Monday, 11 January 2021

12--01--2021


 

 

మధురిమలు  (051 --- 060 )-

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శీర్షిక .. జీవితమ్ము 


అమ్మా దీవించు మమ్ము 

తొల గించు మా పాపమ్ము 

సకల సౌక ర్యాలిమ్ము 

మాకు  నీవే దైవమ్ము 


సద్వినియోగ సమయమ్ము 

అది నిత్య సౌభాగ్యమ్ము 

జీవితం  శుభకరమ్ము 

అదిమనకు కళ్యాణమ్ము 


బతుకు నీదిగ ధైర్యమ్ము

బాధ్యతో ఉండే  దమ్ము

తెలిసే మాయమర్మమ్ము

తెల్సుకొనేది ధర్మమ్ము


పొందాలి సంతోషమ్ము

అదియు నీకు నిశ్చయమ్ము 

మరవాలీ అధైర్యమ్ము  

బ్రతుకు మనసుకు ధైర్యమ్ము


తలరాత అను కోకమ్ము

అది జీవతపు మార్గమ్ము

బతుకంతా బాందవ్యమ్ము

సత్కర్మ సేవ మనమ్ము


హృదయంలో వేదనమ్ము

ప్రేమ పంచే వద నమ్ము

పొందు నిత్యా సాయమ్ము

చూపాలి దాతృత్వమ్ము


ఏతల్లి పూజ ఫలమ్ము

ఏర్పడే జపా తపమ్ము

రక్షగ ఇదియె ధైర్యమ్ము

అందాలు కొర గావమ్ము


ఫలముగా భక్తి మార్గమ్ము

సన్నిధి చేర వ్రతమ్ము

మనసు మార్చే దీక్షమ్ము

సకల శోభ దాయకమ్ము


ఆరోగ్యానికి శుభమ్ము 

యోగాసనాలు క్షమమ్ము 

పతనమే మూర్ఖత్వమ్ము 

చెడు వ్యసనాలు మదమ్ము 


చూపేను ప్రతాపమ్ము 

లేదులే సందేహమ్ము   

నాకు ఆశ్చర్యకరమ్ము 

నీడలా  సహకారమ్ము


--(()౦--

మహాభారతం ఆదిపర్వం పదవ భాగం
((((((((((((((((((())))))))))))))))))))))
                 🏵️🙏🙏🙏🏵️
  ఆ పై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆ కాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులైయ్యారు. మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్ధాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు.
జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మ దేవుడు.
ఆయన మానస పుత్రులు ఆరుగురు
1. మరీచి...        .2. అంగీ రసుడు...3.  అత్రి,...
4.   పులస్త్యుడు   5., పులహుడు,....6. క్రతువు
 అనే ఆరుగురు.
1.   మరీచి ....ఇతని కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మ దేవుని కుడి చేయి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ చేయి బొటన వ్రేలి నుండి ధరణి జన్మించారు. వారిరువురికి వెయ్యిమంది మహా పురుషులు జన్మించారు. దక్షునికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో
      1.  దితికి హిరణ్య కశిపుడు అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలి చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు
     2.  . దను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు.
      3.   సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు.  
      4    వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.                       
      5.  .కద్రువకు నాగ కుమారులు
            జన్మించారు.
        బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన
  2.   అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తనుడు            అనే కుమారులు కలిగారు.
         బృహస్పతి ఇంద్రునికి గురువైయ్యాడు.
  3.   మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహా మునులు జన్మించారు.
  4.  నాల్గవ మానస పుత్రుడైన పులస్త్యునకు
       రాక్షసులు పుట్టారు.
  5.   ఐదవ మానస పుత్రుడైన పులహునకు
        కిన్నెరలు, కింపురుషులు పుట్టారు.
  6.   క్రతువు అనే మానస పుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవ్బుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్ట వసువులు జన్మించారు.
    వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు
  . బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు.     భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుకృడు. శుకృడు రాక్షస గురువైయ్యాడు.
భృగువు కుమారుడు చ్యవనుడు
 అతని కుమారుడు ఔర్యుడు.
ఔర్యుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు.
ఇక భూమి పైన దేవ దానవాంశలతో రాజులు జన్మించారు.  
1.  విష్ణు మూర్తి అంశతో శ్రీ కృష్ణుడు
 2. , ఆదిశేషుని అంశతో బలరాముడు
 3., లక్ష్మీ దేవి అంశతో రుక్మిణీ
 4.   , అప్సరసల అంశతో పదహారు
         వేల గోపికలు,                     
 5     ప్రభాసుని అంశతో భీష్ముడు
 6.    బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు.
 7.   ద్రోణునికి కామ క్రోధములు కలసి
        అశ్వత్థామగా  జన్మించాడు.
 8.    మరుత్తుల అంశతో
      విరాటుడు, సాత్యకి, దృపదుడు జన్మించారు
  9.   . సిద్ధి బుద్ధి అంశతో
          కుంతి మాద్రి జన్మించారు
 10. . ఏకాదశాంశతో కృపాచార్యుడు,
  11.   సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు
  12. హంసుడు అనే గంధర్వుడు
        దృతరాష్ట్రునిగానూ
  13. మతి అనే దేవత గాంధారిగానూ జన్మించారు.
  14.   కలి అంశతో దుర్యోధనుడు
   15.   ,హిరణ్యకశిపుడు శిశుపాలునిగా పుట్టాడు
    16.   ప్రహ్లాదుడు శల్యునిగా పుట్టాడు
    17.    కాలనేమి అంశతో కంసుడు,
     18.   విప్రచిత్తి అనే దానవుడు
              జరాసంధుడిగా పుట్టారు.
     19.   అశ్వపతి కృతవర్మ
      20.   గుహ్యకుడు శిఖండి
      21.   మరుద్గణాంశతో
             పాండురాజు జన్మించారు
      22.   .మాండవ్యముని శాపకారణంగా
                యమ ధర్మరాజు విదురుడిగా జన్మించాడు.     యముడి అంశతో ధర్మరాజు,
     23.     వాయుదేవుని అంశతో భీముడు
     24.    ఇంద్రుని అంశతో అర్జునుడు,
     25.    అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు
     26.   శ్రీ అంశతో ద్రౌపది
     27.   అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించారు.
     అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు
      చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్రులు కలిగారు.
    చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు. .....అతడు ధనాశాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్దకు పంపాడు. పురూరవునిచే పరిహసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడివి కమ్మని శపించారు
. పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కుమారులు. వారిలో
1. ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు.
 2.   నహుషుని భార్య ప్రియంవద.
         వారి పుత్రుడు యయాతి.
 3.   యయాతికి దేవయాని వలన
        ఇద్దరు కుమారులు కలిగారు.
 4.   యయాతి కి..
             వృషపర్వుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు
 5.  . శుకృని శాపం వలన యయాతికి ముసలి తనం వచ్చింది. యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు.
 అప్పుడు జనమేజయుడు వైశంపాయినుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు.....
                 ఓ  మహర్షీ !  క్షత్రియుడు చక్రవర్తీ అయిన యయాతి బ్రాహ్మణుడు రాక్షస గురువూ అయిన శుకృని కుమార్తెను ఎలా వివాహమాడాడు " అని అడిగాడు. సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు.
కచ దేవయానుల వృత్తాంతం
వృషపర్వుడు అనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృతసంజీవిని తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ వచ్చాడు. అందు వలన రాక్షసబలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుకృని వద్దకు వెళ్ళి అతని కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృతసంజీవని విద్య తెలుసుకు రమ్మని లేనియడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు. శుకృనికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు. కచుడు సమ్మతించి శుకృని వద్దకు వెళ్ళి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడుగా చేరాడు
. క్రమంగా కచుడు దేవయాని శుకృల అభిమానం చూరకొన్నాడు. అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి బూడిద చేసి శుకృనికి మధ్యంలో కలిపి ఇచ్చారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుకృడు ఆమె దిగులు పోగొట్టటానికి తన కడుపులోని కచునకు మృతసంజీవిని నేర్పాడు. కచుడు ఆవిద్యతో బయటకు వచ్చి తిరిగి శుకృని బ్రతికించాడు.
కొంత కాలానికి కచుడు శుకృని వద్ద శలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలోదేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని తనను వివాహ మాడమని బ్రతిమాలింది. కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు. అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృతసంజీవని అతనికి పనిచేయకూడదని శపించింది. కచుడు అది తనకు ఉపయోగించక పోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పని చేస్తుందని చెప్పి, తనకు కలిగిన శాపానికి ప్రతి శాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్ళాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళాడు.
ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయాని వేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా నిఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.
దేవయాని తన చెలికత్తెలతో అదే వనవిహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని చూసింది. దేవయాని యాయాతి తో తామిరువురికి ఒకసారి పాణి గ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే అందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది. యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుకృడు శర్మిష్ట వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు.
 దేవయానీ యయాతికి ..1. యదువు,2.   తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు
. శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధ పడి ఒంటరిగా ఉన్న యయాతి మహారాజుని కలసి దేవయాని చెలికత్తె కనుక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన  
               1. దృహ్వుడు 2.;, అనువు,3. పూరుడు అనే ముగ్గురు పుత్రులను పొందింది.
 మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ట పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు యయాతికి శాపం ఇచ్చాడు.
 శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ట కుమారుడైన పూరునికి ఇచ్చి అతడి యవ్వానాన్ని తాను గ్రహించి వేయి సంవత్సరముల తరువాత పూరునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనిని చక్రవర్తిని చేసాడు. యయాతి కోరికకను నిరాకరించిన అతని కుమారులు నలుగురికి శాపం ఇచ్చాడు. శాపకారణంగా
     1. యదు వంశస్తులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు,
    2.  తుర్వసులు కిరాతకులకు
                            రాజులయ్యారు,
    3.    ద్రూహ్యులు అతని వంశస్తులు
             జలమయ ప్రదేశాలకు రాజలయ్యారు,
    4.   అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు.
     శర్మిష్ట కుమారుడైన పూరునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చ చెప్పి యయాతి తపోవనానికి వెళ్ళి వేయి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్ర లోకానికి వెళ్ళాడు.
ఇంద్రుడు యయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది కనుక స్వర్గ లోక భోగాలనుభవిస్తున్నావని అన్నాడు. అందుకు యయాతి కొంచం అతిశయించి దేవ, మానవ, మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చేయలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది. ఇంద్రుడు యయాతిని తిరిగి మానవ లోకానికి వెళ్ళమనగా యయాతి తాను తిరిగి మానవలోకానికి వెళ్ళలేనని నక్షత్ర లోకానికి వెళతానని ఇంద్రుని కోరాడు. ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన యయాతి అక్కడ అతడు తన దహోత్రులను చూసి వారికి తన వృత్తాంతం త్తెలిపాడు. వారు యయాతిని అడిగి అనేక ధర్మ సూత్రాలు పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు. యయాతి సాహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు అష్టకుడు మొదలైన వారు తిరిగి యయాతితో పుణ్యలోకాలకు వెళ్ళారు.
          Good evening too all of my friends
ఈ వ్యాసమును నేను గూగుల్ వికీపీడియా ద్వారా సేకరించాను నాకు సమయం చాలనందువల్ల ఏదో ఈ విధంగా పోస్ట్ పెట్టాను ఏమి అనుకోవద్దు friends మీ మిత్రుడు.......

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

విశ్వములో జీవితం -2 
ఒకరికి ఒకరు

ఈ విశ్వములో కేవలము విద్య ఒక్కటి మాత్రమే కాదు, విద్యతో పాటు వినయము కూడా ఉండాలి, వీటికి తోడు దానగుణము తప్పక ఉండాలి, అనగా విద్యను దాచకుండా తాను తెలుసుకున్న విద్యను తోటివారికి అందించటమే, విద్యా " జ్ఞానము " వళ్ళ మానవులకు మంచి చెడులు తెలుసుకొని మాయ మాటలకు నమ్మకుండా జీవితాన్ని ఓర్పుతో నేర్పుతో సరి దిద్దు కోవటమే ముఖ్యమైన లక్షణం.  .

విద్య లేని వారు వింత పశువు అనే వారు, కానీ అది తప్పు, అందరు అందలం ఎక్కే వారయితే మోసేవారు ఎవరు అనే ప్రశ్న వస్తున్నది. కానీ అవిద్యా ప్రభావము వళ్ళ కొంత నిరుత్సాహము తప్పదు, ఆయినప్పడికి ప్రకృతి సహకారంతో, తోటి వారి సహాయముతో తాను సంపాదించినదే సంతృప్తిగా భావించితే జీవితం అంతా సుఖమయం. కానీ ఎదుటి వారిని చూసి ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, అసంతృప్తిగా ఉండటం అవసరమా ?            

రాత్రి వచ్చే కల తెల్లవారితే మాయ మవుతుంది, దాని వళ్ళ ఎటువంటి హాని ఉండదు, కలలు రావటానికి కారణం మనలో ఉన్న అసంతృప్తి ఒక కారణం, మరియు మనం చూసిన కొన్ని సంఘటనలను ఉహించుకొని నిద్రపోవటం వల్లనే. అందుకే మనం నిద్రపోయేప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని తలచుకుంటే మంచిది. శ్రమ తక్కువగాను ఆలోచన ఎక్కువగాను ఉండటం వళ్ళ కలలు ఱావచ్చును.     

నా ఉద్దేశ్యములో ఏ రోజు పని ఆరోజే చేసుకొని రేపటి గురించి ఆలోచన చేయకుండా ఉండ గలిగిన వాడికి,  బాగా కష్టపడి కడుపు నిండా భోజనము చేసిన వాడికి మంచిగా నిద్రవస్తుంది.    

నమ్ముకున్నదానిపైన నిరంతరం దృష్టి ఉంచడం. ఒకసారి ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తే ఎవడేమనుకున్నా వెనక్కు తిరక్కుండా ‘జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!‘ అనుకుని, అనుకున్నదాన్ని సాధించేవరకు కష్టించడం, ఫలితాన్ని మాత్రం మాట్లాడకుండా స్వీకరిచడం - మంచైనా చెడైనా తప్పదు.  మనం మన మనస్సు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, సహకరించే వారి సలహాను పాటిస్తాం, సరైన జ్ఞానము వళ్ళ బుద్ధి వికసించుతుంది.   

ఎర్రని పుష్పము క్రిష్టల్ ముందుంచి నప్పుడు ఎర్రదనం క్రిష్టల్ ల్లో ప్రతి బింబిస్తుంది. అట్లాగే మనచుట్టు వున్నా వారి ప్రభావము మనపై కొంత పడి, చేసేపనిలో కొంత ఆసౌకర్యము కలుగవచ్చు, ఆయన పట్టుదల విడవకుండా ప్రయత్నిమ్చటమే మానవులకు ఉన్న నిజమైనా ధర్మం.    

ధన వనితాది విషయం భోగాలకు చిక్కకుండా విశ్వములో జీవితాన్ని సాగించాలి.  బురద నీటిలో కలువ పువ్వు కాడ ఉండి పైన అందాలు విరజిమ్మే విధంగా ఉండే పువ్వుని గమనించాలి  సముద్రములో ఎగిరే చేపలు లాగా ప్రేమను పంచుకుంటూ ఒకరికి ఒకరై విశ్వములో జీవించాలి.  
  --((*))--
Indus Valley India Anunnaki Vimana Epics
 
 సమ్మోహనాలు .. ఉట్టిలో కుండలు (
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఉట్టి ఎక్కలేకయు  
లేక స్వర్గ మనియు
మనియు మాయమాటలు మనిషియే ఈశ్వరా

ప్రకృతి అనే గాలీ
గాలి రాక జాలీ
జాలి లాగ ఉట్టి కట్టి ఉంచు ఈశ్వరా

ఉట్టి ప్రపంచంము
ప్రపంచము సౌఖ్యము
సౌఖ్యము ఉట్టిలా వేలాడే ఈశ్వరా

ఉట్టిన కుండ పెట్టి
కుండ పాలు పెట్టి
పాలు తీయకుండ గజ్జె కట్టె ఈశ్వరా
 
హృదయము ఒక కుండా  
శ్వాస రెండొ కుండా
కుండా కదిలేది ప్రాణమె ఈశ్వరా
 
ఉట్టి తెరువు కొరకుయె
తెరువు పాలు అమ్ముయె
పాలు వెన్న నెయ్యి అమ్మె బతుకు ఈశ్వరా

సత్య మనే ఉట్టి
ఉట్టి కుండా మట్టి
మట్టిలో కలియు ప్రాణమైనది ఈశ్వరా

పాలు వెన్నను దాచు
దాచి ఎత్తున యంచు
యుంచె ఉట్టెలో కుండలలోన ఈశ్వరా
 
క్రిములు చేరా కుండ
కుండ కుండా కుండ
కుండలను ఉట్టిలో ఉంచే ఈశ్వరా
 
మాయ చేర కుండా    
కుండ చల్లఁ యుండా     
చల్ల చల్లగ ఉంచేది కుండ ఈశ్వరా

--(())--

మనుష్యజన్మ

మనిషి జీవితం యొక్క పరమార్ధం ఏమిటి?

సంపాదించడం , తినడం , రోజూ ఒక విషయానికి బాధ పడటం , వరికి చనిపోవడం ?
సంపాదించి ,  కష్టపడి మరీ చనిపోడం కంటే ఇప్పుడే చనిపోవడం మేలు కదా ?
మానవజన్మ పరమార్ధం పునర్జన్మ లేని శాశ్వత మోక్షం పొందటం.
భూమిపై మనిషి తక్క అన్ని ప్రాణులు  తిర్యక్కులుగా పుడతాయి.
అంటే భూమికి వెన్నుపాము అడ్డంగా పుట్టి, అడ్డంగా పెరిగి , అడ్డంగానే చస్తాయి.
కాని మనిషి మాత్రమే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. లోచూపుతో పైకెదగడానికి ఇలా జరగాలని ఈశ్వరశాసనం. స్వీయరక్షణ కొఱకు జంతువులకు కొన్ని కొన్ని విభూతులను ఇచ్చాడు. కేవలం మనిషికి మాత్రమే జ్ఞానం, వాక్కు ఇచ్చాడు. వాక్కు అంటే నామ సంకీర్తనం చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి పరిపక్వమై , జ్ఞానమై అది వైరాగ్యాన్ని ఇస్తుంది.

జ్ఞానికి ఈ బాహ్య ప్రపంచంతో సంగం ఉండదు. వేటితోనూ సంగం లేకపోతే పాపం ఉండదు.  భగవదర్పితమైన ఫలాపేక్ష లేని కర్మ వల్ల మోక్షం సిధ్ధిస్తుంది.
ఇచ్చిన ఈ మానవ జన్మలో చెయ్యకూడని పనులన్నీ చేసి ఉత్కృష్టమైన మానవజన్మ వ్యర్ధం చేసుకొంటే  మళ్ళీ ఇది వచ్చేది ఎప్పుడో? మోక్షం ఇంకెప్పుడో?

సేకరణ - జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర పరమాచార్యుల వారి అనుగ్రహభాషణము .

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


      శ్రీ భాగవతం - 107 వ భాగం         చదువుకుందాం భాగవతం
      బాగుపడదాం మనం అందరం      దశమ స్కందము          శ్రీకృష్ణ లీలలు - 37
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

 ధర్మజుని రాజసూయ యాగము

రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు.

కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు.

పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి.

వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు.

వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు.

యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు.

వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు.

భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా అంత అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది.

అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు.

ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందఱో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందఱో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు.

అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశాములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.

ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే.

కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు.

సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ…
 

🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 58 🕉


రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ
బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ
జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!


📍 తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు.

🌹వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును.

🌹నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు.

🌹ఎందుకంటే వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతము…
🙏36. శ్రిత పరిపాలక గోవిందా : 🙏


🌹శ్రితులు అంటే భగవంతుని ఆశ్రయించిన వారు. తనను ఆశ్రయించిన వారి కోర్కెలను అడగకుండానే అనుగ్రహించేవాడు ఆ విష్ణుమూర్తి

🌹శ్రీ పరిపాలక గోవింద అంటే తనను ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడు తోడుగా వుండి వారి కోర్కెలను తీర్చే శ్రీహరి.

🌹సతీ సక్కుబాయి అను భక్తురాలు నిరంతరం శ్రీ పాండురంగని నామం జపిస్తూ, కీర్తనలను పాడుతూ, సర్వం ఆయన దయగా భావిస్తూ నిత్య కృత్యాలతో కాలం గడుపుతూ ఉండేది.

🌹సక్కుబాయి అత్తగారికి ఏ మాత్రం ఎదురు చెప్పేదికాదు. అత్తగారు సక్కుబాయిని పాండురంగని మర్చిపొమ్మని చెప్తూ సరిగ్గా భోజనం పెట్టక ఎక్కువ శ్రమలు కల్గించే పనులు అనగా అధికంగా పిండి విసరటం, బావి నుండి నీళ్ళు తోడటం లాంటివి చెప్పి చాలా బాధలు పెట్టేది.

🌹ఒకరోజు గ్రామస్తులు పండరీపురం వెళ్ళుతున్నారు అని తెలిసి సక్కుబాయి కూడా వెళ్ళాలనుకుంది. అత్తగారు ఆమెను తాడుతో స్తంభానికి కట్టేసి పడుకుంది.

🌹అపుడు స్వామి ఆమె భర్త రూపంలో వచ్చి కట్లు విప్పి ఆమెను పండరీపురానికి పంపి, మళ్ళీ స్వామి సక్కుబాయిగా యింట్లో ఉండేవాడు.

🌹సక్కుబాయి పండరీ పురంలో స్వామి వారిని దర్శించి ఆనందంతో, తన్మయత్వంతో ఈ శరీరంను విడిచి స్వామిలో ఐక్యమైపోయింది. ఇది చూచిన గ్రామస్థులు ఇంటికి వచ్చి చెప్పగా పాండురంగడే సక్కుబాయిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని స్వామిని శరణువేడారు. ఆశ్రితుల కోర్కెలను తీర్చాడు కనుక శ్రితపరిపాలక గోవిందా అని అంటారు.
--(())--

 

 ఓం మహాలక్ష్మి దేవ్యై నమః

"క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమేగేహే సురాసుర నమస్కృతే."

లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు. మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే. ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.  పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకే ముంది. జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి సమాలోచన చేశాడు. వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.
ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు. ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.
యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అనఘా దేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది. జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి. నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.
 అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండ వచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా. లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంత మటుకూ పర్వాలేదు. కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు. తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ  వారి పతనానికి కారణమవు తుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుంది.

No comments:

Post a Comment