ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను నేను 2012 నుండి కధలు కవితలు అనేకమైన విశ్లేషకులు వాట్సాప్ వచ్చాక గౄపులు ద్వారా అంతర్జాల ము ద్వారా సేకరించినవి ఇందు పొందు పరుస్తున్నాను. ఇది ఉచితం ఆన్లైను అంతర్జాల పత్రిక ఇది "ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం " మాత్రమే

న న న న న న న న గ 25 /14 .... (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కవత కధల కరుణ మనుసు
సకల సమత సరళ సుమధురన్
వినయ విపుల వివరణమును
కవి కలము కదలిక కరుణయున్
తరుణి కిరణముల తలపులు
పతి హృదయము సరసత మెరయున్
విరిసిన కమల కనుగవ వలపు
నలుపు దొర విదిత విరిసెన్
కరకమలములను గదలవలి
కినుకు లయ మురళి మధురమున్
సరసత బలుకుచు నమృతమును
సలిపెడి చెలువపు వలపులన్
అణువణువు అణకువ పదిలముగ
సహనపు పలుకులు సమమున్
చిరునగవు చరిత కధలు తలచి
మది పలకల హొయలు కలుగున్
మద యువతుల రతి కలహపు
సుమ లయల హొయల మది విరిసెన్
మదముల జయమును కను గొనిన
మురహరుడు చిరునగ వెపుడున్
వదన సుమ దళముల పిలుపు
నవ తలపుల మలుపులు మదిలోన్
హృదయము సతతము కరుణయు
సహనము తెలుపు తరుణమగున్
కుసుమ శర శరసమరముల
మకుటములు చలి గిలియు యనుచున్
బిస రహ నయనముల పడచుల
బిడియ కులుకుల చిరునగవుల్
మిసిమిగల చనుల ఎరుపులు
అమితముగ కదలిక పిలుపులన్
పస యురమున గలుగుదొరను
ఉపకరములు వయసు బిగువుకున్
--(())--
·
[28/01, 6:32 am] హనుమంతరావు: అమ్మవారి కరుణా వీక్షణం🙏
అమ్మవారి చూపు ఎనిమిది విధాలని ఆచార్య శంకరులు సౌందర్యలహరిలో ప్రతిపాదించారు..
1, విశాలా దృష్టి అంతర్వికాసరూపమైనచూపు.
2,కల్యాణీదృష్టి. చిరునవ్వుతో కూడిమంగళకరమైనచూపు
3, అయోధ్యాదృష్టి, విచ్చుకున్నకన్నలతో మొలక నవ్వుతో నల్లనికనుగ్రుడ్డుతోకూడి నలువకలవలమించు సొగసుకలచూపు.
4,ధారాదృష్టిః అలసభావంతో మందమైన చూపు.
5,మధురాదృష్టి ,చెప్పనలవిగాని మధురమైన చూపు.
6,భోగవతీదృష్టిః ,పరిపూర్ణమైనవైశాల్యంగలిగి స్నేహపాత్రమైనచూపు.
7,అవంతీ దృష్టి ,ఆశ్రితలనుకాపాడే ముగ్ధమనోహరమైన చూపు.
8,విజయాదృష్టి కొనకంటినతాకిననల్లగ్రుడ్డుకల (ఆకేకరకనీనిక)విజయమునుచేకూర్చు చూపు.
విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాఽఽధారా కిమపి మధురాఽఽభోగవతికా.
అవన్తీదృష్టిస్తే బహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే..
అమ్మా నీచూపు అంతర్వికాసమై జనులను కదలించినదేశం విశాలానగరం.
అమ్మ చిరునవ్వుతో శుభాలుకలిగించనదేశం కల్యాణీనగరం
స్పష్టమైన చిరునవ్వుల మొలకలన్నట్ల నల్లకలవలను మించిన సొగసుతో జనులను ఉత్సాహపరచిన దేశం అయోధ్య.
దయాధారతో అలసముగ్ధమనోహరమైన చూపుతో జనులను పాలించిన ప్రాంతం ధారానగరం .
చెప్పనలవికాని మనోఙ్ఞమైన చూపూపుతో జనులన ఆదరించిననగరం మధురానగరి.
పరిపూర్ణవైశాల్యంతో నొప్పుచూపుతో జనులను మెప్పించినచోటు భోగవతీనగరం.
ఆశ్రితభక్తజనలను కాపాడిన నగరం అవంతి .
కొనగంటిచూపుతో శత్రసంహారంచేసి విజయం సాధించిన దేశం విజయనగరం.
ఇట్లు అష్టమూర్తి పత్ని అష్టవిధచూపులతో కష్టములను దూరంచేసి అనంతసుఖాన్నిచ్చు గాక..
🌸🌸🌸 శ్రీ మాత్రేనమః.🌸🌸🌸
హనుమంతరావు: శుభోదయః.
వందే సంస్కృత మాతరం
वन्दे संस्कृतमातरम्।।
నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!*
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు-
ప్రాణాయామం.*
మనసుకు- ద్యానము.*
శరీరానికి- యోగా.*
గుండెకు- నడక.*
ప్రేగులకు- మంచి*
*ఆహారం.*
ఆత్మకు- మంచి*
**ఆలోచనలు.*
ఎల్లప్పడూ ఆరోగ్యంగా, మానసిక ఆనందం తో
*భవ బంధాలు*
తల్లి-తండ్రి, భార్య-భర్త, పిల్లలు-మనవలు అనే బంధాలే మనిషిని బతికిస్తాయి. బతకాలనే ఆశను చిగురింపజేస్తాయి. బంధాలే లేకుంటే మనిషి జీవచ్ఛవమే.
పుడుతూనే తల్లితో పేగుబంధం, పెరుగుతూ తండ్రితో ప్రేమానుబంధం, విద్య నేరుస్తూ గురువులతో అనుబంధం, స్నేహితులతో స్నేహబంధం, వివాహం కాగానే భార్యాభర్తల బంధం, పిల్లలతో మమకారబంధం, తాత కాగానే మనవలతో ఆత్మీయబంధం- ఇలా ఏ వయసుకా అనుబంధంతో మనిషి ప్రేరణ పొందుతాడు. కుటుంబం కోసమే బతుకుతూ ప్రేమానురాగాలు పంచుతాడు.
రావణుడు సీతను అపహరించుకుపోయాడు. మృగాన్ని సంహరించి ఆశ్రమానికి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవి కనిపించక శోకతప్త హృదయుడై అటూ ఇటూ పరుగెత్తుతూ కనపడిన ప్రతి జంతువును, నదులను, పర్వతాలను సీత జాడ తెలుపమని కోరతాడు. కిష్కింధకాండలో చైత్రమాసంలో ప్రకృతి శోభను పరికిస్తూ దుఃఖసముద్రంలో మునిగిపోతాడు. తనకు, సీతాదేవికి రెండు మనసులు లేవని, తన మనసు సీతాదేవి దగ్గరుంటే ఆమె మనసు తన దగ్గరుంటుందని, భార్యాభర్తలిద్దరిదీ ఒకే మనసని ఆ ఒక్క మనసు ఆనందించాలంటే భార్యాభర్తలు పక్కపక్కనే ఉండాలని అలా లేకపోవడంవల్ల తాను వసంతశోభను ఆస్వాదించలేకపోతున్నానని లక్ష్మణుడివద్ద వాపోతాడు. భార్యా భర్తల బంధానికి నిర్వచనం సీతారాముల దాంపత్యం.
సంతానం ఎదుగుతూ విజయాలు సాధిస్తూంటే తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. సంతానం తమకంటే ఉన్నత స్థితిలో వెలుగొందాలనిrc తల్లిదండ్రులు అభిలషిస్తారు. సంతానం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనకాడరు.
గురుశిష్య బంధం పవిత్రమైనది. ద్రోణుడు, అర్జునుల అనుబంధం అందరికీ తెలిసిందే. స్నేహితుల మధ్య బంధానికి ప్రతీతి కుచేలోపాఖ్యానం.
కాలం గడుస్తూంటే కొన్ని బంధాలు తెగిపోతాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు-పెదనాన్నలు, గురువులు, పెద్దలు... కాలగర్భంలో కలిసిపోతూ దుఃఖాన్ని మిగులుస్తారు. ఒక బంధం తెగిపోతుంటే మరో బంధం ఏర్పడుతూ ఉంటుంది. కొడుకులు, కూతుళ్లు, మనవలు మనవరాళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు... అనురాగం కురిపిస్తూ గతించినవారిని మరిపిస్తూంటారు. ఈ చక్రబంధంలో తిరగడమే జీవితం.
జీవితం క్షణ భంగురమని తెలిసీ, బంధాలకు అతీతంగా బతకడం సామాన్య మానవుడికి అసాధ్యం. చివరి క్షణంలో కూడా తాను పోతే కుటుంబసభ్యుల గతేమిటని మనిషి చింతిస్తాడు. ఈ మమకారమే కుటుంబ వ్యవస్థకు పునాది.
భవబంధాలకు తోడు మనిషి జీవితాంతం భగవంతుడితో శాశ్వత బంధం ఏర్పరచుకుంటాడు. చుట్టూ కనిపిస్తున్న బంధుమిత్రులను ప్రేమిస్తూనే కనపడని పరమాత్మను ఆరాధిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి మొక్కుతాడు. మనసులోని వేదనను ఆలయంలో దైవానికి నివేదిస్తాడు. రక్షించమని వేడుకుంటాడు. కాపాడమని ప్రార్థిస్తాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట తలచుకొనేది భగవంతుడినే. ఆ కారుణ్యమూర్తి కరుణిస్తేనే సుఖశాంతులని గ్రహిస్తాడు. కుటుంబసభ్యులను ఆదరిస్తూనే భగవంతుణ్ని నమ్ముకున్నవారి జీవితం ఆనందదాయకమే.
కాలచక్రం ఎవరికోసం ఆగదు... పరుగెత్తుతూనే ఉంటుంది. తరాలు మారతాయి- అంతే. మనిషి మనిషిగా మనుగడ సాగించినంతకాలం బంధాలు అనుబంధాలు పెనవేసుకుంటాయి.
- ఇంద్రగంటి నరసింహమూర్తి
[28/01, 6:32 am] హనుమంతరావు: 🥀 *నిద్రపట్టనివ్వని దుర్గుణాలు* 🥀
🕉️⚜️🌞🌎🔱🚩
అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం,
హృతస్వం కామినం, చోర మావిశన్తి రజాగరాః
పాండవుల వద్ద రాయబారానికి వెళ్లి వచ్చిన సంజయుడు.. ధృతరాష్ట్రునితో,
తానప్పటికి అలసిపోయానని,
తెల్లవారి సభలో అన్ని విషయాలూ చెబుతానని చెప్పి వెళ్లిపోయాడు.
దీంతో ఆ రాత్రి ధృతరాష్ట్రునికి నిద్దుర పట్టలేదు.
తాను రాజ్యభాగం ఇవ్వడు, అయినా పాండవులు యుద్ధం చేయకూడదు..
ఇదీ సంజయునితో పాండవులకు ధృతరాష్ట్రుడు పంపిన రాయబార సారాంశం.
దానికి వారి స్పందనలను బట్టి మహా సంగ్రామ నిర్ణయం జరగాలి.
కానీ, వెళ్లొచ్చిన సంజయుడు ఏ విషయం చెప్పకపోవడంతో ధృతరాష్ట్రుని మనస్సు చాలా అలజడిగా ఉంది.
ఆ మనో వేదన తీరాలంటే తన మనసెరిగి సేదతీర్చగలిగిన వారు ఇద్దరే ఇద్దరు..
ఒకరు సంజయుడు,
మరొకరు విదురుడు.
సంజయుడు అలసిపోయానని వెళ్లిపోవడంతో..
విదురుని పిలిపించాడు ధృతరాష్ట్రుడు.
‘‘విదురా..
పాండవుల వద్దకు దూతగా వెళ్లిన సంజయుడు ఇప్పుడే వచ్చి నన్ను తిట్టి, రెండు మూడు మాటలు చెప్పి,
రేపు సభలో సవిస్తరంగా చెపుతానని వెళ్లాడు.
అక్కడి విషయాలు తెలియక శరీరం నిప్పుల కొలిమిలో పొరలినట్లుగా ఉన్నది. నిద్ర రావట్లేదు.
నా మనసు ప్రశాంతతను పొందే మాటలు చెప్పు’’ అని అడిగాడు.
నిజానికి ధృతరాష్ట్రుడు తెలుసుకోవాలనుకుంటున్నది పాండవుల బలాబలాలను గురించి, వారి వ్యూహప్రతివ్యూహాల గురించి, తమ సైన్య సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే విధానాల గురించే తప్ప..
ఏవో మంచి విషయాలు తెలుసుకునే భావన అతడికి ఏ కోశానా లేదు.
అయితే..
ధృతరాష్ట్రుడు ఏ విధంగా అడిగినా విదురుడు మాత్రం నిర్మొహమాటంగా సత్యమే చెప్పాడు.
ఆ సత్యాలే తదుపరి కాలంలో విదురనీతిగా సర్వకాలీనాలై నిలిచాయి.
ఆ రోజు విదురుడు చెప్పిందే పై శ్లోకం. వ్యాసుడి సంస్కృత శ్లోకాన్ని తిక్కన అద్భుతంగా తెనిగించారిలా..
బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము కోలువడిన యతడు, మ్రుచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్ర లేక కుందుదు రధిపా!
బలం కలిగిన వాడు దండయాత్రకు వచ్చిన వేళ బలం చాలని వాడు, కారణమేదయినా తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయిన వాడు,
పరుల సొమ్మును దొంగతనం చేయాలని సమయం కోసం కాచుకు కూర్చున్న వానికి,
కామభావనలతో మత్తుడైన వానికి నిద్రపట్టదని దీని అర్థం.
‘‘ఈ విధానంలో నీకు నిద్ర పట్టని కారణం ఏమిటో చెప్పు’’ అని అడుగుతాడు విదురుడు.
దానికి ధృతరాష్ట్రుడు.. ‘‘సంజయుడు పాండవుల మనస్సును ఆవిష్కరించకుండానే వెళ్లాడు.
పాండవ నిర్ణయంపై లగ్నమైన నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది’’ అని చెబుతాడు.
ఇతరుల సొమ్ముకు ఆశపడినందునే ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టట్లేదని తెలిపే ఘట్టమిది.
యుగాలు మారినా నేటికీ వర్తించే నిత్యసత్యాలివి.
--(())--
మీ అందరి చిరునవ్వులతో శుభోదయం
👌ఎంత విద్యావంతుడు అయినా.. వినయం లేకపోతే ఆ "విద్య" వ్యర్ధమే. రూపం ఎంత బావున్నా, "గుణం" మంచిది కాకపోతే అనవసరమే. అలాగే.. సదుపయోగం లేని ధనం ఎంతఉన్నా, శౌర్యంలేనప్పుడు ఆయుధాలు ఎన్ని కలిగివున్నా, ఆకలి లేకుండా భోజనం చెయ్యాలన్నా, పరోపకారం చెయ్యని జీవితం సాగించినా కూడా వ్యర్ధమే.
🦜🙏🦜❤️👌దీపం మీద కోపం వచ్చి ఆర్పేస్తే.. చీకటి మిగిలేది మనకే. ఆకలి మీద కోపం వచ్చి తిండి మానేస్తే.. కడుపు కాలేది కూడా మనకే. అలాగే ఇష్టమైన వారిమీద కోపం వచ్చి దూరంగా ఉంటే.. ఒంటరి అయ్యేది కూడా మనమే. అందుకే క్షణికమైన ఆవేశం, కోపాన్ని తగ్గించుకుందాం. ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదాం.
--(())--
మంగల్ పాండేను ఉరితీశారు.
టాంటియా తోపేను ఉరితీశారు.
రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది.
భగత్ సింగ్ ఉరితీశారు.
ఉరితీసిన సుఖ్దేవ్ మాస్టర్ వేలాడదీయ బడ్డాడు.
బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ ఎన్కౌంటర్.
సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు.
భగవతి చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం.
రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీశారు.
అష్ఫకుల్లా ఖాన్ ను ఉరితీశారు.
రోషన్ సింగ్ ను ఉరితీశారు.
లాలా లాజ్పత్ రాయ్ లాతిచార్జ్లో మరణించారు.
కాలా పానీకి వీర్ సావర్కర్ కు శిక్ష .
చాఫేకర్ బంధు (3 సోదరులు) ఉరితీశారు.
మాస్టర్ సూర్య సేన్ ని ఉరితీశారు.
ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన కొద్దిమంది పేర్లు మాత్రమే ఇవి.
చాలా వేల మంది హీరోలు ఉన్నారు, మనకు వారి పేర్లు కూడా తెలియదు.
ఈ రోజు వరకు ఒక విషయం అర్థం కాలేదు. గాంధీ మరియు నెహ్రూలకు దేవుడు ఎలాంటి కవచ కుండాలాలు ఇచ్చాడు.
ఈ కారణంగా బ్రిటిష్ వారు వారిద్దరినీ ఉరితీయడం అటుంచి, ఒక లాఠీ కూడా కొట్ట లేదు ...
అన్నింటికంటే మించి, ఇద్దరూ భారతదేశానికి చెందిన బాపు మరియు చాచా అయ్యారు.
మరియు వారి తరాలు ఇప్పటికీ దేశం మొత్తం మీద తమ పెంటెంట్ను అను భవిస్తున్నాయి.
* లోతుగా ఆలోచించండి *
ఈ సందేశాన్ని నాకు పంపిన వారికి ధన్యవాదాలు.
దయచేసి దీన్ని మీరు కూడా ఫార్వార్డ్ చేయండి.
సైనికులపై రాళ్ళు - అహింసా ఉద్యమం
ప్రొసీడింగ్స్ ఆన్ లవ్ జిహాద్ - పోకిరితనం
రాళ్ళు రువ్వారు - తిరుగుతున్న యువత
భారత్ ను ముక్కలు చేస్తాం - భావ ప్రకటనా స్వేచ్ఛ
భన్సాలీ చెంపదెబ్బ - హిందూ ఉగ్రవాదం
గొడ్డు మాంసం తినడం - ఆహార హక్కు
ఈద్ మీద మేక కోత - మత స్వేచ్ఛ
ట్రిపుల్ తలాక్ హలాలా - మతపరమైన అంతర్గత పదార్థం
దీపావళి బాణసంచా - పర్యావరణ కాలుష్యం
నూతన సంవత్సర పటాకులు - వాతావరణాన్ని జరుపుకోవడం.
క్రిష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పిల్లలు -
రాజ్యాంగ విరుద్ధం
అమాయక పిల్లల సున్తీ - మతపరమైన అంతర్గత విషయం
వేదికపై నమాజ్ - మతపరమైన హక్కులు
రోడ్ పండల్ - రోడ్ జామ్ కేసు
మసీదు లౌడ్ స్పీకర్ - మత స్వేచ్ఛ
ఆలయంలో లౌడ్ స్పీకర్ - శబ్ద కాలుష్యం
కార్వాచౌత్ - ధకోసల
ప్రేమికుల రోజు - ప్రేమ ఉత్సవం
నాలుగు వివాహాలు - మత స్వేచ్ఛ
హిందూ రెండు వివాహం - కేసు నమోదు
గణేష్ నిమజ్జనం, హోలీ - నీటి కాలుష్యం
తాజియా ఇమ్మర్షన్ - రాజ్యాంగ హక్కులు
అజామ్, ఒవైసీ, కేజ్రీ - నేషన్ మెన్
మోడీ, యోగి, స్వామి- హిందూ ఉగ్రవాదులు
భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు - ఉగ్రవాదులు
అఫ్జల్, కసాబ్, బుర్హాన్-షాహీద్
15 నిమిషాల పోలీసు తరలింపు-సహనం
ఈ ఎన్నికల్లో బిజెపి గెలిచింది - అసహనం
కాశ్మీర్, అస్సాం కేరళ అల్లర్లు - దేశం నిశ్శబ్దంగా ఉంది
అఖ్లాక్, గుజరాత్ అల్లర్లు - అవార్డు వాపసీ, అసహనం కలిగిన దేశం
శివలింగంపై పాలు - పాలు వ్యర్థం
మేకలు కోయుట, రక్తపు టేరలు - మత విశ్వాసాలు
రాముని ఆలయం - గుండరాజ్
బాబ్రీ మసీదు - దేశంలో శాంతి
తాజ్ మహల్ - ప్రేమకు సంకేతం
రామ్ సేతు- ఊహాత్మకమైనది, రాముడు లేడు
ఉగ్రవాదుల ఉరిశిక్షపై - రాత్రి సమయంలో, కోర్టులు తెరుచుకుంటాయి, క్షమ పిటిషన్లు దాఖలు చేయబడతాయి, భారత వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతాయి.
ఒక కులభూషణుని ఉరి - అందరూ మౌనంగా ఉన్నారు.
భారతదేశంలో హిందువులపై దారుణం - ఏ గొంతు పెగలదు ... అందరూ నిశ్శబ్దంగా మారతారు. చచ్చిన పాముల్లా ఉండిపోతారు.
హిందువుల ప్రతిచర్య - కాషాయ ఉగ్రవాదులు. దేశంలో అసహనం యొక్క వాతావరణం, వంచన వంటి అవార్డులు.
దేవతలను అవమానించడం - వ్యక్తీకరణ యొక్క స్వేచ్ఛ
మహ్మద్ గురించి వివరణ - దేశంలో అరాచకత్వం.
ఇది భారతదేశం యొక్క నిజం
ఈ దేశంలో ఏమి జరుగుతోంది?
సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి?
ఇది ఏమిటో అందరూ ఆలోచించాలి?
ఓహో కాంగ్రేస్ మీరు ఈ దేశానికి ఏ గతి పట్టించారు .
లేవండి సోదరులారా లేవండి.
ఈ సమాచారం భారత దేశం అంతా చదివితేనే దేశం ముందుకెలుతుంది.......!
నా దేశం, మొట్టమొదట ప్రాధాన్యత.......!
ప్రతి ఒక్కరూ ఈ పద బంధాన్ని ఎప్పుడు పునరావృతం చేసు కోవాలి,
అప్పుడే నా దేశం మారగలదు!
భారత్ మాతా కీ జై!!
జై హింద్!!!
÷÷÷÷÷÷÷×××××××÷÷÷÷÷÷
[28/01, 9:38 am] +91 79936 83723: *_ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :_*
*Vivekananda :* 👌🏿 నిశ్శబ్దముగా వుండు
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.
*Shakespeare :* 👌🏿 ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక
కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.
*Napoleon :* 👌🏿 ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం
*Einstein :* 👌🏿 నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను
ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను
*Abraham Lincoln :* 👌🏿 నీలో స్నేహ గుణం అన్నది
నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం
*Chralie Chaplin :* 👌🏿 నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే
ఆ విధంగా తారసపడతారు
*William Arthur :* 👌🏿 అవకాశాలు సూర్యకిరణాలు వంటివి
అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు
*Hitler :* 👌🏿 నువ్వు వెలుగులో వున్నంత కాలం
నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు
*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయవద్దు *చిత్తశుద్ధి* *ఓర్పు* *పట్టుదల* ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా లాభం లేదు. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
శుభోదయం 🙏
No comments:
Post a Comment