madhurimalu
పరుల పై నింద పాపం
తలచుతే మహాపాపం
కరుణ పై విశ్వ వేదం
ఆచరణ లేక సూన్యం
కథల పై కొత్త బంధం
కాగితాలకె పరిమితం
కళల పై నిత్య వైనం
మనసు యందు నైవైద్యం
తగదు ఎన్నటికి కోపం
కోపం తొ పెరుగు తాపం
వినుము ఎప్పటికి గానం
గళం మనసు ఉల్లాసం
కనుము ఇప్పటికి చిత్రం
చిత్రాల్లోను విచిత్రం
మనసు మౌనముతొ జీవం
లేక గాంధర్వ రాగం
జీవితాని కది శాపం
మనసు చేఇంచు పాపం
కాలమాయయిది శాపం
ధైర్యముయే పోతె నిజం
మేరుపర్వతపు మార్గం
సందేహాల తో సమయం
దారి చూపునది శాంతం
శాంతమె ఙివిత సౌఖ్యం
తెలియ కుండుటే లోపం
తెలిసినా కాని వైపం
నమ్మకమ్ముగాను మనం
మనసు తెలిపే జీవితం
మనసు వెంబడె మధనం
పలుకు పల్కులొ మైధునం
మనసు మౌనమే విజయం
విజయంతోను అపజయం
--(())--
"సీ.
----
కోనేఁటిరాయఁడ ! కోటిదండాలయ్య
కోరిచేరుదుమయ్య కూర్మితోడ
శతకోటిమన్మథ ! సత్యనిత్యసురూప !
లోకాలనేలెఁడు లోకధారి !
మాయేడుగడనీవె మాయిలవేలుప !
మధురమోహనహాస ! మమ్ముఁబ్రోవు
దేవేరులిరువురి దివ్యమనోహర !
వేడుదునిన్నెప్డు విభవములను
గీ.
--
సప్తశైలలసద్ధామ ! సరసిజాక్ష !
లావునొక్కింతలేదయ..రాగహృదయ ..
రక్షనుండుమనిశముగ రాక్షసారి..
వేనవేలనమస్సులు వేడ్కనిడుదు !!! "
-----------
సమ్మోహనాలు .....శ్రీ నేతాజీ వాక్కులు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
అనుబంధాలనేవి
అణువు స్థిర మైనవి
స్థిరమైన ప్రఖ్యాతులు కలిగు ఈశ్వరా
జీవితంలో కళలు
కళలు అనుబంధాలు
అనుబంధం ఆత్మీయత గాను ఈశ్వరా
ప్రొత్సాహ ప్రశంస
ప్రశంసే అభ్యాస
అభ్యాసం ఎప్పుడు అవసరం ఈశ్వరా
సంకల్ప దీక్షలే
దీక్ష ఉద్య మములే
ఉద్యమం నిజాన్ని బతికించుట ఈశ్వరా
గమ్య సోపానాలు
సోపాన పు అడుగులు
అడుగులు ఎన్నో కష్టాలు లే ఈశ్వరా
నిస్వార్ధ జీవితం
జీవితం ప్రశాతం
ప్రశాంత మనసు ఎప్పుడూ జయం ఈశ్వరా
ఒక ఉద్యమ కెరటం
కెరటమే నిర్ణయం
నిర్ణయం గమ్యమే సక్రమం ఈశ్వరా
ఆవేశం అగ్నీ
అగ్ని ప్రచండాగ్నీ
అగ్నీ కుటుంబాన్నీ దహించు ఈశ్వరా
సద్గోష్ఠి సిరిపెంచు
పెంచు కీర్తిని పెంచు
పెంచి సంతుష్ఠితో బత్కేను ఈశ్వరా
విజ్ఞతను గలిగుండి
గలుగు జ్ఞానం వుండి
జ్ఞానం తో అజ్ఞానం పోవు ఈశ్వరా
sekrana 🙏 తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు 🙏
తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది.
ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు.
శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 2 మే1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు.
రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.
స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పని చేసిన థామస్ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం సమర్పించడం విశేషం.
అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్కు చెందిన సయ్యద్మీరా సమర్పించారు.
వేంకటేశ్వర హెచరీస్ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది.
తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది. స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి.
ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి.
ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి.
2009వ సంవత్సరం లో గాలి జనార్ధన రెడ్డి 42 కోట్లు విలువ చేసే వజ్రాల కీరీటాన్ని శ్రీవారికి సమర్పించాడు.
🙏 జ
య-విజయులు ఎవరు? 🙏
జయ-విజయులు, శ్రీ మహావిష్ణువు వైకుంఠధామంలో మందిరానికి కావలివారు. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులు ఐదేండ్ల బాలికలైన సనక, సునంద, సనత్క్ మార, సనత్సుజాతులు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠం వచ్చారు.
ద్వారపాలకులైన జయవిజయలు వారిని లోపలి పంపడానికి నిరాకరించారు. బ్రహ్మజ్ఞానులైన తమను లోనికి వెళ్ళడానికి అడ్డగించడం సరికాదని చెప్పారు. అయినా జయవిజయులు వినలేదు. మునులు వారిని భూలోకంలో రాక్షసులై జన్మించమని శపించారు.
విషయం తెలుసుకున్న శ్రీహరి సనకాదులను సాదరంగా లోనికి తీసుకువెళ్ళారు. తరువాత ద్వారపాలకులైన జయవిజయులు మహావిష్ణువుకు నమస్కరించి నిలబడ్డారు.
అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు.
అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారు వారే మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రెండో జన్మలో రావణ, కుంభకర్ణులు, మూడో జన్మలో శిశుపాల, దంతవక్త్రలుగా జన్మించారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది.
కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.
****
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 71 🕉
సులభుల్మూర్ఖులనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ నన్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ
*జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ
శ్రీ కాళహస్తీశ్వరా!*
*తాత్పర్యం:*
శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు.
అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను.
విశిష్ట లక్షణములతో దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు.
నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికొండను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా భావించి ఆనందింతును.
🕉️ ఓం నమః శివాయ 🕉️
చరిత్రలో ఈ రోజు :
జనవరి 22:
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైఃః
1666 : మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం (జ.1592).
1882 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం.
(మరణం:1962).
1885 : ఆంధ్ర పితామహ గా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు జననం.
(మ.1970).(చిత్రంలో)
1900 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్త, సంగీత కారుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ మరణం (జ.1831).
మ:1901 :
అరవైమూడేళ్లపాటు యునైటెడ్ కింగ్డమ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన విక్టోరియా మహారాణి మరణం (జ.1819).
1940 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ
పితామహుడు గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
1965 : మానవతావాది మలిశెట్టి వెంకటరమణ జననం.
1972: స్వామి రామానంద తీర్థ మరణం (జ.1903).
2014 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (జ.1923).
సేకరణ :
--
కుమ్భినీ పాలుని కధ
శ్రీ రామ చంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగం లో ధర్మారణ్యం అంటే ఈ నాటి కర్నాటక లో రాక్షసుల చేత ధ్వంసం చెయ్య బడ్డ గ్రామాలను రాముడు పునర్నిర్మించి వాస యోగ్యం చేయించాడు . ఆ గ్రామాలకు ”మండల నగరం ”అనే దాన్ని ప్రధాన కేంద్రం గా చేశాడు . అక్కడ వేద వేద్యులు సత్కర్మా చారణులు పండితులు జ్ఞాన నిష్టులు అనేక మంది ఉండే వారు దానికి ధర్మ కర్త గా
ఆంజనేయుడిని నియమించాడు . శ్రీ రాముని తరఫున హనుమ వారిని చక్క గా కాపాడుతున్నాడు . ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు . కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు . గొప్ప ధర్మ వ్యవస్థనేర్పరచి , దాని దిన దినాభి వృద్ధి కి కృషి చేశాడు . కలి కాలం ప్రవేశించగానే , దాని పరిపాలనాన్ని అక్కడి వారి కే వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీ రాముని ధ్యానం చేస్తూ గడుపు తున్నాడు .
కలియుగం లో ”కన్యా కుబ్జం ”అనే పట్టణాన్ని రాజధాని గా చేసుకొని , ”ఆమందుడు ” అనే రాజు పాలిస్తున్నాడు . అతనికి ”మాయ”అనే భార్య ఉంది . వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది . ఆమెను అల్లారు ముద్దు గా పెంచుతూ , సర్వ విద్యా విశారదను చేశారు . ఆమె కు పెండ్లీడు వచ్చింది . వరాన్వేషణ చేస్తున్నారు . వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”. ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు . ఒక రాజు ఆయనతో ”మహాత్మా ! కలి ప్రవేశించింది . కల్మషం అంతటా వ్యాపించి పోయింది అన్నాడు . రాజు కలి కల్మషమంటే ఏమిటి ? అని అడిగాడు . ఆయన దానికి అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి ”కలి కాలం లో అబద్ధం చెప్పే వారు , వేదాన్ని దూషించే వారు , హింసను పెంచే వారు , ధర్మాన్ని వదిలేసి అర్ధ , కామాలను మాత్రమే ఆశ్రయించేవారు ఎక్కువై పోతారు . విశ్వాస హీనులు , కామ పరాయణులు , దైవ చింతన లేని వారు , డామ్బికులు , వేష ధారులు , పాషాండులు , ప్రజావంచకులు , అసూయా పరులు , మూర్ఖులు పెరిగిపోతారు . వీటి వల్ల ఆ అధర్మాలన్ని రాజుకు సంక్రమిస్తాయి . మీరు ధర్మ పరులు కనుక భారాన్ని దేవుడి మీద వేయండి . మన చిరంజీవి కి మంచి వరుని తో త్వరలోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు .
కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే కుమ్భినీ పాలుడు అనే రాజుకు రత్న గంగ నిచ్చి వివాహం చేశాడు . కుమ్భినీ పాలుడు , భార్య తో కలిసి ధర్మారణ్యానికి వెళ్లి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు . కుమ్భినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు . అప్పటి దాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మా చరణకు యజ్ఞ యాగాలకు ఇవ్వబడిన అగ్రహారాలనన్నింటిని లాగేసుకొన్నాడు . జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు . వాళ్ళు యజ్ఞ యాగాలు చేసే వారిని హింసించి శిక్షించే వారు . జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కు తోచలేదు . దుష్టులకు రాజ బలం తోడైంది . ఇక భరించ లేక అందరు కలిసి కన్యా కుబ్జ రాజు అయిన ఆమందుడు కి తమ గోడు విన్న వించుకొన్నారు . తాము అతి ప్రాచీనకాలం నుండి అక్కడ ఉంటున్నామని , త్రేతాయుగం లో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు మరి కొన్ని అగ్రహారాలను తమకు ఇచ్చాడని , తమ అల్లుడు కుమ్భినీ పాలుడు దుర్మార్గం గా వాటిని లాగేసుకొని , హింసిస్తున్నాడని దేవతారాధన, యజ్ఞయాగాదులను నిషేధించాడని పూర్వ జీవితం కొన సాగించటం దుర్భరం గా ఉందని , మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు , తమ వృత్తులను కొనసాగించుకోవటానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించారు .
రాజు వారంతా చెప్పింది సావధానం గా ఆలకించాడు . అల్లుడు కుంభీ పాలుడికి కబురు చేసి లాక్కున్న భూములనన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని వేద విద్య కు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజ పత్రం ఇచ్చి వారిని పంపాడు . వారందరూ కుమ్భినీ పాలుడికి రాజ పత్రం ఇచ్చారు . ఇది అల్లుడికి కోపం తెప్పించింది . మొండిగా ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో ఆ రామున్నే రమ్మనండి ఆయన తో బాటు ”తోకాయన్ను ”కూడా తీసుకొని రండి. అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్లు చేస్తా ”అని భీష్మించాడు . పాపం కొంత మంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగ లేక జైన మతాన్ని తీసుకొని , రాజుకు లోబడి జీవిస్తున్నారు . మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయు సుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి , శరణు కోరుతూ ధ్యానించసాగారు . భక్త సులభుడైన మారుతి వెంటనే ప్రత్యక్ష మైవారికి ఆనందం కల్గించాడు . వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు . తమ బాధను వెళ్ళబోసుకున్నారు . వారిని రక్షించాలనే ఉద్దేశ్యం తో మనసు కరిగి , తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను , కుడి చేతి నుండి ఇంకో రోమాన్నితీసి , ఒక భూర్జర పత్రం లో భద్రం గా ఉంచి దాన్ని బ్రాహ్మణుల కిచ్చి , రాజు దగ్గరకు వెళ్లి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు . ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే -ఒక రోమాన్ని స…
: మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!
మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.
మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.
ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి చలం తెలుగు అనువాదం చూడండి.
“భరించే నీక్షమ నాకండగా వుండగా
నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.
నా చరిత్ర ఎంత నల్లనిదైనా
నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే
నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.
ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని వాడండి శత్రువుల హృదయాన్ని కుడా గెలుచుకొండి. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటామో మరలా మానవులు గా ఈ విచక్షణతో పుడతామో లేదో తెలియదు. కాబట్టి ఈ చిన్ని జన్మలో ఇన్ని కల్మషాలు మనకు ఎందుకు? ఆలోచించండి? కుదిరితే ఒక పులకరింపు... లేకపోతే ఒక పలకరింపు....
[22/01, 6:51 pm] Shiti 2: చెప్పు నేస్తమా ఎక్కడుందో రహస్యం..
చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త బట్టలు కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....
సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..
ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్,
చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...?
ఎందుకు...? ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..
మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!
👍.... ఎవరు రాసారో కానీ బాగా నచ్చింది 👍
🌻 *మహా భారతం* 🌻
🩸 *భాగము 22* 🩸
💧 *వెన్ను చూపిన రారాజు* 💧
🍃🌺అర్జునుని కదలికను గమనించిన అశ్వత్థామ అలజడి చెందాడు. రాధేయుని చూచి, అదిగో పార్థుడు మనమీదికి లంఘించే ప్రయత్నంలో వున్నాడు. ఆ గాండీవిని యెదుర్కోగల ధనుశ్శాలివి నీ వొక్కడివే. ‘‘రాధేయా, ఆలసించక సముత్సహించి యుద్ధానికి సంసిద్ధం కావాలి. మా వంటి సామాన్యులతో అది సాధ్యమయ్యే పనికాదు’’ అన్నాడు అశ్వత్థామ.
🍃🌺అందులోని వ్యంగ్యాన్ని, అధిక్షేపాన్ని గ్రహించిన కర్ణుడు అసహనంగా చూశాడు. అసహ్యాన్ని అసహనాన్ని లోలోపల అణచిపెట్టి, ‘‘క్షణంలో యీ రాధేయుని పరాక్రమ వైభవాన్ని చవి చూపిస్తాను. గాండీవిని తరిమి కొడతాను. కర్ణుని శౌర్యమెంతటిదో మీలాంటి అల్పులకు సైతం బోధపడుతుంది’’ అని గర్జించాడు.
🍃🌺తీవ్రశరాలతో అర్జునునిపై తలపడ్డాడు. కురుసేనకు ఎక్కడలేని వుత్సాహం వచ్చింది. ధనుష్ఠంకారాలతో అరిభయంకరులై రాధేయునికి అనుచరులై కదను తొక్కసాగారు. కిరీటి నూతనోత్సాహంతో, రెట్టించిన పరాక్రమంతో విజృంభించాడు. అతి తక్కువ వ్యవధిలోనే మడుగులో దిగిన మదపుటేనుగు పదఘట్టనలకు నే లకు అంటుకుపోయిన తుంగపోచలవలె కురువాహిని అడుసుపాలైంది.
🍃🌺అర్జున పరాక్రమానికి శాత్రవసేన భయంతో వణికిపోతూంది. కురువీరుల ఆత్మస్థయిర్యం సడలింది. వారి ముఖాలు వివర్ణమైనాయి. చావు భయంతో నిట్టూర్పులు విడుస్తున్నారు.ఇది యిలా వుండగా, సారథ్యం నెరపుతున్న ఉత్తరుడు ఒక్కసారిగా వెనుతిరిగాడు. పగ్గాలు వీడి, గాండీవికి చేతులు జోడించాడు. అతని చూపు దీనంగా వుంది. స్వరం హీనంగా వుంది.
🍃🌺‘‘సవ్యసాచీ, యీ విరామం లేని సంగ్రామాన్ని నేను తట్టుకోలేను. చూడడానికే నాకు శక్తిచాలడం లేదు. నీ ఆగ్రహానికి అలుపూ అంతూ కనిపించడం లేదు. మాటిమాటికీ మట్టుపెట్టినా, శాత్రవసేన నేల యీనినట్టు పుట్టుకు వస్తున్నది. ఇక యీ రథసారథ్యం నావల్ల కాదుగాక కాదు. మహాశయా, నా మాటలు ఆలకించు. దయతలచు. దాహంతో భయంతో నా గొంతు యెండిపోతోంది. ఇక నన్ను వదిలిపెట్టు’’ అన్నాడు జాలిగా. ఫల్గుణుడు యువరాజు మాటలు ఆలకిర చి, విలాసంగా నవ్వాడు.
🍃🌺ఉత్తరుని వెన్ను తట్టాడు. నేనుండగా నీకు ఆందోళన దేనికి? మరీ అవసరమైతే నేనే రథాన్ని నడుపుతాను. ఇంతసేపు శ్రమిం చావు. మరికొద్దిసేపు ఓపిక పట్టు. మనం వచ్చిన పని విజయవంతంగా ముగుస్తుంది. ఇపడిక కౌరవసేనలో మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. ఆ దురభిమాని సర్వదా మమ్మల్ని కించపరుస్తూ, తనంతటివాడు లేడని అహంకరిస్తుంటాడు. ఇపడు నాతో తలపడాలని ఉత్సాహ పడుతున్నాడు.
🍃🌺 తమ్ములతోబాటు ఆప్తభృత్యులందరూ దుర్యోధనునికి యిరువైపులా సమరసన్నద్ధులై కదులుతున్నారు. ఒక గొప్ప వ్యూహం పన్ని మన మీదకు వస్తున్నారు. యువరాజా, నవ చైతన్యంతో రథాన్ని ఆ దిశగా నడిపించు’’ అర్జునుని మాటలు ఉత్తరునిలో నూతన శక్తిని ప్రసాదించాయి.
🍃🌺రథం దిగ్గున లేచి దుర్యోధనుని వైపుకురికింది. మార్గమధ్యంలో అడ్డుకోజూచిన కురుయోధులు గాండీవి శరాఘాతాలకు కుప్పకూలారు. కిరీటి రథం దుర్యోధనుని సమీపించింది.బల్లెపు పోటు తిన్న బెబ్బులి వలె దుర్యోధనుడు హూంకరించాడు. రారాజు ధనుష్ఠంకారం భీతిని శబ్దంగా రూపు కట్టించింది. మరుక్షణం ధనంజయుడు బొమముడి విరిచి, నారిసారించి రెండు కరకుటమ్ములను దుర్యోధనుని రొమ్ముపై నాటాడు.
🍃🌺రారాజు వక్షస్థలం నుంచి రుధిర ధారలు చిమ్ముతున్నాయి. రోషించిన దుర్యోధనుడు అర్జునుని నుదుటిపైకి శరాలు సంధించాడు. నెన్నుదుటి నుంచి ప్రవహిస్తున్న నెత్తుటితో కిరీటి బాలభానుని వలె ప్రకాశిస్తున్నాడు. కౌరవాగ్రజుడు ప్రయోగస్తున్న శరాలను మార్గమధ్యంలోనే శక్తిహీనం చేస్తున్నాడు గాండీవి.వారిరువురి నడుమ సాగుతున్న సంకుల సమరం చూపరులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
🍃🌺దుర్యోధనుని పరిస్థితి గమనించిన వికర్ణుడు, మదగజాన్ని అధిరోహించి అర్జునునిపై తలపడ్డాడు. విజయుడు ఏమాత్రము చలింపక, నిశిత శరాన్ని ఏనుగు కుంభస్థలికి గురిపెట్టి ప్రయోగించాడు. కుంభస్థలం తునాతునకలైన మదగజం మహాపర్వతం వలె తుది ఘీంకారంతో నేలకు వొరిగింది. విక ర్ణుడు దిక్కుతోచక, పక్కనే నిలచి వున్న రథం మీదికురికి ప్రాణాలు రక్షించుకున్నాడు.
🍃🌺హస్తిన గజబలంలో వాసికెక్కిన గజరాజు ఒక వేటుకి కుప్పకూలడంతో కురుసైనికులు హతాశులైనారు. సవ్యసాచి నలుగురు వీరులతో ఏకకాలంలో పోరుసాగిస్తున్నాడు. కౌరవబలగం భయభ్రాంతమైంది. విజయము కల్ల, యిక వీరమరణమే గత్యంతరమని నిర్ణయించుకుంది. వారిని ప్రాణభయం ఆవరించింది. పలాయనం చిత్తగించడమే ప్రస్తుతానికి మేలని వారికి అనిపించింది.
🍃🌺అర్జునుడు అమితోత్సాహంతో శరాలను దశదిశలా గుప్పించాడు. కురుసేన వెన్ను చూపింది. రథాలు వెనుతిరిగి దూరంగా పరుగులు పెడుతున్నాయి. విజయోత్సాహమే ఊపిరిగా ధనంజయుడు దేవదత్తాన్ని పూరించాడు. శత్రువుల పరుగులకది కొత్తవేగాన్నిచ్చింది. దుర్యోధనుడు చుట్టూ కలయజూశాడు. తనవారెవ్వరూ లేరు. దరిదాపులలో తెలిసిన ముఖం ఒక్కటీ గోచరించడం లేదు.
🍃🌺రథాలుగాని, జెండాల రెపరెపలుగానీ లేవు. అభిమాన ధనుడు హతాశుడైనాడు. దుర్యోధనుని రథం వెనుతిరిగింది. దుర్యోధనుని తిరోగమనాన్ని గమనించిన అతిరథ మహారథులు, ధైర్య విహీనులై చెల్లాచెదురైనారు. రణస్థలిలో వెన్నులే తప్ప దన్నులు కనిపించడం లేదు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[22/01, 11:31 pm] Vitthal: *గిడుగు రామ్మూర్తి* సమ్మోహనాలు
2426
వ్యావహారిక భాష
భాష తోడిదె యాస
యాసే మాతృభాషకు ప్రాణము విఠ్ఠలా!
2427
ప్రజల వాడుకభాష
భాష బహు జనభాష
జనభాష కవన భాషగ మార్చెను
విఠ్ఠలా!
2428
భాషలోని అందము
అందాల సోయగము
సోయగము వాడుక భాషదనెను
విఠ్ఠలా!
2429
భాషోద్యమ సాహసి
సాహసి చేసెను కృషి
కృషితో వ్యవహారిక మొనర్చెను
విఠ్ఠలా!
2430
జన భాష సంస్కర్త
సంస్కర్త వ్యవహర్త
వ్యవహారిక భాషకాద్యు డితడు
విఠ్ఠలా!
2431
శిష్టజనుల భాషను
భాషనంత మార్చెను
మార్చి చరిత్రను తిరగ రాసెను
విఠ్ఠలా!
2432
చిచ్చర పిడుగు గిడుగు
గిడుగేసె ముందడుగు
అడుగేసి భాషోద్యమము నడిపె
విఠ్ఠలా!
2433
సవర భాష నేర్చెను
నేర్చి బడులు పెట్టెను
పెట్టి గిరి భాషను వృద్ధి పరిచె
విఠ్ఠలా!
2434
రావు బహదూరయ్యె
అయి విఖ్యాతుడయ్యె
అయి కైజర్ ఇ హింద్ బిరుదు పొందె విఠ్ఠలా!
2435
శాసనాలు చదివెను
చదివెను శోధించెను
శోధించి చరిత్రనే తెలిపెను విఠ్ఠలా!
2436
గురజాడ అడుగులను
అడుగులో జాడలను
జాడను గిడుగు కొనసాగించెను
విఠ్ఠలా!
2437
జీవద్భాష కొరకు
కొరకు వాడుకకొరకు
వాడుకకు సాహితి సేవ చేసె విఠ్ఠలా!
2438
గిడుగు సాహితి సమితి
సమితి భాషకు ప్రగతి
ప్రగతి సాధించెను తెలుగుభాష
విఠ్ఠలా!
2439
భాషా సంస్కరణలు
సంస్కరణల ఫలాలు
ఫలాలు తెలుగు కందించె గిడుగు
విఠ్ఠలా!
2440
హరిజన గిరిజనులను
గిరిజనుల భాషలను
భాషా సరళీకరణకాద్యుడు విఠ్ఠలా!
కే. పాండురంగ విఠల్
[22/01, 9:13 pm] +91 81258 41729: *02-DEC-1989*:
ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భారత హోమ్ మినిస్టరుగా ఛార్జ్ తీసుకున్నాడు.
మరుక్షణం నుంచే కాశ్మీర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఆపి ఉంచిన మతవిధ్వంస వ్యూహం అమలైంది.
*18-JAN-1990*:
కాశ్మీర్ లోయలోని 25,000 పైగా మసీదుల మైకులలో ఒకటే అనౌన్స్ మెంట్ - ప్రతి పది నిమిషాలకు ఒక సారి. *"హిందువులారా, మతం మారండి. లేదా కాశ్మీర్ వదిలి పొండి. కాదంటే చావే గతి"*
ఇదేదో జోక్ అనుకున్న వారికి
తెల్లారే సరికి అసలు విషయం బోధ పడింది. *2000 మంది ఊచ కోత.* ఏ ఊరినీ వదల్లేదు.
ఎవరినీ ఒక్క వేటుతో చంప లేదు. మెడలు సగం కోసి.. రక్తంలో గిల గిల లాడేలా చంపేశారు. ఇదే హలాల్ ! ! !
మన పక్కింటి వాడు, బాగా తెలిసిన వాడూ మంచి వాడే, అనుకున్న ఏ ముస్లిం సహాయానికి రాలేదు.
ప్రభుత్వ సహాయం సున్న. పోలీసులు ఏమయ్యారో తెలియదు. మరి మొన్నెపుడో అడిగినట్టు ఓ 15నిమిషాలు సమయం తీసున్నారేమో !
మరునాటికి ప్రకటనల్లో చిన్న సవరణ.
*"మగవారు మాత్రమే వెళ్ళాలి. రేపటి నుంచి మీ స్త్రీలు మా సొంతం"* అని...
ఒక్క రోజులో 5 లక్షల మంది కాశ్మీర్ నుంచి జమ్మూకి లారీలు, బస్సులు, ఆటోలు, ఏది దొరికితే అది. 200 km దూరానికి లక్ష రూపాయల వరకూ టికెట్. ఇంటి ఆడ పిల్లలు రాక్షసుల చేతిలో పడ కుంటే చాలు అనే ఆరాటంలో ఆడవాళ్ళకు జుట్టు కత్తిరించి మగవాళ్ల బట్టలేసి బార్డరు దాటిస్తుంటే, శరీరంపై చేయివేసి మరీ పరీక్షలు చేసి ఆడవాళ్లను లాగేసుకున్నారు. అలా మిగిలిన స్ర్తీలు ఇంకా జీహదీల చేతులు మారుతూ బంధీలుగానే వున్నారు.
కోటీశ్వరులు, లక్షాధికారులు, వ్యాపారులు, ఉద్యోగులు... కూలీపని చేసుకునే వారూ తేడా లేదు.
ఒక్క రోజులో అంతా బికారులై పోయారు.
నాకు తురక నాయకుడు చాలా మంచి స్నేహితుడంటూ, నాకు ఏమీ అపాయం లేదూ అంటూ, ఆ చూద్దాంలే అని మిగిలిన పోయిన వారి సంగతి ఏమయ్యిందో ఈరోజు చూస్తున్నవారంతా గడ్డాలు టోపీలు పెట్టుకొని వారికి మగవారు ఊడిగం చేస్తూ, ఆడవాళ్లు .......
*"కాశ్మీరీ యత్"*,
*"గంగా జమున తహజీబ్"*, *"వాడూ వీడూ భాయీ భాయీ"* లాంటి మాటలు వింటే జాలి కలుగుతుంది - వినే వాడి మీద.
ఈ సంఘటన దేశాన్ని కుదిపేస్తుంటే.... ప్రధాని వీపీ సింగ్ దేశం దృష్టి మరల్చ టానికి ఒక బ్రహ్మాస్త్రం తీశాడు - *"మండల్ కమిషన్ రిపోర్ట్"*.
దేశం అలవాటుగా కులాల గొడవలో పడి తమ సోదరుల కష్టాన్ని మరిచి పోయింది.
2019 జనవరి చివరికి కాశ్మీర్లో మిగిలింది 1500-2000 హిందువులు మాత్రమే.
2019లో 303 సీట్లు రాకుంటే బెంగాలు, దక్షిణ రాష్ట్రాల్లో మైకులెపుడు మోగేవో ?
15 నిమిషాలు టైం కూడా అడిగేసారు....
ఈ పరిస్థితిలో కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళు చరిత్ర పునరావృతం కాక ముందే మేల్కొనండి, మరో కశ్మీరు చూసే భాగ్యం కల్గించకండి !
జీహదీలలాగా కత్తులు తీసి కోయఖ్ఖరలేదు, మన వాళ్ళు చాలామంది ఇంకా జీహదీలకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు భక్తులుగానే ఉన్నారు. దోపిడీ దొంగలు, దేశద్రోహులు, మతమార్పిడి ముఠాలు, ఆర్థిక నేరగాళ్లు, ఇలాంటి వాళ్ళకు వ్యక్తి పూజలు మాన్పించండి. అలాంటి వాళ్ళ దృష్టి మరల్చి మీవంతు ఓ ఫది ఓట్లు హైందవత్వాన్ని కాపాడే పార్టీకి వేయించి దేశాన్ని, మనల్ని, మన స్ర్తీలనూ కాపాడు కుందాము. Protect YOUR HINDUISM. If you born as HINDU. 🙏🙏🙏🙏
[23/01, 8:30 am] +91 83094 66007: సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.దాని చరిత్ర ,మూలాలు, పరిణామం తెలియదు కానీ.... సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి).
Sanskrit English
1.లప్ lip
2.దంత dent
3.నాసిక nose
4.బ్రాత brother
5.మాత mother
6.సూనుః son
7.దుహిత daughter
8.నక్తం night
9.లఘు light
10.వాహక vehicle
11.వహతి weight
12.తరు tree
13.హోమ home
14.మూషి mouse
15.మృత mortal
16.గ్రాసము grass
17.బంధ bond
18.నవ new
19.మధ్య mid
20.ఉపరి upper
21.అదః under
22.హోరా hour
23.పథ్ path
24.క్రూర cruel
25.ఉక్షా ox
26.గౌ cow
27.సర్ప serpent
28.వమితం vomit
29.ఇతర other
30.పరమానంత permanant
31.న no
32.అ +హం I am
33.ఇతి it
34.తత్ that
35.సా she
36.సః he
37.వయం we
38.తే they
39.అస్ is
40.యూయం you
41.మానవ man
42.అంగార anger
43.జ్ఞా know
44.అగ్రిమకులచర
Agriculture
45.దామ dam
46.స్థాన్ station
47.దానం donation
48.సంత్ saint
49.దివ్య divine
50.అగ్ని ignite
51.వాక్కు vocal
52.వస్ bus
53.సర car
54.సర్వేక్షణ survey
55.షష్టి sixty
56.శత పర శత cent per cent
57.ధీక్షపాల discipline
58.శూర్పనఖ sharp nails
59.దశ deci
60.నవ nona
61.అష్ట octa
62.సప్త septa
63.షష్ఠ hexa, hepta
64.పంచ penta
65.త్రయం three, trio
66.ద్వయం,ద్వి dual, dia
67.అస్థిక osteo
68.చర్మ derma
69.పాదచారి pedestrian
70.కృష్ణ Christna
71. గోళం globe
72.దత్త debt
73.విధవ widow
74.పరిమితి perimeter
75.భ్రూ brow
76.తార star
77.అంతర inter
78.అంత్ end
79.స్విస్టం sweet
80.సీవతి sewing
81.తిథి date
82.క్రమేల camel
83.పురోగం programme
84.చోష్ juice
85.ప్రచార preacher
86.మనస్తర్ minister
87.సంపన్న champion
88.అర్కొదది arctic ocean
89.అతులాంతకోదది. Atlantic ocean
90.ప్రశంతోదది Pacific ocean
91.అస్త్రాలయ్ Australia
92.అంధమానవ ద్వీపం Andaman
93.హిందూ ఆసియా Indonesia
94.ఋషీయా Russia
95.కాశ్యపసముద్రము Kaspean sea.
96.ఆముస్తారదామ Amsterdam
97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి England
98.బ్రహ్మాంగ దామ Bermingham
99.మరీచిక Mauritius
100.లాస్యంజలి LosAngels.
[22/01, 5:35 pm] +91 99898 56906: ఐశ్వర్యం అంటే....
🍁🍁🍁🍁
ఐశ్వర్యం అంటే చాలామంది డబ్బు మాత్రమే అని భ్రమ పడుతుఅంటారు. డబ్బులు లేవు కాబట్టి మేము ఐశ్వర్య వంతులం కాదు అని అనుకుంటూ ఉంటారు.
అసలైన ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం..
తల్లి తండ్రులను రోజు చూడగలగడం ఐశ్వర్యం అని మీకు తెలుసా?ఈ రోజుల్లో పెద్దవాళ్లయినా తల్లి తండ్రులను పిల్లలు భరించలేక వృధాశ్రమము లో వదిలేస్తున్నారు. కానీ తల్లి తండ్రి ఇంటిలో ఉండి రోజు మీరు వారితో పేమ గా మాట్లాడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం. ఎందుకంటే మన మంచినీ వారికన్నా గొప్పగా కోరుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి ఎప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడడం వారు మీతో ఉండడం మహా ఐశ్వర్యం.
భార్య భర్తలు అనుకూలం గా ఉండడం కూడా ఐశ్వర్యం అని మీకుతెలుసా?
భార్యాభర్తలు ఒకరినిఒకరు అర్ధం చేసుకుంటూ ప్రేమ ను పంచుకోవడం కూడా ఐశ్వర్యమే .
దీనితో పాటు చెప్పిన మాట వినే సంతానం ఉండడం కూడా ఐశ్వర్యం. పిల్లలు బుద్ధిమంతులు చెప్పినమాట వినేవారు అయి ఉంటే అది గొప్ప ఐశ్వర్యం
.రుణం లేకపోవడం కూడా ఐశ్వర్యం. మీ సంపాదన మీ అవసరాలకు సరిపడా ఉండి మిగలక పోయిన పర్వాలేదు. కానీ అప్పు లేకుండా ఉంటే మాత్రం చాల ఐశ్వర్యం ఉన్నదానితో సమానం అని గుర్తు పెట్టుకోండి .
ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉన్నవారుకూడా ఐశ్వర్య వంతులే.
మన కోసం కన్నీరు కార్చే ఆప్తులు ఉండడం కూడా ఐశ్వర్యం ఉన్నట్టే.
డబ్బులు లేక పోయిన పదిమందిలో గౌరవింప బడటం కూడా ఐశ్వర్యమే..
ఎదుటివారు కష్టం లో ఉన్నారని తెలియగానే కరిగిపోయే మనస్సు ఉన్నవారు కూడా ఐశ్వర్య వంతులే..
చూసారా డబ్బుతో సంబంధం లేకుండా ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయో. ..
ఎంత డబ్బు ఉన్నాకూడా పైన చెప్పిన విషయాలు లేనప్పుడు వారు లేనివారితోనే సమానం
. ఎంత డబ్బులేక పోయిన ఈ లక్షణాలు ఉంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా చెప్పుకోవచ్చు.
🌸🍁🍁🍁🍁
[22/01, 9:41 pm] +91 89198 69770: 💯💯💯💯💯💯💯💯💯
*నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన తోడు
*నీ శరీరమే!*
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!
*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ బాధ్యత...
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప...!
ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
మనసుకు- *ధ్యానము*
శరీరానికి- *యోగా.*
గుండెకు- *నడక.*
ప్రేగులకు- *మంచి ఆహారం.*
ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
ప్రపంచానికి- *మంచి పనులు.*
👆ఒకటికి రెండు పర్యాయాలు చదవండి.🙏
🌹సర్వేజనసుఖినోభవంతు🌹
[23/01, 7:04 am] Kant's Rso: *శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
*లోకంలో ఉన్న చీకటంతా*
*ఒక్కటైనా...*
*అగ్గిపుల్ల వెలుగును*
*దాచలేదు.*
*నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం,*
*కృషి తోడైతే...*
*నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.*
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"మన సమస్యలకు పరిష్కారం కేవలం
మన దగ్గరే ఉంటుంది ఎదుటివాళ్ళు వద్ద సూచనలు సలహాలు మాత్రమే ఉంటాయి."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
om
ReplyDelete