మహాభారతం ఆదిపర్వం ఏడో భాగం
-------------------------------------------------
అమృతం
కోసం స్వర్గలోకానికి వెళ్లేముందు గరుడుడు తన తల్లి అయిన వినత దగ్గరికి
వచ్చి నమస్కరించి నేను అక్కడికి వెళ్లడానికి నాకు చాలా శక్తి కావాలి నాకు
బాగా ఆకలిగా ఉంది నేను ఏ ఆహారం స్వీకరించాలి అని అడిగాడు అప్పుడు ఆమె
సముద్రంలో నిషాదులు అనే లోక కంటకులు చాలా మంది ఉన్నారు వారిని ఆరగించి మీ
ఆకలి తీర్చుకో ...అటు నీ ఆకలి తీరుతుంది ఇటు లోకానికి క్షేమం చేకూరుతుంది
అని చెప్పింది వినుత. కానీ వారిలో ఒక వేళ ఆ బ్రాహ్మణుడు కనుక ఉంటే
భుజింపవద్దు అంది .గరుడుడు " అమ్మా ! బ్రాహ్మణుని గుర్తించడం ఎలా అని
అడిగాడు తండ్రి ! బ్రాహ్మణుడైన వాడు నీకు మింగుడుపడడు. ఇది ఒకటే నీకు
గుర్తు అని చెప్పింది. వెంటనే ఆ వైనతేయుడు తల్లికి నమస్కరించి నిషాదులు
ఉండే సముద్రం లోని ఆ తావు కి వెళ్ళాడు .. పరమ కిరాతక లైన నిషాదులను దొరికిన
వారిని దొరికినట్లు మ్రింగుతున్నాడు.... కొంతసేపటికి ఏదో గొంతుకు అడ్డం
తగినట్లుగా తెలిసింది .తల్లి మాట గుర్తుకు వచ్చి మహానుభావా మీరు ఎవరో
ఉన్నారు బయటికి రండి అని పలికాడు
అతని నోటిలో నుండి ఒక నిషాదుడు
బయటికి వచ్చి వినతా సుతా ! నేను ఇదివరలో బ్రాహ్మణుని నా కార్యాల వల్ల
భ్రష్టత్వం చెందాను. ఇదిగో ఈవిడ నా అర్ధాంగి ఈమె ఒక నిషాది. మమ్మల్ని
విడిచి పెడితే మేము వెళ్ళిపోతాము అని నమస్కరించాడు. ఆ దంపతుల్ని విడిచి
మిగతావారిని భక్షించాడు. అంతమంది విషాదాలను తిన్నప్పటికి కూడా వైనతేయుని కి
ఆకలి తీరలేదు . ఆకలి తీరే మార్గం తెలియక వైనతేయుడు తండ్రి దగ్గరికి
వచ్చాడు ఇలా పలుకుతున్నాడు తండ్రి ! నా తల్లి దాస్య విముక్తి కోసం నేను
అమృతం తేవడానికి వెళ్తున్నాను నాకు ఆకలి తీరలేదు నాకు ఆహారం పెట్టు అన్నాడు
. కుమారుని ప్రయత్నానికి సంతసించి కశ్యపుడు ఇలా చెప్పాడు " కుమార !
నిభావసుడు ,సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకోవడంలో
తగువులాడుకుంటూ ...అన్నగారు తమ్ముడిని ఏనుగు కమ్మని.. తమ్ముడు అన్నను
తాబేలు కమ్మని శపించుకున్నారు . వారలా గజకచ్చపాలై ఉండి కూడా పూర్వ జన్మ
వైరం తో పోరాడుతూనే ఉన్నారు. వారిని నీవు తిని నీ ఆకలి తీర్చుకో.
వారిద్దరికీ శాపాలు తీరిపోతాయి అని పలికాడు కశ్యపుడు.
ఆ వెంటనే వెళ్లి
వనతేయుడు రెండు కాళ్ళతో ఆ గజకచ్చపాలను పట్టుకుని తినడానికి చోటు
వెతుక్కుంటూ ఉండగా.....రౌహిణమనే చెట్టు గరుత్మంతుని తో " నాయనా ! నేను నూరు
యోజనాలు విస్తరించిన గొప్ప వృక్షాన్ని. నా కొమ్మపై నీవు, వాటిని
పెట్టుకుని ఆరగించు అని పలికింది ఆ వృక్షము.. గరుడుడు ఆ వృక్షానికి
నమస్కరించి తన ఆహారాన్ని ఆ చెట్టు లోని ఒక బలమైన కొమ్మపై కూర్చుని
ఆరగించాలని చూడగా... ఆయన బరువు భరించ లేక ఆ చెట్టు కొమ్మ విరిగి పోయింది.
ఆ
కొమ్మను ఆధారంగా చేసుకుని తలకిందులుగా వేలాడుతూ... తపస్సు చేసుకుంటున్న
వైఖానస మునులను చూసి ఈ కొమ్మ నేల మీద పడితే ఏమవుతుందో అని భయపడి... వెంటనే
గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో కరుచుకుని తండ్రి దగ్గరకు వెళ్లి
నమస్కరించాడు. కశ్యపుడు మహర్షులకు నమస్కరించి మీరు హిమవంత్ పర్వతానికి
వెళ్ళండి అని వారిని అర్థించాడు.. అలాగే అని ఆ ఋషులు సమ్మతించి వెళ్లారు.
తండ్రి
ఆజ్ఞ మీద అతడు మనుషులు లేని చోట ఆ కొమ్మను విడిచి. హిమవంతం మీద నే
వీలైన ఒక చోటు చూసుకుని భోజనం ప్రారంభించాడు. అప్పుడు అతని ఆకలి తీరింది.
అటు
తర్వాత వైనతేయుడు అమృతం సంపాదించడానికి స్వర్గలోకానికి పయనమయ్యాడు.
స్వర్గం లో ఎన్నో ఉత్పాతాలు కలిగాయి. గురువైన బృహస్పతి ద్వారా వాటి కారణం
తెలుసుకున్న ఇంద్రుడు అమృత రక్షకులను పెంచి... కాపలా ఇంకా కట్టుదిట్టం
చేశాడు. ఇప్పుడు గరుడుడు తన రెక్కల గాలి తో అక్కడి కావలి వాళ్ళను ఎగుర
కొట్టాడు. ఆ కాపలాదారులు సామాన్య మైన వాళ్ళు కాదు ఎందరో రాక్షసులను జయించిన
వారు కూడా... అనప్పటికి వారు ఆయన ముందు నిలువలేక పోయారు.
మహేందృడు
గరుడుడి పరాక్రమానికి ఆశ్చర్య పోయి... అతనిని ఆపవలసిందిగా అగ్ని ని, వాయువు
ను ఆజ్ఞాపించాడు. మహాత్ములైన ఆ మహనీయులు గరుడుడి ని చూసి
సంతసించి...పరీక్ష కోసమై ఆయనను చుట్టు ముట్టారు. .
తనకు రకరకాల
విజ్ఞులు ఎదురుకావడంతో వైనతేయునికి ఉన్న ఆవేశం వాయువు కన్నా అధికంగాను...
ఆయన కోపం అగ్ని కన్నా తీవ్రంగా ఉండటం చేత ఒక్కసారిగా వారిద్దరిని
పీల్చే వాడు..... అగ్ని వాయువులు అతనిలో విలీనం కావడం చేత ఆయన స్వరూపం మరో సూర్యుడిలా ప్రకాశిస్తూ వుంది.
స్వర్గ భటులు అతనిని చూసి భయపడి ఇంద్రుని శరణువేడారు. ఇంద్రుడు వజ్రాయుధంతో గరుత్మంతుని పై దాడి చేయడానికి వెళ్ళాడు.
గరుత్మంతుడు
ఇంద్రునితో " స్వర్గ రాజా ! నీ వజ్రాయుధము నన్ను ఏమీ చేయలేదు. నా
శరీరంలోని ప్రతి ఈక నీ వజ్రాయుధంతో సమానమైనవి కావాలంటే పరీక్షించుకో" అని
పలికాడు.
ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి మొదలుపెట్టగానే
బృహస్పతి అతన్ని వారించి వైనతేయుడు చెప్పింది నిజమే. అనవసరంగా దధీచి మహర్షి
యొక్క పరువు తీయకు అదితి పుత్రా ! బలవంతుని తో విరోధం తగదు. అతనితో సంధి
చేసుకో " అని సలహా ఇచ్చాడు.
గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకొని
వెళ్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు" సోదరా వినతా సుత ! నీవు చేసే కార్యం వలన
లోకానికి గొప్ప ఆపద వస్తుంది . అసలే కద్రువ కుమారులు మంచివారు కాదు. నీవు
వారికి అమృతాన్ని ఇస్తే లోకానికి గొప్ప ఉపద్రవం వస్తుంది . కనుక అమృతానికి
తీసుకెళ్లడం సమంజసం కాదు" అని విన్నపం చేశాడు.
శాంతించిన వైనతేయుని
నుండి అగ్ని వాయువు లు బయటకు వచ్చి " మహేంద్రుడు చెప్పింది సత్యం. నాయనా !
అమృతం తీసుకవెళ్ళ వద్దు, బుద్ధిమంతుడైన నీవు అమృతాన్ని తాగిన నష్టం లేదు
కానీ ఇది వారికి చెందకూడదు. నీకు అవసరమైతే అమృతాన్ని త్రాగు "అని
చెప్పారు. అప్పుడు గరుత్మంతుడు వారితో " మహాత్ములారా ! నాకు అమృతం
సేవించాలని ఎటువంటి కోరిక లేదు నా తల్లి దాస్యవిముక్తి ఒక్కటే నాకు ముఖ్యం
అందుకోసం కోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను. నేను అమృతాన్ని తీసుకుని
వెళ్లడం అన్నది తప్పనిసరి . మీరు ఒక పని చేయండి నేను ఈ అమృతకలశాన్ని వారికి
ఇస్తాను ఆ తర్వాత మీరు దానిని యుక్తి తో తిరిగి స్వర్గానికి తెచ్చుకోండి "
అని వినయంగా నమస్కరించి పలికాడు.
ఇదంతా శ్రీ మహాలక్ష్మీ తో కూడిన మహావిష్ణువు గమనిస్తూ.... వైనతేయుని మాతృ భక్తికి.... అతని త్యాగనిరతి కీ ఆనందిస్తున్నాడు.
తర్వాత
మహేంద్రుడు చేయునది లేక గరుత్మంతుని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు
ఆ అమృతకలశాన్ని కద్రువ సమీపంలో ఉన్న ఆమె పుత్రులకు ఇచ్చి " అమ్మా ! ఇదిగో
అమృతకలశం ఇస్తున్నాను ఇక నేను నా తల్లి దాస్య విముక్తులం అవుతున్నాము" అని
పలికి నమస్కరించి తన తల్లి అయిన వినత చెంతకు వెళ్ళిపోయాడు.
కశ్యప
ప్రజాపతి మరియు వినతా దేవి చెంతలో ఉన్న గరుత్మంతునికి మహావిష్ణువు
దర్శనమిచ్చి నాయనా నీ త్యాగనిరతికి నేను సంతోషించాను నీ సేవ కోసం నేను
ఎదురు చూస్తున్నాను. వైకుంఠానికి వచ్చేయి అని వరం ఇచ్చాడు. తల్లిదండ్రులు
గరుత్మంతుని ఆశీర్వదించి వైకుంఠానికి పంపారు
అటు తర్వాత కద్రువ తన
కుమారులను అమృతాన్ని దర్భల పై ఉంచండి తర్వాత మీరు స్నానాదికాలు
పూర్తిచేసుకుని వచ్చి అమృతాన్ని సేవించండి అని చెప్పి తన పతి అయిన కశ్యపుని
చెంతకు ఆమె వెళ్ళిపోయింది.
నాగులు తమ తల్లి చెప్పినట్లే ఆ కలశాన్ని దర్భల పైనుంచి స్నానం చేయడానికి వెళ్లిపోయారు
నదిలో
స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన
నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి
పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా
దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య
పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య
సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది
శేషునకు అప్పగించాడు.
ఆది శేషుడు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం
భయం పట్టుకుంది. అందు వలన కలత చెందిన వాసుకి ... నాగులను పిలిచి తనకు
పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు
చిరంజీవత్వం లభించేలా చేసారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని
చెప్పాడు. అది విని " ఏలా " పుత్రుడు అనే పాము ఇలా చెప్పింది " అమ్మ శాపం
ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా "
బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి
విమోచన లేదా " అన్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో " పాములు లోకానికి హాని
చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం
జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడు " అని దేవతలు
చెప్పగా విన్నాను.
ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువును
వివాహమాడటానికి వరుడైన జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక
ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు.
అతడొక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను
చూసాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి " మహాత్ములారా ఇలా
తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు. ఇదేమి తపస్సు" అని అడిగాడు. అందుకు
వారు " మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాప కర్ముడు వివాహం చేసుకుని
వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృ దేవతలమైన మాకు ఉత్తమ గతులు
కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు
కలుగచేయమని చెప్పు " అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే
నిమిత్తం వివాహం చేసుకోవడానికి తనపేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ
అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన
చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో "
మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ...ఈమెను వివాహం చేసుకోండి " అన్నాడు.
అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో "నీవు నా
మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను
విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది.
కొన్ని
రోజులకు జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యా వందనం చేసుకునే సమయం
అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్ర లేపి చెప్పింది.
అందుకు జరత్కారుడు కోపించి " నన్ను నిద్ర లేపి అవమానించావు. కనుక మన
ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి
దగ్గరకు వెళ్ళు అన్నాడు.
జరత్కారువు ్న అన్నగారన వాసుకి ఇంటికి
వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తీకునికి జన్మ ఇచ్చింది.
ఆస్తీకుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేసాడు.
సర్పయాగం
జరుగుతూ ఉన్నదని తెలిసి తన తల్లి అయినా జగత్కారువు " నాయనా ! నీవు వెళ్లి
జనమేజయుని ప్రసన్నం చేసుకుని నీ మేనమామలను రక్షించు " అని ఆదేశించగా
ఆస్తికుడు హస్తినాపురం వచ్చాడు అక్కడ జనమేజయుని కలుసుకుని
" మహా రాజ !
శ్రీ రాముడు...ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి.
నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది.
సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ పడుతుంది. వ్యాసుడు మొదలైన వారి
రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ
స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో " మహాత్మా ఏమి వరం కావాలో
కోరుకో " అన్నాడు....ఆస్తీకుడు " జనమేజయా ! ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను
రక్షించు " అన్నాడు. జనమేజయ మహారాజు " ఈ సర్పయాగం... తన తండ్రిని తక్షకుడు
చంపాడని అందుకు ప్రతీకారంగా ఈ యాగాన్ని చేస్తున్నానని ఇది కాకుండా మరి
ఏదైనా కోరామని ప్రార్ధిస్తున్నాడు. ఆ సమయంలో తక్షకుడిని లక్ష్యంగా
పెట్టుకుని ఋత్విక్కులు మంత్ర పూర్వకంగా ఒకటికి రెండు సార్లు
ఆహ్వానిస్తున్నా తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు దివ్య
ద్రుష్టి ద్వార తెలుసుకుని జనమేజయ మహారాజుకు తెలుపగా ఆ రాజు ఇంద్రునితో సహా
తక్షకుని అగ్నిగుండంలో పదవేయమని ఆజ్ఞాపించగా ఆ యజ్ఞ హోత ఏకాగ్రచిత్హుడై
ఇంద్రుడితో సహా తక్షుకుడిని ఆహ్వానించగా ఇంద్రుడు మంత్ర ప్రభావంచేత
తక్షకుడి తో సహా ఆకాశంలో నుండి జారుతూ యజ్ఞగుండం వైపు రావడం మొదలు
పెట్టాడు.... అనుకోని ఈ ఉపద్రవానికి ఇంద్రుడు భీతిల్లి తక్షకుని తో "
తక్షకా ! నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను " అని
తక్షకుడిని అక్కడే వదిలి తన భవనమునకు వెళ్ళాడు.
అంతటా తక్షకుడు
భయంకరంగా భయంతో అరుస్తూ మంత్రశక్తికి ఆధీనుడై యజ్ఞగుండం లో పడబోతూ వుండగా
ఆస్తికుడు"తక్షకా! ఆగు అగు అగు" అని మూడుసార్లు అనగా తక్షకుడు అక్కడే
ఆగిపోయి ఆకాశంలో వ్రేలాడుతున్నాడు. అప్పుడు యజ్ఞమునకు ఆహ్వనించ బడిన
సదస్యులందరూ తపస్వి అయిన ఆస్తికుడి కోరికను మన్నింప వలసినదిగా కోరాగా...
జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు.తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు.
ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా
సంతోషించారు. జనమేజయ మహారాజు ఋత్విక్కులకు, సభాసదులందరికి వేలకోలాది
ధనాన్ని ఇచ్చి సత్కరించాడు. జనమేజయ మహారాజు ఆస్తికుడిని మెచ్చుకుని "ఆస్తిక
మహాశయా! భావిష్యత్తు లో నేను అశ్వమేధయాగం చేస్తాను. అందులో మీరు
సదస్యులుగా ఉండా"లని కోరగా .... అందుకు ఆస్తికుడు "అలాగే" అని చెప్పి
సన్మానములను స్వీకరించి ఇంటికి వచ్చి తల్లికి, మేనమామకు నమస్కరించి
యజ్ఞసభలో జరిగినదంతా చెప్పగా వారు సంతోశించి "నీ కోరిక చెప్పు తీరుస్తామని
కోరాగా ఆస్తికుడు "ఈ కథను స్మరించిన వారికి సర్పభయం లేకుండా చేయ"మని
కోరాడు. వారు సంతసించి అలాగేనని వరమిస్తారు. ఇలా నాగుల్ని ఉద్ధరించి
ఆస్తికుడు వివాహం చేసుకుని పుత్ర పౌత్రులతో ఆనందగా జీవితాంతం గడిపి చివరికి
మోక్షమును పొందాడు.
ఈ కథను విన్నవారు మరియు చదివినవారు నాగ దోషాల నుండి
నాగ బంధాలనుండి విడుదలవుతారు అన్నది అక్షర సత్యం అని వ్యాస భగవానుడు
మహాభారతం లో తెలియజేశాడు
మిత్రులందరికీ శుభోదయం
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సోంహికను చంపి లంక శోభ చూచుట
సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ"
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (01.... 10)
ఆకాశ మార్గాన
మార్గాన తరుణాన
తరుణాన హనుమ లంకకు కదిలె ఈశ్వరా
సీతా న్వేషణ కే
అన్వేషణ కొరకే
కొరకే వానరుల ప్రోత్సాహం చేసేను
సీతయోక్క జాడకు
జాడ తెలిసి కొనుటకు
తెలిసికొను ఉద్దేశ్యంతో కదిలె హనుమంతు
సముద్ర లంఘణమే
లంఘణ దుష్కరమే
దుష్కరమే అయిన సాగె హనుమ ఈశ్వరా
తలను మెడను పెంచి
పెంచీ ప్రకాశించి
ప్రకాశించి ఆబోతువలె హనుమ ఈశ్వరా
పచ్చిక బీళ్ళయందు
బీళ్ళ కదిలే ముందు
కదిలే ధైర్యశాలి హనుమంతు ఈశ్వరా
వక్షస్థలము చేత
చేత తరువుల చెంత
చెంత సింహము విజ్రుంభన వలె హనుమంతు
సహజధాతువులతో
ధాతువులందమతో
అందము కిన్నర గంధర్వ లే ఈశ్వరా
మహేంద్ర పర్వతము
పర్వతము ప్రాంతము
ప్రాంతమే అద్భుతము
అద్భుతమేన గజము
గజము వలె ప్రకాశించెను హనుమంతు
హనుమాన్ సూర్యునకే
సూర్యునకె, ఇంద్రకే
ఇంద్ర వాయువు కు నమస్కరించే ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు 1071....1080
ऊँ!
----
"సీసము..
----
మాతల్లి విద్దెల మాణిక్య సంపద
కరుణించి యిచ్చును కామ్యముగను
మాతల్లి వైభోగ మరకత నిధులను
దయతోడ కురిపించు ధాన్యలక్ష్మి
మాతల్లి బలశక్తి మాన్యతాऽభయముల
నొసఁగుచు మాతగా నూతనుండు
మాతల్లి శ్రీవాణి మాతంగి యందును
మాయందెయుండును మాన్యదేవి
తే.గీ.
త్రిపుర శారద లక్ష్ములు త్రితయముగను
లోకకళ్యాణదాత్రులై మాకెపుడును
దీవెనలిడుద్రుసర్వదా దివ్యరీతి
అంజలింతుసభక్తిని యనవరతము !!! "
----------------
మనం చేస్తున్న ఘోరమైన
ఉప్పు తప్పు...
స్వానుభవంతో చెబుతున్నా
రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి
అయోజైజ్డ్ సన్న ఉప్పును 20/-
పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి
మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే
మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు🖱
అప్పట్లో బీపీలు లేవు,
వోంట్లో ఎముకల నోప్పులు లేవు
థైరాయిడ్ సమస్యల్లేవు..
మీకు గుర్తుందా..?
ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారు
ఎందుకంటే ఉప్పును ఎవరూ దోంగతనం చేయరు
ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది
ఆ రోజులు పోయాయి…
అంతా సన్న ఉప్పు,
అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది…
దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ
దీన్నే ప్రిఫర్ చేయసాగారు…
కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది…
ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు
అదెలా స్టార్టయిందంటే..?
1986 ప్రాంతంలో…
కార్పోరేట్లు సర్కారును అప్రోచయ్యారు…
ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు కాబట్టి,
వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు…
అధ్యయనాలు లేవు, ముందు జాగ్రత్తలు లేవు, మరి కార్పోరేట్లు కదా…
సర్కారు వోకే అనేసింది…
🖱
అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించి పారేసింది…
ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే, మరి మిగతా దేశం మొత్తానికీ
ఈ నిర్బంధ లవణం దేనికి
అని అడిగినవాడు లేడు…
రోగి కి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి
అని అడిగిన వాడు లేడు
మరి కార్పొరేటు లాబీయింగు అలాగే ఉంటుంది…
కార్పోరేట్లు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ ఉప్పు తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు… మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ…
చివరకు ప్రజల కూడు నుంచి
చౌక ఉప్పును కూడా కాజేసిన దొంగలు…
తరువాత
అనేక కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు…
ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి…
🖱
మెల్లిమెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి…
ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్…
అవి
1) E535 – sodium ferrocyanide,
2) E536 – potassium ferrocyanide,
3) E538 – calcium ferrocyanide…
మరికొన్నీ అనారోగ్య హేతువులుంటయ్…
ఇవి బీపీలను పెంచినయ్… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచినయ్…
గుండె జబ్బుల్ని పెంచినయ్…
డయాగ్నయిజ్ లేబరేటరీలు హేపీ, మందుల కంపెనీలు హేపీ, డాక్టర్లు హేపీ…
విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు…
కానీ ధర ఎక్కువ…
ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ…
ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది
నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు…
కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం…
దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది
అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్
మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది…
పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..?
కానీ రూల్స్ అలాగే ఉన్నయ్…
దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది
మరి జనం ఏం చేయాలి..?
ఏముందీ..?
ఆ దిక్కుమాలిన ఉప్పును తగ్గించేసి, వీలైనంతవరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజలవణం వైపు మళ్లడం బెటర్…
🖱
మార్కెట్లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు…
అయితే నెట్లో వెబ్సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్…
ఏమనీ అంటే..?
ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని
తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది… సైంధవ లవణం అయితే మరీ మేలు
ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు… అందుకని ఆ వెబ్ డాక్టర్ల జోలికి పోకుండా,
జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్…
ఉప్పు కేవలం రుచి కోసమే… ఆరోగ్యం కోసం కాదు…
మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది…
అందుకని బీ కేర్ ఫుల్
ఈ ప్రభుత్వాలు మనల్ని ఏమీ ఉద్ధరించవు…
మరి పార్టీలకు, నాయకులకు కార్పొరేటు కంపెనీలు డబ్బులిస్తాయి తప్ప జనం ఇవ్వరు కదా
వాటికి, వారికి ఈ దేశం ఉప్పు తింటున్నామనే విశ్వాసం కూడా ఉండదు కదా 🗞
*ప్రవర ఎలా చెప్పాలి...?*
*1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*
*2) మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*
*3) చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.*
*ఋషి1_________, ఋషి 2_______,ఋషి 3_________త్రయార్షేయ ప్రవరాన్విత, _________గోత్రద్భవస్య, _________సూత్రం _______ శాఖాధ్యాయిః _______(పేరు) శర్మణ్ అహంభో అభివాదయే, అభివాదయామి.*
*ఓం🕉️భారతీయ సంస్కృతి*
*కొన్ని బ్రాహ్మణ గోత్రాలు మరియు వాటి ప్రవరలు..*
*1. భరద్వాజ :*
ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య
*2. వాథూలస :*
భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య
*3. శ్రీవస్త లేక శ్రీవత్స :*
భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య
*4. శ్యాలంకాయన :*
విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య
*5. షతమర్షన:*
ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య
*6. ఆత్రేయ:*
ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య
*7. కౌషిక:*
విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య
*8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)*
1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య
2. ఖలభవస:
విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య
*9. విశ్వామిత్ర:*
విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య
*10. కౌండిన్య:*
వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య
*11. హరితస:*
ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య
*12. గౌతమస :*
ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య
*13.ఔద్గల్య (మూడు రకాలు)*
1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య
2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య
3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య
*14. శందిల్య (మూడు రకాలు)*
1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
*15. నైత్రువకాశ్యప:*
కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య
16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య
*17. కన్వ (రెండు రకాలు)*
1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య
2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య
*18. పరాసర:* వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య
*19. అగస్త్య:* అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య
*20. ఘర్గి (రెండు రకాలు)*
1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య
2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య
*21. బాదరాయణ:*
ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య
*22. కశ్యప (మూడు రకాలు)*
1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
2. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య
3. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య
*23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)*
1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య
2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య
*24. ఆంగీరస :*
ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య
*25. గౌతం/గౌతమస :*
అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య
*26. అగ్నివైవశ్వత:*
ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య
*27. శాంఖ్యాయన:*
విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య
*28. విశ్వామిత్ర:*
శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర
*29. కపి:*
ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.
ఓం శ్రీ రాం ... శ్రీ మాత్రేనమః
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 56* 🕉*జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్*
*మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ*
*బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా*
*చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు.
🌹నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను, ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు.
🌹నా తండ్రిపై ఆన వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును.
🌹వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు.
🌹ఏమి చేయుదును? నా అంతఃకరణ వృత్తులందలి సకల దోషములను మాన్పి నీ పాదపద్మముల యందు నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
నేటి కవిత కలల జీవితమ్ (*)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఎంత మరవాలన్న మరవ లేకున్న ...
మరచి నిద్రపోయిన నిద్ర రాదన్న
నిద్రలో కనులుమూసిన రాలేదన్న
కలలనే కనలేను నిద్ర లేకున్న
ఒకరోజు కలగన్న కనులయందున్న
ఇరువురము ఒకటిగా కలియు నట్లన్న
మనమున ఉన్న మహాత్మ రూపమన్న
ముఖకవళికలు నేను చెప్పలేకున్న
నరుని దేహము కలల నివాసము యున్న
చెప్ప నలివి కానిది అది నిండు సున్న
నిద్ర భంగ మవుట సహజమె కలలన్న
ప్రేమవిజయముకు నాందీ యగుచునన్న
భవిష్యత్ విధులు తెలుపుచు ఉండు నన్న
చూసిన భయము కలలో కనబడు నన్న
బలహీనత కలవరింత తెలుపునన్న
సుఖమును పొందుటకు కలలు ముఖ్యమన్న
--(())--
🌻 *మహా భారతం* 🌻
🩸 *భాగము 7* 🩸
💧 *వ్యూహరచన* 💧
🍃🌺ద్రౌపది తనకు జరిగిన పరాభవానికి దుఃఖిస్తూ, తలదించుకుని అక్కడ నుంచి కదిలింది. సుధేష్ణాదేవి మందిరానికి వెళ్లింది. రాణి మహా గడుసరి. ఏమీ తెలియనట్టే ‘‘మాలినీ, ఏమైంది? ముఖం అట్లా వుందేమిటి? జుత్తు రేగిందెందుకు? దుస్తులనిండా మట్టిమరకలు పడ్డాయే’’ అని అడిగింది.
🍃🌺పాంచాలి లోకజ్ఞత తెలీని మూర్ఖురాలు కాదు. ‘‘ఆహా, ఎంతటి నంగనాచి! గొప్పవారికి యెట్లా మాట్లాడినా చెల్లిపోతుంది కాబోలు’’ అని నిట్టూర్చింది. పైగా సుధేష్ణ, సింహబలుల జన్మవృత్తాంతాలు ఆమెకు తెలియనివి కావు. కీచకుని తండ్రి సూతదేశాధీశుడు. మాళవ రాజ్య కన్య మాళవి వలన సూతాధీశునికి నూట ఆరుగురు పుత్రులు కలిగారు.
🍃🌺పెద్దకొడుకు కీచకుడు. మిగిలిన నూట అయిదుగురు ఉపకీచకులుగా సోదరునికి నీడలా వుంటారు. మాళవి చెల్లెలి కుమార్తె సుధేష్ణ విరాటరాజు పట్టమహిషి. కండబలం గుండెబలం వున్న కీచకునికి సింహబలుడు అన్వర్థ నామధేయంగా ప్రచారంలోకి వచ్చింది. విరటునికి అండదండలుగా, కీచకుడు తన సహోదరులు ఉపకీచకులతో సహా మత్స్యదేశంలోనే స్థిరపడ్డాడు.
🍃🌺రాజుకి సింహబలుడంటే వాత్సల్యంతోబాటు భయం కూడా. అందుకే అతను ఆడింది ఆట, పాడింది పాట. అందుకే తను సైరంథ్రి వృత్తిలో చేరేటపడు విధించిన ఆంక్షలను తోసిరాజని కీచకుని మందిరానికి సుధేష్ణాదేవి పంపింది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు యోగక్షేమాలు అడుగుతోంది. రాజ్యాధికారం చేతులో వుంటే ఏది చేసినా చెల్లుతుంది కదా- అని గాఢంగా నిట్టూర్చింది పాంచాలి.
🍃🌺తన నివాసానికి వెళ్లి, విధిని నిందిస్తూ ద్రౌపది జరగవలసిన దానిని గురించి ఆలోచించసాగింది. ‘‘సింహబలుని పీచమణచగల సమర్థుడు భీముడు వొక్కడే’’ అని తీర్మానించుకుంది. కంటిపైకి కునుకు రావడం లేదు. గుండె రగులుతోంది. కోట వాకిట నుంచి వినిపిస్తున్న గంటలు అర్ధరాత్రిని సూచిస్తున్నాయి.
🍃🌺అంతఃపురం గాఢనిద్రలో జోగుతోంది. చీకటి, నిశ్శబ్దం పెనవేసుకుపోయి వున్నాయి. ద్రౌపది వొక్కసారి తుళ్లిపడి లేచింది. స్నానం చేసి, మంచి వస్త్రాలు అలంకరించుకుని పాకశాల వైపు నడిచింది. వంటపాత్రలతో సువిశాల శాల కిటకిటలాడుతోంది. పాకవిశేష శేషాలు కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి.
🍃🌺వాటి మధ్యన కొండవలె కటిక నేలపై ఆదమరచి నిద్రిస్తున్న భీమసేనుడు కనిపించాడు. ద్రౌపది భర్తను సమీపించి, ‘‘నాథా! యింత చేసిన ఈ కీచకుడు నిర్భయంగా తన మందిరానికి వెళ్లి, గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నాడు. నువ్వు కటిక నేలపై హాయిగా గురకలు పెడుతున్నావు. కంటికి నిదురరానిది నాకేనన్నమాట.
🍃🌺కట్టుకున్న యిల్లాలికి నడివీధిన అంతటి అవమానం జరుగుతుండగా చూశావు కదా. అయినా, యింత సుఖంగా నిద్రిస్తున్నావంటే... అది నీ చేతకానితనం అనుకోవాలా? లేక అగ్రజుని ఆదేశానికి కట్టుబడి వున్నావా? లేక నాపై వైముఖ్యమా?’’ అనగా విని, ‘‘నీ రాకను యెవ్వరూ గమనించలేదు కదా’’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు భీమసేనుడు.
🍃🌺లేదన్నట్టు తలవూపింది ద్రౌపది. ఆమె కళ్లవెంట అశ్రుధారలు జారుతున్నాయి. వలలుడు ఆమెను దగ్గరగా తీసుకుని వూరడించాడు. తన భర్తల పరాక్రమాన్ని, ఈ దుస్థితిని తలచుకుని రోదించింది. భీముని వక్షస్థలం ద్రౌపది కన్నీళ్లతో అభిషిక్తమైంది. సాధ్వీ, ఎంతటివారికైనా కాలం కలిసిరానపడు కష్టాలు తప్పవు. గడచిన కాలంలో ఎందరో నీవంటి మహాసాధ్వులు ఎన్నో హింసలు వోర్చారు.
🍃🌺సీత, సుకన్య, దమయంతి, లోపాముద్ర ... యిలా ఎందరో విపత్తులనెదుర్కొని తరువాత సకల సుఖాలు అనుభవించలేదా? పాంచాలీ, మన అజ్ఞాతవాస దీక్ష పూర్తికావడానికి ఎక్కువ రోజులు వ్యవధి లేదు. మన కష్టాలు గట్టెక్కడానికి ఆట్టేరోజులు నిరీక్షించాల్సిన పనిలేదు. కీచకుని సంహరించడం నాకు పెద్దపనికాదు.
🍃🌺నువ్వు సింహబలుని కోరికను అంగీకరించినట్టు నటించి, వాడిని మచ్చిక చేసుకో. తదుపరి నర్తనశాలను సంకేత స్థలంగా నిర్ణయించి, నిశిరాత్రివేళ ఒంటరిగా అక్కడికి రమ్మను. అర్ధరాత్రి అక్కడకు వచ్చిన సింహబలుని చీకటిలోనే మట్టుపెట్టి నీ పగను చల్లారుస్తాను. అజ్ఞాతవాసంలో వున్న మనకు యింతకంటె మరొక మార్గం తోచడం లేదు- అంటూ ఆమె కన్నీరు తుడిచాడు.
🍃🌺భీముని మాటలకు ఆమె ముఖం విప్పారింది. ‘‘మన పథకాన్ని అత్యంత జాగరూకతలో నడిపించాలి. అదుగో, తెలవారడానికి ఆట్టే పొద్దులేదు. నువ్వింక బయలుదేరి వెళ్లు’’ అంటూ మాలినిని కొంతదూరం సాగనంపాడు వలలుడు తెల్లవారింది. సింహబలుడు సముచిత ప్రాతఃకాల విధులు ముగించాడు. ఏరికోరి, ఎంపిక చేసిన వస్త్రధారణ చేశాడు. విలువైన విభూషణాలను అలంకరించుకున్నాడు.
🍃🌺వాని హృదయమంతా మాలిని గురించిన వూహలే. వడివడిగా సుధేష్ణాదేవి మందిరానికి బయలుదేరాడు. దారి పొడుగునా ఎన్నెన్నో రంగుల కలలు! ‘‘ఏకాంతంలో మాలినిని సందర్శించి, తనివితీరా ఆమె రూప లావణ్యాలను ఆస్వాదించవలె.
🍃🌺తీయతీయని పలుకులతో ఆ సుందరీమణి మనసు దోచి, ఆమెను నొప్పింపక వొప్పించవలె. అటు సూర్యుడు యిటు పొడిచిననూ నేటి రాత్రితో నేను సంపూర్ణ జీవిత సాఫల్యమును పొందవలె’’ అని వువ్విళ్లూరుతున్న కీచకునికి సైరంథ్రి సుధేష్ణ సౌధంలో నిమగ్నమై కనిపించింది. క్షణమైనా ఆగక, కీచకుడు ఆమెతో సరస సంభాషణకు దిగాడు.
🍃🌺ఆమె వుదాసీన వైఖరిని అలుసుగా తీసుకుని మరింత వుత్సాహంగా మాటలు దొర్లిస్తున్నాడు. మరొక అడుగు ముందుకు వేసి రకరకాల శృంగార చేష్టలు ప్రారంభించాడు. కాలం దాపురించిన సింహబలుని చేష్టలను రోషావేశాలను అణచుకుని పాంచాలి సహిస్తోంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 56* 🕉
*జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్*
*మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ*
*బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా*
*చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు.
🌹నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను, ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు.
🌹నా తండ్రిపై ఆన వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును.
🌹వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు.
🌹ఏమి చేయుదును? నా అంతఃకరణ వృత్తులందలి సకల దోషములను మాన్పి నీ పాదపద్మముల యందు నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.
🙏 *ఓం నమః శివాయ*
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
మధురిమలు (11 ... 15)
రచయత మల్లాప్రగడ "ప్రాంజలి ప్రభ "
ఇదీ చిన్నారుల కవిత
అభాగ్యుల బతికే కవిత
దేశ దిమ్మరులతొ కవిత
బతికేటి బిడ్డల కవిత
గతం తెలియని వాల్లము
బాల్యం లో ఉండినాము
నెమరు వేసు కొనుస్థలము
మూగవాళ్ళతొ బతికాము
తల్లియె తెలియని వాల్లము
మధురస్మ్రుతులు గా మేము
అక్రమ జన్మ గలిగాము
ప్రకృతి ప్రేమికులము మేము
చెత్తయేరి బతుకు తాము
తరువులే మా నివాసము
పక్షు ల్లా బతుకు తాము
దైవం నమ్మి యున్నాము
కలసి కలయికలొ స్నేహము
పిల్లలమై కలవగలము
మెలకువగాను ఉన్నాము
కూడు కలసి తినె వాల్లము
--(())--
వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..
🔸 అతినిద్ర
🔸 బద్ధకం
🔸 భయం
🔸 క్రోధం
🔸 అలసత్వం
🔸 ఎడతెగని ఆలోచన
...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి.
ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..
నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే.
రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం.
అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం.
ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.
అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు.
అలాగే..
ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.
ఓం శ్రీ రాం.... శ్రీ మాత్రే నమః
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 105 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 35*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*నృగమహారాజు చరిత్రము:*
కృష్ణపరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు తాగాలని అనుకున్నారు. అక్కడ వున్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పడి ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. అపుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు.
సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు.
ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా, నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు.
నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు, ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు.
ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం యిచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు.
కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది ఇపుడు ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు.
కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి, ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘నేను యిప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను యిప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు.
‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం యిచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి నా అవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు.
అపుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో, ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం యిచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం యిచ్చేసిన గోవు. కాబట్టి ఆ గోవును నీవు యిచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు యిచ్చేస్తాను. అన్నాడు. అపుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు.
అపుడు రాజుగారు ‘నీకు లక్ష గోవులను యిస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు యిచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.
అపుడు రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను యిస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు. అపుడు కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు యివ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు.
కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపొయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉంది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు. అపుడు నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం యిచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం యిచ్చావు. కాబట్టి ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.
ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి వెళ్ళిపోయారు.
ఇప్పుడు కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు వున్న భక్తి అటువంటిది’ అన్నారు.
ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను యిస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపొతే రాజ్యం యిస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం కాని, యితర గోవులు కాని అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు యితరులు చేసిన తప్పుడు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ యిక్కడ మనకు కలిగే సందేహములు.
వీటికి సమాధానములను కొందరు పెద్దలు వివరణ యిచ్చారు.
*బ్రాహ్మణుడు అనగా ఎవరు?*
ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు యింకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది.
కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా యిస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు, నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతలి వారియందు వున్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే.
కాబట్టి కృష్ణ పరమాత్మ యింకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు.
ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకథలా ఉంటుంది. కానీ యిందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది.
దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప జేసింది.
నేను యిస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును యిచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను యివ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి.
ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.
*పౌండ్రక వాసుదేవుడు* :
పూర్వం కరూషదేశమును *పౌండ్రక వాసుదేవుడు* అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘అయ్యా మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు.
ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు
ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి యిచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి, ‘అయ్యా *పౌండ్రక వాసుదేవుడు* మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు.
ఆ పత్రికలో, “నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన యిబ్బంది వస్తోంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతె యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం.
కృష్ణుడు అన్నారు, “ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు.
పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అపుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది.
ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది”’ అని శుకమహర్షిని అడిగాడు.
శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు.
పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత తలచినా సంతతము తలచినది ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు.
పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.
కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేషజములు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
సేకరణ
*నాగ సుబ్బయ్య పైడి* (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
No comments:
Post a Comment