










మధురిమలు
యువతరం శివమెత్తాలి
యువజన గళం కావాలి
లోకమంతా మారాలి
చీకటంతా పోవాలి
తప్పుడుమాట తొలగాలి
అవసరం తో మారాలి
జాగర్తె బతుకవ్వాలి
విద్యఉపాధి అవ్వాలి
జన నాడుల్లొ కలవాలి
నవ చైతన్య మవ్వాలి
తూర్పు తేజ మవ్వాలి
శ్వాసనే అందించాలి
స్వయం కృషితొ మెలగాలి
విజయ పథంతొ కదలాలి
సొంత లాభం మానాలి
సేవా పథం నడవాలి
యువతకు స్పూర్తి కావాలి
నవతకు నాంది అవ్వాలి
మన భవిష్యత్ మారాలి
బంగరు బాట అవ్వాలి
బాణం లాగ కదలాలి
ఓర్పుతో మనముండాలి
మనసున మనసు కరగాలి
యవతీ యవకులుండాలి
నలుగురి మధ్య నడవాలి
నలుగురితోను బతకాలి
ముందుగ దాత లవ్వాలి
ప్రేమ పంచే బతకాలి
తీరం తళుక్కు మనాలి
వెలుగులే.విరజిమ్మాలి
తోకచుక్కల్ల మెరవాలి
సంక్రాంతి శోభవ్వాలి
బతుకు కధలను రాయాలి
ఇక బానిసలు తొలగాలి
నగవులు వెలుగుతుండాలి
నలుగురు కలుసు కోవాలి
బ్రతుకు కళలే పండాలి
పండుగ లాగ జరగాలి
మనసున మంచిగుండాలి
బతుకుకే తోడవ్వాలి
బ్రతికి బ్రతికించు
మానవులమై ఉండి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, సృష్టికి ముందే పంచ భూతాలు ఉన్నట్లు మనపెద్దలు చెప్పగా, సంస్కృత గ్రంధాల ద్వారా మనకు తెలుస్తున్నది. వాటిని ప్రత్యక్షంగా చదవ గలుగుతున్నాము. వీటి అన్నింటికీ మూల గురువు పరమేశ్వరుడు, భూమి, ఆకాశం, గాలి, జలము, అగ్ని సృష్టించినవారు. భూమి మీద వృక్షాలను, జీవరాశిని సృష్టించాడు.
సృష్టి అనేది పుట్టుకకు వీలుగా ఒక అధిపతిని నియమించినట్లు మనకు తెలుస్తున్నది. నుదుటిమీద రేఖలద్వారా జీవన కాలము వ్రాసి భూలోకం లో జీవించాలని, ప్రకృతి ననుసరించి బ్రతకాలని ఆ విధాత వ్రాసి నట్లు తెలుస్తున్నది. సృష్టిని పాలించేవారు శ్రీ మహావిష్ణు అని తెలుస్తున్నది. త్రిమూర్తులకు గురువు ఆదిపరాశక్తి అని తెలుస్తున్నది. పార్వతి ఈశ్వర శక్తిగా, బ్రహ్మిణి బ్రహ్మ శక్తిగా, లక్ష్మి విష్ణు శక్తిగా ఆ త్రిమూర్తులు వారి భార్యల శక్తి మానవులందరిని రక్షించు చున్నదని ప్రతి ఒక్కరు గ్రహించగలరు.
విషయానురక్తి బట్టి బంధము నిలబడు తుంది, ఈ బంధమనేది ఇరువైపులా పదునున్న కత్తి వలే ఉంటుంది. మంచి మాటలు వ్రాసే కలములా, చెడు ఎదిరించే కత్తిలా మానవులు బ్రతకాలని తెలిపేది.
కొందరిలో బుద్ధి వికసించు తుంది, దానివల్ల సకర్మలు చేయుచు, సన్మార్గములో సంపాదన చేస్తూ, ఉన్నదానిలో రేపటి గురించి ఆలోచించ కుండా దానం చేసేవారు, ముక్తి మార్గం కోసం జీవితంలో కష్ట సుఖాలు అనుభవించి తన జీవన సాఫల్యాన్ని తెలుసుకొని జీవించటానికి ప్రయత్నీస్తారు. ఇటువంటి వారికీ ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, అట్టివారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి, బంధానికి చిక్కకుండా నిర్మల మనస్సుతో, ప్రశాంత వాతావరణంలో బ్రహ్మా నందం పొందుతున్నారు. వారి వాక్కు వేదవాక్కు, స్వయం ప్రకాశముతో వెలుగుతూ ఎవ్వరికి భయపడని స్థితిని చేరుతారు.
వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు.
అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది. మోక్ష మార్గాన్ని చూపేది.
విశ్వ మంతా అజ్ఞానము కమ్ము కుంటున్నది, మిడి మిడి జ్ఞానంతో తాను చెప్పేది సత్యమని, తాను చేసేది ధర్మమని, తానూ బోధించేది న్యాయమని వాదించే వారు పెరుగుతున్నారు వారి నుండి జాగర్త వహించటం ప్రతి ఒక్కరి లక్ష్యం.
శుద్ధిగా ఉన్న బంగారాన్ని అనేక ఆభరణాలుగా మార్చవచ్చు, పత్తిని అనేక రకాల వస్త్రాలుగా తయారు చేయవచ్చు, మట్టితో అనేక రకాల పాత్రలు తయారు చేయవచ్చు అట్లాగే మనిషిలో ఉండే గుణం ఒక్కటే ఇది అనేక విధాలుగా పరిభ్రమించినా మంచి మార్గం లో ఉంచి బ్రతుకు సాగించటమే శక్తికి తగ్గ (ధనాన్ని)బంగారాన్ని, వస్త్రాన్ని, మట్టిని ఉపయోగించి బ్రతికి బ్రతికించటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
🔥 *భోగ భాగ్యాల భోగి 13 జనవరి బుధవారం* 🔥
భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.
చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.
భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.
*🧘♂️చతుర్ధశ లోకాలలో నివసించేదెవరు..?🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
*చతుర్ధశలోకాలలో నివసించేదెవరు..?*ఇతిహాస, పురాణాలను అనుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్ధశ(14) భువనాలు లేక లోకాలు కలవు. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు కలవు. అలాగే భూలోకానికి కింద అతలలోకం, వితలలోకం, సుతలలోకం, రసాతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళాలని సప్త(7) అధోలోకాలు కలవు.
భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకాలలో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరాలు అతి సూక్ష్మములైనవి. భూలోకం దక్షిణ దిగ్భాగంలో మృత్యు (యమ) లోకం, ప్రేతలోకం, నరకలోకం, పిత్రులోకాలనే 4 భాగాలు కలవు.
*భూలోకం:-*
ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.
*భువర్లోకము:-* (భూలోకము పైన)
ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.
*సువఃలోకము* లేక *సువర్లోకము* లేక *స్వర్గలోకము:-* (భువర్లోకము పైన) ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.
*మహర్లోకము:-* (సువర్లోకము పైన)
ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.
*జనోలోకము:-* (మహర్లోకము పైన)
దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.
*తపోలోకము:-* (జనోలోకము పైన)
ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది.
భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.
*సత్యలోకం:-*
(తపోలోకము పైన)
ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు.
మహాప్రళయకాలంలో బ్రహ్మలోక పర్యంతంగా గల సప్తలోకాలు పరబ్రహ్మంలో లయమవుతారు. బ్రహ్మ తన ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి, భూలోకం, భువర్లోకం, సువ(స్వర్గ)ర్లోకాంలు లయం అవుతాయి. అతని పగటి కాలంలో పునః ఈ లోకాల సృష్టి జరుగుతుంది.
*********************
*సప్త అధోలోకములు:-*
*********************
భూలోకానికి కింద ఉండేది.
*అతల లోకం:-* ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.
*వితల లోకం:-* (అతలలోకం కింద)- ఇక్కడ పార్వతీ- పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.
*సుతల లోకము:-*
(వితల లోకం కింద)
సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.
*తలాతల లోకం:-*
(సుతల లోకం కింద)ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.
*మహాతలము:-*
(తలాతలలోకము కింద) ఇక్కడ కద్రుపుత్రులైన కాద్రవేయులు (సర్పాలు),
సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.
*రసాతలము:-*
(మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.
*పాతాళము:-* (రసాతలం కింద) - ఇక్కడ నాగ లోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై ఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.
🕉🌞🌏🌙🌟🚩
మధురిమలు .. సంక్రాతి మగువలు (101--110)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సంక్రాంతికి సంబరాలు
హరిదాసు తో కీర్తనలు
సంక్రాతి పెద్ద ముగ్గులు
రుచులొప్పు పిండివంటలు
అవని కందమిచ్చు తరులు
సహజ మంత తెల్పు కలలు
పరువ మంత పంచు కళలు
పరువు తీయ నట్టి సిరుల
తరుల కంద మిచ్చు విరులు
విషయ వాంఛ పొందు కళలు
సమయ తీర్పు కాల విధులు
తరుణి తీర్చు తరుణ నిధులు
తరుణి కందమిచ్చు కురులు
మగువ కంద మిచ్చు కనులు
తెగువ చూపు చుండు తిధులు
మనసు విప్పి తెల్పు సెగలు
గృహానందమిచ్చు సిరులు
విశ్వాసమ్ము చూపు కళలు
సమ్మోహమ్ము చేయు నగలు
ధర్మార్ధమ్ము తెలుపు పగలు
సర్దుబాటు జీవి తాలు
మోక్ష మిచ్చు జీవితాలు
అహంకార జీవి తాలు
అంధకార జీవి తాలు
కన్నవారి తీర్చు కలలు
మమతలతో కోరు మేలు
అలుసు చూసి నడుచు కతలు
ఇంటి లోనే దేవతలు
నిత్య వంట సంబరాలు
ఆశతొ అలంకారాలు
మసి అయ్యేవి కోపాలు
విధి యాడే నాటకాలు
మసిచేస్తున్నవి ఊహలు
కసిపెంచే తాపసిగలు
మరిపించే మగువ వగలు
కలుపుతున్నవి బంధాలు
చిరకాలం మార్పు తెరలు
కలకాల మమకారాలు
చిరుహాస శృంగారాలు
మహిళ అహంకారాలు
--(())--
: చెప్పు నేస్తమా ఎక్కడుందో రహస్యం..
చిన్నప్పుడు ఏ పండక్కో..
పబ్బానికో కొత్త బట్టలు కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు వేసేసుకుందామా అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ పదిహేను రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి నడిచి వెళ్లి..
బెంచీ టికెట్ కొనుక్కుని సినిమా చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో కూడా...
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు వెళ్లి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో ఉంటే..ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని రేడియో లో సంక్షిప్త శబ్ద చిత్రం (ఒక గంట కి కుదించిన) సినిమానివింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు కబుర్లు, కధలు చందమామలు బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం నడిచి లైబ్రరీ కి వెళ్లి గంటలు గంటలు కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ ఇంటికి రావడం....
సర్కస్ లు, తోలు బొమ్మలాటలు లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు వైకుంఠ పాళీ పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి లాంటి ఇంట్లో అంతమంది ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని పడుకున్నా ఎంత హాయిగా సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటే ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి నాలుగు కిలోల బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్ అతను చేతిలో గుప్పెడు పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత సంతోషం...
ఎంత బరువైనా మోసేసేవాని..
ఎగురుతున్న విమానం కింద నుండి కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం లో ముప్పావలా పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే ఆనందం...వాసన చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే ఆనందం... రిక్షా ఎక్కితే...
రెండు పైసల ఇసుఫ్రూట్ తింటే ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ లో సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్ లో ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్, చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో మన ముందు ఉండే తిను బండారాలు..
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు పొందిన ఆ ఆనందం పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...? ఎందుకు...? ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి అన్నీ ఇప్పుడు పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం అయిపోయింది...
ఎండమావి అయిపోయింది..
మార్పు ఎందులో...? మనలోనా...? మనసుల్లోనా...? కాలంలోనా...?
పరిసరాల్లోనా...? ఎందులో... ఎందులో...? ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!
మృదుపద ( నూతన వృత్తము )
గణములు - 6 న గణములు , స గణము
యతి - 11
మనిషి సకాలమూ పలుకుపై
దయా కృపయు చూపకుండ పలుకే
వినయ వివాదమే మనసు నంత
చేరియు సమర్ధమైన పలుకే
చిరునగువే మనోమయముగా
మనోహరునిగా సకల పలుకే
కధలను తెల్పి సాహసముగాను
మాలికలు గాను మానసముయే
తలచిన పని తనువు
తపనలకు సరియగు సమయమే
విరిసిన పవన వలయములతొ
మనసును చెరుచుటయే
మదితలపులు ముదమున
మనుగడకు ఒకటి ఆగుటయే
తలవని తమకము తొ తరుణికి
సుఖము దొరుకుటయే
ప్రతి దినము పరువముల
పదనిసలు వయసు నుడికరమే
మదితలపుల మదన కుహరముల
వలపులతొ గుణ కరమే
మరులు గొలుపు మధురగతుల
సిరులు కొలుచు సుడికరమే
వయసు చలి గిలి చమకముల
తమకముల తరుణ మిదే
తెలియ వలసినవి తెలియక
యతుల తిక మక పడునా
తెలిసియు తెలపక తహ
తహ తొ పతులు చలి చలి అనునా
సమరము విరహము
సమ వడిలొ పరువము ఫలమగునా
కనివిని ఎరుగని సుఖమును
తెలుపు సమయము ఇది అగునా
--((*))--
నిద్రకు అనుకూలమైన పరిస్థితులు మనమే కలగచేసుకోవాలి, వెన్నెలలో, చల్లటి గాలిలో అరుగు దొరికితే హాయిగా నిద్రపోవచ్చు. నిద్రపోతున్నప్పుడు చెమట పడుతున్నది, కలవరింతలు వస్తాయి, గురక వస్తున్నది ఇవి ఎందుకొస్తాయి ఒక్కసారి ఆలోచిద్దాం.
ముందుగా మనం నిద్రపోయే ప్రదేశము శుభ్రముగా ఉంచుకోవాలి, దుప్పటి దులుపుకొని సరిగా మంచముపై పరచుకొని, తలక్రింద సరిఅయిన దిండు పెట్టుకోవాలి
1/20 వ మందంతో ఉన్న మిలియన్ల కొద్దీ ఫైబర్స్తో, కాస్పర్ దిండు మీరు నిద్రించే విధంగా అనుగుణంగా రూపొందించబడింది. మీ జిజ్ఞాసను ఆలోచనను మరచు నట్లు చేస్తుంది.
జంట ఉన్నప్పుడు ఒకరకంగా నిద్ర ఉంటుంది, జంట ఉన్నప్పుడు మెలి కలయికతో సుఖ నిద్ర ఉంటుంది. జంట లేనప్పుడు మరోరకంగా నిద్ర ఉంటుంది. ఆలోచనతో ఎదో కొరత ఉన్నట్లు భావిస్తారు, ఎదో మనసులో వెళితే ఉంటుంది, ఎదో చూద్దాము అని వేచి ఉండి కళ్లకు శ్రమ వచ్చేదాకా వేచి ఉంది నిద్రపోతారు.
ఎలక్ట్రిక్ లైటింగ్, టెలివిజన్, ఇంటర్నెట్ మరియు కెఫిన్ వంటివి అన్నింటిని విలాసవంతులకు ముందు రోజులు పోలిస్తే నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, మూడ్ డిజార్డర్స్ మరియు ఇతర ఆధునిక రోగాల పెరుగుదలకు ఈ విధమైన నిద్ర లేమి కొన్నిసార్లు బాధ్యత వహిస్తుంది.
మనం నిద్ర పోతున్నప్పుడు మనకు ఏమి తెలియదు, కొందరు ఒంటి కన్నుతో నిద్రపోతారు (భల్లూకం లాగా) మరికొందరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు, (చేపలాగా) కొందరు లేచిన తర్వాత ప్రక్క వారిని నిద్రపోకుండా చేస్తారు. కొందరికి నిద్రలో స్వర్గ సుఖాలు అనుభవించినట్లు, మరికొందరికి నరకములో ప్రవేశించినట్లు కలలు వస్తాయి. అది మానసిక వత్తిడి అని నా భావము.
జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను', 'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తుంది. ఇది అంతా సుఖ నిద్రలో జరుగు తుంది.
కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడు వంచనలకు, మార్పులు చెందుటకు కారణ మగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి. సాత్విక గుణం తో మానవులు ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని ఉండదు, ఆలోచనకు తావు ఉండదు. సుఖమును పంచే తనువుకు విశ్రాంతి కలుగుతుంది.
--((*))--
om sri ram
ఆత్మస్థితిలోనే ఆనందం
పూర్వం ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. సాధుపురుషులు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకువెళ్లి విశేషమైన మర్యాదలు చేస్తుండేవాడు. ఒకసారి ఓ సాధువును ఇంటికి తీసుకొచ్చాడు శ్రీమంతుడు. తన స్థాయికి తగినట్టుగా అతిథి సత్కారాలు చేశాడు. భోజనం కోసం రకరకాలైన పిండి వంటలు చేయించాడు. ప్రత్యేకంగా పాయసం కూడా చేయించాడు.
సాధువుతో పాటు శ్రీమంతుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. సాధువుతో.. ‘‘స్వామి! మా ఇంట్లో పాయసం అమృత సమానంగా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి’’ అని అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి ‘‘అలాగే’’ అన్నాడు. రెండు గ్లాసుల్లో పాయసం తెచ్చి అక్కడుంచారు. శ్రీమంతుడు ఒక గ్లాసు తీసుకుని అపురూపంగా పాయసం తాగాడు! ఇది గమనించిన సాధువు.. ‘‘పాయసం ఎలా ఉంది నాయనా!’’ అన్నాడు. ‘అమృత సమానంగా ఉంది’ అన్నాడు శ్రీమంతుడు. వంటవాడు రెండో దఫా పాయసం తెచ్చాడు. శ్రీమంతుడు మళ్లీ తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు సాధువు. ‘‘ఫర్వాలేదు’’ అన్నాడు. సాధువు వంటవాడిని పిలిచి మరో గ్లాసు పాయసం తేవాల్సిందిగా చెప్పాడు. శ్రీమంతుడితో దానిని కూడా తాగమన్నాడు. అయిష్టంగానే తాగాడు. ‘‘ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘విష తుల్యంగా’’ ఉందన్నాడు శ్రీమంతుడు. భోజనాలు పూర్తయిన తర్వాత సాధువు, శ్రీమంతుడు బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
సాధువు ఆత్మ, జ్ఞానం తదితర అంశాల గురించి అనేక విషయాలు చెబుతున్నాడు. శ్రీమంతుడు మాత్రం ఇందాక చేసిన భోజనంలోని వంటకాల విశేషాల గురించి చెప్పసాగాడు. సాధువు కల్పించుకొని.. ‘‘నాయనా! మొదట పాయసం తాగినపుడు అమృతంగా ఉందన్నావు. రెండోసారి ఫర్వాలేదన్నావు. మూడోసారి విషంగా ఉందన్నావు! పాయసం అమృతం అయితే.. ఎన్నిసార్లు తాగినా అమృతంగానే ఉండాలి కదా! కాబట్టి విషయం బాహ్య వస్తువులో లేదు. మన భావనే వస్తువులలో సుఖాన్ని కల్పిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఒకసారి గొప్పగా కనిపిస్తాయి, మరోసారి వృథాగా అనిపిస్తాయి. జీవుడు బాహ్య వస్తువులపై విరాగం కలిగి ఉండి.. ఆత్మస్థితిలో ఆనందాన్ని కలిగి ఉండాలి’’ అని బోధించాడు.
--(())--
న జ భ జ భ జ భ ల గ .. అశ్వాలలలిత .. 12
III IUI UII IUI UII IUI UII IU
మనిషి సకాలమూ పలుకుపై దయా కృపయు చూపకుండ పలుకే
వినయ వివాదమే మనసు నంత చేరియు సమర్ధమైన పలుకే
చిరునగువే మనోమయముగా మనోహరునిగా సకల పలుకే
కధలను తెల్పి సాహసముగాను మాలికలు గాను మానసముయే
*సంసార సుఖమే (కొత్త చందస్సు )
UUU-III-UUU-UUI-IIU --౧౫
సంసారం సగము సంభందం సమ్మోహ సమ వి
శ్వాదిత్యా మనసు మాంగల్యం భావాత్మకముగా
సౌందర్యం వినయ విశ్వాసం తన్మాయ మలుపే
విశ్వాసం విషయ తత్భావం ప్రాధాన్య సుఖమే
సంధర్బం మనకు నేస్తమై శ్వశ్చత తలపే
సంకోచం వదలి సందేహా ల్లేక సమన్వ
యంచూపించి చిరు సౌఖ్యాలే కల్పించి మనసే
మందిరం కలల తీర్చుట్లో సంసార సుఖమే
బాల్యంలో మనకు సద్బుద్దే నేర్పించు కరుణా
వేదాంతం తెలిపి బోధించే పాఠాలు తెలిపే
దీ అమ్మే మనకు విస్వాసం విజ్ఞానమును పం
చే నాన్నే మనకు బంధంగా సంసార సుఖమే
మంచివాని తలపే ఆనందం మార్గ మెపుడూ
ధర్మాన్నీ తెలిపి సత్యయాన్ని బోధించి నవ భా
వామృతం పలుకుగా ఆధ్యా త్మికంగ గురు భో
దాంమృతం సమము చేసేదే సంసార సుఖమే
--((*))--
[13/01, 6:07 am] +91 94414 08564: *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 110 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*శ్రీకృష్ణ లీలలు - 40*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*బలరాముడు తీర్థయాత్రకు జనుట*
బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా, బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పొతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు.
ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి యితనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు.
అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బాలరామా, నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము “నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతునియందు దోషం లేదు. యిప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు.
అపుడు బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి యిప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు.
అప్పుడు మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. యికపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు.
నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు యింకా ఏదయినా అడగండి. చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.
సూత మహర్షి ఈవిధంగా చెప్పారు.
ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడుచేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణి మంథనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రములు, రక్తము యివన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అపుడు వాడు పెద్దగా పకపకనవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నీవు పల్వలుని సంహరించు. అపుడు మేము యజ్ఞ యాగాదులను ఆటంకం లేకుండా చేసుకుంటాము’ అని చెప్పారు.
ఋషులు పల్వలుని సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంతమయిన కోరిక. బలరాముడు వెంటనే వెళ్లి పల్వలుని చంపలేదు. అతడు ‘ఏమి చేస్తాడు’ అని అడిగాడు. ‘మేము యజ్ఞం చేస్తే పాడుచేస్తాడు’ అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం చేయడం ప్రారంభించండి. వాడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు.
ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చి యజ్ఞ గుండంలో మలమూత్రములను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమచేతితో నాగలి తీసి వాడి తలకాయకు వేసి కిందికి లాగాడు. కుడిచేత్తో రోకలి పుచ్చుకుని తలమీద ఒక దెబ్బ కొట్టాడు. నెత్తురు బుగబుగ కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తరువాత బలరాముడు ‘నేను పల్వలుని చంపివేశాను. మీరు యజ్ఞ యాగాదులు చేసుకుంటారు. కానీ యింకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది.
ఇంతకుపూర్వం నేను చేసిన పాపములు పోవడానికి ఈ పనులు చేశాను. ఇపుడు నేను కొంత పుణ్య బలమును సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచిపనులు ఏమయినా చెప్పండి అని అడిగాడు.
అపుడు ఋషులు ‘నీవు పన్నెండు నెలలు యింటి ముఖానికి వెళ్ళకుండా దేశం అంతా తిరిగి పుణ్య తీర్థములు అన్నిటిలో స్నానం చెయ్యి. అప్పుడు నీ మనసు ప్రశాంతత పొంది, పుణ్యమును పొంది సత్త్వ గుణమును పొందుతావు. మనస్సునందు పాపపు ఆలోచన అహంకారము పైకిరావు. వినయముతో నిలబడగలుగుతావు’ అన్నారు.
బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్య తీర్థములలో స్నానము చేశాడు.
మనం పుణ్య క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలో ఎందుకు తీర్థములందు స్నానం చేస్తామో ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదయినా సరే యింత పరమపవిత్రమయిన ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు.
*వృకాసురుడు విష్ణుమాయచే మడియుట*
పూర్వం వృకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆతను శకుని కుమారుడు (భారతంలో శకుని కాదు) ఒకరోజున వాడు వెళ్లిపోతుంటే నారదుడు అటుగా వచ్చాడు. అపుడు వాడు నారదుని చూసి నమస్కరించాడు. నారదుని కాళ్ళకి దణ్ణం పెట్టాడు. తరువాత నారదుడిని, ‘అయ్యా! నారదా, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని ముగ్గురు పరమాత్మ రూపములు ఉన్నారని చెపుతారు కదా – ఈ ముగ్గురిలో నేను తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమయి నేను కోరిన వరమును యిచ్చేసే ఆయన ఎవరు?’ అని అడిగాడు. అపుడు నారదుడు –
‘వృకాసురా, బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆయన గురించి చాలా తపస్సు చెయ్యాలి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవాలి అంటే సత్త్వ గుణంలోకి వచ్చెయ్యాలి. ఆయన మోక్షం అడిగేవారి కోసం వస్తాడు. నీజాతి వాళ్ళందరికీ తొందరగా ప్రత్యక్షం అయ్యే ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. ఆయన భక్తులకు చాలా తెలికగా వశుడవుతాడు. అందుకని శివుని గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు.
అపుడు వృకాసురుడు ‘తపస్సు ఎక్కడ చెయ్యను’ అని అడిగితె కేదారంలో చేయమని నారదుడు చెప్పాడు. అందుకని వృకుడు కేదారం వెళ్లి శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు.
కొద్దికాలం తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం కాలేదు. వానికి అక్కసు వచ్చింది. తన శరీరమును తానే ముక్కలుగా నరుక్కుని అగ్నిలో వ్రేల్చేశాడు. చివరకు తన శిరస్సును ఖండించుకుని అగ్నిహోత్రంలో వేయడానికి సిద్ధపడ్డాడు. అపుడు శంకరుడు వెంటనే వచ్చి వృకుడు ఆ పని చేయకుండా అడ్డుపడి ‘నీకు ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు వృకుడు ‘శంకరా నేను నా చేతిని ఎవరి తలమీద పెడితే వాడి తల పగిలిపోయేటట్లు నన్ను అనుగ్రహించు’ అని కోరాడు. వీని కోరిక విని శివుడు తెల్లబోయాడు. ‘సరే తథాస్తు; అన్నాడు.
ఇపుడు వాడు తొందరగా ఎవరో ఒకడి తలమీద తన చేయిని పెట్టాలని అనుకున్నాడు. ‘శంకరా, నీ తలమీద ఒకసారి చేయి పెడతాను నిలబడవలసింది’ అన్నాడు.
ఆయన వృకునకు తల ఇవ్వలేక వెనక్కి తిరిగి పరుగెత్తడం మొదలు పెట్టాడు. అసలు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది.
సుబ్రహ్మణ్యుని ఉత్పత్తి జరగడానికి కావలసిన బీజం అక్కడ అప్పుడు పడింది. శివుడు అలా పరుగెత్తి వైకుంఠమునకు వెళ్ళాడు. శివుడు వెనకాలే వృకుడు ఆగుఆగు అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. శివునికి కేశవునికి భేదం ఉండదు. శంకరునిగా వృకుడి అజ్ఞానమును అణచి వేస్తే బాగుండదు. శంకరుడు నారాయణునిగా వృకుడి అజ్ఞానమును అణచాలి. శంకరుడు వైకుంఠం వెళ్లేసరికి అందులోనుండి శ్రీమన్నారాయణుడు ఒక వటువు రూపంలో, ఒక బంగారు మొలత్రాడు, పచ్చటి గోచి మూడు పోగులు వున్న యజ్ఞపవీతం వేసుకుని చక్కగా ఒక కమండలం చేత్తో పట్టుకుని బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు.
వటువు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరుగెత్తుకు వస్తున్న వృకాసురుని చూసి ‘’అయ్యో వృకాసురా, అలా పరుగెత్తుకు వస్తున్నావేమిటి? నీ ఒళ్ళంతా చెమట పట్టేసింది. శరీరమును సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఎందుకు అలా పరుగెడుతున్నావు ఆగు’ అన్నాడు. అపుడు వృకాసురుడు రొప్పుతూ శంకరుడు వరం యిచ్చాడు. తలమీద చెయ్యి పెడదామంటే పారిపోతున్నాడు’ అన్నాడు.
అపుడు నారాయణుడు వృకాసురా నీవు ఎంత పిచ్చివాడవు. దక్ష ప్రజాపతి యజ్ఞం పూర్తయిన నాటినుండి శంకరుని ప్రవర్తనలో మార్పు వచ్చింది. పిశాచములను భూత గణములను వెంట పెట్టుకు తిరగడం, అబద్ధాలాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది. ఆయన పవిత్రుడు కదా! నువ్వు స్నానం చెయ్యకుండా ఆయనను ముట్టుకుందామంటే ఆయన తల ఇవ్వడు. ఆయన లొంగిపోయే మనిషే. కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే ఆయన లొంగిపోతాడు. నువ్వు అక్కడ కనిపిస్తున్న మడుగులో స్నానం చేసి ఆచమనం చేసి అపుడు శంకరుని తలమీద చెయ్యి పెట్టు’ అన్నాడు. అలాగేనని వృకుడు స్నానం చేసి ఆచమనం చేస్తూండగా పొరపాటున అతని చేయి అతని శిరస్సుకి తగిలింది. వెంటనే వాడు తలపగిలి కిందపడి చచ్చిపోయాడు.
‘మనుష్యులు కోరికలు కావాలి అని కోరికలు అడుగుతారు. కోరిక తీరితే తన కోరిక తీరిందని ఈశ్వరునికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే భగవంతుడిని మరచిపోతారు. నా అంతటి వాడిని నేను అనుకుంటారు. నేనే అవన్నీ చేశానని అహంకారమును పొందుతారు. తాను ఏ పని చేసినా, ఏ విజయమును పొందినా అది ఈశ్వర కృప వలననే జరిగినది అని భావించగలిగితే అతడు కృతార్థుడు అవుతాడు’ అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథను భాగవతంలో చెప్తారు.
వెర్రి పెట్టుకోకుండా ఈశ్వర స్వరూపమును మీరు నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారు అని ఒక అద్భుతమయిన ఆఖ్యానమును ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
*నాగ సుబ్బయ్య పైడి* (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
[13/01, 6:11 am] +91 94414 08564: 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 61* 🕉
*శుకముల్ కింశుకపుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్సము*
*త్సుకతం దేరఁగఁ బోవు నచ్చట మహా దుఃఖంబు సిద్ధించుఁ; గ*
*ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబు* *ల్విలోకించువారికి నిత్యత్వమనీష దూరమగుఁజూ శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! చిలుకలు ఎర్రని మోదుగుపూవులను పండ్ల గుత్తులనుకొని మిగుల ఆసక్తితో ఎప్పుడెప్పుడవి తిందుమా అను తహతహతో పాటుతో వానిని తెచ్చుకొనపోవును.
🌹కాని పండ్లు లభించక పోగా మరియొక కష్టము సిద్ధించును. అట్లే కర్మానుష్ఠానము బోధించు వేదాది విద్యలను వానికి తోడుగ శాస్త్రములను అధ్యయనము చేయువారికి నీ అనుగ్రహము కలుగదు.
🌹కర్మల ననుష్ఠించుటకు ఫలముగ వీరికి అశాశ్వతమగు స్వర్గాది లోకసుఖములు పునః పునర్జన్మలొందుచున్నారే కాని నిన్ను నిత్యమని తెలిసికొనక నీకయి సాధనము చేయుట దానిని సాధించుటయు జరుగదుకదా....!
🙏 *ఓం నమః శివాయ* 🙏
No comments:
Post a Comment