు అన్నాడు ,అప్పుడు వాడు భయంకరమైన విషాగ్నికీలలు చిమ్ముకుంటూ అర్జునుడి మీదకు రాసాగాడు ! వాడిని నిశిత శరాలతో నిలువునా చీల్చాడు అర్జునుడు!.
కర్ణుడు బాగా అలసి పోయాడు, యుద్ధం నిర్ణయాత్మక స్థితి చేరుకుంటున్నది ! ఏ అస్త్రాలు స్ఫురణకు రావడంలేదు ! అర్ధమయ్యింది ఆ యోధుడికి తనకుసమయమాసన్నమయ్యిందని !
అయినా తిప్పలుబడి బాణప్రయోగం చేస్తూనే ఉన్నాడు అర్జునుడి దెబ్బలు కాచుకుంటూనే ఉన్నాడు
ఇంతలో జరుగరాని ఘోరం జరిగిపోయింది రధచక్రం భూమిలో దిగబడ్డది ! .
రధం దిగి చక్రాన్ని ఎత్తటానికి ప్రయత్నం చేస్తున్నాడు కర్ణుడు . అర్జునుడిని కృష్ణుడు రెచ్చగొడుతున్నాడు.
ఇదే మంచిసమయం అతనిని సంహరించటానికి అని!.
సందిగ్ధంలో పడ్డ పార్ధుని కృష్ణుడు ప్రేరేపించటం చూసి కర్ణుడు నల్లనయ్య వైపు తిరిగి నిరాయుధుడను ,నేల పై ఉన్నవాడిని ,నా మీద అస్త్రప్రయోగం ధర్మమా ! అని అడిగాడు ! .
ఓహో ధర్మం ఇప్పడు గుర్తుకు వచ్చిందా కర్ణా నీకు!
,బాలుడు అయిన అభిమన్యుని విల్లు దొంగచాటుగా నీవు తెగనరికినప్పుడు, అతనిని నిరాయుధుడిని చేసి చంపినప్పుడు గుర్తుకు రాలేదా !.
ఏకవస్త్రను,పాండవుల ధర్మపత్నిని సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు ఏ గాలికి కొట్టుకు పోయింది ధర్మం !.
ద్యూతము ఆడటంతెలియని ధర్మరాజు ను ద్యూతప్రవీణుడయిన శకుని ఓడించిననాడు ( రాజు తో రాజే ఆడాలి ,కానీ అతని ప్రతినిది ఆడాడు) ఎటుపోయింది నీధర్మం ?.
పాండవులను లక్క ఇంటిలో ఉంచి తగులబెట్టిననాడు ఎక్కడ తగలబడ్డదయ్యా? ఆ ధర్మం !
ద్రౌపదీ వస్త్రాపహరణమప్పుడు నీవామెను చూసిన వంకర చూపులు ఏ ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నాయి కర్ణా !.
ఒక్కొక్కమాట కృష్ణుడు అడుగుతుంటే సిగ్గుతో తలవంచిన కర్ణుని శిరస్సును అంజిలకం అనే భయంకరమైన బాణప్రయోగంతో ఖండించివేశాడు అర్జునుడు.
కర్ణుని దేహం నుండి దివ్యతేజస్సు సూర్యమండలం వైపుసాగిపోయింది.
గమనిక
కర్ణుడి వ్యక్తిత్వం పరస్పర వైరుధ్యాలతో కూడుకొన్నది
ఆయన కర్మసాక్షి సూర్యభగవానుడి పుత్రుడు ,దుర్యోధనుడి అధర్మవర్తనానికి అతగాడే సాక్షీ ! .
పుట్టుక రాచపుట్టుక ! వంట్లో ప్రవహించేది క్షత్రియ రక్తం ! పెరిగింది సూతుని ఇంట! .
తల్లి ఎవరో తెలిసినా, పాండవులు తన తమ్ములని తెలిసినా తనకు జీవితాన్ని ,వైభవాన్ని ప్రసాదించిన దుర్యోధనుడే ముఖ్యమనుకున్నాడు .
వైభవమే ముఖ్యం ! జీవితపు విలువలు కాదు అని అనుకున్నవాడు !.
ధర్మమేమిటో తెలిసీ అధర్మానికి కొమ్ముకాశాడు ! .
తల్లి విసిరిపారేసిందన్న కోపం ! ఆ కోపాన్ని అర్ధరహితంగా అర్జునుడి మీదకు మరల్చాడు ! అస్త్ర విద్యలో తనకు పోటీ అతను కాబట్టి! .
వైరుధ్యాల పుట్ట ! కర్ణపాత్ర !
--(())--
*జీవన మాధుర్యం*
మనిషి తన జీవిత కాలంలో ప్రపంచ వ్యవహారాలు నిర్వహించే తీరునే బతుకుగా చెబుతారు. పుట్టుక ప్రపంచానికి ప్రవేశ ద్వారం. మరణం నిష్క్రమణ మార్గం. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. జీవి అంటే ప్రాణంతో ఉన్నది. దేహంలో ప్రాణం ఉన్నంతవరకు జీవుడు. లింగ దేహమనే ఆత్మ ఉన్నంతకాలం మనిషి శివుడే. లింగధారణ చేసి శివారాధనలో జీవితాలను అంకితం చేసినవారు ఆత్మలింగ స్వరూపులుగా గౌరవం పొందుతారు.
రుద్రార్చనలో ముందుగా మహన్యాసం ఉంటుంది. శరీరంలోని అణువణువును రుద్రమంత్రాలతో శక్తిమంతం చేస్తారు. రుద్రమంత్రాలన్నీ వేదవాక్కులే. రుద్రార్చనకు వేదపఠనానికి తేడా లేదు. మహాదేవుడు అంటే దేవతలకే దేవుడు. దేవతలు, రుషులు శివలింగాలను శిరస్సు, కంఠం, బాహువుల్లో ధరిస్తారని శివపురాణం చెబుతుంది.
కోటి జన్మల పుణ్యఫలమే శివభక్తి అని స్వయంగా శివుడే చెప్పినట్లు శివగీత వెల్లడిస్తుంది. శివభక్తులకు అకాల మృత్యువు రాదంటారు. భక్తి లోపం లేనంతవరకు ప్రాణరక్షణకు ఇబ్బంది ఉండదు. సమస్త గ్రహాలకు, అస్త్రదేవతలకు శివుడే ఆరాధ్యుడు.
మార్కండేయుడి అల్పాయుష్షును అనంతంగా మార్చివేసిన భక్త పరాధీనుడు శివుడు. ఆయన వాక్కే దివ్య శాసనం.
ప్రతి జీవికీ అంతిమ గమ్యం మరణమే. జీవన ప్రయాణం చావుతో ముగిసిపోతుంది. బతుకు తీపి ఉన్నంతకాలం చావు గురించిన ఆలోచనే భయం కలిగిస్తుంది. అయ్యో... అప్పుడే బాల్య, యౌవన దశలు దాటి, వార్ధక్యంలోకి వచ్చేశామా... మరణం ముంగిట ఉన్నామా- అనుకోగానే మనసు దుఃఖంతో బరువెక్కిపోతుంది.
బతుకు ముగిసిపోతోందనే బాధకు బదులు ఈ బతుకులో నేను సాధించినదేమిటి అనే ప్రశ్న వేసుకుంటే, మనం చేసిన పొరపాట్లన్నీ మనసులో మెదులుతాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. మనం అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేస్తే ఎంతో బావుండేది అనుకుంటాం.
విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేసి పెద్దవారయ్యాక, తమ ఆశలకు తగిన ఉద్యోగాలు దొరకనప్పుడు ఇలాగే పశ్చాత్తాపపడతారు. ఉద్యోగులు శ్రద్ధగా పనిచెయ్యకుండా పదోన్నతులు పొందలేరు కదా? చిన్న స్థాయిలోనే ఉద్యోగకాలం ముగిసిపోతుంది. అప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. సకాలంలో ఉన్నత విద్య చదివి, ప్రజ్ఞను పెంచుకుంటే పెద్ద ఉద్యోగం, ఎక్కువ జీతం పొందగల వీలుంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం లభిస్తుంది. సంతానానికి మంచి విద్యతోపాటు ఉత్తమ భవిత సాధ్యపడుతుంది.
బతుకుబండి ప్రయాణం సాఫీగా, ఒడుదొడుకులు లేకుండా గమ్యం చేరాలంటే చక్కటి జీవన ప్రణాళిక వేసుకోవాలి. పొదుపు పాటించాలి. అప్పుల తప్పులు చెయ్యకూడదు. ఎవరికీ ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. దుర్విచక్షణ చూపకుండా అందరితో ఆత్మీయంగా సమభావంతో వ్యవహరించాలి. కులమతాలన్నీ కల్పనలే, అడ్డుగోడలే. మనం ఇతరులకు చేసే ఉపకారాలే మన ఆస్తిపాస్తులు. ఇతరులకు మనం చేసే అపకారాలే శాపాలు.
మనల్ని అందరూ ప్రేమించాలంటే, మనం అందర్నీ ప్రేమించాలి. ఈ జీవన సూత్రం పాటించిన వారికే బతుకు తియ్యదనం అనుభవంలోకి వస్తుంది. జన్మ ధన్యమవుతుంది.
*వ్యామోహంతోనే మనిషి
భగవంతుడు సాధారణ సందేహాలకు సమాధానమయ్యేంత అల్పస్థాయి వాడు కాదు. ఏ ప్రశ్నకూ అందనంత ఉన్నతుడు. మాటలకు ఇమడనివాడు. మనసుకు అందనివాడు. ఆత్మానుభూతికి మాత్రమే అవగాహన అయ్యేవాడు. దేవుడు సమాధానాలకు తావుకాడని, ప్రశ్నలకు అంతకంటే బద్ధుడు కాడని తెలుసుకొన్న జీవుడు.. దేవుడికి సమీపగతుడై వ్యామోహరహితుడు అవుతాడు.
సత్, చిత్ ఆనందాలు మనలోనే ఉన్నాయి. కానీ, మనకు తెలీదు. నిరంతరం వాటికోసం బయట అన్వేషిస్తూ ఉంటాం. అయినా వెతుకుతూనే ఉంటాం. నిరంతర అన్వేషణలో మనమేమిటో, మనం తెలుసుకున్నప్పుడు ఆనందం మనదవుతుంది. మనం సచ్చిదానందులం అయినప్పుడు, మన దిగుళ్లు, భయాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కనుమరుగవుతాయి. అప్పుడు వ్యామోహరహితమైన స్థితప్రజ్ఞులమవుతాం. దైవానికి దగ్గరవుతాం.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలలో మోహం మిగుల ప్రమాదకారి. ఆ మోహం తీవ్రంగా ప్రకోపిస్తే ‘వ్యామోహం’ అవుతుంది. దానికి‘తృష్ణ’ సమానార్ధకం. ముసలితనం వల్ల శరీరం జీర్ణమైనా వ్యామోహం జీర్ణం కాదు. తత్ఫలితంగా అత్యంత భయంకరమైన పాపబంధాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా పోతుంది.
దారాపుత్రులు, ధన, కనక, వస్తు వాహనాదులు, కీర్తి, ఇత్యాదులపై వ్యామోహం ఉంటుంది. ఈ వ్యామోహంలో అంతర్లీనంగా అధర్మం, అసత్యం, అన్యాయం అత్యధిక శాతం ఉండి మానవాళిని పతనావస్థకు చేరుస్తాయి. మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది. ఆ మచ్చ బాహ్య సౌందర్యాన్ని చెడగొట్టి అంతఃసౌందర్యాన్ని హరించి వేయడానికి వ్యామోహమే ప్రధాన కారణం.
అనంతమైన మన పూర్వానుభవాన్ని మన పురాణాల్లో పూర్వచిత్తి అంటారు. మన ఏకాగ్రతకు భంగం కలిగించే పూర్వ వాసనలూ, జ్ఞాపకాలే పూర్వచిత్తి. ఇది గతానుగతంగా సంభవించే వ్యామోహజనితమని గ్రహించాలి. పరమాద్భుతమైన సాధనోపకరణమైన ఈ ప్రపంచంలో మమతానురాగాల మాయాతెరలు, జిహ్వ చాపల్యాలు, అందమైన సర్పాల్లా ఆకర్షించే ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటివైపూ మనసును నడిపించేది వ్యామోహమే. దానికి బద్ధులం కాకుండా చూసుకోగలిగితే మోక్షసాధన మార్గంలో అనేక బంధాలు తొలగిపోయినట్టే. అందుకే వ్యామోహాన్ని తొలగించుకుని.. మంచికి యజమానులం అవుదాం. అంతే తప్ప చెడుకు బానిసలం కావద్దు.
,............................
*సుగుణ భూషణం*
భౌతిక సంపదలకన్నా సుగుణ సంపద గొప్పది. ధన ధాన్య రాశులు ఎన్ని ఉన్నా పాప భీతి నశించిన భోగానుభవం ప్రమాదకరం. రావణాసురుడు స్వర్ణ లంకను పరిపాలించాడు. కుబేరుణ్ని జయించి అంతులేని సంపదలు సమకూర్చుకున్నాడు. వేదాల్లో పాండిత్యం సంపాదించాడు. శాస్త్రజ్ఞానాన్ని ఎరుకపరచుకొని పంచభూతాలను తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలిగి రావణ సంహిత రచించాడు. గొప్ప శివ భక్తుడు. అయినా... ఒకే ఒక తప్పు... సీతాపహరణకు పాల్పడి- మానవుడి చేతిలో మరణించాడు. సౌశీల్యం లోపించిన పుస్తక జ్ఞానం, మానవత్వాన్ని మరచిన శాస్త్ర విజ్ఞానం, సిద్ధాంతాలను విస్మరించిన పాలన మూలాన- సుగుణాల కారణంగా లభించే ఘన కీర్తిని ఎవరూ ఆస్వాదించలేరు. వినమ్రతను మించిన తపః సాధన లేదంటారు. సద్గుణాల కారణంగా లభించిన గౌరవానికి మించిన ఉత్కృష్టత లేదు. దయను మించిన సుగుణం ఉండదు.
మనకు శారీరక బలం ఉన్నప్పుడు ఎదుటివాడిని ఓడించడం సులువే. కానీ అతణ్ని గెలవడమే కష్టం. సుగుణశీలురు ఎన్నడూ ఇతరులను, శత్రువునైనా సరే- అణగదొక్కాలని అనుకోరు. పైకి తేవాలనే ప్రయత్నిస్తారు. వసిష్ఠుడు విశ్వామిత్రుణ్ని బ్రహ్మర్షిని చేశాడు. మొదట్లో తనతో యుద్ధం చేసిన విశ్వామిత్రుడి వెంట యాగ రక్షణ కోసం రామ లక్ష్మణులను పంపడంలో వసిష్ఠుడు కీలకపాత్ర వహించాడు. సుగుణాలు గలవారికి అసూయా ద్వేషాలు ఉండవు. గుణవంతుల్లో ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం. లోకంలో ఇదే అత్యుత్తమ సన్మార్గం. గుణ హీనులు పక్కదోవ పట్టిస్తారు. సుగుణాల్లో అద్భుత దైవత్వం ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ దైవత్వాన్ని వెతికి పట్టుకోవాలి. అందుకోసం గుణవంతులతో స్నేహం చేయాలి. విభజించి పాలించడం ఒక పరిపాలనా సూత్రం అయితే కావచ్చు.... కానీ అది గుణహీనుల సూత్రం. సద్గుణాలు గలవాడు ఒక్కడే అయినా నలుగురితో కలిసిమెలసి ముందుకు నడిపిస్తాడు. గాంధీజీ చేసింది ఇదే. అందుకే ఆ సుగుణం అంత మంచి ఫలితాలను ఇచ్చింది. జాతి భవితనే మార్చింది. మంచి నడత, క్షమ, ధైర్యం, కృతజ్ఞత అనేవి సుగుణ రాశులు. ఇందులో కృతజ్ఞత విచిత్రమైంది. కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం... రెండూ పొరపాటే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. కానీ ఇంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత. మనం చేసేది సహాయం కాదు, సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది.
సుగుణాలను సాధన చేయాలి. సుగుణ భూషణుడనిపించుకునేందుకు తహతహలాడాలి. దుర్గుణాలు మనిషిని నీచస్థితికి దిగజారుస్తాయి. కామం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషంలాంటి భయానక స్థితి మరొకటి లేదు. మూర్ఖత్వం లాంటి బంధం ఇంకొకటి లేదు. దురాశ లోతు తెలియని వరద లాంటిది. అందుకే వీటికి దూరంగా ఉంటూ సుగుణాలన్నింటినీ పట్టుదలతో సాధన చేయాలి. కోపం, అసహనం... మన పైనే మనం ప్రయోగించుకోవాలని బుద్ధుడు చెబుతాడు. ఎందుకంటే అవి గొప్ప సుగుణాలే అవుతాయి. సుగుణభూషణుడు తాను పొందిన కష్టాలను నీటిపై రాసుకోవాలి. తాను పొందిన కరుణను రాయిపై రాసుకొంటాడు. దైవం మనకు ప్రసాదించిన వాటిపట్ల మనం కృతజ్ఞత చూపితే దైవం మనకు మరింతగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే సుగుణభూషణుల పట్ల అంతర్యామి సదా అనురాగ హృదయుడై ఉంటాడు!
ఈనాడు అంతర్యామి
- అప్పరుసు రమాకాంతరావు
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.
ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావ్. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీ కృష్ణుడు అంతరార్థం. -
om
ReplyDelete